Anganwadi: నిర్బంధాలను నిగ్గదీసి..
అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు అన్ని జిల్లాల్లోనూ కదం తొక్కారు. పోలీసుల హెచ్చరికలు, ముందస్తు గృహ నిర్బంధాలు, అరెస్టులను లెక్కచేయలేదు. అడ్డంకులను అధిగమించి నిరసన గళం వినిపించారు. తమ డిమాండ్ల పరిష్కారానికి అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) పిలుపు మేరకు
జిల్లా కేంద్రాల్లో కదం తొక్కిన అంగన్వాడీ కార్యకర్తలు
పలుచోట్ల ఉద్రిక్తంగా ‘చలో కలెక్టరేట్’
ఈనాడు డిజిటల్ - అమరావతి
అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు అన్ని జిల్లాల్లోనూ కదం తొక్కారు. పోలీసుల హెచ్చరికలు, ముందస్తు గృహ నిర్బంధాలు, అరెస్టులను లెక్కచేయలేదు. అడ్డంకులను అధిగమించి నిరసన గళం వినిపించారు. తమ డిమాండ్ల పరిష్కారానికి అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) పిలుపు మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన చలో కలెక్టరేట్ను విజయవంతం చేశారు. నిరసనల్లో పలుచోట్ల ఉద్రిక్తత నెలకొంది. కలెక్టర్ల కార్యాలయాల్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా కొన్నిచోట్ల అంగన్వాడీలకు, పోలీసులకు మధ్య తోపులాటలు జరిగాయి. ఈ సందర్భంగా... సీఎం జగన్ మాట తప్పి తాము రోడ్డెక్కాల్సిన పరిస్థితిని కల్పించారని మండిపడ్డారు. కొవిడ్ సమయంలో మృతి చెందిన వారికి నష్టపరిహారం అందించాలని, కనీస వేతనం రూ.26 వేలు, రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.5లక్షలు ఇవ్వాలని, రేషన్కార్డును తొలగించకుండా సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
బారికేడ్లను, బలగాలను అధిగమించి..
చిత్తూరుకు బయలుదేరిన కార్యకర్తలను ఎక్కడికక్కడ నిర్బంధించినా... బారికేడ్లను, పోలీసు బలగాలను తప్పించుకొని కొందరు కలెక్టరేట్ ఎదుట నినదించారు. అనంతరం కలెక్టర్ హరినారాయణన్కు వినతిపత్రం అందించి తిరిగి వస్తున్న కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని.. పోలీసుస్టేషన్కు తరలించారు. కడప కలెక్టరేట్ వద్ద నిరసనలో అంగన్వాడీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. కర్నూలులో మహిళలు కలెక్టరేట్లోకి చొచ్చుకురాకుండా భారీగా మహిళా పోలీసులను మోహరించినా కొందరు గేటు ఎక్కి కలెక్టరేట్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అనంతపురంలో భారీ ధర్నా నిర్వహించి, కలెక్టర్కు వినతిపత్రం అందించారు.
సాధారణ దుస్తుల్లో వచ్చి... పోలీసులను ఏమార్చి
కృష్ణా జిల్లాలో ధర్నాను అడ్డుకునేందుకు పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వందలాది మంది అంగన్వాడీలు మచిలీపట్నం కలెక్టరేట్ ధర్నా చౌక్కు చేరుకున్నారు. పోలీసులను ఏమార్చడానికి వారంతా సాధారణ దుస్తుల్లో వచ్చారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ నిరసనల్లో పాల్గొన్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్లు సైతం నిరసనలతో మారుమోగాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు కలెక్టరేట్ ముట్టడిని పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. దాంతో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ఆధ్వర్యంలో వారంతా ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రోడ్డుపై బైఠాయించారు.
వాహనాల నుంచి దింపేసినా తెగువ చూపి...
శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం రాత్రి నుంచే పలువుర్ని గృహ నిర్బంధంలో ఉంచారు. కవిటి, ఇచ్ఛాపురం, మందస, నందిగం, టెక్కలి, పాలకొండ తదితర మండలాల నుంచి ప్రైవేటు వాహనాలు, బస్సుల్లో వస్తున్న కార్యకర్తలను పోలీసులు కిందికి దింపేశారు. అయినా... వివిధ మార్గాల్లో కలెక్టరేట్కు చేరుకుని ధర్నా చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం నుంచే ఆంక్షలు కొనసాగించిన పోలీసులు సోమవారం ఉదయం ధర్నాకు అనుమతిచ్చారు. కలెక్టరేట్లోకి వెళ్లకుండా అయిదు వరుసల్లో బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. మండుటెండలో మూడుగంటలకు పైగా కార్యకర్తలు, ఆయాలు అక్కడే బైఠాయించారు. ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మద్దతు పలికారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబీరాణి పాల్గొన్నారు. విజయనగరంలో చలో కలెక్టరేట్ అడుగడుగునా నిర్బంధాల నడుమ సాగింది. పోలీసులు గృహ నిర్బంధాలు చేసినా... అధిక సంఖ్యలో కార్యకర్తలు, సహాయకులు విజయనగరంలోని సీఐటీయూ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలివచ్చారు. ఆంధ్రా-ఒడిశా జాతీయ రహదారిపై గంటపాటు బైఠాయించారు. ఎన్టీఆర్ విగ్రహం ఎదుట మానవహారం చేపట్టారు.
హతవిధీ... కాపలా విధి!
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చేపట్టిన ధర్నాకు వెళ్లనీయకుండా అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఈమేరకు తుని మండల అంగన్వాడీల సంఘం నాయకురాలు ధనలక్ష్మిని ఆదివారం నుంచి గృహ నిర్బంధం చేశారు. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఆమె ఇంటి ఆవరణలో దోమతెరలు ఏర్పాటు చేసుకుని మరీ నిద్రించి, ధనలక్ష్మి బయటికి వెళ్లకుండా ఇలా సోమవారం ఉదయం వరకు కాపలా కాశారు.
- న్యూస్టుడే, తుని
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM