Bypoll Results: అధికార పార్టీలదే హవా
గువాహటి: దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 30 శాసనసభ, 3 లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ, హిమాచల్ప్రదేశ్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో అధికార పార్టీలు పట్టు నిలుపుకొన్నాయి. గతంలో వీటిలో పది అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ బలం ఈసారి 8కి తగ్గింది.
తెలంగాణ, హిమాచల్ మినహా ఇతర చోట్ల ఇదే పరిస్థితి
30 అసెంబ్లీ స్థానాల్లో భాజపాకు 7, కాంగ్రెస్కు 8
ప్రాంతీయ పార్టీలకు 15 సీట్లు
కాంగ్రెస్, భాజపా, శివసేనలకు ఒక్కో లోక్సభ స్థానాలు
విజయ దుందుభి మోగించిన మమత
మండి (హిమాచల్ప్రదేశ్) లోక్సభ స్థానం నుంచి విజయం సాధించాక.. శిమ్లాలో విజయ సంకేతం చూపుతున్న కాంగ్రెస్ అభ్యర్థి ప్రతిభాసింగ్
ఈనాడు-దిల్లీ, గువాహటి: దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 30 శాసనసభ, 3 లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ, హిమాచల్ప్రదేశ్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో అధికార పార్టీలు పట్టు నిలుపుకొన్నాయి. గతంలో వీటిలో పది అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ బలం ఈసారి 8కి తగ్గింది. భాజపా బలం 6నుంచి 7కి పెరిగింది. మొత్తంగా ఎన్డీయే కూటమికి 14 స్థానాల్లో విజయం లభించింది. ఇదివరకు రెండు స్థానాల్లో గెలుపొందిన టీఎంసీ ఈసారి భాజపా నుంచి రెండింటిని కైవసం చేసుకుని పశ్చిమబెంగాల్లో మొత్తం 4 స్థానాల్లో ఘన విజయం సాధించింది. ఆ రాష్ట్రంలో భాజపాకు లభించిన ఓట్లు 15% కంటే తక్కువే కాగా టీఎంసీ 75 శాతానికి పైగా రాబట్టుకోగలిగింది. దీంతో ఆధిక్యాలు పెరిగాయి. మమత పోటీ చేయడం కోసం భవానీపుర్ స్థానానికి గతంలో రాజీనామా చేసి ఖర్దాహాలో ఇప్పుడు పోటీ చేసిన సోవన్దేవ్ ఛటోపాధ్యాయ 93 వేలకు పైగా ఆధిక్యంతో నెగ్గారు. బిహార్లో హోరాహోరీ పోరులో భాజపా మిత్రపక్షం జేడీయూ రెండు స్థానాలనూ నిలబెట్టుకుంది. అస్సాంలో భాజపా మిత్రపక్షమైన యూపీపీఎల్ తన బలాన్ని ఒకటి నుంచి రెండుకు పెంచుకొంది. ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, మేఘాలయ, నాగాలాండ్లలో 5 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించారు. ఇదివరకు వీటిలో రెండు స్థానాల్లో కాంగ్రెస్, మరో రెండుచోట్ల స్వతంత్రులు గెలవగా ఇప్పుడు ఐదింటినీ అక్కడి ప్రాంతీయ పార్టీలే చేజిక్కించుకొన్నాయి. నాగాలాండ్లో మాత్రం ఎన్డీపీపీ తన ఒక్క స్థానాన్ని ఏకగ్రీవ ఎన్నిక ద్వారా నిలబెట్టుకొంది. కరోనా ముప్పు నేపథ్యంలో విజయోత్సవాలపై నిషేధాన్ని పాటించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల సీఈవోలను ఆదేశించింది.
హిమాచల్లో కమలనాథులకు షాక్
ఉప ఎన్నికల్లో హిమాచల్ప్రదేశ్లో భాజపాకు షాక్ తగిలింది. ముఖ్యమంత్రి జైరాం ఠాకుర్ సొంత జిల్లాలోని లోక్సభ స్థానాన్ని, మరో మూడు శాసనసభ స్థానాలను కూడా కాంగ్రెస్ గెలుచుకోవడం దీనికి కారణం. ఆ రాష్ట్రంలో వచ్చే ఏడాది చివర్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రికి ఇబ్బందికరంగా మారాయి. మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్లో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ మెజార్టీ స్థానాలను తమ పార్టీల తరఫున గెలుచుకొని.. అత్తెసరు మెజార్టీతో నడుస్తున్న ప్రభుత్వాలను పదిలపరచుకున్నారు.
ఉప ఎన్నికల్లో భాజపా విజయంపై భోపాల్లో వేడుకల్లో పాల్గొన్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్
లోక్సభ స్థానాల్లో ఇలా..
మూడు లోక్సభ సీట్లకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, శివసేన ఒక్కో స్థానాన్ని కొత్తగా గెలుచుకున్నాయి. భాజపా ఒకటి కోల్పోయి మరొకటి నిలబెట్టుకొంది. కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ లోక్సభ స్థానంలో శివసేన నెగ్గింది. హిమాచల్ప్రదేశ్లోని మండీ లోక్సభ స్థానంలో దివంగత సీఎం వీరభద్రసింగ్ సతీమణి ప్రతిభాసింగ్ (కాంగ్రెస్) నెగ్గారు. మధ్యప్రదేశ్లోని ఖండ్వాలో భాజపా అభ్యర్థి జ్ఞానేశ్వర్ పాటిల్ విజయం సాధించారు.
ప్రతి కార్యకర్త విజయమిది: రాహుల్
ఉప ఎన్నికల ఫలితాలు ప్రతిఒక్క కాంగ్రెస్ కార్యకర్త విజయమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పేర్కొన్నారు. నిర్భీతిగా పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.
అభయ్ చౌతాలాను వరించిన విజయం
రైతు ఉద్యమానికి మద్దతుగా రాజీనామా చేసిన హరియాణా ఐఎన్ఎల్డీ అభ్యర్థి అభయ్ చౌతాలా మరోసారి నెగ్గి పట్టు నిరూపించుకున్నారు. ఇది స్థానిక భాజపా నాయకత్వానికి ఇబ్బందిపెట్టే ఫలితం.
* కర్ణాటకలో జేడీఎస్ నుంచి సింధగి స్థానాన్ని భాజపా గెలుచుకొంది. ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సొంత జిల్లా హావేరీలోని హానగల్లో కాంగ్రెస్ చేతిలో భాజపా ఓటమి చవిచూడటం అక్కడి నాయకత్వానికి ఇబ్బందికరంగా మారింది.
* మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కు 2, భాజపాకు ఒక సిట్టింగ్ స్థానం ఉండగా, ఇప్పుడు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాల్లో భాజపా, భాజపా సిట్టింగ్ స్థానంలో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేశాయి.
* హిమాచల్ప్రదేశ్లో కాంగ్రెస్ ఇదివరకు తన చేతిలో ఉన్న రెండు అసెంబ్లీ స్థానాలతోపాటు, భాజపా చేతిలో ఉన్న మరో స్థానాన్ని, మండీ లోక్సభ స్థానాన్ని చేజిక్కించుకొని వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు హెచ్చరిక సంకేతాన్ని పంపినట్లయింది.
* రాజస్థాన్లో కాంగ్రెస్ తన స్థానాన్ని నిలబెట్టుకోవడంతోపాటు, భాజపా చేతిలో ఉన్న మరో స్థానాన్ని చేజిక్కించుకొని అక్కడి ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు.
* పశ్చిమ బెంగాల్లో ప్రస్తుత హోం శాఖ సహాయ మంత్రి నిషిత్ ప్రమాణిక్ గత అసెంబ్లీ ఎన్నికల్లో దిన్హటా స్థానం నుంచి కేవలం 57 ఓట్ల తేడాతో గెలుపొందారు. అప్పటికే లోక్సభ సభ్యుడిగా ఉన్న ఆయన.. గెలిచిన అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ దాదాపు 1.65 లక్షల ఆధిక్యంతో విజయదుందుభి మోగించింది. మరో మూడు నియోజకవర్గాల్లో 1.40 లక్షలు, 97వేలు, 64వేల భారీ మెజార్టీతో తృణమూల్ అభ్యర్థులు భాజపా అభ్యర్థులను ఓడించారు.
*అస్సాంలో అయిదు శాసనసభ స్థానాల్లోనూ అధికార కూటమి అభ్యర్థులు విజయబావుటా ఎగురవేశారు. మూడు స్థానాల్లో భాజపా అభ్యర్థులు గెలుపొందారు. మిత్రపక్షం యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ రెండు చోట్ల గెలిచింది.
క్ర.సంఖ్య రాష్ట్రం సీట్లు భాజపా కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలు
1. ఆంధ్రప్రదేశ్ 1 - - 1 వైకాపా
2. అస్సాం 5 3 - 2 యూపీపీఎల్
3. బిహార్ 2 - - 2 జేడీయూ
4. హరియాణా 1 - - 1 ఐఎన్ఎల్డీ
5. హిమాచల్ప్రదేశ్ 3 - 3 -
6. కర్ణాటక 2 1 1 -
7. మధ్యప్రదేశ్ 3 2 1 -
8. మహారాష్ట్ర 1 - 1 -
9. మేఘాలయ 3 - - 2 ఎన్పీపీ, 1 యూడీపీ
10. మిజోరం 1 - - 1 మిజో నేషనల్ ఫ్రంట్
11. నాగాలాండ్ 1 - - 1 ఎన్డీపీపీ (ఏకగ్రీవం)
12. రాజస్థాన్ 2 - 2 -
13. తెలంగాణ 1 1 - -
14. పశ్చిమ బెంగాల్ 4 - - 4 తృణమూల్
మొత్తం 30 7 8 15
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్