CAG: బడ్జెట్ అనుమతులు లేకుండా చేసిన ఖర్చు 94,399 కోట్లు!
రాష్ట్రంలో బడ్జెట్ అనుమతి(ప్రొవిజన్) లేకుండానే రూ.94,399.04 కోట్లు ఖర్చు చేశారని కాగ్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం తప్పు పట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021-22)లో డిసెంబరు నెలాఖరుకు రాష్ట్రంలో చేసిన మొత్తం ఖర్చును విశ్లేషించిన కాగ్ అధికారులు అనేక అభ్యంతరాలను వ్యక్తంచేశారు
తప్పుబట్టిన కాగ్ అకౌంటెంట్ విభాగం
కేటాయింపులకు మించి రూ.13,398 కోట్ల వ్యయం
9 నెలల రాష్ట్ర బడ్జెట్ పరిశీలన.. లోపాల ప్రస్తావన
రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ
ఈనాడు - అమరావతి
రాష్ట్రంలో బడ్జెట్ అనుమతి(ప్రొవిజన్) లేకుండానే రూ.94,399.04 కోట్లు ఖర్చు చేశారని కాగ్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం తప్పు పట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021-22)లో డిసెంబరు నెలాఖరుకు రాష్ట్రంలో చేసిన మొత్తం ఖర్చును విశ్లేషించిన కాగ్ అధికారులు అనేక అభ్యంతరాలను వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కోడ్లోని నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు బడ్జెట్లో వివిధ ప్రభుత్వ విభాగాలకు రూ.వేల కోట్ల కేటాయింపులు ఉన్నా ఖర్చు చేయడం లేదని విశ్లేషించారు. ప్రతినెలా రాష్ట్ర ప్రభుత్వం చేసే ఖర్చుల వివరాలను కాగ్కు అధికారులు సమర్పిస్తుంటారు. వాటిని అకౌంటెంట్ విభాగ అధికారులు పరిశీలించి... బడ్జెట్ అంచనాల ప్రకారం ఎంత కేటాయింపులు జరిపారు? ఎంత ఖర్చు చేశారు? రెవెన్యూ లోటు ఉందా? మిగులు ఉందా? ద్రవ్యలోటు ఉందా? వంటి అంశాలపై నివేదికలు ఇస్తారు.
ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి తొమ్మిది నెలల్లో ఏపీ ప్రభుత్వ ఖర్చులను పరిశీలించిన కాగ్... సంబంధిత నివేదికను వెల్లడించింది. ఖర్చులు జరిగిన తీరును విశ్లేషించి అనేక లోపాలను గుర్తించింది. వాటిని ప్రస్తావిస్తూ కాగ్ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలోని ఒక ఉన్నతాధికారి ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శికి తాజాగా లేఖ రాశారు. ఈ లోపాలను సరిదిద్ది, పరిష్కార చర్యలను చేపట్టి కాగ్కు తిరిగి తెలియజేయాలని అందులో సూచించారు.
లేఖలో కాగ్ ఎత్తిచూపిన ముఖ్య లోపాలు...
* ఏదైనా ఖర్చు చేయాలన్నా, బిల్లులు చెల్లించాలన్నా దానికి తప్పనిసరిగా బడ్జెట్ ప్రొవిజన్ ఉండాలి. అయితే... ఎలాంటి బడ్జెట్ అనుమతి లేకుండానే దాదాపు 124 అంశాల్లో రూ.94,399.04 కోట్లను వివిధ ప్రభుత్వ శాఖలు ఖర్చు చేశాయి.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 947 అంశాల్లో బడ్జెట్లో కేటాయింపులకు మించి రూ.13,398.71 కోట్లు ఖర్చు చేశారు.
* మరోవైపు బడ్జెట్ కేటాయింపుల్లో రూ.30,327.26 కోట్లను వివిధ విభాగాల కింద ఖర్చు చేసేందుకు ప్రతిపాదించి... కనీసం పైసా కూడా ఖర్చు చేయలేదు. ఇలా 2,214 అంశాల్లో జరిగింది.
* రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా మార్కెట్ నుంచి రుణాలు తీసుకుంటుంది. అదే సమయంలో ప్రతినెలా గతంలో తీసుకున్న రుణాలకు అసలు, వడ్డీల రూపంలో కొంత మొత్తం చెల్లిస్తుంది. ఈ క్రమంలో 2021 డిసెంబరులో రూ.3,250 కోట్లను మార్కెట్ నుంచి, రూ.81.11 కోట్లను కేంద్రం నుంచి రుణంగా తీసుకుంది. అదే నెలలో కేంద్ర రుణాలకు సంబంధించి పాత చెల్లింపులు చేసినా... బహిరంగ మార్కెట్ రుణాలకు చెల్లింపులు జరపలేదు.
* కొన్ని అంశాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మైనస్ ఖర్చు చూపించారు.
వివిధ శాఖల్లో నిబంధనల ఉల్లంఘన
చాలా ప్రభుత్వ శాఖల్లో నిబంధనలను ఉల్లంఘిస్తూ బడ్జెట్ను దాటి ఖర్చులు చేస్తున్నారని కాగ్ ప్రస్తావించింది. బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించే సమయంలోనే నిక్కచ్చిగా వ్యవహరించాలని.... అంచనా, వాస్తవ ఖర్చుల మధ్య తేడా లేకుండా చూసుకోవాలన్న ఉత్తర్వులున్నా సరిగా అమలు కావడం లేదని ప్రిన్సిపల్ అకౌంటెంట్ కార్యాలయం అభిప్రాయపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి