Covid Effect: తుంటికీలుపై కొవిడ్ దెబ్బ
చిన్నవయసులోనే తుంటికీలు అరిగిపోవడం ‘అవాస్క్యులర్ నెక్రొసిస్’ లక్షణమని నిపుణులు చెబుతున్నారు. బాధితుల్లో 95 శాతం మంది పురుషులే ఉంటున్నారు.
స్టెరాయిడ్స్ వాడకంతో దుష్ప్రభావం
అవాస్క్యులర్ నెక్రోసిస్ వ్యాధి బారిన బాధితులు
20-50 ఏళ్ల వయసులోనే కీలు అరుగుదల
బాధితుల్లో 95 శాతం పురుషులే
నాలుగోదశలోనే కీలు మార్పిడి అవసరమంటున్న నిపుణులు
ఈనాడు - హైదరాబాద్
చిన్నవయసులోనే తుంటికీలు అరిగిపోవడం ‘అవాస్క్యులర్ నెక్రొసిస్’ లక్షణమని నిపుణులు చెబుతున్నారు. బాధితుల్లో 95 శాతం మంది పురుషులే ఉంటున్నారు.
కరీంనగర్కు చెందిన ఒక వ్యక్తి (43) రెండోదశ కొవిడ్ ఉద్ధృతిలో వైరస్ బారినపడ్డాడు. హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో సుమారు మూడు వారాలు చికిత్స పొందాడు. ఐసీయూలోనే ఆక్సిజన్ సాయంతో 12 రోజులున్నాడు. ఆ సమయంలో వైద్యులు స్టెరాయిడ్స్ సహా ఇవ్వాల్సిన మందులన్నీ ఇచ్చారు. ఎట్టకేలకు ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కానీ గత రెండు నెలలుగా తుంటి దగ్గర విపరీతంగా నొప్పి పెడుతుండడంతో నిమ్స్ ఆర్ధోపెడిక్స్ విభాగంలో సంప్రదించాడు. ఎక్స్రే తీసిన వైద్యులు తుంటికీలు అరుగుదల రెండోదశలో ఉందని నిర్ధరించారు. సాధారణంగా 60-70 ఏళ్లు దాటిన వారికొచ్చే తుంటికీలు అరుగుదల ఇంత చిన్న వయసులో రావడంతో బాధితుడు, వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. లోతుగా విశ్లేషించగా.. ఇది కొవిడ్ చికిత్సానంతర దుష్ప్రభావమని తేలింది.
కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినా.. దాని కారణంగా వచ్చే బాధలు మాత్రం బయటపడుతూనే ఉన్నాయి. కంటి నుంచి కాలి వరకూ అన్ని అవయవాలపైనా దుష్ప్రభావాలు కనిపిస్తూనే ఉన్నాయి. మోతాదుకు మించి స్టెరాయిడ్ చికిత్స పొందిన రోగుల్లో తాజాగా తుంటికీలు సమస్య తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో కొవిడ్ రెండోదశ ఉద్ధృతి 2021 మార్చిలో మొదలై.. ఏప్రిల్-ఆగస్టు వరకూ ఉద్ధృతంగా కొనసాగింది. వేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడున్న పరిస్థితుల్లో స్టెరాయిడ్స్ చికిత్స అనివార్యమైంది. కానీ వాటిని విచ్చలవిడిగా వినియోగించడం వల్ల మ్యూకర్ మైకోసిస్ (బ్లాక్ఫంగస్) జబ్బు బారినపడి.. కనుగుడ్డు తీయాల్సి వచ్చిన బాధితులు కూడా వేలల్లో నమోదయ్యారు. ఇప్పుడు ఆ బాధల్లో తుంటికీలు కూడా చేరింది. ఏడాది కిందట వాడిన స్టెరాయిడ్స్ ప్రభావం ఇప్పుడు బయటపడుతోంది.
రోబోటిక్ సర్జరీతో మెరుగైన ఫలితాలు
- డాక్టర్ ఎ.వి.గురవారెడ్డి, కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స నిపుణులు, సన్షైన్ హాస్పిటల్స్.
కొవిడ్లో స్టెరాయిడ్స్ ఇచ్చిన వారిలో కొందరికి తుంటికీలులో ఈ వ్యాధి కనిపిస్తోంది. స్టెరాయిడ్స్ వాడిన ప్రతి ఒక్కరికీ వస్తుందని చెప్పలేం. రోజూ ఓపీలో కనీసం 2-3 కేసులొస్తున్నాయి. గత రెండు నెలల్లోనే దాదాపు 100 మందికి పైగా వచ్చారు. వీరిలో అత్యధికులు 20-40 ఏళ్ల మధ్య వయసు వారే. 95 శాతానికి పైగా పురుషులే. ప్రస్తుతం రెండు, మూడు దశలకు చేరిన తుంటికీలు సమస్యతో వస్తున్నారు. వీరికి ఎప్పుడు కీలు మార్పిడి అవసరమవుతుందనేది తీసుకునే జాగ్రత్తలపై ఆధారపడి ఉంటుంది. కానీ సాధారణ వయసు కంటే ముందే తుంటికీలు మార్పిడి చేయించుకోవాల్సి వస్తుంది. నాలుగో దశలోకి చేరి, బాగా నడవలేని స్థితికి చేరుకున్నప్పుడు కీలు మార్చాల్సి వస్తుంది. రోబోటిక్ హిప్ రిప్లేస్మెంట్తో 100 శాతం కచ్చితత్వంతో ఆపరేషన్ చేయొచ్చు. అవాస్క్యులర్ నెక్రోసిస్ కారణంగా పోయిన రక్తప్రసరణ తిరిగి రాదు. మృదులాస్థి (కార్టిలేజ్) బలాన్ని కాపాడే మందులు మాత్రం వైద్యుల సూచనల మేరకు వాడాల్సి ఉంటుంది.
25 శాతం పెరిగిన బాధితులు
- ఆచార్య డాక్టర్ పి.చంద్రశేఖర్, ఆర్ధోపెడిక్స్, నిమ్స్
తుంటికీలు సమస్య రెండు, మూడు దశల్లో వచ్చిన రోగులకు.. ‘కోర్ డి కంప్రెషన్’ అనే చికిత్స చేస్తున్నాం. అంటే మోకీలు బంతిలోకి మల్టిపుల్ డ్రిల్లింగ్ ద్వారా రంధ్రాలు చేసి, రక్తప్రసరణ పెరగడానికి, వాపు తగ్గడానికి చికిత్స అందిస్తున్నాం. దీనివల్ల కొంత వరకూ కీలుమార్పిడిని వాయిదా వేయొచ్చు. సాధారణ తుంటి కీలు మార్పిడి రోగులతో పోల్చితే అదనంగా ఈ తరహా కేసుల సంఖ్య 25 శాతం పెరిగింది. ముఖ్యంగా స్టెరాయిడ్స్ వాడిన వారిపై ఈ ప్రభావం కనిపిస్తోంది. తుంటికీలు మార్పిడిని సాధ్యమైనంత వరకూ వాయిదా వేసుకోవాలి. తప్పదు అనుకున్నప్పుడే చేయించుకోవాలి. ఈలోగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నేలపై కూర్చోవద్దు. మెట్లు ఎక్కడం, దిగడం తగ్గించుకోవాలి. పరుగెత్తకూడదు. మోకాళ్లపై కూర్చునే విధంగా భారతీయ మరుగుదొడ్డి విధానాన్ని వినియోగించొద్దు. క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ చేసుకోవాలి. నొప్పి ఉన్నా రోజూ పెయిన్కిల్లర్స్ వేసుకోవద్దు. వాటిని ఎక్కువగా వాడితే మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదముంది. కాల్షియం, విటమిన్ డి వంటి మాత్రలు వైద్యుల సలహా మేరకు వాడుకోవాలి. సాధారణ ఆహారం తీసుకోవచ్చు. బరువు పెరగకుండా జాగ్రత్తపడాలి.
ఏమిటీ అవాస్య్కులర్ నెక్రోసిస్?
తుంటికీలులో బంతి, గిన్నె రెండూ ఉంటాయి. వీటికి రక్తప్రసరణ తగ్గిపోవడాన్నే ‘అవాస్క్యులర్ నెక్రోసిస్’ అంటారు. దానివల్ల అక్కడ కండరం చచ్చుబడిపోతుంది. క్రమేణా తుంటికీలులో అరుగుదల పెరుగుతుంది. నొప్పి అధికమవుతుంది. ఇందులో నాలుగు దశలుండగా.. నాలుగో దశలోకి చేరితే, నడవలేని స్థితి వస్తుంది. ఈ దశలోనే తుంటికీలు మార్పిడి అవసరమవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి