Gujarat: అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో 38 మందికి ఉరిశిక్ష
గుజరాత్లోని అహ్మదాబాద్లో 2008లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో మొత్తం 38 మంది దోషులకు ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. మరో 11 మందికి యావజ్జీవ కారాగార
మరో 11 మందికి యావజ్జీవం
ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు
దేశంలో ఇంత మందికి మరణశిక్ష ఇదే మొదటిసారి
బాధిత కుటుంబాల హర్షం
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్లో 2008లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో మొత్తం 38 మంది దోషులకు ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది. సుమారు 13 ఏళ్ల విచారణ అనంతరం శుక్రవారం ఈ సంచలన తీర్పును వెలువరించింది. దేశంలో ఒక న్యాయస్థానం ఒకేసారి ఇంతమందికి మరణ దండన విధించడం ఇదే తొలిసారి! ఇంతకుముందు 1998లో తమిళనాడులోని టాడా కోర్టు రాజీవ్గాంధీ హత్యకేసులో గరిష్ఠంగా 26 మందికి మరణశిక్ష విధించింది. 2008, జులై 26న... అహ్మదాబాద్ నగరంలో ఉగ్రవాదులు చెలరేగిపోయారు. 70 నిమిషాల వ్యవధిలోనే 21 బాంబు పేలుళ్లతో బీభత్సం సృష్టించారు. ఈ ఘటనల్లో మొత్తం 56 మంది ప్రాణాలు కోల్పోగా,
200 మందికి పైగా గాయపడ్డారు. యావద్దేశాన్ని తీవ్రంగా కలచివేసిన ఈ పేలుళ్లపై అహ్మదాబాద్, సూరత్లలో మొత్తం 35 కేసులు నమోదయ్యాయి. ప్రత్యేక న్యాయస్థానం వీటన్నింటినీ కలిపి విచారణ ప్రారంభించింది. మొత్తం 78 మందిపై అభియోగాలు నమోదుకాగా, వీరిలో ఓ వ్యక్తి అప్రూవర్గా మారాడు. మిగతా 77 మందిపై 2009లో విచారణ ఆరంభమైంది. మొత్తం 1,171 మంది సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలను నమోదు చేసిన న్యాయస్థానం... ఈ నెల 8న 49 మందిని దోషులుగా తేల్చింది. మరో 28 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. ఈ క్రమంలోనే, ప్రత్యేక న్యాయమూర్తి ఎ.ఆర్.పటేల్ శుక్రవారం దోషులకు శిక్షను ఖరారుచేస్తూ తీర్పు వెలువరించారు. 38 మందికి మరణ దండన, 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. దోషుల్లో 48 మందికి రూ.2.85 లక్షలు, ఒకరికి రూ.2.88 లక్షల చొప్పున జరిమానా విధించారు. హత్య, నేరపూరిత కుట్ర, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం వంటి అభియోగాల కింద ఈ శిక్షలను ఖరారు చేశారు.
మృతుల కుటుంబాలకు రూ.లక్ష
పేలుళ్లలో మృతిచెందినవారి కుటుంబాలకు రూ.లక్ష, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశించారు. తీర్పు వెలువరిస్తున్న సమయంలో... దోషులంతా అహ్మదాబాద్లోని సబర్మతి కేంద్ర కారాగారం, దిల్లీలోని తిహార్ జైలుతో పాటు భోపాల్, గయ, బెంగళూరు, కేరళ, ముంబయి జైళ్ల నుంచి వీడియో ద్వారా విచారణకు హాజరయ్యారు.
ఇంకా నలుగురిపై అభియోగాలు
వరుస పేలుళ్ల కేసును గుజరాత్ పోలీసు విభాగం, ఇంటెలిజెన్స్ బ్యూరో సంయుక్తంగా ఛేదించాయి. రాజస్థాన్, దిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక పోలీసులు కూడా దర్యాప్తులో సహకరించారు. ఈ కేసులో మరో నలుగురిపైనా ఆరోపణలు నమోదైనా, ఇంకా విచారణ ప్రారంభం కాలేదని ప్రభుత్వ సీనియర్ న్యాయవాది తెలిపారు. వరుస బాంబు పేలుళ్లపై తొలుత విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ త్రివేది... ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. తీర్పు వెలువరించిన ప్రత్యేక న్యాయమూర్తి ఎ.ఆర్.పాటిల్ 2017 జులై 14 నుంచి వాదనలు వింటూ వచ్చారు.
మోదీని కూడా చంపాలనుకున్నారు...
అహ్మదాబాద్లో వరుస బాంబు పేలుళ్లు చేపట్టడంతో పాటు... నాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీని కూడా హతమార్చాలని కుట్రదారులు ప్రణాళికలు వేసినట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుధీర్ బ్రహ్మభట్ చెప్పారు. కేసు దర్యాప్తు సందర్భంగా ఓ నిందితుడు ఈ విషయాన్ని వెల్లడించినట్టు పోలీసులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారని ఆయన వివరించారు. సదరు వ్యక్తిని న్యాయస్థానం దోషిగా తేల్చి, శిక్ష విధించిందన్నారు.
ప్రతీకారేచ్ఛతోనే..
2002-గోద్రా రైలు దుర్ఘటన అనంతర అల్లర్లలో వెయ్యి మందికి పైగా మృతిచెందారు. ప్రతీకారంగా నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ అహ్మదాబాద్లో బాంబు పేలుళ్లకు కుట్రపన్నింది. దీనిలోమధ్యప్రదేశ్కు చెందిన సఫ్దర్ నగోరి, కుమరుద్దీన్ నగోరి, గుజరాత్కు చెందిన ఖయూముద్దీన్ కపాడియా, జాహిద్ షేక్, షంషుద్దీన్ షేక్ కీలకపాత్ర పోషించారు. సఫ్దర్, జాహిద్లు పేలుడు పదార్థాల కొనుగోలుకు నిధులు సేకరించినట్టు ఆధారాలు లభించాయి.
స్వాగతించిన బాధిత కుటుంబాలు
పేలుళ్లలో మృతిచెందినవారి కుటుంబ సభ్యులు ఈ తీర్పును స్వాగతించారు. ‘‘ఈ సమయం కోసమే మా అమ్మ, నేను 13 ఏళ్లుగా నిరీక్షించాం. 38 మందికి మరణశిక్ష విధించడం ఆనందం కలిగించింది. మిగతా దోషులకూ ఇదే శిక్షను ఖరారుచేసి ఉంటే బావుండేది’’ అని ఈ దుర్ఘటనలో తండ్రిని, సోదరుడిని కోల్పోయి... తాను కూడా తీవ్రంగా గాయపడిన యశ్ వ్యాస్ పేర్కొన్నాడు. అతని తండ్రి దుష్యంత్ వ్యాస్ ఓ క్యాన్సర్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్. కుమారులిద్దరికి సైకిల్ తొక్కడం నేర్పిద్దామని సాయంత్రం వారిని సరదాగా బయటకు తీసుకువెళ్లగా... పేలుళ్లు సంభవించాయి! ఆ ధాటికి దుష్యంత్తో పాటు యశ్ సోదరుడు కూడా మృతిచెందారు. 50% కాలిన గాయాలతో యశ్ చాలా నెలలు ఐసీయూలోనే చికిత్స పొందాల్సి వచ్చింది. తొమ్మిదేళ్ల వయసులో ఇంతటి ఘోరాన్ని చూసిన యశ్... ఇప్పుడు డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. భారీ పేలుడు కారణంగా పాక్షికంగా వినికిడి శక్తిని కోల్పోయాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
సీఎం తెచ్చిన నరకయాతన
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు -
అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలొద్దు
స్కిల్ కేసులో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది.