House arrests: చిత్తూరులో తెదేపా నేతల గృహ నిర్బంధం
చిత్తూరు జిల్లాలో బుధవారం తెదేపా నాయకులు, పోలీసుల మధ్య నెలకొన్న వాగ్వాదం తోపులాటకు దారితీసి చివరకు గృహనిర్బంధం వరకు వెళ్లింది. తెదేపా చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పులివర్తి
పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట.. పలువురి అరెస్టు
చిత్తూరులో నాని నివాసం వద్ద డీఎస్పీ సుధాకర్రెడ్డితో మాట్లాడుతున్న నాని, రామానాయుడు
ఈనాడు డిజిటల్, చిత్తూరు, కుప్పం, న్యూస్టుడే: చిత్తూరు జిల్లాలో బుధవారం తెదేపా నాయకులు, పోలీసుల మధ్య నెలకొన్న వాగ్వాదం తోపులాటకు దారితీసి చివరకు గృహనిర్బంధం వరకు వెళ్లింది. తెదేపా చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పులివర్తి నానిని పోలీసులు మంగళవారం అర్ధరాత్రి 2 గంటలకు కుప్పం నుంచి చిత్తూరులోని అతని ఇంటికి తీసుకొచ్చారు. బయటకు రాకుండా ఉదయాన్నే పోలీసులు భారీగా మోహరించారు. నాని నివాసంలో అప్పటికే విలేకరుల సమావేశం పూర్తిచేసుకొని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, నాని, ఎమ్మెల్సీ దొరబాబు తదితరులు ‘ప్రజాపరిరక్షణ యాత్ర’ పేరిట కుప్పం వెళ్లేందుకు బయల్దేరారు. వారు ఇంటి నుంచి బయటకు రాగానే పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట జరిగాయి. మహిళా కార్యకర్తల్ని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి వ్యాన్లోకి ఎక్కించారు. దీంతో నాయకులు నాని నివాసంలోకి వెళ్లిపోయారు. వివాదం పెద్దదవుతుండటంతో డీఎస్పీ సుధాకర్రెడ్డి వారితో చర్చించారు.
నిర్బంధాన్ని ఛేదించుకుని ప్రచారం
మాజీ మంత్రి అమరనాథరెడ్డి, దొరబాబు, పులివర్తి నానిని మంగళవారం రాత్రి తర్వాత అదుపులోకి తీసుకున్న పోలీసులు తెల్లవారుజామున వారి స్వస్థలాలకు చేర్చారు. పలమనేరులో స్వగృహానికి చేరిన అమరనాథరెడ్డి వేకువజామునే స్వెట్టర్, తలపాగా చుట్టుకొని బయటకు వచ్చారు. ఇంటి వెనుక గోడ దూకగా చేతికి గాయమైంది. అక్కడే పాఠశాలలోకి వెళ్లి కారు తెప్పించుకున్నారు. రహస్యంగా బయల్దేరి మధ్యాహ్నం ఒంటి గంటకల్లా కుప్పంలోని తెదేపా కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి 16వ వార్డులో ప్రచారం చేశారు.
తెదేపా కార్యకర్తల్ని వ్యాన్లోకి ఎక్కిస్తున్న పోలీసులు
అర్ధరాత్రి తరలింపు
మంగళవారం అర్ధరాత్రి దాటాక కుప్పం నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి పీఎస్ మునిరత్నం ఇంట్లో ఉన్న రామానాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 6 గంటలకే తాను స్టేషన్కు వస్తానని, అప్పటికీ రాకుంటే అరెస్టు చేయాలని ఆయన కోరారు. పోలీసులు ససేమిరా అనడంతో అర్ధరాత్రి 1.40 గంటలకు ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చి పోలీసుల కారు ఎక్కారు. కుప్పం అర్బన్ స్టేషన్లో కొంతసేపు ఉంచిన తర్వాత చిత్తూరులోని నాని ఇంటికి తరలించారు.
28 మంది ఎమ్మెల్యేలు తిష్ఠ వేశారు: రామానాయుడు
కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని నిమ్మల రామానాయుడు ఆరోపించారు. చిత్తూరులో నాని నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ‘మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వందల వాహనాలతో కుప్పంలో కలియదిరుగుతూ ప్రజల్ని బెదిరిస్తున్నారు. దాదాపు 28 మంది వైకాపా ఎమ్మెల్యేలు కుప్పంలోనే ఉన్నారు. వారిని తక్షణం అక్కడి నుంచి పంపించాలి. లేదంటే ప్రజాపరిరక్షణ యాత్ర పేరుతో తెదేపా నాయకులు, కార్యకర్తలతో కుప్పం బయలుదేరుతామ’ని ప్రకటించారు.
మేం ఉగ్రవాదులమా?
అమరనాథరెడ్డి
తమను నిర్బంధించి, అర్ధరాత్రి కుప్పం నుంచి తరలించాల్సిన అవసరమేంటని మాజీ మంత్రి అమరనాథరెడ్డి ప్రశ్నించారు. కుప్పం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘రాత్రి మమ్మల్ని కర్ణాటక ప్రాంతంలో తిప్పి తెల్లవారుజామున ఇళ్లకు చేర్చి గృహనిర్బంధంలో ఉంచారు. ఉగ్రవాదులకు కాపలా కాసినట్లుగా వందల మంది మా ఇళ్ల చుట్టూ మోహరించారు. కుప్పంతో నాకూ, నానీకి సంబంధం లేదంటూ అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. వైకాపా స్థానికేతరులు ప్రచారం చేయొచ్చు కాని, మేం చేయకూడదా? సొంత జిల్లా నాయకులు కూడా కుప్పం వెళ్లొద్దంటున్న పోలీసుల ఏకపక్ష ధోరణి తగద’ని హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)