Junk Food: జంక్ పిడుగు
చిన్నారుల జీవితాల్ని చిరుతిళ్లు శాసిస్తున్నాయి. ఇంట్లో అమ్మ చేసి పెట్టే తినుబండారాల కంటే వారు మార్కెట్లో దొరికే ఆహార పదార్థాలను ఎక్కువగా ఇష్టపడుతుండడం పరిపాటి అయ్యింది. బడుల వద్ద కూడా
పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
మార్కెట్లోని చిరుతిళ్లతో ప్రమాదం
‘ఈట్ రైట్’ నినాదంతో ఆదర్శంగా నిలుస్తున్న కేరళ
ప్రత్యేక పౌష్టికాహార మెనూ.. జంక్ ఫుడ్ కట్టడి
ఈనాడు డిజిటల్, హైదరాబాద్
చిన్నారుల జీవితాల్ని చిరుతిళ్లు శాసిస్తున్నాయి. ఇంట్లో అమ్మ చేసి పెట్టే తినుబండారాల కంటే వారు మార్కెట్లో దొరికే ఆహార పదార్థాలను ఎక్కువగా ఇష్టపడుతుండడం పరిపాటి అయ్యింది. బడుల వద్ద కూడా జంక్ ఫుడ్ కోసం పరుగులు పెడుతున్నారు. అది వారికి బలమివ్వకపోగా, ప్రమాదంలోకి నెడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిబంధనల్ని కఠినంగా పాటిస్తున్న కేరళ రాష్ట్రం ‘ఈట్ రైట్’ నినాదంతో ఆదర్శంగా నిలుస్తోంది. జంక్ ఫుడ్ను దూరం పెట్టడంతో పాటు పౌష్టికాహారాన్ని చిన్నారుల పళ్లెంలోకి చేర్చే ప్రయత్నం చేస్తోంది.
పాఠశాలలకు 50 మీటర్ల పరిధిలో చిరుతిళ్ల దుకాణాలుండొద్దనే నిబంధనలు తెలుగు రాష్ట్రాల్లో సరిగా అమలు కావట్లేదు. కేరళ మాత్రం కఠినంగా అమలు చేస్తోంది. బడుల్లో వాతావరణం (20%), చిరుతిళ్ల వ్యాపారాలు (30%), ఆహార పరీక్షలు, పర్యవేక్షణ (20%), శిక్షణ, వనరులు (10%), వినియోగంపై అవగాహన (20%) అంశాల ఆధారంగా ఎఫ్ఎస్ఎస్ఏఐ మూడేళ్లుగా రాష్ట్రాల ర్యాంకులను నిర్ణయిస్తోంది. ‘ఈట్ రైట్ కేరళ’ నినాదంతో విధానాల్ని మెరుగుపరుచుకున్న కేరళ రాష్ట్రం రెండో స్థానానికి చేరుకోగా.. 49 పాయింట్లతో తెలంగాణ 10వ స్థానంలో, 36 పాయింట్లతో ఏపీ 19వ స్థానంలో నిలిచాయి.
కేరళలో ఏం చేస్తున్నారంటే...
బడుల్లో ఇవీ నిబంధనలు..
* శుభ్రమైన తాగునీరు అందించాలి.
* తృణధాన్యాలు, పాలు, గుడ్లు, ఇతర పౌష్టికాహారంతో కూడిన మెనూ ఉండాలి.
* తాజా, స్థానిక ఉత్పత్తులతోనే వంట చేయాలి. ప్యాక్ చేసిన ఉత్పత్తులేవీ వాడొద్దు.
* వంటనూనె ఒకేసారి వాడాలి. అదీ రోజూ 25 గ్రాములకు మించరాదు.
* పాఠశాలలు, విద్యార్థుల హాస్టళ్లకు 50 మీటర్ల దరిదాపుల్లో చిరుతిళ్ల దుకాణాలుండకూడదు. క్యాంటీన్లలో మిఠాయిలు, ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్లు, చిప్స్, పిజ్జా, సమోసాలు, నూడుల్స్, గులాబ్ జామూన్, శీతల పానీయాలు నిషేధం.
బడి బువ్వలో ఉండేవి ఇవీ...
* గోధుమ, బియ్యం, రాగులు, సజ్జలు, కొర్రలు, జొన్నలతో వంటకాలు
* తక్కువ కొవ్వు ఉన్న పాలు, పెరుగు, పన్నీరు, చికెన్, చేపలు, కోడిగుడ్లు
* 300 గ్రాముల కూరగాయలు.. వీటిలో ఆకు కూరలు 50 గ్రా, ఇతరాలు 200 గ్రా, దుంపలు 50 గ్రా. ఉండాలి.
* బాదం, ఆల్మండ్, పిస్తా, ఉప్పు లేకుండా వేయించిన గింజలు
* ఉడికించిన చిరుతిళ్లు, ఉప్మా, పోహా, డోఖ్లా
పిల్లలకు ఇచ్చే స్నాక్ బాక్సుల్లో..
ఫ్రూట్ సలాడ్లు, పల్లీలు, బెల్లంతో చిక్కీలు, లడ్డూలు, బాదం, పిస్తాతో చేసిన పదార్ధాలు, మినప, ఉలవ పిండితో లడ్డూలు, రాగులు, జొన్నలు, సజ్జలతో చేసే స్నాక్స్.
రోగనిరోధక శక్తిని పెంచే ఆహారమిద్దాం
- సుజాత, పోషకాహార నిపుణురాలు
గత పదేళ్లలో పిల్లల ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. సరైన సమయానికి, సరైన తిండి తినట్లేదు. రోగ నిరోధక శక్తి పెరగాలంటే వారికి మంచి ఆహారం అందించాలి. జంక్ ఫుడ్ను నివారించి, పీచు, బలవర్ధక పదార్ధాలు ఇవ్వాలి. పాఠశాలల పరిసరాల్లో జంక్ ఫుడ్, ఇతర చిరుతిళ్లను ఉంచనివ్వొద్దు. పాలు, గుడ్లు, మన సంప్రదాయ ఆహారాన్ని తినేందుకు ప్రోత్సహించాలి.
ఆసక్తి.. అవగాహన పెంచాలి
- సయ్యదా సనా, పోషకాహార నిపుణురాలు
పిల్లలకు ఇంట్లో ఏం పెట్టాలో తల్లిదండ్రులు చూసుకుంటున్నట్లే బడుల్లో గురువులు బాధ్యత తీసుకోవాలి. ఏ ఆహారం తింటే ఏమవుతుందో చిన్నారులకు అర్థమయ్యేలా చెప్పాలి. లంచ్ బాక్సుల్లో రోజుకో రకం వినూత్న వంటకాలు పెట్టాలి. పండ్లు, ఇతర పదార్థాలతో భిన్న ఆహారాలతో వారికి ఆసక్తి కలిగించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
జగన్.. సొంత జిల్లా ప్రజలకు మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!