Kishan Reddy: వైకాపా అరాచక పాలన ఎన్నాళ్లో సాగదు
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అప్పుల కోసం పాకులాడుతోందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేసిందని ఎద్దేవా చేశారు. సొంత కాళ్లపై నిలబడే ప్రయత్నం చేయడం లేదన్నారు.
అప్పుల కోసం వైకాపా సర్కారు ఆరాటం
‘రాయలసీమ రణభేరి’ సభలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోమని నేతల ఉద్ఘాటన
ఈనాడు డిజిటల్, కడప: రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అప్పుల కోసం పాకులాడుతోందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేసిందని ఎద్దేవా చేశారు. సొంత కాళ్లపై నిలబడే ప్రయత్నం చేయడం లేదన్నారు. అప్పులు చేసి ఎన్ని రోజులు పాలన సాగిస్తారని ప్రశ్నించారు.కడపలో శనివారం జరిగిన రాయలసీమ రణభేరి సభలో ఆయన మాట్లాడారు. ‘వ్యతిరేకంగా మాట్లాడేవారిని అణచివేసే ప్రభుత్వాన్ని ఇక్కడే చూస్తున్నాం. పార్టీ మారితే కేసులు పెడతారు. భూములు కబ్జా చేస్తారు. వ్యాపారాలు దెబ్బతీస్తారు. ఇలాంటి అరాచక పాలన ఎన్ని రోజులో సాగదు. రతనాల సీమ లాంటి రాయలసీమ నేడు వెనుకబడిపోయింది. ఇక్కడి నుంచి ఎందరో నాయకులు రాష్ట్రానికి ముఖ్యమంత్రులయ్యారు. ఎవరు వచ్చినా సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోకపోవడమే సీమ వెనుకబాటుకు కారణం. నికర జలాలు కేటాయింపు లేక రాయలసీమ నష్టపోయింది’ అని ధ్వజమెత్తారు. ‘నిరుద్యోగ సమస్య పరిష్కారానికి సీఎం జగన్ ఏం చేశారు? రాయలసీమ సమస్యలపై భాజపా మొదటి నుంచి పోరాడుతోంది. జాతీయ రహదారుల అభివృద్ధి బాధ్యత కేంద్రం తీసుకుంది. గండికోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. శ్రీశైలం, అన్నవరం, అమరావతి క్షేత్రాల అభివృద్ధికి నిధులిస్తోంది’ అని తెలిపారు. ‘రానున్న రోజుల్లో రాయలసీమను మరింత అభివృద్ధి చేస్తాం. ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో కుటుంబపాలనకు ప్రజలు స్వస్తి పలికారు. ఇక్కడ కూడా రౌడీ రాజ్యం పోవాలి. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలి’ అని ఆకాంక్షించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ ‘పులివెందులలో మా పార్టీ అభ్యర్థి పోటీ చేస్తే ఆమె భూములు కబ్జా చేశారు. బద్వేలులో పార్టీకి మద్దతు పలికిన వారి భూములను నీటముంచారు. ఇసుక, మట్టి అమ్ముకునే దొంగల పార్టీ వైకాపా. చైనా, పాకిస్థాన్కే భాజపా భయపడలేదు. జగన్కు భయపడుతుందా?’ అని పేర్కొన్నారు. పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో రివర్స్ పాలన సాగుతోందన్నారు. జగన్ మద్యం అమ్ముకుంటుంటే.. ఆ పార్టీ నేతలు కల్తీసారా దందా చేస్తున్నారని ఆరోపించారు. కర్నూలులో న్యాయ రాజధాని పెడతానన్న జగన్.. ఏనాడైనా అమరావతి నుంచి హైకోర్టును మార్చాలని కేంద్రానికి లేఖ రాశారా? అని నిలదీశారు.
భాజపాతోనే మంచి భవిష్యత్తు
మా కుటుంబానికి రాయలసీమతో అవినాభావ సంబంధం ఉందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ‘రాయలసీమ దత్తపుత్రుడిగా ప్రకటించుకున్న ఎన్టీఆర్.. తిరుపతి నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఎన్టీఆర్ కుమార్తెగా నేను సీమ ఆడబిడ్డగా భావిస్తున్నా. రాయలసీమ క్షామ పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఇక్కడ భిక్షాటన చేపట్టారు. సిద్దేశ్వరం అలుగు రాయలసీమ జీవనాడి. దీనిపై ఏ ప్రభుత్వమూ దృష్టి పెట్టలేదు. పెండింగ్ ప్రాజెక్టులపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. 200 టీఎంసీల నీరు రాయలసీమకు రావాల్సి ఉండగా.. ఎంతమేరకు అందిస్తున్నారో తరచిచూసుకోవాలి’ అని పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర సహ బాధ్యులు సునీల్ దేవధర్ మాట్లాడుతూ.. తిరుమలేశుని తొలి గడప కడపలో టిప్పుసుల్తాన్ విగ్రహం పెడతామంటే ఊరుకోమన్నారు. హిందువులను ఊచకోత కోసిన వ్యక్తి విగ్రహాన్ని ప్రొద్దుటూరులో పెడతామంటే ఎలా ఒప్పుకుంటామని ప్రశ్నించారు.
శవాలకు కుట్లు వేసే పార్టీ
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని మాజీ మంత్రి, భాజపా నేత ఆదినారాయణరెడ్డి విమర్శించారు. వైఎస్ వివేకాను వాళ్లే చంపించి నాపై కేసులు పెట్టారని మండిపడ్డారు. కేసులో బయటకు వస్తున్న పేర్లన్నీ వారివే అన్నారు. శవాలకు కుట్లు వేయడం, రక్తపు మరకలు తుడవడం లాంటి పనులకు పాల్పడే పార్టీ వైకాపా అని ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసే బాధ్యత అందరిపై ఉందన్నారు. జమ్మలమడుగులో ఉక్కు పరిశ్రమ ఏమైందని ప్రశ్నించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు, సుజనాచౌదరి, టీజీ వెంకటేశ్, నాయకులు కామినేని శ్రీనివాస్, కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ మాధవ్, వాకాటి నారాయణరెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి తదితరులు మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
సీఎస్, డీజీపీలపై.. ఈసీ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
సీఎం తెచ్చిన నరకయాతన
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు -
అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలొద్దు
స్కిల్ కేసులో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి