New Districts: కొత్త జిల్లాల ఏర్పాటు..అధికరణ 371డీకి విరుద్ధం
కొత్త జిల్లాల ఏర్పాటు (జిల్లాల పునర్విభజన) విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 25న ఇచ్చిన ముసాయిదా నోటిఫికేషన్ను (మొత్తం 26 జీవోలు) చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించి, రద్దు చేయాలంటూ హైకోర్టులో
ముసాయిదా ప్రకటనను రద్దు చేయండి
ఉద్యోగాల భర్తీకి జిల్లా, జోన్లే ప్రాతిపదిక
వాటిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు
హైకోర్టులో పిల్.. సోమవారం విచారణ
ఈనాడు, అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటు (జిల్లాల పునర్విభజన) విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 25న ఇచ్చిన ముసాయిదా నోటిఫికేషన్ను (మొత్తం 26 జీవోలు) చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించి, రద్దు చేయాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ముసాయిదా నోటిఫికేషన్, తదనంతరం జారీ చేసిన జీవోలు అధికరణ 371-డికి విరుద్ధమని, వాటిని రద్దు చేయాలంటూ గుంటూరు జిల్లా అప్పాపురం గ్రామానికి చెందిన దొంతినేని విజయ్ కుమార్, శ్రీకాకుళం జిల్లాకు చెందిన బి.సిద్ధార్థ, ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన జాగర్లమూడి రామారావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ముసాయిదా జీవోల అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శులను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరపనుంది.
పిటిషన్లో ఏముందంటే..
* కొత్త జిల్లాల ఏర్పాటు అధికరణ 371-డికి, ‘ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల (స్థానిక కేడర్ నిర్వహణ, నేరుగా నియామకాల క్రమబద్ధీకరణ) ఉత్తర్వులు-1975కు విరుద్ధం. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్య సంబంధ వ్యవహారాల్లో రాష్ట్ర ప్రజల హక్కులకు భద్రత కల్పిస్తూ ఏపీ విభజన చట్టం సెక్షన్ 97లోనూ దీన్ని పొందుపరిచారు.
* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఆరు సూత్రాల ప్రణాళిక ఉండేది. లోకల్ ఏరియాను నిర్ణయించడానికి జిల్లాను ఒక యూనిట్గా పరిగణించారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ఆరు జోన్లుగా నిర్ణయించారు. స్థానికులకు రిజర్వేషన్ కల్పించారు.
* ఆరు సూత్రాల ప్రణాళిక నేపథ్యంలో రాజ్యాంగంలో అధికరణ 371డి, 371ఈని పొందుపరిచారు. వాటి ప్రకారం ఏపీ ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక నిబంధనలున్నాయి.
* రాష్ట్రపతి ఉత్తర్వుల నేపథ్యంలో ‘ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల (స్థానిక కేడర్ నిర్వహణ, నేరుగా నియామకాల క్రమబద్ధీకరణ) ఉత్తర్వులు-1975ను తీసుకొచ్చారు. అందులోని రెండో షెడ్యూల్ ప్రకారం ఏపీలోని జిల్లాలను మొత్తం ఏడు జోన్లుగా ఏర్పాటు చేశారు. విభజన అనంతరం ఏపీలో 4 జోన్లు మిగిలాయి. కొత్త జిల్లాలతో వాటి స్వరూపం మారిపోతోంది.
* ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ల కోసం జిల్లాను యూనిట్గా పరిగణించాలి. రాజ్యాంగ నిబంధనలను సవరించకుండా ఉద్యోగాల్లో రిజర్వేషన్లను మార్చడానికి వీల్లేదు.
* రాష్ట్రపతి ఉత్తర్వుల నేపథ్యంలో లోయర్ డివిజన్ పోస్టుల భర్తీ విషయంలో జిల్లాను యూనిట్గా పరిగణిస్తున్నారు. దానిని రాష్ట్ర ప్రభుత్వం మార్చలేదు.
* 32వ రాజ్యాంగ సవరణ ద్వారా అధికరణ 371డి తీసుకొచ్చి ప్రత్యేక నిబంధనలు రూపొందించారు. ఈ నేపథ్యంలో జోన్ల సృష్టి, అందులో లోకల్ కేడర్ నిర్ణయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి స్వతఃసిద్ధ అధికారం ఉండదు.
* వీటన్నింటి నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటు పేరుతో జోన్లను మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు.
* ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయండి.
పిటిషనర్ ఏం చెప్పారంటే...
1. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లాల హద్దులను నిర్ణయించారు. కాబట్టి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించనంత వరకు ఏపీలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉండదు.
2. 32వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏపీలోని వివిధ ప్రాంతాల ప్రజలకు విద్యాసంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు కల్పించడానికి ఆరు సూత్రాల ప్రణాళికను అమల్లోకి తెచ్చింది. రాష్ట్రంలో వెనుకబడిన వారికి అభివృద్ధిలో సమాన అవకాశాలు కల్పించడానికి అధికరణ 371డిని తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న జోన్లకు విరుద్ధంగా కొత్త జిల్లాలను సృష్టించే అధికారం రాష్ట్రప్రభుత్వానికి ఉండదు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం శాసనం చేయకుండా అధికరణ 371డి(10) ప్రకారం నిషేధం ఉంటుంది.
3. ఏపీ విభజన చట్టం సెక్షన్ 97లో.. అధికరణ 371డిని సవరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని పేర్కొన్న స్థానంలో ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదా తెలంగాణ రాష్ట్రం’ అని పేర్కొన్నారు. అంటే విభజన తర్వాత కూడా అధికరణ 371డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్తిస్తుందని స్పష్టమవుతోంది.
4. కొత్త జిల్లాల ఏర్పాటుతో గతంలో నిర్ణయించిన జోన్లు, రెవెన్యూ డివిజన్లలో మార్పులు చోటుచేసుకుంటాయి. అలా మార్చే అధికారం రాష్ట్రానికి లేదు.
5. కొత్త జిల్లాల ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోల్లో ఉద్యోగాల భర్తీ సందర్భంగా స్థానిక అభ్యర్థులు అంటే ఎవరు? లోకల్ ఏరియా ఏమిటి అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు.
6. 1975లో ఇచ్చిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఉత్తర్వుల్లో ప్రతి జిల్లాను లోకల్ ఏరియాగా పేర్కొన్నారు. వివిధ ఉద్యోగాల్లో స్థానిక అభ్యర్థులకు 80శాతం రిజర్వేషన్లు కల్పించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో జోన్లు మారిపోతాయి. పూర్వ ప్రక్రియ అంతా మారిపోతుంది.
7.పునర్నిర్మాణ జిల్లాలు, డివిజన్లు ఏప్రిల్ 2 నుంచి ప్రారంభం అవుతాయని ప్రభుత్వం పేర్కొంది. అది ఏపీ జిల్లా(ఏర్పాటు) చట్టం-1974 నిబంధనలను ఉల్లంఘించడమే. ఆ చట్టప్రకారం అభ్యంతరాలను స్వీకరించి, పరిగణనలోకి తీసుకోవాలి. జనవరి 26న ఇచ్చిన నోటిఫికేషన్లో అభ్యంతరాల గురించి ప్రస్తావనే లేదు.
8. తుది నోటిఫికేషన్ ఇచ్చే ముందు అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని ఏపీ జిల్లా ఏర్పాటు చట్టం స్పష్టం చేస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ 8వేలకు పైగా అభ్యంతరాలు వచ్చాయి. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాలు, డివిజన్లు ప్రారంభించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ నెల 3న మెమో జారీచేస్తూ పోస్టులను కేటాయించింది.
9. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వ్యవహారమై ఇప్పటికే గుర్తించిన జిల్లాల భౌగోళిక స్వరూపాన్ని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు.
10. కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రప్రభుత్వ ఖజానాపై చాలా భారం పడుతుంది. ఇప్పటికే ప్రభుత్వం భారీగా అప్పుల్లో ఉంది. కేంద్రం కూడా కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆర్థిక సాయం చేసేందుకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
ఎడ్సెట్-2024 నోటిఫికేషన్ విడుదల
బీఎడ్ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శుక్రవారం ఎడ్సెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
‘కౌలు రైతుకు’ జగన్ కాటు!
‘‘దేశంలో ఎక్కడా లేనట్లుగా కౌలు రైతులకు మేం తోడుగా ఉంటున్నాం. గ్రామ సచివాలయంలోనే సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నాం. వారికి ఇక రైతు భరోసాతోపాటు అన్ని పథకాలు అందుతాయి’’ అంటూ 2023 సెప్టెంబరులో రైతు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్ గొప్పలు చెప్పారు. -
జనం కళ్లలో జగన్ దుమ్ము
సిద్ధం యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడీబీ రోడ్డు మీదుగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఇది.. మధ్యలో ఒక్కసారి ఆయన బస్సు దిగి చూస్తే రోడ్డు దుస్థితి తెలిసేవి. -
ఐదేళ్లలో భారీగా పెరిగిన బొత్స కుటుంబ ఆస్తి
విజయనగరం జిల్లా చీపురుపల్లి వైకాపా అభ్యర్థి (వైకాపా), మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో సుమారు రెండున్నర రెట్లు పెరిగింది. -
రోజాకు రూ. 10.63 కోట్ల ఆస్తులు
వైకాపా అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు. ఇప్పుడు రూ.4.58 కోట్లు. -
రైతు సదస్సు పేరుతో వైకాపా భోజనాలు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో రైతు అవగాహన సదస్సు పేరుతో వైకాపా నాయకులు ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. -
ఉద్యోగమే ‘సోర్స్..’ పథకాలు ‘అవుట్’
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు. -
గిగ్గోడు వినిపించలేదు
ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు.. నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్, బైక్ రైడర్ లాంటి పనులు చేస్తూ ‘గిగ్’ కార్మికులుగా మారుతున్నారు యువత. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
జగన్ మాట్లాడుతుంటే జనం వెళ్లిపోయారు
సీఎం జగన్ కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మొదట్లో కాకినాడ గ్రామీణ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రసంగించారు. -
సిద్ధం సభకు బస్సుల తరలింపు.. ప్రయాణికులకు నరకయాతన
కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం సిద్ధం సభకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. -
సామాజికవర్గం పేరుతో మహిళను దూషించిన వైకాపా నేత రాజమోహన్రెడ్డి
‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసల విలువ చేయదు..’ అంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆత్మకూరు ఛైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అన్నదాతలను బలిచేసి.. అస్మదీయులకు ధారపోసి
అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు. -
సంక్షేమ పథకాలు ఓట్లు పొందే మార్గాలు కాకూడదు
ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.