PRC employees:నెలాఖరులోగా పీఆర్సీ కొలిక్కి
ఉద్యోగులకు వేతన సవరణ ఈ నెలాఖరులోగా కొలిక్కి తీసుకొస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. నవంబరు చివరిలోగా ప్రధాన సమస్యలన్నీ పరిష్కరించాలన్నది ప్రభుత్వ ఆలోచన అని
నవంబరు చివరికి ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం
18, 19 తేదీల్లో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం: సజ్జల
పరిష్కరించకుంటే ఉద్యమ పంథా: బండి, బొప్పరాజు
ఈనాడు డిజిటల్, అమరావతి: ఉద్యోగులకు వేతన సవరణ ఈ నెలాఖరులోగా కొలిక్కి తీసుకొస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. నవంబరు చివరిలోగా ప్రధాన సమస్యలన్నీ పరిష్కరించాలన్నది ప్రభుత్వ ఆలోచన అని వెల్లడించారు. అక్టోబరు 18, 19 తేదీల్లో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. నవంబరు నుంచి వేతనాలు సక్రమంగా ఇవ్వడానికి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారని చెప్పారు. కొవిడ్ కారణంగా ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైందని, ఫలితంగానే పీఆర్సీ, సీపీఎస్ రద్దు అంశాలు పెండింగ్లో ఉన్నాయని వివరించారు.
వచ్చే నెలాఖరులోగా ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితర సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. ఏపీ ఐకాస ఛైర్మన్ బండి శ్రీనివాసరావు, ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఇతర నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎంవో అధికారులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం సమావేశమయ్యారు. వేతన సవరణ, సీపీఎస్ రద్దు తదితర 10 అంశాలపై చర్చించారు. అనంతరం ఐకాస నేతలతో కలిసి సజ్జల విలేకర్లతో మాట్లాడారు. ‘ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఉద్యోగ సంఘాలతో సమావేశమవుతున్నాం. గత సీఎస్ పదవీ విరమణ చేసిన సమయానికి కొన్ని అంశాలు కొలిక్కి వచ్చినా కొత్త సీఎస్ రావడంతో కొంత ఆలస్యం జరిగింది. దీంతో కొన్ని చిన్న సమస్యలు పెద్దగా కనిపించాయి. ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. ఉద్యోగుల సంక్షేమం విషయంలో రెండు అడుగులు ముందుండాలన్నదే సీఎం విధానం’ అని చెప్పారు. ‘ఉద్యోగులేమైనా బయటి వ్యక్తులా..? వాళ్లు ఏదైనా ఆందోళన చేస్తున్నప్పుడు సమస్య ఏమిటని అడగడం సాధారణం. ఉద్యోగుల సమస్యలపై అధికారికంగా.. అనధికారికంగా ఫోన్లలో మాట్లాడుతుంటారు. అంతర్జాతీయ రహస్యమైనట్లు వింతగా మాట్లాడుతున్నారు. బండి శ్రీనివాసరావు అక్కడే ప్రెస్మీట్లోనే ఫోన్లో ఎందుకు మాట్లాడతారు..? పక్కకు వెళ్లి మాట్లాడలేరా..? ప్రభుత్వం అన్ని ఉద్యోగ సంఘాలను సమానంగా చూస్తుంది. సీఎస్తో సమావేశానికి అందరూ రావొచ్చు. ఉద్యోగుల్ని గ్రూపులుగా విడగొట్టి రాజకీయం చేయాలన్నది సీఎం ఉద్దేశం కాదు’ అని సజ్జల స్పష్టం చేశారు.
పరిష్కరించకుంటే ఉద్యమమే: ఐకాస నేతలు
వచ్చే నెలాఖరులోగా సమస్యలన్నీ కొలిక్కి తీసుకొస్తామని సజ్జల హామీ ఇచ్చారని, ఒకవేళ పరిష్కారమవకుంటే ఉద్యమ బాట వదిలిపెట్టబోమని ఏపీ ఐకాస ఛైర్మన్ బండి శ్రీనివాసరావు, ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. ‘దసరా కానుకగా పీఆర్సీ ఇవ్వాలని కోరగా.. చర్చించాల్సి ఉందని.. సీఎస్కు బుధవారం నుంచే ఇందుకు సంబంధించి బాధ్యతలు అప్పగిస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులుంటే ముందుగా రిటైర్డు ఉద్యోగులకు పింఛన్లు ఇచ్చి ఆ తర్వాతే వేతనాలు ఇవ్వాలని కోరాం. కారుణ్య నియామకాల కోసం ప్రత్యేక మేళాలు నిర్వహించాలి. పెండింగ్ బిల్లులు, పీపీ జీఎల్ఐ, జీపీఎఫ్, మెడికల్ బిల్లుల విడుదలపై త్వరలో ఆర్థిక శాఖతో సమావేశం ఏర్పాటు చేసి పరిష్కరిస్తామన్నారు. ఆరోగ్యకార్డులు సక్రమంగా పనిచేయనందున నెట్వర్క్ ఆసుపత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు’ అని వివరించారు. సమావేశంలో ఏపీ ఐకాస ప్రధాన కార్యదర్శి హృదయరాజు, ఏపీ ఐకాస అమరావతి ప్రధాన కార్యదర్శి వైవీ రావు, ఏపీఎన్జీవో సంఘం ప్రధాన కార్యదర్శి కేవీ శివారెడ్డి తదితరులున్నారు.
మధ్యంతర భృతితో సమంగా..
పీఆర్సీ నివేదిక అమలుచేసే లోపు ప్రభుత్వాలు ఉద్యోగులకు ఐఆర్ (మధ్యంతర భృతి) ఇస్తాయి. 2019 జులై నుంచి ప్రభుత్వం 27% మధ్యంతర భృతి ఇస్తోంది. వేతన సవరణ కమిషన్ కూడా అంతే మొత్తంలో ఫిట్మెంట్ సిఫార్సు చేసిందని తెలిసింది. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతన స్కేళ్లు పెంచేందుకు ఈ ఫిట్మెంట్ను లెక్కకట్టి వేతన సవరణ కమిషన్ సిఫార్సు చేస్తుంది. ఇంటి అద్దె భత్యం, గ్రాట్యుటీ పెంపు, ప్రారంభ మూలవేతనం తదితరాలపై ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకున్నందువల్ల వారి విషయంలోనూ ప్రత్యేక నివేదికను కమిషన్ సమర్పించింది.
పీఆర్సీ నివేదికలో 27% ఫిట్మెంట్?
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతన సవరణకు సంబంధించి 11వ వేతన సవరణ కమిషన్ 27% ఫిట్మెంటును సిఫార్సు చేసిందా? అది అంతే మొత్తమని విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రంలో ఉద్యోగులకు 11వ వేతన సవరణ కమిషన్ నివేదికను అమలు చేయాల్సి ఉంది. అశుతోష్ మిశ్ర ఏకసభ్య ఛైర్మన్గా ఉన్న ఈ కమిషన్ గతేడాది అక్టోబరు 5న తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. వేతన సవరణ కమిషన్ నివేదిక సమర్పణ ఎంతో హడావుడిగా జరుగుతుంది. ముఖ్యమంత్రికి నేరుగా కమిషన్ తన నివేదిక ఇస్తుంది. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో వారు విలేకర్లతోనూ మాట్లాడతారు. ఈ కమిషన్ కరోనా సమయంలో నివేదిక సమర్పించాల్సి వచ్చింది. దీంతో ఛైర్మన్ అశుతోష్ మిశ్ర రాకుండానే నివేదికను వారి కార్యాలయ ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి పంపించారు. నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి ఆ నివేదిక అందింది. ఇంతవరకూ ప్రభుత్వం నివేదికను బయటపెట్టలేదు. సాధారణంగా ఉద్యోగులకు ఎంత ఫిట్మెంట్ ఇస్తారనేది ఆసక్తికరం. వీలైనంత ఎక్కువ మొత్తం సాధించుకునేందుకు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో చర్చిస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు