Padma Awards: పద్మవిభూషణుడు ఎస్పీ బాలు
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మరణానంతరం ప్రకటించిన దేశంలోనే రెండో అత్యున్నత పౌరపురస్కారం పద్మవిభూషణ్ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం అందజేసింది. ఈ మేరకు రాష్ట్రపతి
పురస్కారం స్వీకరించిన కుమారుడు చరణ్
పద్మశ్రీ అందుకున్న గుస్సాడీ కనకరాజు
దిల్లీ: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మరణానంతరం ప్రకటించిన దేశంలోనే రెండో అత్యున్నత పౌరపురస్కారం పద్మవిభూషణ్ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం అందజేసింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్లో జరిగిన 2021 ఏడాదికి సంబంధించిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో బాలు కుమారుడు ఎస్పీ చరణ్ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా తదితరులు హాజరయ్యారు. పురస్కారాలకు ఎంపికైన 118 (పద్మవిభూషణ్-7, పద్మభూషణ్-10, పద్మశ్రీ-101) మందిలో జపాన్ మాజీ ప్రధాని షింజో అబే (పద్మ విభూషణ్), బ్రిటన్కు చెందిన సినీ దర్శకుడు పీటర్ బ్రూక్ (పద్మశ్రీ)లు మాత్రం కార్యక్రమానికి హాజరవలేదు. తెలంగాణకు చెందిన గుస్సాడీ కళాకారుడు కనకరాజు, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన వయోలిన్ విద్వాంసుడు అన్నవరపు రామస్వామి, అనంతపురం జిల్లాకు చెందిన సాహితీవేత్త ఆశావాది ప్రకాశరావు, దేశంలోనే తొలి మృదంగ కళాకారిణి దండమూడి సుమతి రామమోహన్రావు(విజయవాడ)లు పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.
తన తండ్రికి ప్రకటించిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని మంగళవారం దిల్లీలో రాష్ట్రపతి
రామ్నాథ్ కోవింద్చేతుల మీదుగా స్వీకరిస్తున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్
పద్మశ్రీ అవార్డు అందుకుంటున్న తెలంగాణ గుస్సాడీ కళాకారుడు కనకరాజు
* ఒడిశాకు చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ సాహూ, కర్ణాటక వైద్యుడు బీఎం హెగ్డే పద్మ విభూషణ్ పురస్కారం స్వీకరించారు.
* లోక్సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్, మాజీ ఐఏఎస్ అధికారి నృపేంద్ర మిశ్రాలు పద్మభూషణ్ అందుకున్నారు. అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్, కేంద్ర మాజీ మంత్రి రాంవిలాస్ పాస్వాన్లకు మరణానంతరం ప్రకటించిన పద్మభూషణ్ను వారి కుటుంబసభ్యులు అందుకున్నారు.
ప్రథమ పౌరుడికి దిష్టి తీసిన మంజమ్మ జోగతి
జానపద కళాకారిణి మంజమ్మ జోగతి
బెంగళూరు (ఎలక్ట్రానిక్ సిటీ), న్యూస్టుడే: పద్మ పురస్కారాల ప్రదానోత్సవంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన జానపద కళాకారిణి మాతా బి. మంజమ్మ జోగతి.. తన పేరు పిలవగానే హుందాగా నడిచివెళ్లారు. రాష్ట్రపతికి సమీపంలో నిలుచుని ముందుగా ఆయనకు దిష్టి తీశారు. పైట కొంగును పైకి కిందకు ఊపుతూ దిష్టి తీస్తుంటే.. రామ్నాథ్ కోవింద్ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. అనంతరం ప్రథమ పౌరుడికి మంజమ్మ పాదాభివందనం చేశారు. ఆ తర్వాత ఆయన చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. పద్మ పురస్కారానికి ఎంపికైన తొలి మంగళముఖి (ట్రాన్స్జెండర్) మంజమ్మ. కర్ణాటకలోని విజయనగర జిల్లా మరియమ్మనహళ్లికి చెందిన ఆమెకు కళల విభాగంలో అవార్డు లభించింది.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకుంటున్న సాహితీవేత్త ఆశావాది ప్రకాశరావు
మృదంగ కళాకారిణి దండమూడి సుమతి రామమోహన్రావు
వయోలిన్ విద్వాంసుడు అన్నవరపు రామస్వామి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్