Pending bills: హోరెత్తిన చెరకు పోరు
చెరకు రైతులకు ఇవ్వాల్సిన బకాయిలపై మూడోరోజు శుక్రవారం విజయనగరం జిల్లాలో నిరసనలు హోరెత్తాయి. లచ్చయ్యపేట ఎన్సీఎస్ చక్కెర కర్మాగారం పరిధిలోని చెరకు రైతుల బకాయిలు చెల్లించాలని ఈనెల 3న రైతులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే
ముందస్తు అరెస్టులు...నిరసనలు
మూడో రోజూ ‘ఎన్సీఎస్’ ఆందోళన
విజయనగరం జిల్లాలో ఆగని లచ్చయ్యపేట బకాయిల చిచ్చు
బొబ్బిలిలో ఆందోళనకారులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
బొబ్బిలి, సీతానగరం, న్యూస్టుడే: చెరకు రైతులకు ఇవ్వాల్సిన బకాయిలపై మూడోరోజు శుక్రవారం విజయనగరం జిల్లాలో నిరసనలు హోరెత్తాయి. లచ్చయ్యపేట ఎన్సీఎస్ చక్కెర కర్మాగారం పరిధిలోని చెరకు రైతుల బకాయిలు చెల్లించాలని ఈనెల 3న రైతులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. రెండు సీజన్ల బకాయిలు రూ.16.33 కోట్ల చెల్లింపులపై అధికారుల నుంచి స్పష్టమైన హామీ లేకపోవడంతో శుక్రవారం పార్వతీపురం డివిజన్లో బంద్ నిర్వహించేందుకు వామపక్ష, ప్రజాసంఘాలు పిలుపు నిచ్చాయి. వారికి మద్దతుగా తెదేపా, జనసేన నాయకులు రహదారులపైకి వచ్చారు. జిల్లా వ్యాప్తంగా వామపక్ష, జనసేన నాయకులను పోలీసులు అరెస్టులు చేశారు. కొందరిని గృహ నిర్బంధం చేశారు. తెదేపా, జనసేన, సీపీఎం, సీపీఐ, నాయకులు సీతానగరం, కర్మాగారం వద్ద నిరసనకు సిద్ధమయ్యారు. అయితే తొలుత జనసేన నాయకులను పోలీస్స్టేషన్కు తరలించారు. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రాపు సూర్యనారాయణ నేతృత్వంలో సీతానగరం హనుమాన్ కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. మరోవైపు పార్వతీపురం తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి బొబ్బిలి చిరంజీవులు, జిల్లా తెలుగు రైతు కార్యదర్శి జి.వెంకటరెడ్డి నేతృత్వంలో తెదేపా నాయకులు రాస్తారోకో చేశారు. జనసేన నాయకులు బొబ్బిలి పోలీస్స్టేషన్లో ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని గ్రామీణ పోలీస్స్టేషన్లకు తరలించారు. కర్మాగారాన్ని ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని, బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మందస్తు అరెస్టులతో కట్టడి చేసినా జిల్లాలో పలు చోట్ల ఆందోళనలు కొనసాగాయి. జిల్లా వ్యాప్తంగా 80 మందిని అరెస్టు చేశారు. జనసేన రాజకీయ వ్యవహరాల రాష్ట్ర కార్యదర్శి యశస్వి, పార్వతీపురం నియోజకవర్గ ప్రచార కార్యదర్శి పాలూరు బాబు, మండల కార్యదర్శి పోతల శివశంకర్, సీపీఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణలతో పాటు పలువురు కార్మిక నాయకులు, తెదేపా మండల స్థాయి నాయకులను అరెస్ట్ చేసి తరవాత విడుదల చేశారు.
ఫ్యాక్టరీ భూములు అమ్మి చెరకు బకాయిలు చెల్లిస్తాం: బొత్స
విజయనగరం కలెక్టరేట్, న్యూస్టుడే: ఎన్సీఎస్ షుగర్స్ కు చెందిన భూములను వేలం ద్వారా అమ్మి సంబంధిత రైతులకు బకాయిల కింద చెల్లించాల్సిన ప్రతి పైసా చెల్లిస్తామని, అందరూ సంయమనం పాటించాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విజయనగరంలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. చెరకు బకాయిల కోసం కొన్ని రోజుల క్రితం జిల్లాలో జరిగిన ఆందోళన నిజమైన రైతులు చేసింది కాదని చెప్పారు. నిజమైన రైతులను తాము అరెస్టు చేయలేదని, అటువంటి ఘటనలు పునరావృతం కాకూడదనే శుక్రవారం ముందస్తు అరెస్టులు చేశామని వెల్లడించారు. ఎన్సీఎస్ షుగర్స్కు చెరకు ఇచ్చిన రైతులకు గత రెండు సీజన్లతో కలిపి రూ.16 కోట్ల మేర బకాయిలు ఉన్నాయని, వీటి చెల్లింపునకు కర్మాగారానికి చెందిన సుమారు 24 ఎకరాలను స్వాధీనం చేసుకొని వేలం వేస్తామని తెలిపారు. రూ.10 కోట్ల విలువైన 30 వేల బస్తాల పంచదారను ఇప్పటికే ప్రభుత్వం సీజ్ చేసిందని చెప్పారు. 2015 నుంచి పేరుకుపోయిన రూ.27.80 కోట్ల బకాయిలను... కర్మాగార భూములు విక్రయించి 2019లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించిన విషయాన్ని గుర్తు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
జగన్.. సొంత జిల్లా ప్రజలకు మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సాక్షి వదిన తర్వాత.. ధోనీ భయ్యా ఎత్తుకుంది నన్నే: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ