Petro rates: పెట్రో వాతపై హారన్ల మోత
‘పెట్రో మోతను తగ్గించాలి.. నిద్ర నటిస్తున్న ముఖ్యమంత్రి మేల్కొనాలి’ అంటూ తెదేపా నేతలు రాష్ట్రవ్యాప్తంగా పెట్రోలు బంకుల వద్ద వినియోగదారులతో కలిసి వాహనాల హారన్లు మోగించారు. నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు, బైఠాయింపులు, వినూత్న ప్రదర్శనలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పెట్రోలు బంకుల వద్ద తెదేపా నిరసనలు
నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ముందుగానే కొందరు నేతల గృహనిర్భందం
విజయవాడ బెంజిసర్కిల్లో పెట్రోల్ బంకు వద్ద నిరసన తెలుపుతున్న తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర, కృష్ణా జడ్పీ మాజీ ఛైర్పర్సన్ గద్దె అనూరాధ, రాష్ట్ర అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ, రాష్ట్ర కార్యదర్శి గన్నే నారాయణ ప్రసాద్ తదితరులు
ఈనాడు, అమరావతి: ‘పెట్రో మోతను తగ్గించాలి.. నిద్ర నటిస్తున్న ముఖ్యమంత్రి మేల్కొనాలి’ అంటూ తెదేపా నేతలు రాష్ట్రవ్యాప్తంగా పెట్రోలు బంకుల వద్ద వినియోగదారులతో కలిసి వాహనాల హారన్లు మోగించారు. నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు, బైఠాయింపులు, వినూత్న ప్రదర్శనలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘పెట్రోలు, డీజిల్పై వ్యాట్ను తగ్గిస్తానని పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ధరలు తగ్గించాలి’ అని డిమాండు చేశారు. ‘పెట్రోలు, డీజిల్పై దేశంలోనే అత్యధిక వ్యాట్ జగన్ సర్కారు వసూలుచేస్తోంది. గత రెండున్నరేళ్లలో వీటిపై రూ.28 వేల కోట్ల పన్నులు వసూలుచేశారు. రహదారుల అభివృద్ధి సెస్ పేరుతో అదనంగా వసూలు చేస్తున్న మొత్తంతో రాష్ట్రంలో ఎక్కడా రోడ్లు వేసిన దాఖలాల్లేవు. ఈ పెట్రో ఆదాయం ఏమైంది?’ అని ప్రశ్నించారు. నిరసనల సందర్భంగా పలువురు నేతలను పోలీసులు అరెస్టుచేయగా, మరికొందరిని ముందే గృహనిర్బంధం చేశారు.
వాహన ర్యాలీలు
* ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి 3కి.మీ. మేర సైకిల్ తొక్కుతూ రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ సమీపంలోని పెట్రోలు బంకు వద్దకు చేరుకుని నిరసన తెలిపారు.
* మండపేటలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో, గన్నవరంలో ఎమ్మెల్సీ అర్జునుడి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై, సూళ్లూరుపేట నియోజకవర్గ తెదేపా బాధ్యుడు నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వాహన ప్రదర్శనలు నిర్వహించగా ఉంగుటూరులో హారన్లు మోగించారు.
విజయనగరం జిల్లా సాలూరు ప్రధాన రహదారిలో వాహనానికి తాడుకట్టి లాగుతున్న పొలిట్బ్యూరో సభ్యురాలు సంధ్యారాణి, నేతలు
వినూత్న ప్రదర్శనలతో
* గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా సాలూరులో స్కార్పియోను తాళ్లతో లాగారు.
* నర్సీపట్నంలో చింతకాయల రాజేష్ ఆధ్వర్యంలో స్కూటరు చక్రాలు ఊడదీసి సైకిల్ చక్రాలు బిగించి నడిపించారు.
* పెట్రోలు ధరలు తగ్గించాలని వేమూరులో దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చారు.
* తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆధ్వర్యంలో పెట్రోలు, డీజిల్ పంపులకు పూలమాల వేసి టెంకాయ కొట్టి నిరసన తెలిపారు.
* రంగంపేటలో ఆళ్ల గోవిందు ఆధ్వర్యంలో పెట్రోలు బంకు సిబ్బందికి, పోలీసులకు, వాహన చోదకులకు గులాబీ పూలు అందించారు.
* కర్నూలు జిల్లా మహానంది మండలం బుక్కాపురంలో తెదేపా నాయకులు లారీని కొంతదూరం లాగారు.
ధర్నాలు.. బైఠాయింపులు
విజయవాడ బెంజిసర్కిల్లో, గాంధీచౌక్లో తెదేపా సీనియర్ నేతలు ధర్నాచేయగా, తెనాలిలో మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా ఆధ్వర్యంలో తెనాలి-గుంటూరు బ్రిడ్జిపై బైఠాయించి నిరసన తెలిపారు. నరసరావుపేటలో తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి చదలవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో వినుకొండ రోడ్ జంక్షన్లోని పెట్రోల్ బంకు ఎదుట బైఠాయించారు. చెన్నేకొత్తపల్లిలో పరిటాల శ్రీరామ్ బైఠాయించారు. రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు.
* ఎంపీ రామ్మోహన్నాయుడు శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కరాపాడు జాతీయ రహదారిలోని పెట్రోలుబంకు వద్ద నిరసన చేపట్టారు.
కర్నూలు జిల్లా బుక్కాపురంలో లారీని లాగుతున్న తెదేపా శ్రేణులు
అడ్డుకున్న పోలీసులు
* అమలాపురంలో నిరసనను పోలీసు అధికారులు అడ్డుకున్నారు.
* రావులపాలెం, అమలాపురాల్లో సాక్షి దినపత్రికకు నిప్పంటించే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు.
* కడపలో నిరసన తెలిపేందుకు వెళుతున్న మల్లెల లింగారెడ్డి, బీటెక్ రవి, పుట్టా సుధాకర్ యాదవ్, అమీర్ బాబు, ప్రవీణ్కుమార్రెడ్డి తదితర నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టుచేశారు. శ్రీనివాసులరెడ్డిని గృహనిర్బంధం చేశారు. పులివెందులలో ధర్నా చేస్తున్న తెదేపా నేతలను అరెస్టుచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ