Raitu Nestam: ఉచితాలతో ప్రజలకు మేలు కలగదు
రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించేలా ప్రభుత్వాల పథకాలు ఉండాలని, జనాకర్షక పథకాలపై దృష్టి పెట్టి.. ఉన్న డబ్బును ఎక్కువగా వాటికి ఖర్చుపెడితే సమస్య పరిష్కారం
దీర్ఘకాలిక చేయూత అందించే పథకాలు అవసరం
రైతులకు కావాల్సింది 12 గంటల నాణ్యమైన, నిరాటంక విద్యుత్తు
‘రైతునేస్తం’ పురస్కారాల ప్రదానోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఏఐకేఎస్ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డికి జీవిత సౌఫల్య పురస్కారం అందజేస్తున్న
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కామినేని శ్రీనివాస్, మంత్రి కన్నబాబు
ఈనాడు, అమరావతి: రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించేలా ప్రభుత్వాల పథకాలు ఉండాలని, జనాకర్షక పథకాలపై దృష్టి పెట్టి.. ఉన్న డబ్బును ఎక్కువగా వాటికి ఖర్చుపెడితే సమస్య పరిష్కారం కాదని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ‘ఉచితాలు, తాత్కాలిక జనాకర్షక పథకాలతో ప్రజలకు మేలు కలగదని 50 ఏళ్ల ప్రజాజీవితంలో నేను గమనించాను. ఇబ్బందిగా ఉన్నవారికి ఆహారం పెట్టాలి, ఉచితంగా బియ్యం ఇవ్వాలి.. అందులో అనుమానం లేదు. కానీ ఈ దేశంలో రేషన్ కార్డులు ఉన్నవారంతా పేదవాళ్లేనా? అనేది మనమంతా ఆలోచించుకోవాలి. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంతో పాటు దీర్ఘకాలికంగా వారికి చేయూతనందించేలా పథకాలు చేపట్టాలి’ అని సూచించారు. విజయవాడ సమీపంలోని ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్లో ముప్పవరపు ఫౌండేషన్, రైతునేస్తం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘ఐవీ సుబ్బారావు రైతునేస్తం పురస్కారాలు-2021’ ప్రదానోత్సవంలో ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు, గౌరవ అతిథిగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘నా లెక్కలో రైతుకు కావాల్సింది ఉచిత విద్యుత్తు కాదు.. 10-12 గంటల నాణ్యమైన, నిరాటంకమైన విద్యుత్తు.. ఇలా చెబితే రైతులు బాధపడతారని కొందరు అంటున్నారు. నేనూ రైతుబిడ్డనే’ అన్నారు. ‘రైతు తన ఉత్పత్తులను పట్టణానికి తీసుకెళ్లి అమ్ముకునేందుకు, అక్కడి వారు పల్లెలకు వచ్చి కొనుక్కునేందుకు కావాల్సిన రవాణా సౌకర్యం కల్పించాలి. శీతల గోదాములు, శీతల వాహనాలు అందుబాటులోకి తేవాలి.. ఇవీ రైతు అనుకూల చర్యలంటే’ అని స్పష్టం చేశారు.
వ్యవసాయానికి సాయం పెరగాలి
‘రాబోయే రోజుల్లో ఆహార సంక్షోభం తలెత్తుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్న క్రమంలో రైతులకు చేయూత అందించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. వ్యవసాయ రంగంలో సవాళ్లు ఎక్కువగా ఉన్నాయి.. సాయం కూడా ఎక్కువగా ఉండాలి’ అని వెంకయ్యనాయుడు సూచించారు. ‘కొవిడ్ ప్రమాదం ఇంకా పొంచి ఉంది. రష్యా సహా పలుదేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. అందరూ తప్పనిసరిగా టీకా వేయించుకోవాలి. కరోనా సమయంలో అన్ని రంగాలూ ఆటుపోట్లకు గురైనా.. రైతులు తమ అకుంఠిత దీక్షతో వ్యవసాయ ఉత్పత్తిని పెంచారు. వారికి జేజేలు’ అని చెప్పారు. ‘వ్యవసాయరంగ అభివృద్ధికి అన్నదాత సహా వివిధ పత్రికలు చేస్తున్న కృషిని అభినందిస్తున్నా. దినపత్రికలూ కొంతభాగాన్ని వ్యవసాయానికి కేటాయిస్తున్నాయి. ఇంకా ఎక్కువగా కేటాయించాలి’ అని సూచించారు. ‘మన నాటుకోడి పులుసు, రాగి సంగటి ముందు మరేదీ సాటిరాదు..’ అన్నారు.
రైతు భరోసా కేంద్రాల్ని సందర్శించండి
ఉన్నత విద్యావంతులు వ్యవసాయం బాట పట్టడం చూస్తుంటే.. రాబోయే రోజుల్లో వ్యవసాయానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు అన్నారు. ‘వ్యవసాయ సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ద్విముఖవ్యూహంతో ప్రణాళికలు రూపొందించింది. దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించేలా మౌలిక వసతుల కల్పనపైనా దృష్టి సారించాం’ అని వివరించారు. రైతు భరోసా కేంద్రాలను సందర్శించాలని ఉపరాష్ట్రపతిని కోరారు. రైతునేస్తం ఆధ్వర్యంలో ఎనిమిదేళ్లుగా పురస్కారాలు అందిస్తున్నామని పత్రిక ఎడిటర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు చెప్పారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను పురస్కారాలకు ఎంపిక చేస్తున్నామని, చాలామంది వరి నుంచి చిరు ధాన్యాలకు మారుతున్నారని వివరించారు.
సారంపల్లి మల్లారెడ్డికి జీవిత సాఫల్య పురస్కారం
అఖిలభారత కిసాన్సంఘ్ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డిని జీవితసాఫల్య పురస్కారం, రైతాంగ సమాఖ్య(ఆంధ్రప్రదేశ్) నాయకుడు ఎర్నేని నాగేంద్రనాథ్ను ‘కృషిరత్న’ బిరుదుతో సత్కరించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో కృషి చేసిన పలువురికి అవార్డులు అందించారు. 16 మంది రైతులు, 10 మంది శాస్త్రవేత్తలతోపాటు విస్తరణ విభాగం నుంచి 9 మంది, వ్యవసాయ జర్నలిజం విభాగం నుంచి అయిదుగురికి పురస్కారాలు అందించారు.
ఎర్నేని నాగేంద్రనాథ్కి కృషిరత్న బిరుదు ప్రదానం చేస్తున్న వెంకయ్యనాయుడు.
చిత్రంలో రైతునేస్తం ఎడిటర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు,
పుస్తకాలను ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి
రైతునేస్తం పురస్కారాల ప్రత్యేక సంచికతోపాటు గ్రాస్ జనరల్ ఆఫ్ సదరన్ ఇండియా, లాభదాయకంగా నాటుకోళ్ల పెంపకం, మిద్దెతోట పుస్తకాలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు, మాజీ మంత్రి, స్వర్ణభారత్ ట్రస్టు ఛైర్మన్ డాక్టరు కామినేని శ్రీనివాస్ తదితరులు ఆవిష్కరించారు.
ఐవీ సుబ్బారావు రైతు నేస్తం పురస్కార గ్రహీతల వివరాలు
జీవిత సాఫల్య పురస్కారం - సారంపల్లి మల్లారెడ్డి, ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు
కృషిరత్న బిరుదు - ఎర్నేని నాగేంద్రనాథ్, రైతాంగ సమాఖ్య (ఆంధ్రప్రదేశ్) నాయకుడు
రైతు విభాగం
అప్పన్నగారి యశోదమ్మ, చిన్నార్సుపల్లి, కడప జిల్లా
మీసాల రామకృష్ణ, నందివెలుగు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా
పల్లబోతుల శబరినాథ్, ఎ.కొండూరు, కృష్ణా జిల్లా
డాక్టరు మంచిపల్లి శ్రీరాములు, తోటపల్లి, పార్వతీపురం డివిజన్, విజయనగరం జిల్లా
ఒబిలిశెట్టి గోపాలకృష్ణమూర్తి, గుండుగొలను కుంట, ద్వారకాతిరుమల మండలం, పశ్చిమగోదావరి జిల్లా
పోసిన వెంకట అప్పాజీ, రావికంపాడు, తొండంగి మండలం, తూర్పుగోదావరి జిల్లా
పనపల హరికృష్ణారెడ్డి, దాసరాపల్లి, పెనుమూరు మండలం, చిత్తూరు జిల్లా
ముప్పాల అశోక్రాజు, నాగరాజుపల్లి, రామాపురం మండలం, కడప జిల్లా
వనిపల్లి శ్రీనివాస్రెడ్డి, ఆరుట్ల, మంచాల మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ
పుట్టా జనార్దన్రెడ్డి, పరడ, కట్టంగూర్ మండలం, నల్గొండ జిల్లా
కరుటూరి పాపారావు, జైతాపూర్, ఎడపల్లి మండలం, నిజామాబాద్ జిల్లా
దీప్యరెడ్డి, లింగారెడ్డి, మాదాపూర్, హైదరాబాద్
అనుముల రామిరెడ్డి, ముత్తగూడెం, ఖమ్మం జిల్లా
కె.మల్రెడ్డి, కొత్తగడి, వికారాబాద్ జిల్లా
భైరపాగ రాజు, గుమ్మకొండ, చిమ్మాజిపేట్ మండలం, నాగర్కర్నూలు జిల్లా
మావురం మల్లికార్జునరెడ్డి, కుర్మపల్లి, చొప్పదండి మండలం, కరీంనగర్ జిల్లా
శాస్త్రవేత్తల విభాగం
డాక్టరు ఏవీ రామాంజనేయులు, సీనియర్ శాస్త్రవేత్త (అగ్రానమీ), ఏఆర్ఎస్, పీజేటీఎస్ఏయూ, తోర్నాల
డాక్టరు ఎన్బీవీ చలపతిరావు, ప్రధాన శాస్త్రవేత్త (ఎంటమాలజీ), హెచ్ఆర్ఎస్, అంబాజీపేట, తూర్పుగోదావరి జిల్లా
ఆచార్య జంపాల వెంకటరమణ, ప్రొఫెసర్, పశువైద్య కళాశాల, గన్నవరం, కృష్ణా జిల్లా
డాక్టరు జి.చిట్టిబాబు, శాస్త్రవేత్త (క్రాప్ ప్రొటెక్షన్), కేవీకే, ఆముదాలవలస, శ్రీకాకుళం జిల్లా
డాక్టరు ఎన్.మల్లికార్జునరావు, ప్రధాన శాస్త్రవేత్త (ప్రోగ్రాం కోఆర్డినేటర్), కేవీకే, ఉండి, పశ్చిమ గోదావరి జిల్లా
డాక్టరు ఎం.శంకరయ్య, ప్రధాన శాస్త్రవేత్త (సాయిల్ సైన్స్), కేవీకే, కంపాసాగర్, పీజేటీఎస్ఏయూ, నల్గొండ జిల్లా
డాక్టరు యు.రాజ్కుమార్, ప్రధానశాస్త్రవేత్త, కోళ్ల పరిశోధనా స్థానం, హైదరాబాద్
డాక్టరు ఆకుల వెంకట ఉమాకాంత్, ప్రధాన శాస్త్రవేత్త, ఐఎంఆర్సీ, హైదరాబాద్
డాక్టరు సర్వేపల్లి విజయకుమార్, ఎస్ఎంఎస్, కేవీకే, క్రీడా, హైదరాబాద్
డాక్టరు కె.మధుబాబు, ప్రొఫెసర్ (ఎక్స్టెన్షన్), పీజేటీఎస్ఏయూ, రాజేంద్రనగర్, హైదరాబాద్
విస్తరణ విభాగం
డాక్టరు వైవీ మల్లారెడ్డి, ఏఎఫ్ ఎకాలజీ కేంద్రం, అనంతపురం
డాక్టరు సీహెచ్ శ్రీనివాసరావు, సహాయ సంచాలకులు, పశుసంవర్థకశాఖ, గుంటూరు
గుత్తికొండ మాధవి, టెర్రస్ గార్డెనర్, విశాఖపట్నం
రావూరి వెంకటేశ్వరరావు (ఏడుకొండలు), పశుసంవర్థక సేవలు, తిక్కిరెడ్డిపాలెం, గుంటూరు జిల్లా
అన్న మణిరత్నం, టెర్రస్ గార్డెనర్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా
కొప్పుల అశోక్, వ్యవసాయ పనిముట్లు, ఇర్లపాడు, నాదెండ్ల మండలం, గుంటూరు జిల్లా
ఎ.శాంతి ధీరజ్, టెర్రస్ గార్డెనర్, బోడుప్పల్, హైదరాబాద్
కె.శివప్రసాద్, డీడీఏ, వ్యవసాయశాఖ, హైదరాబాద్
వన్నోజు సుధాకర్, పీఆర్ఓ, పీజేటీఎస్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్
వ్యవసాయ జర్నలిజం విభాగం
వలేటి గోపీచంద్ (ఆకాశవాణి) హైదరాబాద్
కొడిపెల్లి పురుషోత్తం రెడ్డి (ఈనాడు), అర్సపల్లి, జగిత్యాల జిల్లా
శ్రీనివాస మోహన్ వేలమూరి (ఈటీవీ), తాడిగడప, కృష్ణా జిల్లా
మొలుగూరి గోపయ్య (సాక్షి), నడిగూడెం, సూర్యాపేట జిల్లా
సూర్యదేవర నవీన్బాబు (ఆంధ్రజ్యోతి), ప్రకాశం జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
ఎడ్సెట్-2024 నోటిఫికేషన్ విడుదల
బీఎడ్ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శుక్రవారం ఎడ్సెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
‘కౌలు రైతుకు’ జగన్ కాటు!
‘‘దేశంలో ఎక్కడా లేనట్లుగా కౌలు రైతులకు మేం తోడుగా ఉంటున్నాం. గ్రామ సచివాలయంలోనే సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నాం. వారికి ఇక రైతు భరోసాతోపాటు అన్ని పథకాలు అందుతాయి’’ అంటూ 2023 సెప్టెంబరులో రైతు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్ గొప్పలు చెప్పారు. -
జనం కళ్లలో జగన్ దుమ్ము
సిద్ధం యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడీబీ రోడ్డు మీదుగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఇది.. మధ్యలో ఒక్కసారి ఆయన బస్సు దిగి చూస్తే రోడ్డు దుస్థితి తెలిసేవి. -
ఐదేళ్లలో భారీగా పెరిగిన బొత్స కుటుంబ ఆస్తి
విజయనగరం జిల్లా చీపురుపల్లి వైకాపా అభ్యర్థి (వైకాపా), మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో సుమారు రెండున్నర రెట్లు పెరిగింది. -
రోజాకు రూ. 10.63 కోట్ల ఆస్తులు
వైకాపా అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు. ఇప్పుడు రూ.4.58 కోట్లు. -
రైతు సదస్సు పేరుతో వైకాపా భోజనాలు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో రైతు అవగాహన సదస్సు పేరుతో వైకాపా నాయకులు ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. -
ఉద్యోగమే ‘సోర్స్..’ పథకాలు ‘అవుట్’
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు. -
గిగ్గోడు వినిపించలేదు
ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు.. నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్, బైక్ రైడర్ లాంటి పనులు చేస్తూ ‘గిగ్’ కార్మికులుగా మారుతున్నారు యువత. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
జగన్ మాట్లాడుతుంటే జనం వెళ్లిపోయారు
సీఎం జగన్ కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మొదట్లో కాకినాడ గ్రామీణ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రసంగించారు. -
సిద్ధం సభకు బస్సుల తరలింపు.. ప్రయాణికులకు నరకయాతన
కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం సిద్ధం సభకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. -
సామాజికవర్గం పేరుతో మహిళను దూషించిన వైకాపా నేత రాజమోహన్రెడ్డి
‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసల విలువ చేయదు..’ అంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆత్మకూరు ఛైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అన్నదాతలను బలిచేసి.. అస్మదీయులకు ధారపోసి
అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు. -
సంక్షేమ పథకాలు ఓట్లు పొందే మార్గాలు కాకూడదు
ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం