Special Status: తెరపైకి మరోసారి ప్రత్యేక హోదా!
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే అంశాన్ని దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో ప్రస్తావించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డు పరిధిలోకి జూరాల ప్రాజెక్టును తీసుకురావాలనే
దక్షిణాది రాష్ట్రాల భేటీలో ప్రస్తావించాలని సీఎం ఆదేశం
దక్షిణాది రాష్ట్రాల మండలి భేటీ సన్నద్ధతపై ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం జగన్
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే అంశాన్ని దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో ప్రస్తావించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డు పరిధిలోకి జూరాల ప్రాజెక్టును తీసుకురావాలనే విషయాన్ని ఆ సమావేశంలో చర్చకు పెట్టాలని తీర్మానించింది. కేంద్ర హోంమంత్రి అమిత్షా అధ్యక్షతన ఈనెల 14న తిరుపతిలో నిర్వహించనున్న దక్షిణాది రాష్ట్రాల భేటీలో చర్చించాల్సిన అంశాలపై వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలో బుధవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు అంశాలను ప్రధానంగా ప్రస్తావించాలని ఆదేశించారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలన్నీ చర్చకు వచ్చేలా చూడాలన్నారు. ఇతర రాష్ట్రాలు ప్రస్తావించే అంశాల్లో ఏపీతో ముడిపడినవి ఏమైనా ఉంటే వాటిపై తగిన రీతిలో చర్చించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో సీఎం ప్రస్తావించిన ఇతర అంశాలు..
* ఏపీ విభజన చట్టానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అన్ని అంశాలను ఎజెండాలో పొందుపరచాలి. ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాల స్తంభన, ఆస్తుల విభజనలో అపరిష్కృత అంశాలను లేవనెత్తాలి.
* తెలుగుగంగ ప్రాజెక్టుకు సంబంధించి తమిళనాడు నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రానికి రావాల్సిన రూ.6,300 కోట్ల విద్యుత్తు బకాయిలు, రెవెన్యూ లోటు, హేతుబద్ధతలేని లేని రీతిలో రేషన్ బియ్యం కేటాయింపులు, పౌరసరఫరాల శాఖకు సంబంధించి తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన బకాయిలు తదితర అంశాలను ప్రస్తావించాలి.
* నదుల అనుసంధానంపై కేంద్రం రూపొందిస్తున్న ప్రతిపాదనల విషయంలో రాష్ట్రానికి మేలు జరిగేలా, రాష్ట్రం సూచించే ప్రత్యామ్నాయ వివరాలను పొందుపరచాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్