Sugar cane: తిరగబడ్డ చెరకు రైతు
ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి అందేవరకూ ఆందోళన... వచ్చిన పంటకు మద్దతు ధరపై ఆవేదన... అమ్మిన పంటకు ఏళ్ల తరబడి నగదు అందక అన్నదాతకు కన్నీరే మిగులుతోంది. బకాయిలు చెల్లించాలంటూ విజయనగరం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట ఎన్సీఎస్ చక్కెర కర్మాగారం వద్ద చెరకు రైతుల ఆందోళన బుధవారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రైతు నాయకుల అరెస్టుకు నిరసనగా పోలీసులపై ఎదురుతిరగడంతో
బకాయిలు చెల్లించాలంటూ కర్మాగారం వద్ద ఆందోళన
కొబ్బరిమట్టలతో పోలీసులపై ఎదురుతిరిగిన అన్నదాతలు
విజయనగరం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట ఎన్సీఎస్ చక్కెర
కర్మాగారం వద్ద రాష్ట్ర రహదారిపై ఆందోళన చేస్తున్న అన్నదాతలు
సీతానగరం, న్యూస్టుడే: ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి అందేవరకూ ఆందోళన... వచ్చిన పంటకు మద్దతు ధరపై ఆవేదన... అమ్మిన పంటకు ఏళ్ల తరబడి నగదు అందక అన్నదాతకు కన్నీరే మిగులుతోంది. బకాయిలు చెల్లించాలంటూ విజయనగరం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట ఎన్సీఎస్ చక్కెర కర్మాగారం వద్ద చెరకు రైతుల ఆందోళన బుధవారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రైతు నాయకుల అరెస్టుకు నిరసనగా పోలీసులపై ఎదురుతిరగడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. గత రెండు సీజన్లకు సంబంధించి కర్మాగారం పరిధిలోని 2400 మంది రైతులకు యాజమాన్యం రూ.16.38 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనిపై ఏపీ రైతుసంఘం ఆధ్వర్యంలో పలు గ్రామాల రైతులు ర్యాలీగా కర్మాగారం ప్రధానద్వారం వద్దకు చేరుకుని ఎదుట నిరసన చేపట్టారు. యాజమాన్యం, ప్రభుత్వ అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ఆగ్రహించిన అన్నదాతలు సమీపంలోని
36వ రాష్ట్ర రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో పార్వతీపురం-బొబ్బిలి మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను చెదరగొట్టారు. రైతుసంఘం రాష్ట్ర నాయకుడు కృష్ణమూర్తి, మరో అయిదుగుర్ని అరెస్టు చేసి బొబ్బిలి పోలీసుస్టేషన్కు తరలించారు. మరికొందరిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా.. ఆగ్రహించిన రైతులు చేతికి దొరికిన మట్టిపెళ్లలు, కొబ్బరిమట్టలతో పోలీసులపై దాడికి దిగారు. సీతానగరం ఎస్సై బి.మురళి, మహిళా కానిస్టేబుల్ పద్మలకు గాయాలయ్యాయి. వారిని బొబ్బిలి, పార్వతీపురం ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. రైతుల ఆగ్రహాన్ని గుర్తించి, అక్కడ మిగిలిన పోలీసులు కర్మాగారంలోకి పరుగులు తీశారు. వర్షం పడుతున్నా రైతులు పరదాలు కప్పుకొని మరీ నిరసన తెలిపారు. సుమారు అయిదు గంటల తర్వాత జేసీ కిశోర్కుమార్, బొబ్బిలి డీఎస్పీ మోహనరావు రైతు నాయకులతో చర్చించడంతో శాంతించారు. జనవరి 15 లోగా బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని జేసీ రైతులకు హామీ ఇవ్వగా అందుకు వారు అంగీకరించలేదు. 5న పార్వతీపురం డివిజన్లోని మండల కేంద్రాల్లో బంద్కు పిలుపునిచ్చారు.
పోలీసులపై మట్టిపెళ్లలు, కొబ్బరిమట్టలతో ఎదురుతిరుగుతున్న చెరకు రైతులు
రైతులపై లాఠీఛార్జి హేయం: సీపీఎం
విజయవాడ (అలంకార్ కూడలి), న్యూస్టుడే: సీతానగరం షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం చెల్లించాల్సిన బకాయిల కోసం ఆందోళన చేపట్టిన రైతులపై పోలీసులు లాఠీఛార్జి చేయడం హేయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. యాజమాన్యం వెంటనే బకాయిలు చెల్లించాలని కోరారు. రైతులపై కేసులు ఎత్తివేసి, వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పోలీసులతో రైతుల వాగ్వాదం
మట్టి పెళ్లలు విసురుతున్న మహిళా రైతులు
చెరకు రైతుకు.. బకాయిల చేదు
ఈనాడు, అమరావతి: మొత్తం కలిపి రూ.90 కోట్లు.. ప్రభుత్వం కరుణిస్తే 10వేల మంది చెరకు రైతుల బకాయిలు తీరిపోతాయి. రోడ్డెక్కి ఆందోళనలు.. ఆప్పులు తీర్చలేక అవమానాలు కర్షకులకు ఉండవు. నిశ్చింతగా పొలానికి వెళ్లి పంట పండించుకుంటారు. అధికారులు ఇదిగో అదిగో అని సాగదీస్తుండటంతో.. కొన్ని చెరకు కర్మాగారాలు పంచదారను అమ్ముకుని, తర్వాత నష్టం వచ్చిందని చేతులెత్తేస్తున్నాయి. రెండు మూడేళ్లకూ పంట సొమ్ము అందకపోవడంతో అప్పులు తెచ్చి చెరకు పండించిన రైతులకు అసలుతో పాటు వడ్డీభారం పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు కర్మాగారాల్లో రెండు మూడేళ్లుగా బకాయిలు పేరుకుపోయాయి. నెలలు, ఏళ్లు గడుస్తున్నా పట్టించుకునేవారు లేక.. రైతులు రోడ్డెక్కుతున్నారు. కొన్నిచోట్ల న్యాయస్థానాలనూ ఆశ్రయిస్తున్నారు.
ఎకరాకు రూ.50వేల పెట్టుబడి.. రెండేళ్ల ఎదురుచూపు: ఎకరా చెరకు సాగుకు రూ.50వేల పెట్టుబడి పెడితే.. 30-40 టన్నుల దిగుబడి వస్తుంది. కర్మాగారానికి తోలిన తర్వాత 20 రోజులకైనా సొమ్ము వస్తుందనే ఆలోచనతో.. ప్రైవేటు వ్యాపారుల వద్ద వడ్డీలకు తెచ్చి పెట్టుబడి పెడుతున్నారు. రైతుల నుంచి చెరకు తీసుకుంటున్న కొన్ని కర్మాగారాలు చెల్లింపులతోపాటు చెరకు గానుగ ఆడటం నిలిపేస్తున్నారు. దీంతో అప్పులు తీర్చలేకపోగా.. మళ్లీ పంట వేసే పరిస్థితి ఉండటం లేదు. వేసినా.. ఎక్కడ అమ్ముకోవాలో తెలియదు. సమీపంలోని కర్మాగారానికి తీసుకెళ్లినా ధరలో కోత పెట్టి తీసుకుంటున్నారు.
* క్రషింగ్, చక్కెర దిగుబడి, చెల్లింపులపై చెరకు శాఖ పర్యవేక్షించాలి. 15 రోజుల్లోగా చెల్లింపులు చేయకపోతే.. సంబంధిత సంస్థపై చర్యలు తీసుకోవాలి. రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా ఆస్తుల్ని వేలం వేసి.. రైతులకు చెల్లింపులు చేయాలి. అదీ అమలు కావడం లేదు.
అప్పులోళ్లకు సమాధానం చెప్పలేక
చిత్తూరు జిల్లా నిండ్రలోని నేటం షుగర్స్ పరిధిలో 2019-20లో చెరకు తోలినవారికి రెండేళ్లుగా రూ.36 కోట్ల బకాయిలు చెల్లించలేదు. దీంతో 2020-21లో రైతులు చెరకు తోలలేదు. క్రషింగ్ నిలిచింది. బకాయిలు ఇప్పించాలని రెండేళ్లుగా రైతులు అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకపోయింది. ‘102 టన్నుల చెరకు తోలాను. రూ.3 లక్షలు రావాలి. కోత ఖర్చులకు అప్పు చేసి చెల్లించాల్సి వచ్చింది. ప్రైవేటు అప్పులు పెరిగిపోతున్నాయి. వారికి సమాధానం చెప్పలేకపోతున్నాం. బ్యాంకు వాళ్లు ఇంటికి వచ్చి ఎప్పుడు చెల్లిస్తావని అడుగుతున్నారు.. పిల్లల చదువులకూ ఇబ్బందులు పడుతున్నాం’ అని నేతాజీ చెరకు రైతు సంఘం అధ్యక్షుడు బి.నారాయణస్వామిరెడ్డి ఆవేదన వెలిబుచ్చారు.
అంతా చిన్న రైతులమే
విజయనగరం జిల్లాలోని ఎన్సీఎస్ షుగర్స్ పరిధిలో 2019-20, 2020-21 సంవత్సరాల బకాయిలు చెల్లించాలి. అందరూ చిన్న, సన్నకారు రైతులే. దొరికిన చోట అప్పు తెచ్చి పంటకు పెట్టుబడి పెట్టారు. వాటికి వడ్డీలు పెరుగుతున్నాయి. ‘అయిదెకరాలు కౌలుకు తీసుకుని యజమానికి ముందుగా రూ.లక్ష చెల్లించాను. చెరకు బకాయిలు రూ.4 లక్షలు రావాలి. ఇన్నాళ్ల పాటు చెల్లించకపోతే ఎలా బతకాలి?’ అని ప్రశ్నించారు.
ఎలా బతకాలి?
ఏడాదంతా కష్టపడి పండించినా... పంట డబ్బు రెండు మూడేళ్లకూ రాకపోతే రైతు ఎలా బతకాలి? అప్పులెలా తీర్చాలి? వడ్డీభారం ఎవరు భరించాలి? ప్రభుత్వమూ పట్టించుకోకపోతే.. మా గోడు వినేదెవరు?
- చెరకు రైతుల ఆవేదన
రూ.30 కోట్లు ఓ లెక్కా?
చిత్తూరు జిల్లాలోనే సూదలగుంట షుగర్స్ యాజమాన్యం రైతులకు 2018-19 బకాయిల్ని ఇప్పటికీ చెల్లించలేదు. ఇక్కడా న్యాయవివాదాలు కొనసాగుతున్నాయి ‘అయిదెకరాల్లో చెరకు సాగు చేశాను. మొదటివిడత పంట డబ్బు రూ.2.9 లక్షలు చెల్లించలేదు. ఇది మూడో సంవత్సరం.. అయినా పైసా అందలేదు. అగ్రిగోల్డ్ బాధితులకు ఇప్పించినట్లు మాకూ ప్రభుత్వమే చెల్లించి తర్వాత ఆర్ఆర్ చట్టం ప్రకారం వసూలు చేసుకోవచ్చుగా? రూ.30 కోట్లు ప్రభుత్వానికి లెక్కా?’ అని రైతు రాజేశ్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనే కాదు.. మంత్రులు వచ్చినా అంతే!
ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకే కాదు.. మంత్రుల ర్యాలీలప్పుడు కూడా పచ్చని చెట్లని కొట్టేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్లోని తారకరామనగర్కు వెళ్లే దారిలో మంత్రి బుగ్గన నామినేషన్ దాఖలు ర్యాలీకి చెట్లు అడ్డొస్తున్నాయని వాటి కొమ్మలు నరికేశారు. -
వేలకొద్దీ మద్యం సీసాలు.. వైకాపా నాయకులకు ఎక్కడివి?
మారు సుధాకర్రెడ్డి.. వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. -
ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే
సీఎం జగన్ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. -
గులకరాయి కేసు నిందితుడి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. టెన్త్లో 509 మార్కులు
కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
హతవిధీ.. గిరిబాలుడి ప్రాణాలు ఆవిరి!
‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్ పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. -
ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు. -
నా.. నా.. నా.. అని బాకా.. చేసిందంతా ధోకా
మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్పై స్పష్టతనివ్వాలి
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వీఆర్వోల సంఘం సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. -
విద్య కమిషనరేట్లోకి ఆదర్శ పాఠశాలల టీచర్ల విలీనం
ఆదర్శ పాఠశాలల్లోని రెగ్యులర్ బోధన సిబ్బందిని.. పాఠశాల విద్య కమిషనరేట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గతనెల 15న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఇచ్చిన జీవోకు ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసింది. -
పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్ల నియంత్రణకు పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు. -
వాలంటీర్ల రాజీనామాలనుఅంగీకరించకుండా ఈసీని ఆదేశించండి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసేవరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్, గ్రామ సచివాలయాలశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ. -
యాక్సిస్తో పీపీఏల ప్రతిపాదన తిరస్కరణ
యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మోకాలడ్డింది. -
‘పది’లో బీసీ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ
పదో తరగతి పరీక్షల్లో మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల పాఠశాలల విద్యార్థులు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాలయాల కార్యదర్శి సోమవారం ప్రకటించారు. -
వెలంపల్లి సారూ.. ఈ భాగ్యవతి గుర్తుందా?
వృద్ధాప్యం, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వచ్చు. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గత అయిదేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
కరవు సీమలో ‘అవినీతి’ సిరి!
రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. -
50,000 → 10,117 → 3,350
‘‘మాట తప్పను.. మడమ తిప్పను. చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’ ‘మీట’ల మాస్టర్ జగన్ ‘బ్రాండ్’ మాటలు ఇవి. కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్..! -
వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల దాష్టీకాలు.. దేశం దృష్టికి తెచ్చేందుకు బొటన వేలు నరుక్కున్న మహిళ
మాజీ హోంమంత్రి, వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. -
‘ప్రోగ్రెస్ కాదు..’ అంతా బోగస్!
పరీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి.
తాజా వార్తలు (Latest News)
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్