TTD: విరులతో సిరులు
తిరుమలతో పాటు స్థానిక ఆలయాల్లో నిత్యం పెద్ద ఎత్తున పుష్పాలను వినియోగిస్తారు. అనంతరం వీటిని నిరుపయోగంగా పడేయకుండా వాటితో తితిదే పలు ఉత్పత్తులను తయారు చేయిస్తోంది. భక్తులకు
ఆలయాల్లో వినియోగించిన పూలతో ఉత్పత్తులు
నూతన ఒరవడికి తితిదే శ్రీకారం
తిరుమలతో పాటు స్థానిక ఆలయాల్లో నిత్యం పెద్ద ఎత్తున పుష్పాలను వినియోగిస్తారు. అనంతరం వీటిని నిరుపయోగంగా పడేయకుండా వాటితో తితిదే పలు ఉత్పత్తులను తయారు చేయిస్తోంది. భక్తులకు స్వామివారిని దగ్గరకు చేర్చడంతో పాటు ఇటు ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాలు అందిస్తున్నాయి. గతంలో ఆలయాల్లో వినియోగించిన పూలను ఎవరూ తొక్కని ప్రదేశంలో ఉంచేవారు. వీటిని పునర్వినియోగించడం ద్వారా అగరుబత్తీలను తయారు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా బెంగళూరుకు చెందిన దర్శన ఇంటర్నేషనల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని 10 యంత్రాల ద్వారా రోజుకు సుమారు 3.50 లక్షల అగరుబత్తీలను తయారు చేస్తున్నారు. సప్తగిరులను ప్రతిబింబించేలా ఏడు బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చారు. తొలుత శ్రీవారికి వినియోగించిన పూలను మినహా మిగిలినవి ఉపయోగించారు. ఆ తర్వాత ఆగమ సలహా మండలి నిర్ణయం మేరకు వాటిని కూడా అగరుబత్తీల తయారీకి వాడుతున్నారు.
డ్రైఫ్లవర్ టెక్నాలజీతో..
ఆలయాల్లో వినియోగించిన పూలతోనే స్వామి, అమ్మవార్ల ఫొటోలు తయారు చేసేందుకు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి చెందిన సిట్రాస్ రీసెర్చ్ స్టేషన్లో మహిళలకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారు. ఫొటోలతో పాటు క్యాలెండర్లు, కీ చెయిన్లు, పేపర్ వెయిట్లు, రాఖీలు, డ్రై ఫ్లవర్ మాలల తయారీపై తర్ఫీదు ఇచ్చారు.
పంచగవ్య ఉత్పత్తులు..
‘నమామి గోవింద’ పేరుతో 15 రకాల పంచగవ్య ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయుర్వేద ఫార్మసీ సాంకేతిక సహకారంతో వీటిని ఉత్పత్తి చేశారు. గో మూత్రం, గోమయం ద్వారా వీటిని రూపొందిస్తున్నారు. ఇందులో హెర్బల్ సబ్బు, పండ్ల పొడి, షాంపూ, అగరుబత్తీలు, దూప్ చూర్ణం ఇలా పలు ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. గోమయం, మూత్రం ద్వారా జీవామృతం, ఘనామృతాలను తయారు చేసి తితిదే ఉద్యాన వనాల్లో వినియోగిస్తోంది. ఎక్కడా వ్యర్థం అనేది లేకుండా సాధ్యమైనంత మేరకు వాటిని పునరుత్పాదక వస్తువులుగా తీర్చిదిద్దుతున్నట్లు తితిదే అధికారులు స్పష్టం చేస్తున్నారు.
- ఈనాడు, తిరుపతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
హామీలకు శిలువ!
గత ఎన్నికలకు ముందు.. మ్యానిఫెస్టో అనే పదానికి తానే తొలిసారిగా అర్థం కనిపెట్టినట్లు చెప్పారు జగన్. దాన్ని బైబిల్తో పోల్చి ప్రచారం చేశారు. క్రైస్తవుల ఓట్లు దండుకుని గద్దెనెక్కారు. తీరా చూస్తే.. ఈ ఐదేళ్ల పాలనలో అదే బైబిల్ను దైవసమానంగా చూసే క్రైస్తవులను జగన్ వంచించారు. -
అక్రమాల కిరణం!
అవినీతి, అరాచకం కలగలిసిన అక్రమాల ‘కిరణం’ ఆయన. కొండల్ని కొల్లగొట్టారు.. ప్రభుత్వ భూముల్ని చెరబట్టారు.. ఇసుకలో దోచేశారు.. రియల్ ఎస్టేట్ దందాల్లో ఆరితేరారు.. ఒకప్పుడు రోజువారీ ఖర్చులకూ కటకటలాడిన ఆయన.. గత ఐదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.వందల కోట్లకు పడగలెత్తారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
జలభగ్నం
‘‘పోలవరం సహా గాలేరు-నగరి, హంద్రీనీవా, వంశధార, వెలిగొండ తదితర అన్ని ప్రాజెక్టులను జలయజ్ఞంలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత తాగు, సాగునీటి కలలను నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం. -
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ
ఓటు హక్కుపై అవగాహన పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని విశ్రాంత ఐఏఎస్ అధికారి, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ పేర్కొన్నారు. -
అయిదేళ్లు చాల్లేదా..జగన్?
మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని పదే పదే చెబుతున్న వైకాపా ప్రభుత్వం.. వారి పిల్లల కోసం నిర్మించిన గురుకుల పాఠశాల భవనాన్ని మాత్రం పట్టించుకోలేదు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
అయినవాళ్లకే భద్రత
ఏ ప్రభుత్వమైనా సరే ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులకు వారికున్న ముప్పు ఆధారంగా భద్రత కల్పిస్తుంది. కానీ వ్యవస్థల విధ్వంసానికి తెగబడుతున్న జగన్ ప్రభుత్వం మాత్రం ఆ భద్రతనూ తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోంది.