Kodali Geethika: విజయగీతిక
ఆశయం.. అందుకు తగ్గ శ్రమ ఉంటే అవకాశాలకు హద్దులు ఉండవని ఓ తెలుగు యువ కెరటం నిరూపించింది. తక్కువ వయసులోనే అమెరికాలోని క్రికెట్ జట్టుకు సారథ్యం వహించే స్థాయికి ఎదిగింది. 11వ ఏట బ్యాట్ చేతపట్టి..
14 ఏళ్లకే అమెరికా మహిళా క్రికెట్ జట్టులోకి
17 ఏళ్లకే అండర్-19 జట్టుకు సారథ్యం
తెలుగు యువ కెరటం గీతిక కొడాలి
ఈనాడు, అమరావతి: ఆశయం.. అందుకు తగ్గ శ్రమ ఉంటే అవకాశాలకు హద్దులు ఉండవని ఓ తెలుగు యువ కెరటం నిరూపించింది. తక్కువ వయసులోనే అమెరికాలోని క్రికెట్ జట్టుకు సారథ్యం వహించే స్థాయికి ఎదిగింది. 11వ ఏట బ్యాట్ చేతపట్టి.. 14 ఏళ్లకే యూఎస్ మహిళా క్రికెట్ జట్టులో ఆడే అవకాశం దక్కించుకుంది. 17 ఏళ్లకు అండర్-19 జట్టుకు సారథ్యం వహిస్తోంది గీతిక కొడాలి. విజయవాడకు చెందిన కొడాలి ప్రశాంత్, మాధవిల కుమార్తె గీతిక.. అమెరికాలోని నార్త్కరోలినాలో 12వ తరగతి చదువుతూనే క్రికెట్లో సత్తా చాటుతోంది. కెప్టెన్గా తమ బృందాన్ని విజయపథంలో నడిపిస్తూ తొలి సిరీస్లోనే విజయాన్ని అందుకుంది. యూఎస్ ఉమెన్స్ జట్టు కెప్టెన్గా వరల్డ్ కప్లో ఆడటమే లక్ష్యం అంటున్న గీతిక ‘ఈనాడు-ఈటీవీ’కి చెప్పిన ముచ్చట్లు..
యూఎస్ మహిళా జట్టుకు ఎంపికై
చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఎంతో ఇష్టం. కానీ క్రికెటే నా లోకం అవుతుందని ఎప్పుడూ ఊహించలేదు. బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు అమ్మానాన్నల సూచనతో కోచ్ రఘును కలిశాం. శిక్షణ తీసుకుంటే క్రికెట్లో బాగా రాణిస్తావని ఆయన చెప్పారు. రెండేళ్ల శిక్షణ తర్వాత 14వ ఏట అమెరికన్ మహిళా జట్టులోకి వెళ్లే అవకాశం లభించింది. జట్టు ఎంపిక కోసం మూడు క్యాంప్లు జరిగాయి. 32 మంది హాజరయ్యారు. 14 ఏళ్ల విభాగంలో ఎంపికయ్యా. జట్టులో నేనే చిన్నదాన్ని. నేషనల్ ఉమెన్ క్రికెట్ లీగ్కు ఆడాను. సీనియర్ల నుంచి మెలకువలు నేర్చుకోవడంతోపాటు.. ఫిట్నెస్, బౌలింగ్ సామర్థ్యాలను మెరుగుపరుచుకున్నాను. కెనడా, మెక్సికో, జింబాబ్వే తదితర దేశాల్లో 20 మ్యాచ్లు ఆడాను.
అమ్మానాన్న సహకారంతోనే
అమ్మ మాధవి, నాన్న ప్రశాంత్ సహకారంతోనే క్రికెట్లో రాణిస్తున్నా. చిన్ననాటి నుంచి ఎంతో ప్రోత్సహించారు. నార్త్కరోలినా అయితే క్రికెట్కు మంచి సౌకర్యాలు ఉంటాయని.. నా కోసమే కాలిఫోర్నియా నుంచి నివాసం మార్చారు. ఇది నా చదువుకు కూడా దోహదపడింది. నా చిన్నతనంలో ఏటా ఆంధ్రప్రదేశ్కు వచ్చే వాళ్లం. హైస్కూల్కు వచ్చాక సమ్మర్ ఇంటర్న్షిప్తో అవకాశం కుదరలేదు. ఈ లోగా కొవిడ్ రావడమూ కారణమైంది. త్వరలో ఇండియాకు వస్తాను. మన గడ్డపై కూడా క్రికెట్ ఆడతాను.
అండర్-19 జట్టు సారథిగా
అమెరికాలో తొలిసారిగా గతేడాది అండర్-19 జట్టును ఏర్పాటు చేశారు. జట్టుకు కెప్టెన్గా నాయకత్వం వహించే అవకాశం మొదటగా నాకే లభించింది. మొత్తం 15 మందితో కూడిన మా జట్టు తొలి పర్యటనలో భాగంగా కరేబియన్ ఐలాండ్స్లో సెయింట్ విన్సెంట్లో ఆడాం. ఈ జట్టులో అత్యధికులు భారతీయ సంతతి వారే. సిరీస్లో భాగంగా నాలుగు మ్యాచ్లు ఆడి.. మూడు గెలిచాం. బృంద సభ్యుల్లో విశ్వాసం నింపుతూ.. విజయం దిశగా అడుగేశాం. మే నెలలో దుబాయ్లో జరిగే ఫెయిర్బ్రేక్ టోర్నమెంట్కు మా బృందం సిద్ధమవుతోంది. మహిళా క్రికెట్ను యూఎస్ క్రికెట్ అసోసియేషన్తో పాటు ఐసీసీ ఛార్టర్ ఎంతో ప్రోత్సహిస్తున్నాయి. శాటిలైట్ కోచ్ సెషన్స్ ఏర్పాటు చేసి.. స్థానికంగా శిక్షణ ఇచ్చేవారు. అక్కడ సిద్ధమయ్యాక.. టీమ్ ప్రాక్టీసెస్, మ్యాచ్కు వారంముందు బృందం సభ్యులంతా కలిసి మళ్లీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేసవిలో రీజినల్స్, నేషనల్ ఆడాం. క్రికెట్ నాకు సమయపాలన నేర్పింది. చదువు, ఆటను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లేలా ప్రణాళిక రూపొందించుకుంటున్నాను. తొమ్మిది, పదో గ్రేడ్ల వరకు స్కూల్లో రాణిస్తూనే క్రికెట్ ఆడేదాన్ని. 11, 12 గ్రేడ్లలో పాఠశాలకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉపాధ్యాయులు సహకారం అందించారు. క్రికెట్తో నాలో టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ పెరిగాయి.
ఇండియా ఉమెన్స్ ఐపీఎల్లో పాల్గొనాలి
గీతిక చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడేది. కోచ్ రఘును కలవగా క్రికెట్లో బాగా రాణిస్తుందని చెప్పారు. రెండేళ్ల శిక్షణ తర్వాత యూఎస్ ట్రైఔట్స్కు వెళ్లి.. విజయవంతంగా ఎంపికైంది. ఇప్పుడు ఆల్రౌండర్గా అడుగేస్తోంది. అంతర్జాతీయ స్థాయి సిరీస్లో తొలి విజయం నమోదు చేయడం సంతోషించదగ్గ విషయం. ఇండియా ఉమెన్స్ ఐపీఎల్లో ఆమె పాల్గొనాలని కోరుకుంటున్నాం.
-తల్లిదండ్రులు కొడాలి ప్రశాంత్, మాధవి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. -
సరిహద్దు రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగానికి వెసులుబాటు
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి మే 13న పోలింగ్ జరగనుండగా.. ఆ రోజును వేతనంతో కూడిన సెలవుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. -
గుత్తేదార్ల దయ.. గనులశాఖ ప్రాప్తం
టెండరు దక్కించుకున్న గుత్తేదారు ఒకటో తేదీన ఆ నెల సొమ్ము అడ్వాన్స్గా జమ చేయాలనేది నిబంధన. కానీ అత్యధిక జిల్లాల్లో గుత్తేదారులు ఆ డబ్బు చెల్లించడం లేదు. -
‘పర్యాటకం...’ పక్కా నాటకం!
జగన్ ప్రభుత్వంలో పర్యాటక రంగం అభివృద్ధికి అప్పులివ్వడానికి బ్యాంకులే కాదు... పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలూ ముందుకు రాలేదు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి.