YS Jagan: ప్రజా సంకల్పయాత్రకు నేటితో నాలుగేళ్లు
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు శనివారంతో నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఈ యాత్రలో ఇచ్చిన హామీలనే అధికారంలోకొచ్చాక అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో వివరించింది. పాదయాత్ర అప్పట్లో కొనసాగిన తీరునూ గుర్తుచేసింది.
ప్రతిపక్ష నేత హోదాలో 2017నవంబరు 6న ప్రారంభించిన జగన్
ఈనాడు, అమరావతి: ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు శనివారంతో నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఈ యాత్రలో ఇచ్చిన హామీలనే అధికారంలోకొచ్చాక అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో వివరించింది. పాదయాత్ర అప్పట్లో కొనసాగిన తీరునూ గుర్తుచేసింది. ‘2017 నవంబరు 6న ఇడుపులపాయ నుంచి చేపట్టిన పాదయాత్ర 2019 జనవరి 9న ఇచ్ఛాపురంలో ముగిసింది. సుమారు 14నెలలపాటు సాగిన యాత్రలో ఆయన 3,648 కి.మీ.లు నడిచారు. పాదయాత్రలో భాగంగా 124 సభలు సమావేశాలు, 55 ఆత్మీయ సమావేశాల్లో ప్రజలతో మమేకమయ్యారు. క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యలను స్వయంగా చూసేందుకు అప్పట్లో పాదయాత్ర చేపట్టారు. 134 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,516 గ్రామాల మీదుగా యాత్ర సాగింది. పాదయాత్రలో గమనించిన ప్రజాసమస్యలకు పరిష్కారాన్ని చూపేలా అధికారంలోకొచ్చాక పాలన అందిస్తామంటూ అప్పట్లో హామీనిచ్చారు. గ్రామంలోనే ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచనను పాదయాత్రలోనే జగన్ వెల్లడించారు. అధికారంలోకి వచ్చాక దానికనుగుణంగా గ్రామసచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలను తీసుకువస్తామని పాదయాత్రలో చెప్పినట్లు వాలంటీరు వ్యవస్థను అమల్లోకి తెచ్చారు. ఇలాంటి వ్యవస్థల అంకురార్పణ ఆలోచనకు పాదయాత్రలోనే నాంది పడింది. గ్రామసచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇవి గ్రామాలకు ఆస్తులుగా మారుతున్నాయి. యాత్ర సృష్టించిన సంచలనంతో 2019ఎన్నికల్లో జగన్ చరిత్రాత్మక విజయాన్ని సాధించారు. అధికారంలోకి వచ్చినప్పటినుంచి మేనిఫెస్టోలోని హామీలను అమల్జేస్తున్నారు’ అని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!