YS Jagan: జంగారెడ్డిగూడెంలో అన్నీ సహజ మరణాలే
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకున్నవన్నీ సహజ మరణాలే. దేశ, రాష్ట్ర గణాంకాల ప్రకారం మరణాల రేటు 2 శాతంగా వేసుకున్నా అక్కడ నెలకు కనీసం 90 మంది అనారోగ్యం, వయోభారం, ప్రమాదాలవల్ల చనిపోతుంటారు
అనారోగ్యం, ఇతరత్రా కారణాలతో నెలకు ఆ ఊళ్లో 90 మంది సాధారణంగానే చనిపోతుంటారు
అక్రమ మద్యంవల్ల జరిగినవే అన్నట్లు తెదేపా యాగీ చేస్తోంది
మద్యం ధరలు తగ్గించాక.. కల్తీ మద్యం ఎందుకు ప్రబలుతుంది: సీఎం జగన్
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకున్నవన్నీ సహజ మరణాలే. దేశ, రాష్ట్ర గణాంకాల ప్రకారం మరణాల రేటు 2 శాతంగా వేసుకున్నా అక్కడ నెలకు కనీసం 90 మంది అనారోగ్యం, వయోభారం, ప్రమాదాలవల్ల చనిపోతుంటారు. సహజ మరణాలను అక్రమ మద్యం వల్ల జరిగినవే అన్నట్లుగా తెదేపా భ్రమ కల్పిస్తోంది. ఇలాంటి అన్యాయమైన పనిని మానుకోవాలని తెదేపా సభ్యులకు సభ ద్వారా తెలియజేస్తున్నా.
- శాసనసభలో ముఖ్యమంత్రి జగన్
ఈనాడు, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకున్నవన్నీ సహజ మరణాలేనని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తెలిపారు. దేశ, రాష్ట్ర గణాంకాల ప్రకారం మరణాల రేటు 2 శాతంగా వేసుకున్నా నెలకు కనీసం 90 మంది అనారోగ్యం, వయోభారం, ప్రమాదాలవల్ల సహజంగానే అక్కడ చనిపోతుంటారని చెప్పారు. జంగారెడ్డిగూడెం మరణాలపై సోమవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ.. ‘జంగారెడ్డిగూడెం జనాభా 2011 లెక్కల ప్రకారం 48,994. ఈ దశాబ్ద కాలంలో 12 శాతం వృద్ధిరేటుగా తీసుకుంటే అక్కడ 54,880 మంది నివాసం ఉంటున్నారు. ఇంత పెద్ద పురపాలక సంఘంలో మరణాలు ఒకే చోట జరిగినవి కాదు. మొత్తం పురపాలక సంఘం పరిధిలో జరిగినవి. ఈ 18 మంది సహజ మరణాలను వక్రీకరించి మాట్లాడడం మనం ఇక్కడే చూస్తున్నాం. ప్రతి నెలా 60-70 మంది గుండెపోటు, అనారోగ్యాలతో సహజంగా చనిపోతుంటారు. కల్తీ మద్యం తయారు చేసేవాళ్లకు ప్రభుత్వం ఎందుకు మద్దతిస్తుంది? కల్తీ మద్యం తయారీ ఇప్పుడు కొత్తగా జరుగుతోంది కాదు.. చంద్రబాబు హయాంలోనూ జరిగింది. అప్పుడూ ఇప్పుడూ అక్కడక్కడా జరుగుతోంది. దీన్ని నేను కాదనడం లేదు’ అని తెలిపారు.
లాభాపేక్ష వద్దనే..
‘గతంలో లాభాపేక్షతో మద్యాన్ని విచ్చలవిడిగా బెల్టు దుకాణాల ద్వారా అమ్మేవారు. బడి, గుడి పక్కన గ్రామంలో ఎక్కడపడితే అక్కడ దొరికేది. లాభాపేక్ష ఉంటే వీటిని ఆపలేమనే ఉద్దేశంతో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నడుపుతోంది. గతంలో అర్ధరాత్రి వరకు మద్యం దుకాణాలు తెరిచి, ఇష్టమొచ్చినట్లు తాగించే పరిస్థితి. ఇప్పుడు వేళలు కచ్చితంగా పాటిస్తున్నారు. నిర్ణీత సమయాల్లోనే మద్యం అందుబాటులో ఉండే పరిస్థితి తీసుకొచ్చాం. అక్రమ మద్యం తయారీని అరికట్టేందుకు ప్రత్యేక పోలీస్ ఫోర్సును ఏర్పాటు చేసి, ఎవరినీ ఉపేక్షించాల్సిన అవసరం లేదని చాలా స్పష్టమైన సంకేతాలిచ్చాం. మా తపనంతా మద్యం వినియోగాన్ని తగ్గించాలనే. అధికారంలోకి వచ్చిన వెంటనే 43వేల బెల్టు దుకాణాలను పూర్తిగా లేకుండా చేశాం. గతంలో 4,380 మద్యం దుకాణాల పక్కనే పర్మిట్ రూమ్లకు అనుమతిచ్చారు. అక్కడే 50-60 మంది కూర్చుని, మద్యం తాగుతుంటే.. మహిళలు ఆ దారిలో వెళ్లాలంటేనే భయపడేవారు. మనం అధికారంలోకి వచ్చాక పర్మిట్ రూమ్లను రద్దు చేశాం’ అని వెల్లడించారు. ‘వినియోగదారులకు షాక్ కొట్టేలా మద్యం ధరలు పెంచాం. దీంతో వినియోగం తగ్గినా.. ధరలు పెంచటంతో అక్రమ మద్యం ఎక్కువగా వస్తోంది. ధరలు తగ్గిస్తేనే అక్రమ మద్యాన్ని అడ్డుకోగలమని ఎస్ఈబీ నివేదిక ఇచ్చింది. ప్రతిపక్ష పార్టీలూ అదే చెప్పేసరికి సదుద్దేశంతో ధరలు తగ్గించాం. చంద్రబాబు హయాంలో ఉన్న ధరలే మళ్లీ తీసుకొచ్చాం. అలాంటప్పుడు కల్తీ మద్యం ఎలా ప్రబలుతుంది? కల్తీ మద్యం తయారీదారులను ఉక్కుపాదంతో అణిచివేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చాం. అక్రమ మద్యంపై ఎస్ఈబీ 13 వేల కేసులు నమోదు చేసింది. సహజ మరణాలను అక్రమ మద్యం వల్ల జరిగినవే అన్నట్లుగా భ్రమ కల్పిస్తూ నానారకాలుగా యాగీ చేయడం తప్పని, ఇలాంటి అన్యాయమైన పనిని మానుకోవాలని తెదేపా సభ్యులకు సభ ద్వారా తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు.
బాధపడకండి..ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా నాణ్యమైన మద్యం అందేలా చూస్తా..! నాటుసారా జోలికి పోకండి!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’ ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్