
YS Jagan: 1000కి పైగా ప్రాంతాలను ఏజెన్సీలో కలపాలి
అప్పుడే వాటి అభివృద్ధికి కేంద్రం నుంచి గ్రాంట్లు వస్తాయి
గిరిజన ప్రాంతాలపై సీఎం జగన్కు ఎస్టీ ఎమ్మెల్యేల వినతి
ఈనాడు, అమరావతి: ఏళ్ల తరబడి పెండింగులో ఉన్న అర్హత కలిగిన ప్రాంతాలను ఏజెన్సీలో (షెడ్యూల్ ఏరియాలో) కలపడంపై వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు ఎస్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జగన్ను కోరారు. సోమవారం అసెంబ్లీలోని కార్యాలయంలో సీఎం జగన్ను ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పుష్ప శ్రీవాణి, ఎమ్మెల్యేలు పి.రాజన్నదొర, వి.కళావతి, ఎన్.ధనలక్ష్మి, కె.భాగ్యలక్ష్మి, శెట్టి ఫల్గుణతోపాటు పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కలిశారు. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 805 ప్రాంతాలు ఇలాంటివి ఉండగా వాటిని ఏజెన్సీలో కలిపేందుకు ప్రతిపాదిస్తూ కేంద్రానికి పంపారు. వాటిలో నిబంధనల ప్రకారం కొన్ని మార్పులు చేయాలని కేంద్రం వెనక్కి పంపింది. ఆ 805లో తెలంగాణలో 256 ఉండగా ఏపీలోనివి 549 ఉన్నాయి. ఆ ప్రక్రియను వెంటనే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలి’ అని కోరారు. ‘ఇవే కాకుండా 70శాతంపైగా గిరిజన జనాభా ఉండి ఏజెన్సీలో ఇప్పటివరకూ కలపని ప్రాంతాలు మరో 500కుపైగా గుర్తించారు. వాటిని కూడా కలిపి కేంద్రానికి పంపాలి. వీటన్నింటినీ ఏజెన్సీలో కలిపేందుకు రాష్ట్రపతి ఆమోదం పొందితే.. ఈ ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం నుంచి గ్రాంట్లు వస్తాయి’ అని వివరించారు. అలాగే మంచినీటి, రహదారుల మరమ్మతుల సమస్యలనూ సీఎంకు వివరించారు. వచ్చే నెల తర్వాత నిధుల విడుదలకు కొంత వెసులుబాటు వస్తుందని, పెండింగు బిల్లులను చెల్లించడంతోపాటు కొత్త పనులను చేపట్టేందుకు ఏర్పాట్లు చేద్దామని ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. పార్వతీపురం జిల్లాలోనే రెండు ఐటీడీఏ ఏజెన్సీలు (పార్వతీపురం, సీతంపేట) వస్తున్నాయని.. అందువల్ల ఒకటి తొలగించాలని ఎమ్మెల్యేలు చెప్పగా.. ‘ఉన్నవాటిలో దేన్నీ తొలగించొద్దు, అవసరమైతే శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం ప్రాంతంలో కొత్తగా ఐటీడీఏ ఏర్పాటుపై ఆలోచిద్దాం’ అని సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. గిరిజన ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
HMDA: సొంతింటి కల సాకారమయ్యే వేళ... రేపటి నుంచే రాజీవ్స్వగృహ ఫ్లాట్ల కేటాయింపు
-
India News
Aaditya Thackeray: పిరికివారే పార్టీని వీడారు.. దమ్ముంటే శివసేనను వీడి పోరాడండి..!
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
World News
Xi Jinping: మూడేళ్ల తర్వాత చైనాను దాటి బయటకు రానున్న షీజిన్పింగ్..!
-
General News
AP CRDA: కాసుల కోసం వేట... రాజధానిలో భవనాలు అద్దెకిచ్చేందుకు సిద్ధమైన ప్రభుత్వం
-
Sports News
Ranji Trophy: మధ్యప్రదేశ్ సరికొత్త రికార్డు.. తొలిసారి రంజీ ట్రోఫీ కైవసం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- మా ఆయన కోసం సల్మాన్ఖాన్ని వదులుకున్నా!
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి
- Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్స్టేషన్లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
- Atmakur ByElection: ఆత్మకూరు ఉపఎన్నిక.. వైకాపా ఏకపక్ష విజయం
- AP Liquor: మద్యంలో విషం
- Teesta Setalvad: పోలీసుల అదుపులో తీస్తా సీతల్వాడ్
- ప్రశ్నించానని పాలు, నీళ్లు లేకుండా చేశారు
- Rohit Sharma: టీమ్ఇండియాకు షాక్.. రోహిత్ శర్మకు కరోనా
- R Madhavan: మాధవన్పై నెటిజన్ల విమర్శలు.. సైన్స్ తెలియకపోతే సైలెంట్గా ఉండు..!