Agriculture: కరిగిపోయిన కరవు సాయం!
2018 ఖరీఫ్లో కరవుకు సంబంధించి పెట్టుబడి రాయితీ బకాయిలు రూ.2వేల కోట్లు ఉన్నాయి. గత ప్రభుత్వం చెల్లించాల్సిన ఆ బకాయిల్ని మేమే చెల్లిస్తాం. అందుకు అనుగుణంగా సంతకాలు చేశామని చెప్పడానికి గర్వపడుతున్నా.
ఇప్పటికీ అందని 2018 ఖరీఫ్ పెట్టుబడి రాయితీ
కేంద్రం రూ.900 కోట్లు ఇచ్చినా రైతులకు మొండిచెయ్యే
2018 ఖరీఫ్లో కరవుకు సంబంధించి పెట్టుబడి రాయితీ బకాయిలు రూ.2వేల కోట్లు ఉన్నాయి. గత ప్రభుత్వం చెల్లించాల్సిన ఆ బకాయిల్ని మేమే చెల్లిస్తాం. అందుకు అనుగుణంగా సంతకాలు చేశామని చెప్పడానికి గర్వపడుతున్నా.
- 2019 జులై 8న కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించిన రైతు దినోత్సవంలో సీఎం జగన్
2014-15 నుంచి 2018-19 మధ్య కాలంలో ప్రభుత్వం మంజూరు ఇవ్వనందున 24.80 లక్షల మందికి రూ.2,558 కోట్ల పెట్టుబడి రాయితీని విడుదల చేయలేదు. వాటిని చంద్రబాబు ఎగ్గొట్టారు.
- మార్చి 21న శాసనసభలో వ్యవసాయ మంత్రి కన్నబాబు
2018 ఖరీఫ్కు సంబంధించి కరవు సాయంగా 2019 మే నెలలో కేంద్రం రూ.900.40 కోట్లు విడుదల చేసింది. ఈ విషయాన్ని లోక్సభలో పలుమార్లు ప్రస్తావించింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ 2019 జూన్ 24న నిర్వహించిన సమీక్షలోనే ఈ మేరకు అధికారులు పూర్తి వివరాలతో ప్రజంటేషన్ ఇచ్చారు..
...అయినా రైతులకు మాత్రం నేటికీ కరవు సాయం అందలేదు.
ఈనాడు - అమరావతి
గత ప్రభుత్వం వదిలిన బకాయిలన్నీ తామే చెల్లిస్తున్నామని తరచూ చెప్పే సీఎం జగన్మోహన్రెడ్డి.. 2018 ఖరీఫ్, రబీ నాటి కరవు సాయాన్ని మరచిపోయారు. అధికారంలోకి వచ్చాక జమ్మలమడుగులో నిర్వహించిన తొలి రైతు దినోత్సవం రోజు ఇచ్చిన హామీ.. రెండున్నరేళ్లు గడిచినా ఇంకా అమలు చేయలేదు. పెట్టుబడి సాయంగా కేంద్రం నుంచి మంజూరైన రూ.900 కోట్లనూ రైతులకు ఇవ్వలేదు. కరవు ప్రభావంతో 2018 ఖరీఫ్, రబీల్లో మొత్తం 43 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. పెట్టుబడి రాయితీగా రైతులకు రూ.2,371 కోట్లు చెల్లించాలని అధికారులు అంచనా వేశారు. కేంద్రానికి నివేదిక పంపారు. ఈలోగా ఎన్నికలు జరిగి, రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో చెల్లించాల్సిన రూ.2వేల కోట్ల పెట్టుబడి రాయితీ బకాయిల్ని తామే చెల్లిస్తామని చెప్పిన సీఎం.. అధికారులతో సమీక్ష సందర్భంలోనూ 2019 నవంబరులోగా చెల్లించాలని సూచించారు. రెండున్నరేళ్లు దాటినానిధులు మాత్రం కర్షకుల ఖాతాల్లో జమ కాలేదు.
ఇస్తారో.. ఇవ్వరో చెప్పరేం!
2014-19 మధ్య రూ.2,558.07 కోట్ల పెట్టుబడి రాయితీని చంద్రబాబు ఎగ్గొట్టారని అసెంబ్లీలో చెప్పిన వ్యవసాయ మంత్రి కన్నబాబు.. వాటిని తమ ప్రభుత్వం చెల్లిస్తుందో, లేదో మాత్రం చెప్పలేదు. పాత బకాయిలన్నీ ఇస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పే మాటల ప్రకారం.. ఈ రూ.2,558.07 కోట్లను రైతులకు జమ చేయాల్సి ఉంది. అలా కాదు, 2018 నాటి బకాయిల వరకే అనుకున్నా వాటినీ ఇవ్వలేదు. దీనిపై వ్యవసాయశాఖ అధికారులూ స్పందించడం లేదు.
2018 ఖరీఫ్లోనే 34 లక్షల ఎకరాలు.. రూ.1,869 కోట్లు
2018 ఖరీఫ్లో కరవు కారణంగా రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది జిల్లాల్లోని 347 మండలాల్లో 16.52 లక్షల మంది రైతులకు చెందిన 34 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం తేల్చింది. వీరికి కేంద్ర మార్గదర్శకాల ప్రకారం రూ.979 కోట్లు, రాష్ట్ర మార్గదర్శకాల ప్రకారం రూ.1,869 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. తర్వాత కేంద్రం నుంచి ఉన్నతస్థాయి బృందమూ వచ్చి పంటలను పరిశీలించింది. వారి సిఫారసు మేరకు 2019లో కేంద్రం నుంచి రూ.900.40 కోట్లు విడుదలయ్యాయి. ఇప్పటికీ ఇవి రైతుల ఖాతాల్లో మాత్రం జమ కాలేదు. అత్యధికంగా అనంతపురం జిల్లా రూ.890 కోట్లు, కర్నూలు జిల్లా రూ.616 కోట్లు, ప్రకాశం జిల్లా రూ.139కోట్లు, చిత్తూరు జిల్లా రైతులకు రూ.119 కోట్లు చెల్లించాలి.
రబీ సాయానికి నీళ్లు
2018-19 రబీలోనూ వర్షాలు అనుకూలించలేదు. వర్షాభావ పరిస్థితుల కారణంగా అయిదు జిల్లాల్లో 9.12 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారమైతే రూ.359.54 కోట్లు, రాష్ట్ర మార్గదర్శకాల ప్రకారమైతే రూ.502 కోట్లు పెట్టుబడి రాయితీగా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు నివేదికలు రూపొందించారు. అయితే నిర్దేశిత గడువులోగా నివేదిక పంపలేదని, కరవు ప్రకటన సమయంలో క్షేత్రస్థాయిలో కరవు తీవ్రతను సరిగా అంచనా వేయలేదని పేర్కొంటూ కేంద్రం సాయానికి నిరాకరించింది. నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వమూ సాయం అందించలేదు. నిధుల విడుదలపై వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, కమిషనర్ అరుణ్కుమార్ను సంప్రదించే ప్రయత్నం చేయగా ఫోన్కు స్పందించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. -
సరిహద్దు రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగానికి వెసులుబాటు
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి మే 13న పోలింగ్ జరగనుండగా.. ఆ రోజును వేతనంతో కూడిన సెలవుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. -
గుత్తేదార్ల దయ.. గనులశాఖ ప్రాప్తం
టెండరు దక్కించుకున్న గుత్తేదారు ఒకటో తేదీన ఆ నెల సొమ్ము అడ్వాన్స్గా జమ చేయాలనేది నిబంధన. కానీ అత్యధిక జిల్లాల్లో గుత్తేదారులు ఆ డబ్బు చెల్లించడం లేదు. -
‘పర్యాటకం...’ పక్కా నాటకం!
జగన్ ప్రభుత్వంలో పర్యాటక రంగం అభివృద్ధికి అప్పులివ్వడానికి బ్యాంకులే కాదు... పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలూ ముందుకు రాలేదు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి.