Dr.YSR: ఊరూరా ఆ పేర్లే.. దేన్నీ వదల్లేదు
రాష్ట్ర స్థాయి పథకాలు, కార్యక్రమాలకే కాదు.. వివిధ ప్రాంతాలు, జిల్లాలు, మండలాల్లో ఉన్న సాగునీటి పథకాలు, భవనాలు, మైదానాలు, పరిశోధన కేంద్రాలు, విద్యా సంస్థలు, రహదారులు, పార్కులు సహా అన్నింటికీ మాజీ ముఖ్యమంత్రి
భవనాలు, రహదారులు, మైదానాలకూ వైఎస్ పేర్లు
ఈనాడు-అమరావతి, యంత్రాంగం: రాష్ట్ర స్థాయి పథకాలు, కార్యక్రమాలకే కాదు.. వివిధ ప్రాంతాలు, జిల్లాలు, మండలాల్లో ఉన్న సాగునీటి పథకాలు, భవనాలు, మైదానాలు, పరిశోధన కేంద్రాలు, విద్యా సంస్థలు, రహదారులు, పార్కులు సహా అన్నింటికీ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేరు పెట్టారు. ఆయన మరణించిన తర్వాత గత ప్రభుత్వాల హయాంలో కొన్నింటికి రాజశేఖరరెడ్డి పేరు పెట్టగా.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పేరు పెట్టడాన్ని ఒక ఉద్యమంలా అమలు చేశారు. గతంలో ఉన్న వివిధ ప్రాజెక్టుల పేర్లు మార్చేసి.. వాటికి రాజశేఖరరెడ్డి పేరు తగిలించారు. వాటిల్లో కొన్ని ముఖ్యమైనవి ఇవి..
ప్రభుత్వ వైద్యశాలలకూ ఆ పేరే..
* నరసరావుపేట పట్టణంలోని 200 పడకల ఆసుపత్రికి నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాల అని ఉండగా డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వ వైద్యశాలగా మార్చారు.
* తిరుపతిలోని వెటర్నరీ విశ్వవిద్యాలయం ప్రధాన భవనానికి వైఎస్ఆర్ భవన్ అని పేరు పెట్టారు.
* తిరుపతి మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశాలతో పాటు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే భవనానికి వైఎస్ఆర్ భవన్ అనే పేరు ఉంది.
* తిరుపతిలోని డీబీఆర్ ఆసుపత్రికి వెళ్లే మార్గానికి ఇటీవలే వైఎస్ఆర్ మార్గ్ అని పేరు పెట్టారు.
* గూడూరు మున్సిపల్ కార్యాలయ భవనానికి డా. వై.ఎస్.రాజశేఖరరెడ్డి భవనం అని పెట్టారు.
* పుత్తూరులోని మెప్మా భవనానికి వైఎస్ఆర్ సమావేశ మందిరం అనే పేరు పెట్టారు. పుత్తూరులోని పార్కుకు వైఎస్ఆర్ పార్కు అని నామకరణం చేశారు.
* విశాఖపట్నం నగరంలోని ఎన్.ఎ.డి.కూడలిలో నిర్మించిన పైవంతెనకు రాజశేఖరరెడ్డి పేరు పెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఆ పేరును అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
* పొన్నూరులో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పురపాలక సంఘం అని పేరు పెట్టారు.
* బాపట్ల జిల్లాలో 40 బల్క్మిల్క్ కూలింగ్ కేంద్రాలు వైఎస్ఆర్ పేరుతో ఉన్నాయి.
* బాపట్ల మార్కెట్ యార్డుకు డాక్టర్ వైఎస్ఆర్ మార్కెట్ యార్డు అని పేరు మార్చారు.
* చుండూరు మండలంలోని చినపరిమి గ్రామ సచివాలయానికి వైఎస్ఆర్ గ్రామ సచివాలయం అని నామకరణం చేశారు.
* పల్నాడు జిల్లా మాచర్ల మార్కెట్యార్డు ఆర్చీకి డాక్టర్ వైఎస్ఆర్ ముఖద్వారం అని పేరు పెట్టారు.
* వినుకొండ పట్టణంలోని మున్సిపల్ కాంప్లెక్స్కు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ వాణిజ్య సముదాయంగా నామకరణం చేశారు.
* చిలకలూరిపేట పట్టణంలో కూరగాయల మార్కెట్కు చంద్రమౌళి కూరగాయల మార్కెట్ అని ఉండగా దానిని మార్చి డాక్టర్ వైఎస్ఆర్ కూరగాయల మార్కెట్గా మార్చారు.
* చిలకలూరిపేట పట్టణంలో ఉన్న మార్కెట్ యార్డుకు ప్రత్తిపాటి పుల్లారావు వ్యవసాయ మార్కెట్ అని ఉండగా దాని పేరు మార్చి డాక్టర్ వైఎస్ఆర్ వ్యవసాయ మార్కెట్ అని మార్చారు.
* విశాఖలోని సిటీ సెంట్రల్ పార్క్కు ‘డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి సెంట్రల్ పార్క్’ అని నామకరణం చేశారు.
* విజయవాడలోని జక్కంపూడి కాలనీకి వైఎస్ఆర్ కాలనీగా పేరు.
* విజయవాడలోని భవానీపురం క్రాంబే రోడ్డుకు వైఎస్ఆర్ రోడ్డుగా నామకరణం.
* నెల్లూరు నగరపాలక సంస్థకు.. వైఎస్ఆర్ నెల్లూరు నగరపాలక సంస్థగా పేరు.
* కందుకూరులో వైఎస్ఆర్ ఉద్యాన కళాశాల.
* కందుకూరులో వైఎస్ఆర్ సమ్మర్ స్టోరేజీ ట్యాంక్.
* చిత్తూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరానికి ‘వైఎస్ఆర్ సభా వేదిక’ అని పేరు.
* కృష్ణా విశ్వవిద్యాలయంలోని పరిపాలన భవనం ఉన్న బ్లాక్కు వైఎస్ఆర్ పేరు.
* శ్రీకాకుళం పట్టణంలోని కల్యాణ మండపానికి వైఎస్ఆర్ మున్సిపల్ కల్యాణ మండపంగా పేరు.
* తాడేపల్లిగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయంలోని రైతు శిక్షణ కేంద్రానికి వైఎస్ఆర్ రైతు శిక్షణ కేంద్రం అని పేరు.
ఈ ప్రాజెక్టుల పేర్లు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టారు..
* వెలిగల్లు ప్రాజెక్టు -వైఎస్ఆర్ వెలిగల్లు రిజర్వాయరు.
* వరికపూడిసెల ఎత్తిపోతల పథకం - వైఎస్ఆర్ పల్నాడు కరవు నివారణ ప్రాజెక్టు.
* పరిటాల రవీంద్ర ఎత్తిపోతల పథకం - వైఎస్ఆర్ అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్.
జిల్లాల్లో వైఎస్ఆర్ పేరుతో ఉన్న వాటిలో కొన్ని ముఖ్యమైనవి
* వైఎస్ఆర్ వేదాద్రి ఎత్తిపోతల పథకం.
* వైఎస్ఆర్ తాడిగడప పురపాలక సంఘం.
* విజయవాడలోని అవతార్ పార్క్.. వైఎస్ఆర్ పార్కుగా పేరు మార్పు.
* డా.వైఎస్ రాజశేఖరరెడ్డి పొన్నూరు పురపాలక సంఘం.
* గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండల పరిషత్ భవనానికి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి భవనంగా నామకరణం.
* నందిగామలోని దేవినేని వెంకట రమణ రైతు బజారు.. వైఎస్ఆర్ రైతు బజారు, పండ్ల మార్కెట్గా మార్పు.
వైఎస్ఆర్ పేరుతో ఉన్నవి మరికొన్ని
* వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ.
* కడపలో వైఎస్ రాజశేఖరరెడ్డి బస్స్టేషన్.
* ప్రొద్దుటూరులో వైఎస్ఆర్ పురపాలక సంఘం.
* కడపలో వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియం.
* కడపలో వైఎస్ఆర్ క్రీడా పాఠశాల.
* వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం.
* కలిదిండిలో వైఎస్ఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల.
* ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ కళాశాలకు వైఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాల అని పేరు పెట్టారు..
భవనాలు, మైదానాలు, పరిశోధన కేంద్రాలకూ
* ఎలమంచిలి పట్టణంలో రూ. 2.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇండోర్ స్టేడియానికి వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియంగా పేరు. 2013 నిధులు మంజూరయ్యాయి. తెదేపా హయాంలో పనులు పూర్తయ్యాయి. వైకాపా హయాంలో ప్రారంభోత్సవం చేసి పేరు పెట్టుకున్నారు.
* తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (తుడా) భవనం పేరు ‘డా.వైఎస్ఆర్ భవన్’.
* ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన క్రీడా వికాస కేంద్రానికి ఈ ప్రభుత్వం వచ్చాక ‘డా.వైఎస్సార్ క్రీడా వికాస కేంద్రం’గా పేరు.
* అంబాజీపేటలోని ఉద్యాన పరిశోధన కేంద్రం పేరును డా.వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, ఉద్యాన పరిశోధన కేంద్రంగా మార్చారు. అంతకుముందు ఎన్జీ రంగా పేరుతో ఉండేది. వై.ఎస్. మరణాంతరం 2010లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పేరు మార్చింది.
* విశాఖపట్నంలోని మధురవాడలోని అంతర్జాతీయ క్రికెట్ మైదానానికి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఎ.సి.ఎ.- వి.డి.సి.ఎ. క్రికెట్ స్టేడియంగా నామకరణం చేశారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి మృతి చెందిన తరువాత ఆయన జ్ఞాపకార్థం క్రికెట్ స్టేడియం పేరుకు డాక్టర్ రాజశేఖరరెడ్డి పేరు జత చేశారు.
* కాకినాడ గ్రామీణ మండలం నేమాం పంచాయతీ పరిధిలోని జగనన్న కాలనీకి వై.ఎస్.జగన్మోహనపురం అని పేరు పెట్టారు.
* బాపట్ల జిల్లాలోని జె.పంగలూరు మండల పరిషత్ భవనానికి వైఎస్ రాజశేఖరరెడ్డి భవన్ అని నామకరణం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ