Amaravathi: కాలయాపనే అసలు లక్ష్యం
‘రాజధానిలో ప్రధాన మౌలిక వసతుల పనులు చేపట్టేందుకు గుత్తేదారుల నుంచి గడువు పొడిగింపు ప్రతిపాదనలు (ఈఓటీ) కోరాం. వారు ప్రతిపాదన ఇచ్చాక కమిటీ ముందు పెడతాం. దీనికి రెండు నెలలు పడుతుంది.
పనులు చేయకుండా.. సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం
ప్రభుత్వ అఫిడవిట్పై న్యాయనిపుణుల విశ్లేషణ
ఈనాడు, అమరావతి: ‘రాజధానిలో ప్రధాన మౌలిక వసతుల పనులు చేపట్టేందుకు గుత్తేదారుల నుంచి గడువు పొడిగింపు ప్రతిపాదనలు (ఈఓటీ) కోరాం. వారు ప్రతిపాదన ఇచ్చాక కమిటీ ముందు పెడతాం. దీనికి రెండు నెలలు పడుతుంది.
ఇన్వెస్టిగేషన్, సర్వే, డిజైన్లకు నాలుగు నెలలు.. కార్మికులు, యంత్రాల్ని సమకూర్చుకోవడానికి మరో రెండు నెలలు.. మొత్తం మీద పనులు ప్రారంభించడానికి ఎనిమిది నెలలు పడుతుంది. ఇలా మొత్తంగా రాజధానిలో మౌలిక వసతుల అభివృద్ధికి 60 నెలలు అవసరం’.. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో ఇలాంటి విడ్డూరాలు చాలా ఉన్నాయి. రాజధానిలో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.3వేల కోట్ల రుణం తెచ్చుకునేందుకు సీఆర్డీఏకి ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీ గడువు ముగిసిందని, దాన్ని పునరుద్ధరించబోతున్నామని చెప్పింది. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో రూ.లక్షల కోట్ల అప్పులు చేసిన ప్రభుత్వం తలచుకుంటే, నిజంగానే అమరావతిని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశం ఉంటే రూ.3వేల కోట్ల అప్పు దొరికేది కాదా? ప్రభుత్వం చెప్పినదాన్ని బట్టి.. రాజధానిలో ప్రధాన మౌలిక వసతుల పనుల్ని గతంలో అవి చేసిన చేసిన గుత్తేదారులకే ఇవ్వాలనుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. రాజధానిలో ప్రధాన మౌలిక వసతుల పనుల ప్రణాళికలు, డిజైన్లు వంటివన్నీ రూపొందించి, టెండర్లు ఖరారై, పనులు వేగంగా జరుగుతున్న దశలో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం వాటిని ఎక్కడికక్కడ ఆపేసింది. కొన్నాళ్లు ఎదురుచూసిన గుత్తేదారులు.. ప్రభుత్వం స్పందించకపోవడంతో కొన్ని నెలలయ్యాక యంత్రాల్ని, సామగ్రిని తరలించారు. కొన్ని కంపెనీల సామగ్రి ఇప్పటికీ కొంత అక్కడే ఉంది. మళ్లీ పాత సంస్థలకే పనులు ఇస్తున్నప్పుడు... ఈఓటీ ఆమోదానికే రెండు నెలలు పట్టడమేంటి? కొత్త పనులు కానప్పుడు ఇన్వెస్టిగేషన్, సర్వే, డిజైన్లకు నాలుగు నెలలు ఎందుకు? ఇలాంటి సందేహాలెన్నో వస్తున్నాయి. ప్రభుత్వ అఫిడవిట్ చూస్తే.. కోర్టు ఆగ్రహానికి గురవకుండా తప్పించుకోవడానికి దాఖలు చేసినట్టుంది తప్ప, రాజధాని పనులు చేపట్టాలన్న ఆలోచన లేనట్టు తేటతెల్లమవుతోంది. ఆ అఫిడవిట్ ద్వారా ప్రభుత్వ కుటిలనీతి బయటపడిందని, రాజధానిలో పనులు చేపట్టేందుకు తాము సిద్ధంగా లేమన్న విషయాన్ని ప్రభుత్వం చెప్పకనే చెప్పిందన్న విమర్శలు న్యాయ నిపుణులు, రాజధాని రైతుల నుంచి వినిపిస్తున్నాయి. అఫిడవిట్లో పస లేదని, ప్రభుత్వ చర్య కచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని వారు చెబుతున్నారు. ప్రభుత్వం అఫిడవిట్లో ప్రస్తావించిన ముఖ్యాంశాలేమిటి? వాటిలో ఎంత హేతుబద్ధత ఉందో చూద్దాం.
ప్రభుత్వం: సీఆర్డీఏ ప్రాంత అభివృద్ధి.. రైతులతో చేసుకున్న భూసమీకరణ ఒప్పందం పరిధిలోకి రాదు. అయినా రూ.433 కోట్లతో పనులు చేపట్టాం. విజయవాడ ఇన్నర్ రింగ్రోడ్డు పనులు కూడా చేశాం.
నిజమెంత: రాజధాని అమరావతితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సీఆర్డీఏని ఏర్పాటు చేశారు. సీఆర్డీఏ అయినా, అంతకుముందున్న వీజీటీఎం-ఉడా అయినా, దాని పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం నిరంతర ప్రక్రియ. రాజధాని అమరావతిని, విజయవాడ నగరాన్ని చుడుతూ ఇన్నర్రింగ్ రోడ్డు ప్రతిపాదన ఉంది. దానికి ప్రాథమిక అలైన్మెంట్ కూడా గతంలోనే సిద్ధమైనా నిర్మాణ ప్రక్రియ మొదలు కాలేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కాజ నుంచి చినఅవుటుపల్లి వరకు అమరావతి మీదుగా విజయవాడకు బైపాస్ రోడ్డు నిర్మిస్తోంది.
ప్రభుత్వం: ప్రధాన మౌలిక వసతుల అభివృద్ధికి నిధుల కోసం మార్చి 23న బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాం. ప్రతిపాదనల్ని ఉన్నతాధికారులకు పంపుతామని వారు చెప్పారు. రూ.3వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీ గడువు ముగిసింది. మళ్లీ పంపిస్తాం.
నిజమెంత: రూ.3 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి చాన్నాళ్లయింది. ప్రభుత్వం రాజధాని పనులు నిలిపివేయడం, అక్కడి భూముల ధరలు తగ్గడంతో.. రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావడం లేదు. ఇప్పుడు బ్యాంకర్లతో సమావేశం కూడా కంటితుడుపు చర్యే.
ప్రభుత్వం: రాజధానిలో అక్కడక్కడా భూసమీకరణలో ఇవ్వని భూములున్నాయి. రహదారుల నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న ఆ భూముల్నీ సేకరించాలి. దానిపై వ్యాజ్యాలు ఉండటంతో ప్రక్రియ ముందుకెళ్లడం లేదు.
నిజమెంత: ఎక్కడైనా అలాంటి ఇబ్బంది ఉంటే.. ఆ ప్రాంతం వరకు నిర్మాణం ఆపేసి అటూ ఇటూ పూర్తి చేయవచ్చు. సమీకరణ ద్వారానో, భూసేకరణ ద్వారానో ఆ భూమిని తీసుకున్న తర్వాత ఆ భాగాన్నీ నిర్మించవచ్చు. సీడ్యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి రాయపూడి దగ్గర అలాంటి సమస్యే వస్తే.. నిర్మాణం ఆపేయకుండా అటూ ఇటూ పూర్తి చేశారు.
ప్రభుత్వం: ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస భవనాలు, ఏఐఎస్ అధికారుల నివాస భవనాల నిర్మాణాలు పునఃప్రారంభమయ్యాయి. వాటిని పూర్తి చేసేందుకు నవంబరు వరకు గడువు పొడిగించాం.
నిజమెంత:ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐఎస్ అధికారుల నివాస భవనాల నిర్మాణం 90 శాతానికిపైగా ఇది వరకే పూర్తయింది. మిగిలింది పూర్తి చేయడానికి నవంబరు వరకు గడువివ్వడం విడ్డూరంగా ఉంది. గెజిటెడ్, నాన్గెజిటెడ్ అధికారులు, నాలుగో తరగతి ఉద్యోగులు, మంత్రులు, జడ్జిలు, సీనియర్ అధికారుల బంగళాల నిర్మాణం ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో ప్రభుత్వం చెప్పలేదు. ఇప్పటికే పునాదుల నిర్మాణం పూర్తయిన సచివాలయ టవర్లు, హైకోర్టు భవనం నిర్మాణం గురించీ ప్రస్తావించలేదు. ఇదంతా కాలయాపనలానే కనిపిస్తోంది.
ప్రభుత్వం: రైతులకు ఇచ్చిన స్థలాల్లో ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోనివి 22,276 ఉన్నాయి. రిజిస్ట్రేషన్ చేసుకోమని యజమానులకు సమాచారమిస్తే 348 స్థలాలకు మాత్రమే చేసుకున్నారు.
నిజమెంత: రాజధానిలో రైతులకు స్థలాలిచ్చిన లేఅవుట్లన్నీ అడవుల్ని తలపిస్తున్నాయి. తమ స్థలం ఎక్కడుందో రైతులే గుర్తించలేని పరిస్థితి. హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత సీఆర్డీఏ కనీసం ఆ చెట్లన్నీ తొలగించి, లేఅవుట్లను శుభ్రం చేసే పని కూడా చేయలేదు. తమ ప్లాట్ ఎక్కడుందో చూపించి, సరిహద్దులు స్పష్టంగా చెబితే రిజిస్ట్రేషన్ చేసుకుంటామని రైతులు కోరినా స్పందించలేదు.
ప్రభుత్వం: రాజధాని నిర్మాణానికి నిధుల్ని భూముల విక్రయం ద్వారా సమకూర్చుకునే అధికారం సీఆర్డీఏకి ఉంది. కానీ 2023 నుంచే భూములమ్మే వెసులుబాటు వస్తుంది.
నిజమెంత: రాజధాని నిర్మాణానికి భూముల విక్రయం ఒక వనరు మాత్రమే. ప్రాథమికంగా ఆర్థిక సహకారం అందించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. మాకు సంక్షేమ పథకాలే ముఖ్యం గానీ, రాజధాని నిర్మాణం కాదన్నట్టుగా ప్రభుత్వ అఫిడవిట్ ఉంది. ఎనిమిదేళ్లుగా రాజధాని నగరమంటూ లేని రాష్ట్రానికి అన్ని వసతులతో నగరాన్ని నిర్మించుకోవడం ప్రభుత్వ ప్రాధాన్యం కాదా?
తీర్పును అమలు చేయబోమని చెప్పకనే చెప్పింది - ఉన్నం మురళీధర్రావు, హైకోర్టు సీనియర్ న్యాయవాది
ప్రభుత్వం ఒక పక్క చెప్పిన గడువులోగా రాజధాని నిర్మాణం సాధ్యం కాదంటూనే.. తీర్పును అమలు చేయకుండా ఉండటానికి న్యాయపరంగా ఉన్న మార్గాల్ని అన్వేషిస్తున్నామని పేర్కొంది. అంటే కోర్టు తీర్పును అమలు చేయడానికి సిద్ధంగా లేమని చెప్పకనే చెప్పింది. రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి భూములు తీసుకుని, ఇప్పుడు డబ్బుల్లేవు పనులు చేయలేమనడం కోర్టు ధిక్కరణే అవుతుంది. రాజధాని నిర్మాణానికి డబ్బుల్లేవన్నందుకు సీఎస్ను జైలుకి పంపే ఆస్కారం ఉంది. ప్రభుత్వం భూసేకరణ చట్టం కింద భూములు తీసుకోవాలంటే.. దాని విలువలో 80 శాతాన్ని ముందుగానే భూసేకరణ అధికారులైన కలెక్టర్ల వద్ద డిపాజిట్ చేయాలి. ముందే డబ్బు చెల్లించకుండా తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధం.
ప్రభుత్వ అఫిడవిట్ చెల్లదు - ముప్పాళ్ల సుబ్బారావు, భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
కోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, పనులు ప్రారంభించి.. ఇంత వరకు చేశాం, ఆర్థిక ఇబ్బందులున్నాయి, నెమ్మదిగా చేస్తామని చెబితే గడువు పొడిగించే అవకాశం ఉండేది. నెల తర్వాత ఇప్పుడు తీరిగ్గా స్పందిస్తూ.. పనులు పూర్తి చేయడానికి ఐదేళ్లు పడుతుందంటే కోర్టు అంగీకరించదు. రాజధానిలో అసైన్డు భూములకు సంబంధించిన కేసులుండటంతో కొన్ని స్థలాల రిజిస్ట్రేషన్ నిలిపేశామని ప్రభుత్వం సాకులు చెబుతోంది. సీఐడీ ప్రభుత్వం చేతిలోనే కదా ఉంది? కేసులు ఉంటే వెంటనే ఛార్జిషీటు దాఖలు చేసి, కోర్టుకు పెడితే విచారణ చేపడుతుంది కదా? కోర్టు తీర్పే సుప్రీం. ప్రభుత్వ అఫిడవిట్ చెల్లదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
జగన్.. సొంత జిల్లా ప్రజలకు మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ