Andhra News: రహస్యం బయటకొచ్చింది!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్కు ప్రభుత్వం రూ.25వేల కోట్ల మేర గ్యారంటీ ఇచ్చిన అంశం ఎట్టకేలకు అధికారికంగా బడ్జెట్ పుస్తకాల్లో నమోదైంది. 2021-22 ఆర్థిక
2020-21లోనే ప్రభుత్వ గ్యారంటీలు
నాటి బడ్జెట్ పుస్తకంలో చూపక వివాదమైన వైనం
నాడు గ్యారంటీ ఇవ్వలేదన్న మంత్రి బుగ్గన
తాజా బడ్జెట్ పుస్తకాల్లో చోటు
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్కు ప్రభుత్వం రూ.25వేల కోట్ల మేర గ్యారంటీ ఇచ్చిన అంశం ఎట్టకేలకు అధికారికంగా బడ్జెట్ పుస్తకాల్లో నమోదైంది. 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించిన నాటికే ఆ రూపేణా అప్పులు తెచ్చి వాడేసినా, ఆ విషయాన్ని శాసనసభకు సమర్పించే గ్యారంటీల లెక్కల్లో చేర్చలేదు. అప్పట్లోనే ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డిని ఈ విషయం ప్రశ్నిస్తే అసలు ఆ గ్యారంటీలు వినియోగించుకుంటే కదా అని సమాధానం ఇచ్చారు. నిజానికి అప్పటికే ఏపీఎస్డీసీ ద్వారా రుణం తెచ్చి కొంత సొమ్ము ఖర్చు చేసినట్లు బడ్జెట్ ఖర్చుల్లో చూపించారు. ఆ రుణానికి గ్యారంటీ సంగతి దాచిపెట్టారు. ‘ఆ గ్యారంటీలను కలిపితే అప్పటికే రుణ పరిమితి దాటిపోయేది. అందుకే గ్యారంటీల అంశాన్ని బడ్జెట్ పుస్తకాల్లో చూపలేదు’ అని ఆర్థిక నిపుణులు అప్పట్లోనే విమర్శించారు. ఈ గ్యారంటీలను బడ్జెట్ పుస్తకాల్లో చేర్చాలని తాము సూచించినా ప్రభుత్వ పెద్దలు వద్దన్నారని నాడు ఆర్థికశాఖలో పని చేసిన ముఖ్య అధికారులు వెల్లడించారు. అప్పట్లో దాచి పెట్టిన ఏపీఎస్డీసీ రుణాల గ్యారంటీలు ఇప్పుడు బయట పెట్టాల్సి వచ్చింది. బడ్జెట్ పుస్తకం 5/2లో అప్పులు, గ్యారంటీల వివరాలు శాసనసభకు సమర్పించాలి. ప్రస్తుతం బడ్జెట్ ప్రతిపాదన సందర్భంగా సభకు సమర్పించిన వివరాల్లో ఏపీఎస్డీసీకి రూ.25వేల కోట్ల గ్యారంటీలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
2020లోనే గ్యారంటీ ఒప్పందాలు, మంత్రిమండలి ఆమోదాలూ!
రాష్ట్రాభివృధ్ధి కార్పొరేషన్ రుణాలు పొందేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు బ్యాంకులతో గ్యారంటీ ఒప్పందాలు 2020 నవంబరులోనే పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్యారంటీదారుగా, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణదాతలుగా, రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ రుణగ్రహీతగా, ఎస్బీఐ క్యాప్ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ సెక్యూరిటీ ట్రస్టీగా ఈ ఒప్పందం 2020 నవంబరు 5న కుదిరింది. ఎస్బీఐ, పీఎన్బీ, ఇండియన్ బ్యాంకు రుణదాతలు. ఈ మూడు బ్యాంకులు రూ.13,500 కోట్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. అదే రోజు ఎస్క్రో ఒప్పందమూ కుదిరింది.
* 2020 నవంబరు 24న 5 బ్యాంకులతో ఒప్పందం కుదిరింది. రూ.21,500 కోట్ల రుణం తీసుకునేందుకు వీలుగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎస్బీఐ రూ.6,000 కోట్లు, పీఎన్బీ రూ.5,000 కోట్లు, ఇండియన్ బ్యాంకు 2,500 కోట్లు, యూబీఐ రూ.5,000 కోట్లు, బ్యాంకు ఆఫ్ బరోడా రూ.3,000 కోట్ల రుణం ఇచ్చేందుకు ఆ ఒప్పందంలో అంగీకరించాయి. పై కార్యకలాపాలు పూర్తయ్యాక అన్ని జీవోలనూ ర్యాటిఫై చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేసింది. నవంబరు 27న నిర్వహించిన మంత్రిమండలి సమావేశంలో ఎజెండా అంశం 21 కింద దీన్ని మంత్రిమండలి ముందుంచారు. మూడు జీవోలకు సంబంధించి తీర్మానం 204/2020లో వాటన్నింటినీ మంత్రిమండలి ఆమోదించింది. అయినా, గ్యారంటీలను ప్రభుత్వం రహస్యంగా ఉంచింది.
ఎప్పుడో గ్యారంటీ జీవోలు
* ఏపీఎస్డీసీ నుంచి రుణం తెచ్చేందుకు ప్రభుత్వం 2020లోనే గ్యారంటీలు ఇచ్చింది. ఆ వివరాలు 2021 బడ్జెట్ పుస్తకాల్లో నమోదు కావాలి.
* రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్కు ప్రభుత్వం రూ.25వేల కోట్ల గ్యారంటీలు నిబంధనలు, షరతులకు లోబడి ఇస్తున్నట్లుగా 2020 నవంబరు 3న జీవో 92 విడుదలైంది.
* కార్పొరేషన్ రుణం తీసుకుని ఆ మొత్తం చెల్లించేందుకు వీలుగా అదనపు ఎక్సయిజ్ సుంకం విధించి ఆ మొత్తాన్ని బ్యాంకులకు ఎస్క్రో చేసేందుకు వీలు కల్పిస్తూ జీవో 90 వచ్చింది.
* కార్పొరేషన్ మూలనిధిని రూ.2,500 కోట్లకు పెంచుతూ జీవో 91 విడుదల చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! -
సీఎం పీఆర్ఓలా... వైకాపా నాయకులా?
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. -
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
‘కంప్యూటర్ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఎకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
దాడి చేసి.. దండంతో సరి!
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్కుమార్లను కొట్టిన మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. -
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
‘డ్రైడ్ఈస్ట్ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. -
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
తిరుమలలో జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడి వివాహ వేడుక
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భానుప్రకాశ్, సౌజన్యల వివాహ వేడుక స్థానిక పుష్పగిరి మఠంలో బుధవారం జరిగింది. -
శ్రీవారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి కుటుంబానికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. -
డోన్, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. -
అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!
అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది. -
ఆరంభమే ఫ్లాప్
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. -
నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. -
జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్