Andhra News: పోటీ ఎక్కువ.. పోస్టులు తక్కువ
ఉద్యోగాల ఖాళీల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు నిరుద్యోగులను ఆగ్రహానికి గురిచేస్తోంది. ఖాళీలు ఎక్కువగా ఉన్నా తక్కువ సంఖ్యలో పోస్టులను భర్తీ చేస్తుండటం పట్ల నిరుద్యోగులు మండిపడుతున్నారు.
గ్రూపు-2 కోసం లక్షల మంది నిరుద్యోగుల ఎదురుచూపులు
పోస్టులు తక్కువగా చూపడంపై ఆవేదన
పోలీసు, లెక్చరర్ల ఖాళీల భర్తీ మాటేమిటని నిలదీత
ఈనాడు, అమరావతి: ఉద్యోగాల ఖాళీల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు నిరుద్యోగులను ఆగ్రహానికి గురిచేస్తోంది. ఖాళీలు ఎక్కువగా ఉన్నా తక్కువ సంఖ్యలో పోస్టులను భర్తీ చేస్తుండటం పట్ల నిరుద్యోగులు మండిపడుతున్నారు. ముఖ్యంగా లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూసే...గ్రూపు-1, గ్రూపు-2, పోలీసు, ఇతర ఉద్యోగాల నోటిఫికేషన్లు చాలా కాలం నుంచి వెలువడలేదు. గత ఏడాది జూన్ 18న జారీ చేసిన క్యాలెండర్లో గ్రూపు-1, 2 కింద కేవలం 36 పోస్టులు ప్రకటించారు.
ఇవి మరీ తక్కువగా ఉండడంతో నిరుద్యోగ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. తర్జనభర్జనల అనంతరం శుక్రవారం గ్రూపు-1 కింద 110 పోస్టులు, గ్రూపు-2 కింద 182 పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా గ్రూపు-2 కింద ప్రకటించిన పోస్టులు తక్కువగా ఉండడం పట్ల నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2016లో గ్రూపు-1 కింద 74, గ్రూపు-2లో 980, 2018లో గ్రూపు-1 కింద 160, గ్రూపు-2లో 443 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. గ్రూపు-2 పోస్టులకు లక్షల్లో దరఖాస్తులు వస్తాయి. ఈ పోస్టుల కోసం నాలుగైదు సంవత్సరాల నుంచి సన్నద్ధమయ్యే నిరుద్యోగులు ఉన్నారు.
రాష్ట్ర సచివాలయంలో 250 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉండగా.. కొన్ని పోస్టుల భర్తీకే అవకాశం కల్పించారు. ఇలాగే ఇతర శాఖల్లోనూ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 66,309 ఖాళీలు ఉన్నట్లు ప్రకటించింది. అన్ని శాఖల్లో కలిపి 7,71,177 పోస్టులు మంజూరు కాగా... 5,29,868 మంది శాశ్వత ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉపాధి కల్పనా కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకున్న నిరుద్యోగులు 6.16 లక్షల మంది ఉన్నారు. పోస్టుల సంఖ్యను పెంచాలని నిరుద్యోగ ఐకాస, ఉద్యోగ పోరాట సమితి నేతలు హేమంతకుమార్, సిద్ధిక్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
నోటిఫికేషన్ల జారీ ఎప్పుడు?
కొత్తగా ప్రకటించిన గ్రూపు-1, గ్రూపు-2 పోస్టుల నోటిఫికేషన్ల జారీకి ఎంత కాలం పడుతుందన్న దానిపై నిరుద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది. సీఎం ఆమోదం తెలిపిన ప్రకారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇవ్వాలి. ఇది జరిగిన అనంతరం సంబంధిత శాఖల నుంచి నేరుగా ఏపీపీఎస్సీకి ఇండెంట్లు వెళ్లాలి. రిజర్వేషన్లు, అర్హతలు, ఇతర అంశాలపై స్పష్టత వచ్చాక.. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. ఇందుకు నెలకు పైగానే సమయం పడుతుంది.
పోలీసు, లెక్చరర్ల పోస్టుల మాటేమిటి?
ఉద్యోగాల భర్తీ క్యాలెండర్లో పేర్కొన్న ప్రకారం పోలీసు శాఖలో 450 పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబరులోనే నోటిఫికేషన్ రావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు జారీ కాలేదు. రాష్ట్రంలో చివరిసారిగా 2018 డిసెంబరులో పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అప్పుడు దాదాపు 5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉన్నత విద్యాశాఖ తరఫున ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 240 లెక్చరర్స్ పోస్టుల భర్తీకి గత జనవరిలోనే నోటిఫికేషన్ వెలువడాల్సి ఉంది. విశ్వవిద్యాలయాల్లో 2 వేల అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి గతనెలలో ప్రకటన రావాల్సి ఉంది. కానీ ఇంతవరకు అతీగతీలేదు.
వెల్లడికాని గ్రూపు-1 ఫలితాలు
గత నోటిఫికేషన్కు సంబంధించి గ్రూపు-1 ప్రధాన పరీక్షల ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారో తెలియక అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్లో జరిగిన జవాబు పత్రాల మూల్యాంకనాన్ని హైకోర్టు ఆదేశాలను అనుసరించి పెన్ను-పేపరు విధానంలో ప్రస్తుతం చేస్తున్నారు. గత అక్టోబరులో హైకోర్టు జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం మూడు నెలల్లో మూల్యాంకనం పూర్తికావాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్