Andhra News: తగ్గనున్న టోల్ గేట్లు!
వాహనంతో జాతీయ రహదారిపైకి వస్తే చాలు టోల్బాదుడు మొదలవుతుంది. కొత్త రోడ్ల నిర్మాణం, ఉన్నవాటిని విస్తరించడం ఇలా ఏదో ఒక కారణంతో రోజురోజుకూ టోల్గేట్ల సంఖ్య పెరిగిపోతుండటంతో రుసుములు కట్టలేక వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు.
జాతీయ రహదారులపై 60 కి.మీ.లోపు ఉంటే మూసేస్తామన్న కేంద్రం
అలాంటివి రాష్ట్రంలో 15
ఈనాడు - అమరావతి
వాహనంతో జాతీయ రహదారిపైకి వస్తే చాలు టోల్బాదుడు మొదలవుతుంది. కొత్త రోడ్ల నిర్మాణం, ఉన్నవాటిని విస్తరించడం ఇలా ఏదో ఒక కారణంతో రోజురోజుకూ టోల్గేట్ల సంఖ్య పెరిగిపోతుండటంతో రుసుములు కట్టలేక వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. అయితే జాతీయ రహదారులపై 60 కి.మీ.లోపు ఉన్న టోల్గేట్లను మూసివేస్తామని ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఇది అమలైతే రాష్ట్రంలోని జాతీయ రహదారులపై ఉన్న టోల్ప్లాజాల్లో దాదాపు 15 వరకు మూతపడే అవకాశాలున్నట్లు అంచనాలు వేస్తున్నారు. ఆ మేరకు వాహనదారులకు ఊరట కలుగుతుందా? లేక తొలగించిన టోల్ప్లాజాల రుసుములను కూడా ఉన్నవాటిలోనే కలుపుతారా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
కోల్కతా-చెన్నై రహదారిపైనే అధికం
రాష్ట్రవ్యాప్తంగా వివిధ జాతీయ రహదారులపై మొత్తం 57 టోల్ప్లాజాలు ఉన్నాయి. ఇవన్నీ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) పరిధిలో ఉన్నాయి. నిబంధనల ప్రకారం 60 కి.మీ.కు ఓ టోల్ప్లాజా మాత్రమే ఉండాలి. అయితే వివిధ చోట్ల రహదారుల విస్తరణ, అభివృద్ధి నేపథ్యంలో అదనంగా టోల్ప్లాజాలు ఏర్పాటు చేస్తూ వచ్చారు. దీంతో కొన్ని చోట్ల 60 కి.మీ.లోపే టోల్ప్లాజాలు వచ్చాయి. రాష్ట్రంలో సుదీర్ఘంగా సాగే కోల్కతా - చెన్నై జాతీయ రహదారి (నంబర్ 16)పై అత్యధికంగా 19 టోల్ప్లాజాలు ఉన్నాయి. వీటిలో 60 కి.మీ.లోపు దూరంలో ఉన్నవి 7.
* తెలంగాణలోని నకిరేకల్ నుంచి మన రాష్ట్రంలో ఏర్పేడు వరకు జాతీయ రహదారి-565లో దావులపల్లి- మార్కాపురం- వగ్గంపల్లి మధ్య మిల్లంపల్లి, మేకలవారిపల్లిల వద్ద టోల్ప్లాజాలు ఉన్నాయి. ఈ రెండింటి మధ్య దూరం 53.8 కి.మీ. పెంచలకోన- ఏర్పేడు మధ్య ఉన్న చింతలపాలెం, రాపూరు టోల్ప్లాజాల మధ్య దూరం 56.35 కి.మీ.
* కర్ణాకలోని హుబ్లి నుంచి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు వరకు జాతీయ రహదారి-67లో దోర్నాల -ఆత్మకూరు- నెల్లూరు మధ్య డీసీపల్లి, బుచ్చిరెడ్డిపాళెం వద్ద టోల్ప్లాజాలు ఉన్నాయి. వీటి మధ్య దూరం 42.35 కి.మీ..
కత్తిపూడి- ఒంగోలు మధ్య ఎన్ని?
కేంద్ర మంత్రి తాజా ప్రకటనతో.. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు అయిదు కోస్తా తీరప్రాంత జిల్లాలను కలుపుతూ ఉన్న జాతీయ రహదారి-216లో ఎన్ని టోల్ప్లాజాలు వస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం కాకినాడ బైపాస్ వద్ద, ఈపూరుపాలెం- ఒంగోలు మధ్య చినగంజాం వద్ద టోల్ప్లాజాలు ఉన్నాయి. మధ్యలో మరో అయిదు ఏర్పాటు కావాల్సి ఉంది. ఆయా ప్యాకేజీల్లో పనులు పూర్తయితే వీటిని ఆరంభిస్తారు. అయితే వీటిలో రెండు, మూడు టోల్ప్లాజాలు 60 కి.మీ.లోపే ఉండనున్నాయి. దీంతో వేటిని ఆపేయాల్సి ఉంటుందో స్పష్టత రావాల్సి ఉంది.
తగిన ఆదేశాలు వచ్చాకే నిర్ణయం
60 కి.మీ.లోపు ఉండే టోల్ప్లాజాల తొలగింపునకు సంబంధించి దిల్లీలోని ఉన్నతాధికారుల నుంచి వచ్చే సూచనలు బట్టే నిర్ణయాలు ఉంటాయని ఎన్హెచ్ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని పలు జాతీయ రహదారుల్లో కొన్ని ప్యాకేజీలు ‘నిర్మించు, నిర్వహించు, బదలాయించు (బీవోటీ), మరికొన్ని ఈపీసీ విధానంలో నిర్మించారన్నారు. ఆయా గుత్తేదారులకు టోల్ వసూళ్లకు ఇంకా గడువుందని చెప్పారు. వాటిలో కొన్ని మూసివేయాల్సి వస్తే, గుత్తేదారులకు ఒప్పందం ప్రకారం సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. వీటన్నింటిపై ఉన్నతాధికారులు ఇచ్చే ఆదేశాలు పాటిస్తామని, ఆ తర్వాతే రాష్ట్రంలో ఎన్ని టోల్ప్లాజాలు మూసివేస్తామనేది స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
ఎడ్సెట్-2024 నోటిఫికేషన్ విడుదల
బీఎడ్ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శుక్రవారం ఎడ్సెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
‘కౌలు రైతుకు’ జగన్ కాటు!
‘‘దేశంలో ఎక్కడా లేనట్లుగా కౌలు రైతులకు మేం తోడుగా ఉంటున్నాం. గ్రామ సచివాలయంలోనే సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నాం. వారికి ఇక రైతు భరోసాతోపాటు అన్ని పథకాలు అందుతాయి’’ అంటూ 2023 సెప్టెంబరులో రైతు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్ గొప్పలు చెప్పారు. -
జనం కళ్లలో జగన్ దుమ్ము
సిద్ధం యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడీబీ రోడ్డు మీదుగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఇది.. మధ్యలో ఒక్కసారి ఆయన బస్సు దిగి చూస్తే రోడ్డు దుస్థితి తెలిసేవి. -
ఐదేళ్లలో భారీగా పెరిగిన బొత్స కుటుంబ ఆస్తి
విజయనగరం జిల్లా చీపురుపల్లి వైకాపా అభ్యర్థి (వైకాపా), మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో సుమారు రెండున్నర రెట్లు పెరిగింది. -
రోజాకు రూ. 10.63 కోట్ల ఆస్తులు
వైకాపా అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు. ఇప్పుడు రూ.4.58 కోట్లు. -
రైతు సదస్సు పేరుతో వైకాపా భోజనాలు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో రైతు అవగాహన సదస్సు పేరుతో వైకాపా నాయకులు ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. -
ఉద్యోగమే ‘సోర్స్..’ పథకాలు ‘అవుట్’
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు. -
గిగ్గోడు వినిపించలేదు
ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు.. నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్, బైక్ రైడర్ లాంటి పనులు చేస్తూ ‘గిగ్’ కార్మికులుగా మారుతున్నారు యువత. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
జగన్ మాట్లాడుతుంటే జనం వెళ్లిపోయారు
సీఎం జగన్ కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మొదట్లో కాకినాడ గ్రామీణ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రసంగించారు. -
సిద్ధం సభకు బస్సుల తరలింపు.. ప్రయాణికులకు నరకయాతన
కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం సిద్ధం సభకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. -
సామాజికవర్గం పేరుతో మహిళను దూషించిన వైకాపా నేత రాజమోహన్రెడ్డి
‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసల విలువ చేయదు..’ అంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆత్మకూరు ఛైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అన్నదాతలను బలిచేసి.. అస్మదీయులకు ధారపోసి
అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు. -
సంక్షేమ పథకాలు ఓట్లు పొందే మార్గాలు కాకూడదు
ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
నేను ఓటు వేశా.. మీరూ వేయండి..! ఎన్నికల వేళ విశాల్ ఇంకా ఏమన్నారంటే?
-
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్రెడ్డి
-
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?