Andhra News: అందుబాటులో జిల్లా కేంద్రం
జిల్లాలోని అన్ని ప్రాంతాలకు మధ్యలో జిల్లా కేంద్రాలు ఉండాలనే ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగానే 3 జిల్లా కేంద్రాల్లో మార్పులు చోటు చేసుకున్నాయని ప్రణాళికశాఖ ముఖ్య కార్యదర్శి జీఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ తెలిపారు. జిల్లా
3 చోట్ల జిల్లా కేంద్రాలను మార్చి ప్రకటించాం
సౌలభ్యం కోసమే ‘ఒక నియోజకవర్గం ఒకే జిల్లాలో’ అనే నిబంధనను సడలించాం
‘ఈనాడు-ఈటీవీ’తో ప్రణాళికశాఖ ముఖ్య కార్యదర్శి జీఎస్ఆర్కేఆర్ విజయ్కుమార్
ఈనాడు, అమరావతి: జిల్లాలోని అన్ని ప్రాంతాలకు మధ్యలో జిల్లా కేంద్రాలు ఉండాలనే ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగానే 3 జిల్లా కేంద్రాల్లో మార్పులు చోటు చేసుకున్నాయని ప్రణాళికశాఖ ముఖ్య కార్యదర్శి జీఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రం ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలనే.. ఒక నియోజకవర్గం పూర్తిగా ఒకే జిల్లాలో ఉంచాలనే నిబంధననూ సడలించామని చెప్పారు. ‘నరసాపురం మూలగా ఉండటంతో మధ్యలో ఉండే భీమవరాన్ని జిల్లా కేంద్రంగా నిర్ణయించాం. రాజంపేట, మదనపల్లె చెరో పక్కగా ఉండటంతో మధ్యలో ఉండే రాయచోటి జిల్లా కేంద్రమైతే అనువుగా ఉంటుందని భావించాం. పుట్టపర్తి అయితే కదిరి, ధర్మవరం, హిందూపురం, పెనుగొండ ప్రాంతాలకు దగ్గరగా ఉంటుందని ఆలోచించాం. అందుకే ఈ 3 చోట్ల జిల్లా కేంద్రాలను మార్చాం’ అని ఆయన వివరించారు. వీటిపై స్పందనలు మిశ్రమంగా ఉండటంతో ప్రకటించిన మేరకే కొనసాగించామని చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆదివారం ఆయన ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు. ‘జిల్లాల పేర్లపైనా చాలా అభ్యంతరాలు వచ్చాయి. వాటిని పరిగణనలోకి తీసుకుంటే తేల్చడం కష్టమనే పక్కన పెట్టాం’ అని పేర్కొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాల్లో సహేతుకమైన వాటిని ప్రభుత్వం ఆమోదించిందని వివరించారు.
లోక్సభ నియోజకవర్గమే ప్రాతిపదికగా అనుకున్నా..
‘లోక్సభ నియోజకవర్గం ప్రాతిపదికగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని, ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని సాధ్యమైనంత వరకు పూర్తిగా ఒకే జిల్లాలో ఉండేలా చూడాలనే ఆలోచన చేశాం. అయితే కొన్ని నియోజకవర్గాలు ఇప్పుడున్న జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉండటం, ఆ నియోజకవర్గాన్ని పక్క జిల్లాలో చేరిస్తే ప్రజలు ఇబ్బంది పడతారని భావించినప్పుడు మినహాయింపులిచ్చాం. బాపట్ల లోక్సభ నియోజకవర్గంలో భాగమైన సంతనూతలపాడును ఒంగోలులో, తిరుపతి లోక్సభ స్థానం పరిధిలోని సర్వేపల్లిని నెల్లూరులో, నంద్యాల లోక్సభలోని పాణ్యం నియోజకవర్గాన్ని కర్నూలులో, హిందూపురం లోక్సభ నియోజకవర్గ పరిధిలోని రాప్తాడును అనంతపురం జిల్లాలో, చిత్తూరు లోక్సభ పరిధిలోని చంద్రగిరిని తిరుపతిలోనే ఉంచుతూ ప్రతిపాదించాం. జనవరి 25న కొత్త జిల్లాల ఏర్పాటుపై ముసాయిదా ప్రకటించి అభ్యంతరాలను ఆహ్వానించగా 16,660 వినతులొచ్చాయి. ఇందులో ప్రధానమైనవిగా 284 గుర్తించాం. వీటిని పరిశీలించిన ప్రభుత్వం.. సహేతుకమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంది. ఒక నియోజకవర్గాన్ని 2 జిల్లాల్లోకి విభజించాల్సి వచ్చినప్పుడు ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని పరిశీలించింది.
సగటున 8 నుంచి 12 మండలాలతో రెవెన్యూ డివిజన్
రెవెన్యూ డివిజన్ అందుబాటులో ఉండాలనేది ప్రభుత్వ నిర్ణయం. ప్రజల నుంచి వచ్చిన వినతుల మేరకు గతంలో ఉన్న 51 రెవెన్యూ డివిజన్లను 62కి పెంచుతూ ప్రతిపాదించాం. చివరకు 72 ఏర్పాటయ్యాయి. కొత్తగా 23 డివిజన్లు వచ్చాయి. సగటున ఒక్కో రెవెన్యూ డివిజన్లో 8 నుంచి 12 మండలాలుంటాయి. ప్రత్యేక పరిస్థితుల్లో కుప్పంలో 4 మండలాలకే డివిజన్ ఏర్పాటు చేశాం. విజయవాడ, విశాఖపట్నం నగర ప్రాంతాలు కావడంతో జనాభా ఎక్కువ, మండలాలు తక్కువ కావడంతో అయిదారు మండలాలను డివిజన్ చేశాం. మండలాల సంఖ్య తగ్గడంతో కొత్తపేట రెవెన్యూ డివిజన్ను తొలగించాం.
వారంలో రెండు రోజులు రంపచోడవరంలోనే..
రంపచోడవరం, ఎటపాక, ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన మండలాలు, మారేడుమిల్లి, దేవీపట్నం 200 కి.మీ.పైనే దూరంలో ఉన్నాయి. ఈ ఇబ్బందిని పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్ వారంలో 2 రోజుల పాటు రంపచోడవరం నుంచే విధులు నిర్వహించేలా ప్రభుత్వం ఉత్తర్వులిస్తోంది. దీంతో జిల్లా యంత్రాంగమంతా రెండు రోజులు అక్కడే అందుబాటులో ఉంటారు’ అని విజయ్ కుమార్ వివరించారు.
12 మంది ఎమ్మెల్యేలకు 2 జిల్లాల్లో ప్రాతినిధ్యం
విజయనగరంలో మెంటాడ, విశాఖపట్నంలో పెందుర్తి, తూర్పుగోదావరి జిల్లాలో పెదపూడి, గోకవరం, తాళ్లరేవు, కాజులూరు, పశ్చిమగోదావరి జిల్లాలో ద్వారకాతిరుమల, నెల్లూరు జిల్లాలో రాపూరు, సైదాపురం, కలువాయి, చిత్తూరు జిల్లాలో పుత్తూరు, వడమాలపేట, కడప జిల్లాలో సిద్దవటం, ఒంటిమిట్ట, కర్నూలు జిల్లాలో పాణ్యం, గడివేముల, అనంతపురం జిల్లాలో రామగిరి, కనగానపల్లె, చెన్నేకొత్తపల్లి మండలాలకు సంబంధించి మార్పులు జరిగాయి. ఈ మండలాలన్నీ ప్రతిపాదించిన జిల్లా నుంచి పక్క జిల్లాకు మార్చుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో 12 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు 2 జిల్లాల్లో ప్రాతినిధ్యం లభించనుంది. సాలూరు, పెందుర్తి, జగ్గంపేట, రామచంద్రపురం, ముమ్మిడివరం, అనపర్తి, గోపాలపురం, వెంకటగిరి, నగరి, పాణ్యం, రాజంపేట, రాప్తాడు ఎమ్మెల్యేలకు ఇలాంటి అవకాశముంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! -
సీఎం పీఆర్ఓలా... వైకాపా నాయకులా?
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. -
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
‘కంప్యూటర్ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఎకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
దాడి చేసి.. దండంతో సరి!
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్కుమార్లను కొట్టిన మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. -
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
‘డ్రైడ్ఈస్ట్ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. -
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
తిరుమలలో జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడి వివాహ వేడుక
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భానుప్రకాశ్, సౌజన్యల వివాహ వేడుక స్థానిక పుష్పగిరి మఠంలో బుధవారం జరిగింది. -
శ్రీవారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి కుటుంబానికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. -
డోన్, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. -
అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!
అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది. -
ఆరంభమే ఫ్లాప్
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. -
నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. -
జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్