Andhra News: అందుబాటులో జిల్లా కేంద్రం
జిల్లాలోని అన్ని ప్రాంతాలకు మధ్యలో జిల్లా కేంద్రాలు ఉండాలనే ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగానే 3 జిల్లా కేంద్రాల్లో మార్పులు చోటు చేసుకున్నాయని ప్రణాళికశాఖ ముఖ్య కార్యదర్శి జీఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ తెలిపారు. జిల్లా
3 చోట్ల జిల్లా కేంద్రాలను మార్చి ప్రకటించాం
సౌలభ్యం కోసమే ‘ఒక నియోజకవర్గం ఒకే జిల్లాలో’ అనే నిబంధనను సడలించాం
‘ఈనాడు-ఈటీవీ’తో ప్రణాళికశాఖ ముఖ్య కార్యదర్శి జీఎస్ఆర్కేఆర్ విజయ్కుమార్
ఈనాడు, అమరావతి: జిల్లాలోని అన్ని ప్రాంతాలకు మధ్యలో జిల్లా కేంద్రాలు ఉండాలనే ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగానే 3 జిల్లా కేంద్రాల్లో మార్పులు చోటు చేసుకున్నాయని ప్రణాళికశాఖ ముఖ్య కార్యదర్శి జీఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రం ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలనే.. ఒక నియోజకవర్గం పూర్తిగా ఒకే జిల్లాలో ఉంచాలనే నిబంధననూ సడలించామని చెప్పారు. ‘నరసాపురం మూలగా ఉండటంతో మధ్యలో ఉండే భీమవరాన్ని జిల్లా కేంద్రంగా నిర్ణయించాం. రాజంపేట, మదనపల్లె చెరో పక్కగా ఉండటంతో మధ్యలో ఉండే రాయచోటి జిల్లా కేంద్రమైతే అనువుగా ఉంటుందని భావించాం. పుట్టపర్తి అయితే కదిరి, ధర్మవరం, హిందూపురం, పెనుగొండ ప్రాంతాలకు దగ్గరగా ఉంటుందని ఆలోచించాం. అందుకే ఈ 3 చోట్ల జిల్లా కేంద్రాలను మార్చాం’ అని ఆయన వివరించారు. వీటిపై స్పందనలు మిశ్రమంగా ఉండటంతో ప్రకటించిన మేరకే కొనసాగించామని చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆదివారం ఆయన ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు. ‘జిల్లాల పేర్లపైనా చాలా అభ్యంతరాలు వచ్చాయి. వాటిని పరిగణనలోకి తీసుకుంటే తేల్చడం కష్టమనే పక్కన పెట్టాం’ అని పేర్కొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాల్లో సహేతుకమైన వాటిని ప్రభుత్వం ఆమోదించిందని వివరించారు.
లోక్సభ నియోజకవర్గమే ప్రాతిపదికగా అనుకున్నా..
‘లోక్సభ నియోజకవర్గం ప్రాతిపదికగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని, ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని సాధ్యమైనంత వరకు పూర్తిగా ఒకే జిల్లాలో ఉండేలా చూడాలనే ఆలోచన చేశాం. అయితే కొన్ని నియోజకవర్గాలు ఇప్పుడున్న జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉండటం, ఆ నియోజకవర్గాన్ని పక్క జిల్లాలో చేరిస్తే ప్రజలు ఇబ్బంది పడతారని భావించినప్పుడు మినహాయింపులిచ్చాం. బాపట్ల లోక్సభ నియోజకవర్గంలో భాగమైన సంతనూతలపాడును ఒంగోలులో, తిరుపతి లోక్సభ స్థానం పరిధిలోని సర్వేపల్లిని నెల్లూరులో, నంద్యాల లోక్సభలోని పాణ్యం నియోజకవర్గాన్ని కర్నూలులో, హిందూపురం లోక్సభ నియోజకవర్గ పరిధిలోని రాప్తాడును అనంతపురం జిల్లాలో, చిత్తూరు లోక్సభ పరిధిలోని చంద్రగిరిని తిరుపతిలోనే ఉంచుతూ ప్రతిపాదించాం. జనవరి 25న కొత్త జిల్లాల ఏర్పాటుపై ముసాయిదా ప్రకటించి అభ్యంతరాలను ఆహ్వానించగా 16,660 వినతులొచ్చాయి. ఇందులో ప్రధానమైనవిగా 284 గుర్తించాం. వీటిని పరిశీలించిన ప్రభుత్వం.. సహేతుకమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంది. ఒక నియోజకవర్గాన్ని 2 జిల్లాల్లోకి విభజించాల్సి వచ్చినప్పుడు ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని పరిశీలించింది.
సగటున 8 నుంచి 12 మండలాలతో రెవెన్యూ డివిజన్
రెవెన్యూ డివిజన్ అందుబాటులో ఉండాలనేది ప్రభుత్వ నిర్ణయం. ప్రజల నుంచి వచ్చిన వినతుల మేరకు గతంలో ఉన్న 51 రెవెన్యూ డివిజన్లను 62కి పెంచుతూ ప్రతిపాదించాం. చివరకు 72 ఏర్పాటయ్యాయి. కొత్తగా 23 డివిజన్లు వచ్చాయి. సగటున ఒక్కో రెవెన్యూ డివిజన్లో 8 నుంచి 12 మండలాలుంటాయి. ప్రత్యేక పరిస్థితుల్లో కుప్పంలో 4 మండలాలకే డివిజన్ ఏర్పాటు చేశాం. విజయవాడ, విశాఖపట్నం నగర ప్రాంతాలు కావడంతో జనాభా ఎక్కువ, మండలాలు తక్కువ కావడంతో అయిదారు మండలాలను డివిజన్ చేశాం. మండలాల సంఖ్య తగ్గడంతో కొత్తపేట రెవెన్యూ డివిజన్ను తొలగించాం.
వారంలో రెండు రోజులు రంపచోడవరంలోనే..
రంపచోడవరం, ఎటపాక, ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన మండలాలు, మారేడుమిల్లి, దేవీపట్నం 200 కి.మీ.పైనే దూరంలో ఉన్నాయి. ఈ ఇబ్బందిని పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్ వారంలో 2 రోజుల పాటు రంపచోడవరం నుంచే విధులు నిర్వహించేలా ప్రభుత్వం ఉత్తర్వులిస్తోంది. దీంతో జిల్లా యంత్రాంగమంతా రెండు రోజులు అక్కడే అందుబాటులో ఉంటారు’ అని విజయ్ కుమార్ వివరించారు.
12 మంది ఎమ్మెల్యేలకు 2 జిల్లాల్లో ప్రాతినిధ్యం
విజయనగరంలో మెంటాడ, విశాఖపట్నంలో పెందుర్తి, తూర్పుగోదావరి జిల్లాలో పెదపూడి, గోకవరం, తాళ్లరేవు, కాజులూరు, పశ్చిమగోదావరి జిల్లాలో ద్వారకాతిరుమల, నెల్లూరు జిల్లాలో రాపూరు, సైదాపురం, కలువాయి, చిత్తూరు జిల్లాలో పుత్తూరు, వడమాలపేట, కడప జిల్లాలో సిద్దవటం, ఒంటిమిట్ట, కర్నూలు జిల్లాలో పాణ్యం, గడివేముల, అనంతపురం జిల్లాలో రామగిరి, కనగానపల్లె, చెన్నేకొత్తపల్లి మండలాలకు సంబంధించి మార్పులు జరిగాయి. ఈ మండలాలన్నీ ప్రతిపాదించిన జిల్లా నుంచి పక్క జిల్లాకు మార్చుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో 12 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు 2 జిల్లాల్లో ప్రాతినిధ్యం లభించనుంది. సాలూరు, పెందుర్తి, జగ్గంపేట, రామచంద్రపురం, ముమ్మిడివరం, అనపర్తి, గోపాలపురం, వెంకటగిరి, నగరి, పాణ్యం, రాజంపేట, రాప్తాడు ఎమ్మెల్యేలకు ఇలాంటి అవకాశముంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోత కోసేకంటే తొక్కించేయడమే నయం.. ఆవేదనలో వరి రైతులు
కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కాప్తానిపాలేనికి చెందిన కౌలు రైతు యార్లగడ్డ వీరప్రసాద్.. రూ.1.35 లక్షల పెట్టుబడితో ఆరెకరాల్లో వరి నాట్లు వేశారు. -
AP News: వరదలో కొట్టుకుపోయిన ఎడ్లబండి, యజమాని
కృష్ణా నదిలో ఇసుక లోడింగ్ చేస్తుండగా హఠాత్తుగా వరద రావడంతో ఎడ్ల బండి, యజమాని కొట్టుకుపోయారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. -
Anantapuram: మహిళాశక్తి.. బైబిల్ భక్తి!
కలెక్టరేట్లోని వేదికను ఓ మహిళా అధికారి క్రైస్తవ మత ప్రచారానికి వాడుకోవడం వివాదాస్పదమైంది. -
‘ఇవి నగరాలు కావు..’ ప్రత్యక్ష నరకాలు
నగరాలు... మానవ ప్రగతికి చిహ్నాలు. అవి పెట్టుబడులను ఆకర్షిస్తాయి. యువత ఉపాధికి ఊతమిస్తాయి. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి చోదకశక్తిగా పనిచేస్తాయి. -
బాబోయ్ ‘ఖర్సయిపోతాం’!
అధికార వైకాపాలో కొన్ని లోక్సభ స్థానాల టికెట్లకు పెద్దలు అడుగుతున్న ‘పార్టీ ఫండ్’ అంకె విని అభ్యర్థులు గుడ్లు తేలేస్తున్నారు. -
తుపాను ఊడ్చేసింది
మిగ్జాం అపారమైన పంటనష్టాన్ని మిగిల్చింది. శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి జిల్లా వరకు ఎక్కడ చూసినా లక్షల ఎకరాల్లో కోతకొచ్చిన పంటలు నీటమునిగాయి. -
‘ఎన్నికల ముంగిట్లో..’ గ్రూపు-2 ముచ్చట!
ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వం గురువారం గ్రూపు-2 నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ నిర్వహిస్తామని ప్రకటించింది. -
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన నేడు
మిగ్జాం తుపాను ప్రభావంతో తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి శుక్రవారం పర్యటించనున్నారు. -
రాజ్భవన్లో సాయుధ దళాల జెండా దినోత్సవం
-
‘తూర్పు తీరంలో తెలుగు రేఖలు’ పుస్తకావిష్కరణ
ఆస్ట్రేలియా గడ్డపై తెలుగువారి ప్రస్థానానికి ప్రతిబింబమే ‘తూర్పు తీరంలో తెలుగు రేఖలు’ పుస్తకమని రచయిత మల్లికేశ్వరరావు కొంచాడ తెలిపారు. -
ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై రూ.216 కోట్లతో చేపట్టబోతున్న అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. -
గుంతల దారుల్లో కూరుకుపోతున్నా పట్టించుకోరేం?
రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో వాహనదారులు, ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. -
అవే పనులు.. 2 సార్లు శంకుస్థాపనలు
దుర్గగుడిలో అన్నదాన భవనం, కేశఖండనశాల, ప్రసాదం పోటు, కనకదుర్గానగర్ ప్రవేశం వద్ద రాజద్వారంతో పాటు పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ గురువారం శంకుస్థాపన చేశారు. -
హైకోర్టు ముందు జగన్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు
‘ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ ఆదేశాలకు కట్టుబడి ఉన్నాం. ఈ ఏడాది మే 2తో జేపీ సంస్థకు గడువు ముగియడంతో రీచ్ల్లో ఎక్కడా ఇసుక తవ్వడం లేదు. -
‘పదండి దూసుకు..’ పదండి వెనక్కి!
పోలవరం... ఆంధ్రప్రదేశ్కు నిజంగా జలవరం! రాష్ట్రంలోని మూడు ప్రాంతాలనూ సస్యశ్యామలం చేయగల జీవనాడి ఇది. ప్రజలకు జలధారలు అందించే బహుళార్థసాధకం. -
మీ ఓటు నమోదు చేసుకోండిలా..
ఒక్క ఓటు తేడాతో గెలుపోటములు తారుమారు కావచ్చు. అందునా రాబోయేవి రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే అత్యంత కీలకమైన ఎన్నికలు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఓటూ కీలకమే. -
రూ.5 కోట్లతో కడితే.. మరుగుదొడ్ల పక్కన పడేశారు!
విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానానికి కనకదుర్గానగర్ మీదుగా వెళ్లే మార్గంలో భక్తుల రాకపోకలకు వీలుగా గత ప్రభుత్వ హయాంలో రూ.5 కోట్లతో రాతి మండప దారిని నిర్మించారు. -
‘పెట్టింది తినాలి..’ పెట్టకపోతే పస్తులుండాలి!
టోఫెల్ శిక్షణ, ట్యాబ్లూ, స్మార్ట్టీవీలంటూ అరచేతిలో స్వర్గం చూపే జగన్ సర్కారు... ట్రిపుల్ఐటీ విద్యార్థుల కడుపు మాడ్చుతోంది. -
ప్రకాశం బ్యారేజీ 30 గేట్ల ఎత్తివేత
భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరిగింది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి గురువారం ఉదయం సుమారు 30,000 క్యూసెక్కుల మేర వరద వచ్చింది. -
భర్తిపూడిలో ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం
బాపట్ల జిల్లా భర్తిపూడి గ్రామంలో బుధవారం రాత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని వైకాపా సానుభూతిపరులు ధ్వంసం చేశారు. -
కేజీబీవీ కార్యదర్శికి జాతీయ అవార్డు
విద్యారంగంలో ఉత్తమ ఆవిష్కరణలు, అభ్యసన విధానం అమలుకు కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) కార్యదర్శి మధుసూదనరావుకు జాతీయ అవార్డు లభించింది.


తాజా వార్తలు (Latest News)
-
కోత కోసేకంటే తొక్కించేయడమే నయం.. ఆవేదనలో వరి రైతులు
-
AP News: వరదలో కొట్టుకుపోయిన ఎడ్లబండి, యజమాని
-
ISRO: 10 కీలక ప్రయోగాలు చేపట్టనున్న ఇస్రో
-
Khammam: రేవంత్ సీఎం.. ఆర్టీసీ డ్రైవర్ పాదయాత్ర
-
Murder: అతిథులకు ట్రే తగిలిందని వెయిటర్ దారుణ హత్య
-
KCR: మాజీ సీఎం కేసీఆర్కు గాయం.. యశోద ఆస్పత్రిలో చికిత్స