Andhra News: ఒక్క మెగావాట్టూ అదనంగా రాలేదు
2014 జూన్ 2న రాష్ట్ర విభజన సమయంలో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఉండేది. రాష్ట్ర డిమాండుకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి లేక సర్దుబాటు కోసం రోజూ 15 మిలియన్ యూనిట్లు (ఎంయూ) కోతలు పెట్టేవాళ్లు.
2019 తర్వాత ఒక్క ప్రాజెక్టూ ప్రారంభం కాలేదు
2014-19 మధ్య దాదాపుగా 8వేల మెగావాట్లు అందుబాటులోకి..
ఈనాడు - అమరావతి
2014 జూన్ 2న రాష్ట్ర విభజన సమయంలో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఉండేది. రాష్ట్ర డిమాండుకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి లేక సర్దుబాటు కోసం రోజూ 15 మిలియన్ యూనిట్లు (ఎంయూ) కోతలు పెట్టేవాళ్లు. అయిదు నెలల్లో విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా అప్పటి ప్రభుత్వం తీర్చిదిద్దింది. గతంలో తెదేపా హయాంలో 2014 నుంచి 2019 మధ్య 8వేల మెగావాట్ల సౌర, పవన విద్యుత్తు అందుబాటులోకి వచ్చింది. కానీ, వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి ఇప్పటివరకూ కొత్తగా ఒక్క మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో విద్యుత్రంగ పరిస్థితి దిగజారి 2014 ప్రారంభంలో మాదిరే కోతలు విధించే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది.
విభజన నాటికి రాష్ట్ర విద్యుత్ డిమాండు సమారు 139 ఎంయూలుగా ఉంటే.. 124 ఎంయూలే అందుబాటులో ఉండేది. దీంతో అప్పట్లో రోజూ 15 ఎంయూలను లోడ్ రిలీఫ్ పేరిట డిస్కంలు కోత విధించి సర్దుబాటు చేశాయి. అప్పట్లో పునరుత్పాదక విద్యుత్ 3.19 ఎంయూలు మాత్రమే. రాష్ట్ర విభజన నాటికి పునరుత్పాదక ప్రాజెక్టుల నుంచి 500 మెగావాట్లే వచ్చేది. 2015 నుంచి అప్పటి ప్రభుత్వం పవన, సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటును ప్రోత్సహించింది. దీంతో పునరుత్పాదక విద్యుత్ 12.11 ఎంయూలకు పెరిగింది. 2019 నాటికి పవన విద్యుత్ 4,179 మెగావాట్లు, సౌర విద్యుత్ 2,882 మెగావాట్ల ప్రాజెక్టులు రాష్ట్రంలో ఏర్పాటయ్యాయి. వాటి ద్వారా సీజన్లో సుమారు 50-60 ఎంయూల విద్యుత్ వచ్చే అవకాశం ఏర్పడింది. దీనివల్ల రాష్ట్ర విద్యుత్ డిమాండు 191 ఎంయూలకు చేరినా కోతలు విధించాల్సిన అవసరం రాలేదు.
సౌర విద్యుత్తులో ఎదురుదెబ్బలు
ప్రాజెక్టుల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం చేసిన ప్రయత్నాలపైనా భారీ విమర్శలు వచ్చాయి. వ్యసాయానికి ఉచిత విద్యుత్ అందించడానికి 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేకంగా ఏపీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏపీజీఈఎల్) అనే సంస్థను ఏర్పాటుచేసింది. ప్లాంట్ల ఏర్పాటుకు రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 50 వేల ఎకరాలను సంస్థ గుర్తించింది. మొదటి విడతగా 6,400 మెగావాట్ల ప్రాజెక్టు ఏర్పాటుకు 2020 ఆగస్టులో ఏపీజీఈఎల్ టెండర్లను పిలిచింది. సాంకేతిక బిడ్ల పరిశీలన తర్వాత 2021 ఫిబ్రవరి మొదటి వారంలో ప్రైస్ బిడ్లను ఏపీజీఈఎల్ తెరిచింది. ఎన్టీపీసీ 600 మెగావాట్లు, టొరెంటో పవర్స్ లిమిటెడ్, హెచ్ఈఎస్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్లు ఒక్కొక్కటీ 300 మెగావాట్లు.. మిగిలిన 5,200 మెగావాట్లకు అదానీ, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ బిడ్లు దాఖలు చేశాయి. కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ మార్గదర్శకాల మేరకు టెండరు డాక్యుమెంటు లేదని అభ్యంతరం వ్యక్తం చేస్తూ టాటా రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన ధర్మాసనం టెండర్లను నిబంధనల మేరకు నిర్వహించలేదని.. కొందరికి ప్రయోజనం కలిగించే ఉద్దేశం కనిపించిందంటూ ప్రక్రియను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ బిడ్లలో కోట్ చేసిన యూనిట్ ధర రూ.2.49 వరకు ఉంది. ఈ టెండర్ల ఆధారంగా వచ్చిన ధర ప్రకారం 7వేల మెగావాట్ల విద్యుత్ను సరఫరా చేస్తామని 2021 సెప్టెంబరు 15న సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకి) ప్రభుత్వానికి లేఖ రాసింది. 2019లో నిర్వహించిన టెండర్ల ఆధారంగా 7 వేల మెగావాట్లను యూనిట్ రూ.2.49 వంతున (ట్రేడ్ మార్జిన్ కలిపి) ఇవ్వనున్నట్లు లేఖ రాసింది. 2024 సెప్టెంబరులో 3వేలు, 2025లో 3వేలు, 2026లో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఇచ్చేలా సెకి ప్రతిపాదించింది. ప్రస్తుతం మార్కెట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.1.99 ఉంది. మార్కెట్లో సౌర విద్యుత్ ధరలు వేగంగా తగ్గుతుంటే.. ప్రభుత్వం మాత్రం మూడు నుంచి అయిదేళ్లకు ముందే విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో యూనిట్ రూ.2.49 వంతున కొనేందుకు ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించింది. దీనివల్ల పీపీఏ వ్యవధి 25 ఏళ్లలో సుమారు రూ.21,250 కోట్ల భారం రాష్ట్రంపై పడుతుందని అంచనా. 2019 నవంబరులో పిలిచిన బిడ్లలో కోట్ చేసిన ధరల ప్రకారం ఒప్పందం కుదుర్చుకునే ప్రతిపాదనపై భారీగా విమర్శలు వచ్చాయి. రాబోయే రెండేళ్లలో సౌర విద్యుత్ ధరలు భారీగా తగ్గి యూనిట్ రూ.1.50 వరకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
మూడేళ్లలో ఒక్క పీపీఏ లేదు.. ఉన్నవాటినీ ఇబ్బంది పెట్టారు
వైకాపా అధికారం చేపట్టిన తర్వాత మూడేళ్లలో ఒక్క సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకూ ఒప్పందం కుదుర్చుకోలేదు. పైపెచ్చు తెదేపా హయాంలో ఏర్పాటైన పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో కుదుర్చుకున్న 264 పీపీఏల యూనిట్ ధర ఎక్కువని.. వాటిని సమీక్షిస్తామని ప్రకటించి వివాదాన్ని రేపింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సరికాదని కేంద్రం హెచ్చరించినా పట్టించుకోలేదు. పీపీఏలపై సమీక్షకు ఉన్నతస్థాయి మంత్రుల కమిటీ ఏర్పాటు చేసింది. ఈ విషయమై కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ జోక్యం చేసుకుని పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. ఈ వివాదంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో అదనంగా ఒక్క మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులూ రాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ