Andhra News: ముడితేనే మ్యుటేషన్!
మండల తహసీల్దార్ కార్యాలయాలు భూముల మ్యుటేషన్ దరఖాస్తులను అడ్డగోలుగా తిరస్కరిస్తున్నాయి. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టకుండానే.. అదనపు సమాచారం కావాలంటూ దరఖాస్తులను పక్కన
దరఖాస్తుల్లో 45 శాతం వరకు తిరస్కృతి
సాంకేతిక అంశాలు కొన్ని.. కుంటి సాకులు మరికొన్ని
లంచాలే అసలు కారణం!
ఈనాడు - అమరావతి
మండల తహసీల్దార్ కార్యాలయాలు భూముల మ్యుటేషన్ దరఖాస్తులను అడ్డగోలుగా తిరస్కరిస్తున్నాయి. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టకుండానే.. అదనపు సమాచారం కావాలంటూ దరఖాస్తులను పక్కన పెట్టేస్తున్నాయి. రైతులు ఫీజు కట్టి.. సమర్పించే దరఖాస్తుల్లో 45 శాతం వరకు చిన్నచిన్న కారణాలతోనే తిరస్కృతి జాబితాలోకి చేరుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇది పరిస్థితి తీవ్రతను స్పష్టంచేస్తోంది. నిబంధనల ప్రకారం నెలరోజుల్లో మ్యుటేషన్ పూర్తి చేసేందుకు ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు ఒక కారణమైతే.. అడిగినంత మామూళ్లు ఇవ్వకుంటే కొన్ని మండలాల్లో దరఖాస్తులను పరిశీలించడంలేదన్న విమర్శలు ఉన్నాయి. కిందటేడాది పూర్వ విశాఖ జిల్లాలో చోడవరం తహసీల్దార్ రూ. 4.5 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. రెవెన్యూ శాఖలో నమోదయ్యే అవినీతి కేసుల్లో ఇవే ఎక్కువగా ఉంటున్నాయి. దాదాపు ప్రతి జిల్లాలో మ్యుటేషన్ కోసం వసూళ్లు జరుగుతుండగా కొన్నిసార్లు రెడ్హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కుతున్నారు.
మ్యుటేషన్ జరిగితేనే..
క్రయ, విక్రయాలు పూర్తయ్యాక కొత్త యజమాని పేరు రికార్డుల్లో చేర్చడమే మ్యుటేషన్ అంటే. పేరు మార్పు జరిగాక వచ్చే యాజమాన్య హక్కులతో బ్యాంకుల నుంచి రుణాలు, ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. రెవెన్యూ శాఖలో వీఆర్వోల నుంచి తహసీల్దార్ల వరకు కొందరు దీనిని అవకాశంగా తీసుకుని పేట్రేగిపోతున్నారు. ముఖ్యంగా రైతు భరోసా పథకం వచ్చిన తర్వాత మ్యుటేషన్కు డిమాండ్ పెరిగింది. మండల స్థాయిలో నెలకు కనీసం 200 నుంచి 500 దరఖాస్తులు వస్తుంటాయి.
నగరాలు/పట్టణాలకు సమీపంలోని మండలాల్లో అయితే నెలకు 1,000 వరకు ఉంటాయి. దరఖాస్తు అందిన రెండు వారాలకు వివరాలను సంబంధిత గ్రామంలో బహిర్గతం చేయాలి. అభ్యంతరాలు రాకుంటే.. వెబ్ల్యాండ్లో పేరు మార్చి, పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు చేయాలి. అలాగే వారసత్వంగా వచ్చిన భూములపై కుటుంబ సభ్యులందరూ భాగస్వామ్య పత్రాలు రాసుకుని.. వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకుని వస్తే, వాటిపై హక్కుల బదలాయింపు నెలరోజుల్లోగా పూర్తి కావాలి. కొంతమంది రెవెన్యూ ఉద్యోగులు చిన్న చిన్న కారణాలను సాకుగా చూపుతూ దరఖాస్తుల్ని తిరస్కరిస్తున్నారు. భూమి కొలతల్లో తేడాలు ఉన్నాయని, సబ్ డివిజన్ కాలేదనే కారణాలతో దరఖాస్తులను పక్కన పెడుతున్నారు. కుటుంబ సభ్యుల నుంచి దరఖాస్తులు వస్తే ఫ్యామిలీ సర్టిఫికేట్, ఇతరత్రా వివరాలు కావాలంటున్నారు. గత రెండు సంవత్సరాల్లో నెల్లూరు జిల్లాలోని ఓ మండలంలో 60 శాతం తిరస్కారానికి గురయ్యాయి. ఆన్లైన్లో ఉన్న దాని కంటే తక్కువగా విస్తీర్ణం ఉండడం వల్ల కొన్ని పక్కన పడుతున్నాయి. ఒక సర్వే నంబరులో కొంత భాగానికి ఎవరైనా వన్టైం కన్వర్షన్ కింద దరఖాస్తు చేసుకున్నా మిగిలిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవడంలేదు. అయితే కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేయడం వల్ల కూడా మ్యుటేషన్లు ఆగిపోతున్నాయని, లింక్ డాక్యుమెంట్లు లేకున్నా.. దరఖాస్తుదారులు సమర్పించిన ఆధారాలు సహేతుకంగా లేకున్నా.. తిరస్కరించక తప్పడంలేదని సిబ్బంది చెబుతున్నారు.
25 శాతం తిరస్కృతి
దరఖాస్తులు పరిశీలించాలి
అదనంగా విస్తీర్ణం కోసం క్లెయిమ్ చేశారనో, సబ్ డివిజన్ అవసరమన్న కారణాలతోనో కొన్నిచోట్ల మ్యుటేషన్లు దరఖాస్తులు తిరస్కరించకూడదని భూ పరిపాలన శాఖ స్పష్టంచేసింది. ఈ మేరకు జిల్లాలకు సూచనలు పంపింది. ఒకవేళ అదనంగా సర్వే అవసరమైతే.. మ్యుటేషన్ గడువులోగా సర్వే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. దరఖాస్తులు తిరస్కరిస్తే.. అందుకు దారితీసిన కారణాలు, స్పీకింగ్ ఉత్తర్వులను దరఖాస్తుదారులకు కచ్చితంగా తెలియచేయాలని తెలిపింది. కుటుంబ వివాదం కారణాలతో దరఖాస్తులను తిరస్కరించకుండా పూర్తిస్థాయిలో విచారణ జరిపాకే కేసు ముగించాలని పేర్కొంది. కోర్టు కేసుల విషయంలో స్పష్టమైన ఆదేశాలు లేనట్లయితే.. ఏ కేసునూ తిరస్కరించకూడదు/పెండింగులో ఉంచకూడదని ఆదేశించింది. అసైన్డ్ భూముల విషయంలో, అసలైన వారసులు మాత్రమే మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. మూడో పార్టీ చేయకూడదు. అసైనీ మరణించినట్లయితే.. రికార్డుల్లో మార్పులు చేసేందుకు అసైన్మెంట్ రివ్యూ కమిటీ అనుమతి అవసరం తెలిపింది. యాదృచ్ఛికంగా తిరస్కరించిన దరఖాస్తుల్లో 25% కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి పరిశీలించాలని తెలిపింది.
కిందటేడాది రెవెన్యూ శాఖలో నమోదైన 36 అవినీతి కేసుల్లో మ్యుటేషన్కు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. ఈ శాఖలో భూ సంబంధిత పనులకు లంచాల బెడద ఎక్కువగా ఉంది. ఆన్లైన్లో వివరాల నమోదు, పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు, మ్యుటేషన్, భూముల సర్వే, ఇతర పనులకు భారీస్థాయిలో వసూళ్లు జరుగుతున్నాయి. ఒకవేళ దరఖాస్తుదారు మ్యుటేషన్కు అర్హుడు కాదనుకుంటే దానిని నిర్ధారించాల్సిన బాధ్యత తహసీల్దార్లపైనే ఉంది. అయితే... పదేపదే ఇంకా ఆధారాలు కావాలంటూ దరఖాస్తుదారులను రెవెన్యూ సిబ్బంది ముప్పతిప్పలు పెడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
-
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!