Andhra News: బొగ్గు లేదు.. డబ్బుల్లేవు!
వేసవిలో తలెత్తే అదనపు విద్యుత్ డిమాండ్ సర్దుబాటుకు సరైన ప్రణాళిక లేకపోవడం.. ముందుచూపు కొరవడటంతో పరిశ్రమలు, ప్రజలు విద్యుత్ కోతలతో అల్లాడిపోతున్నారు. థర్మల్ విద్యుత్ ప్లాంట్లు పూర్తి సామర్థ్యంతో ....
థర్మల్ కేంద్రాల్లో ఉత్పత్తి కష్టాలు
కొనుగోలుకు నిధుల సంకటం
దశాబ్ద కాలం తర్వాత పరిశ్రమలకు పవర్ హాలిడే
ముందుచూపు లేకే కరెంట్ ఇక్కట్లు
విద్యుత్ డిమాండ్ అంచనాల్లో 22శాతం (55 మిలియన్ యూనిట్లు) ఎక్స్ఛేంజీల నుంచి కొనాల్సి వస్తోంది. దీనికోసం ఉత్పత్తి సంస్థలతో స్వల్పకాలిక పీపీఏలు కుదుర్చుకున్నా ప్రస్తుత పరిస్థితి తలెత్తేది కాదని నిపుణులు పేర్కొంటున్నారు.
తెలంగాణలో గ్రిడ్ డిమాండ్ (14,582 మెగావాట్లు) ఉన్నా కోతలు లేకుండా సరఫరా చేస్తున్నప్పుడు.. రాష్ట్రంలో 11,500 మెగావాట్ల విద్యుత్ను సరఫరా చేయడం ఎందుకు సాధ్యంకావటం లేదనేది అంతుబట్టని ప్రశ్న.
ఈనాడు, అమరావతి: వేసవిలో తలెత్తే అదనపు విద్యుత్ డిమాండ్ సర్దుబాటుకు సరైన ప్రణాళిక లేకపోవడం.. ముందుచూపు కొరవడటంతో పరిశ్రమలు, ప్రజలు విద్యుత్ కోతలతో అల్లాడిపోతున్నారు. థర్మల్ విద్యుత్ ప్లాంట్లు పూర్తి సామర్థ్యంతో పనిచేయడానికి బొగ్గు లేదు. బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనడానికి డబ్బులు లేవు. వెరసి సుమారు దశాబ్ద కాలం తర్వాత పరిశ్రమలకు విద్యుత్ విరామాన్ని(పవర్ హాలిడే) ప్రకటించాల్సి వచ్చింది. జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలు పూర్తి ప్లాంటు లోడ్ ఫ్యాక్టర్తో (పీఎల్ఎఫ్) పనిచేసినా సమస్య ఉండేది కాదు. నిర్మాణం పూర్తయిన కృష్ణపట్నం 800 మెగావాట్ల ప్లాంటు నుంచి ఉత్పత్తి తీసుకున్నా ఇబ్బంది తలెత్తేది కాదు. ఈ రెండు విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే కోతలు విధించే పరిస్థితి వచ్చేది కాదని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో రాష్ట్ర విద్యుత్ డిమాండ్.. వినియోగానికి మధ్య ఉన్న 1000 మెగావాట్ల కొరతను అధిగమించడం డిస్కంలకు సాధ్యంకావటం లేదు.
ప్రణాళికా లోపం.. సుస్పష్టం
జెన్కో, హిందూజా థర్మల్ విద్యుత్ కేంద్రాల ఉత్పాదక సామర్థ్యం 6,050 మెగావాట్లుగా కాగా.. వాటి నుంచి ఉత్పత్తి 3,750 మెగావాట్లు దాటడం లేదు. వాటిని 85-90 పీఎల్ఎఫ్తో నిర్వహిస్తే 5,445 మెగావాట్ల ఉత్పత్తికి అవకాశం ఉంది. కానీ థర్మల్ ప్లాంట్లను పూర్తి పీఎల్ఎఫ్తో పని చేయించడానికి బొగ్గు నిల్వలు లేక 60శాతం లోడ్లో నిర్వహించాల్సి వస్తోంది. వీటీపీఎస్, ఆర్టీపీపీ, కృష్ణపట్నం దగ్గర సుమారు 1.93 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. పూర్తి పీఎల్ఎఫ్ వచ్చేలా ఉత్పత్తిలో ఉంచితే తర్వాత రోజు బొగ్గు అందకుంటే షట్డౌన్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల మరింతగా నష్టపోవాల్సి ఉంటుందన్న ఉద్దేశంతో బ్యాక్డౌన్లో నిర్వహించాల్సి వస్తోంది. దీనికి అధికారుల నిర్లక్ష్యమే కారణం.
కృష్ణపట్నంలో రెండు థర్మల్ యూనిట్ల నుంచి 1,600 మెగావాట్ల ఉత్పత్తి రావాలి. కానీ, 800-850 మెగావాట్లకు మించడం లేదు. ఈ ప్లాంటును 30శాతం విదేశీ బొగ్గు, 70శాతం దేశీయ బొగ్గును కలిపి వినియోగించేలా రూపొందించారు. మూడేళ్లుగా విదేశీ బొగ్గును సమకూర్చడంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో స్థానికంగా అందుబాటులో ఉన్న బొగ్గునే వాడటం వల్ల ఉత్పత్తి సగానికి పడిపోయింది. మూడో యూనిట్ను పూర్తిగా దేశీయంగా లభించే బొగ్గు వినియోగించేలా రూపొందించారు. ఇది 2019 ఆఖరుకు అందుబాటులోకి వస్తుందని అంచనా వేశారు. కానీ కొవిడ్, ఇతర కారణాల వల్ల నిర్మాణంలో జాప్యం జరిగింది. చివరకు గత ఏడాది జులై-ఆగస్టు నాటికే నిర్మాణం పూర్తయినా కమర్షియల్ ఆపరేషన్ డేట్(సీవోడీ)కు డిస్కంలు అనుమతించడం లేదు. దీని నుంచి వచ్చే విద్యుత్ను యూనిట్కు రూ.4.50 వంతున కొనాల్సి వస్తుందని.. మార్కెట్లో యూనిట్ రూ.3.50కే దొరుకుతుందని చెబుతూ పీపీఏకు నిరాకరిస్తున్నాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ నుంచి యూనిట్కు సగటున రూ.8.11 వంతున విద్యుత్ కొంటున్నాయి.
వైన్ షాపులు సర్కారుకు..
విద్యుత్తు ప్లాంట్లు ప్రైవేటుకా!
కృష్ణపట్నం ప్లాంటుకు అవసరమైన బొగ్గు నిల్వలను సమకూర్చడం ప్రభుత్వానికి చేతకాకపోగా.. ప్లాంట్ల నిర్వహణను ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు దేశంలోనే అత్యంత పీఎల్ఎఫ్తో థర్మల్ ప్లాంట్లను నిర్వహించిన చరిత్ర ఏపీ జెన్కోది. వీటీపీఎస్, కేటీపీఎస్ (కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం), ఆర్టీపీపీతో పాటు పలు ప్లాంట్ల నుంచి పూర్తి సామర్థ్యంతో విద్యుదుత్పత్తి జెన్కో తీసుకొచ్చింది. అలాంటి జెన్కో పరిధిలోని కృష్ణపట్నం (ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మూడు ప్లాంట్లు కలిపి 2,400 మెగావాట్లు) నిర్వహణను 25 ఏళ్ల పాటు ప్రైవేటుకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవైపు కార్పొరేషన్గా ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవడంతో పాటు.. ప్రైవేటు లైసెన్సీల చేతుల్లో ఉన్న మద్యం దుకాణాలను ప్రభుత్వమే సొంతంగా నిర్వహించడానికి లాక్కుంది. రాష్ట్ర విద్యుత్ రంగానికి గుండెలాంటి కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని మాత్రం ఎంతో అనుభవం ఉన్న జెన్కో చేతుల్లోంచి తీసుకెళ్లి ప్రైవేటుకు అప్పగించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ నిర్ణయంపై విమర్శలు వ్యక్తం అవుతున్నా ప్రభుత్వం మాత్రం ముందుకు వెళ్లే ప్రయత్నాల్లో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!