Andhra News: మందుల్లేవాయే!
ప్రభుత్వాస్పత్రికి మరోపేరు.. ధర్మాసుపత్రి. అంటే వైద్యపరీక్షల నుంచి చికిత్సలు, మందులు అన్నీ ఉచితంగానే ఇస్తారు. అందుకే ప్రైవేటు ఆస్పత్రులలో ఖర్చు భరించలేని పేదలు ప్రభుత్వాస్పత్రి వైపే చూస్తారు. కానీ, రాష్ట్రంలో పరిస్థితి భిన్నంగా ఉంది.
ప్రభుత్వాస్పత్రుల్లో కరవైన మందులు, సర్జికల్స్
గ్లౌజులు, దూదీ కరవే.. యూరిన్ బ్యాగులకూ కటకట
5 మాత్రలు రాస్తే ఇచ్చేది మూడే.. బయట కొనాలని సూచనలు
గుత్తేదారులకు కోట్లలో బిల్లుల పెండింగ్తోనే సమస్య
‘ఈనాడు’ పరిశీలనలో వెల్లడి
ఈనాడు-అమరావతి, ఈనాడు యంత్రాంగం
ప్రభుత్వాస్పత్రికి మరోపేరు.. ధర్మాసుపత్రి. అంటే వైద్యపరీక్షల నుంచి చికిత్సలు, మందులు అన్నీ ఉచితంగానే ఇస్తారు. అందుకే ప్రైవేటు ఆస్పత్రులలో ఖర్చు భరించలేని పేదలు ప్రభుత్వాస్పత్రి వైపే చూస్తారు. కానీ, రాష్ట్రంలో పరిస్థితి భిన్నంగా ఉంది. వైద్యులు రోగులను చూస్తున్నారు గానీ... మందుల విషయంలో చేతులెత్తేస్తున్నారు. బీపీ, షుగర్ మాత్రల నుంచి శస్త్రచికిత్సలో వాడే గ్లౌజులు, దారాల వరకూ అన్నింటినీ రోగుల బంధువులే కొనుక్కుని తెచ్చుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం చేసే ప్రకటనలకు.. క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన ఉండట్లేదు. రాష్ట్రంలోని పలు బోధన, జిల్లా ప్రభుత్వాస్పత్రులను ‘ఈనాడు’ ప్రతినిధులు ప్రత్యక్షంగా పరిశీలించినప్పుడు ఈ లోపాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. నెలకు లేదా.. కనీసం 15 రోజులకు సరిపడా ఇవ్వాల్సిన బీపీ, షుగర్ మాత్రలు కూడా అయిదు రోజులకు సరిపోయేవే ఇస్తున్నారు. విజయవాడ జీజీహెచ్లో ఈ విషయాన్ని బోర్డు పెట్టి మరీ చెబుతున్నారు.
బయట మందులు కొనే ఖర్చుకంటే ఆస్పత్రికి వచ్చేందుకు అయ్యే ఖర్చే ఎక్కువ కావడంతో రోగులు రావడానికి వెనకాడుతున్నారని ఓ సీనియర్ వైద్యుడు వ్యాఖ్యానించారు. మరోవైపు.. చాలా ఆస్పత్రుల్లో మందులు, సర్జికల్స్కు అయ్యిన బిల్లులు పెద్దమొత్తంలో గుత్తేదారులకు పెండింగ్ ఉండటంతో ఇక తాము సరఫరా చేయలేమని వాళ్లు తెగేసి చెబుతున్నారు. గుండె, ఎముకల శస్త్రచికిత్సలు చేయించుకున్నవారికీ స్టాక్ లేదంటూ 15 రోజులకే ఇస్తున్నారు. ఆస్పత్రుల్లో దూదికి కూడా కొరతగానే ఉంటోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం జిల్లా ఆస్పత్రిలోని ఈఎన్టీ విభాగంలో చెవిలో వేసే డ్రాప్స్ కూడా లేవని సిబ్బంది రోగులకు చెబుతున్నారు. ఇక్కడ ఏడాదికి రూ.2కోట్ల మందులు అవసరం కాగా.. రూ.కోటి విలువైన మందుల సరఫరా జరుగుతోంది. ఏలూరు జిల్లా ఆస్పత్రిలో కిడ్నీ, కార్డియాలజీ, న్యూరాలజీ వైద్యం కోసం వినియోగించే పలురకాల మందులు, యాంటీ బయాటిక్స్, మానసిక దౌర్బల్యానికి వాడే మందులు, కాల్షియం మాత్రలు, కొన్ని ఆయింట్మెంట్లు, సెలైన్లు, సర్జికల్స్, దూది, బ్యాండేజీలు, ఐవీ సెట్లు, కుట్లు వేసే సామగ్రి అందుబాటులో లేవు. కర్నూలులోని సర్వజన వైద్యశాలలో కార్డియాలజీలో అత్యవసర మందులు లేక, బయట కొనాలని రోగులకు రాసిస్తున్నారు. ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేయించుకుంటున్న రోగులు సైతం మందులు, ఆప్రాన్, గ్లౌజులు బయట కొంటున్నారు.
మంత్రి రజని వచ్చి వెళ్లినా... పురోగతి అంతంత మాత్రమే
గుంటూరు జీజీహెచ్లో ఇంజెక్షన్లు చేసే సిరంజీలు, పడకపై ఉండి, మరుగుదొడ్డికి వెళ్లలేని వారికి ఉపయోగించే ఐసీడీ ట్యూబ్స్, టీపీసెస్లు లేవు. శస్త్రచికిత్స థియేటర్లలో రక్తం కింద పడకుండా ఉపయోగించే సామగ్రి, కుట్లువేసే సామగ్రి, ఇతర అవసరాలకు వినియోగించే చిన్నచిన్న వస్తువులు లేవు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని వచ్చి వెళ్లినా.. వీటి విషయంలో పురోగతి అంతంత మాత్రంగానే ఉంది. దీనిపై జీజీహెచ్ సూపరింటెండెంట్ ఆచార్య ప్రభావతి మాట్లాడుతూ సర్జికల్స్, కుట్ల సామగ్రి కొంత కొరతగా ఉన్నా వాటిని ఆస్పత్రి ద్వారానే కొని అందిస్తున్నామని తెలిపారు.
సరఫరా ఆగినందునే రాస్తున్నాం
- సూరిబాబు, గిద్దలూరు వైద్యుడు
యర్రగొండపాలెంలోని ఆస్పత్రిలో గ్లౌజులు, కుట్లు వేసే దారానికి తీవ్ర కొరత ఉండటంతో ఆ భారమంతా రోగులపైనే పడుతోంది. గిద్దలూరు ప్రాంతీయ వైద్యశాలలో సర్జికల్ వస్తువుల కొరతపై ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ సూరిబాబు స్పందిస్తూ ‘గతంలో ప్రాంతీయ వైద్యశాలలో ఉన్న పీపీ యూనిట్ను సంజీవరాయునిపేటకు తరలించారు. దాంతో జిల్లా వైద్యశాఖ నుంచి సర్జికల్ సామగ్రి నిలిచిపోయింది. ఫలితంగా రోగులకు రాస్తున్నాం. సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాం’ అని తెలిపారు.
సెలైన్లకూ కొరతే!
విశాఖ కేజీహెచ్లో నెలకు 30వేల వరకు సెలైన్ బాటిల్స్ వినియోగం ఉంటుంది. కొన్ని ఇంజెక్షన్ల వినియోగం వేలల్లో ఉండగా సీడీఎస్ నుంచి తక్కువగా వస్తున్నాయి. నెలకు పాన్టాప్, ఒమిప్రజోల్ వంటివి 2లక్షల మాత్రల వరకు అవసరం కాగా పంపిణీ బాగా తగ్గింది. మందుల కొరత లేదని కేజీహెచ్ పర్యవేక్షణాధికారి మైథిలి పేర్కొన్నారు. ప్రభుత్వ ఈఎన్టీ ఆస్పత్రిలో చెవిలో దురద సమస్యను తగ్గించే క్లోట్రిన్, తల తిరిగే సమస్యకు వెర్టిన్ మందులు నెల రోజుల నుంచి అందుబాటులో లేవు.
వంద రకాల మందుల్లేవు
కాకినాడ జీజీహెచ్లో మందులు, సర్జికల్స్కు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకూ నిధులు కేటాయించలేదు. అత్యవసర నిధుల కింద మందులకు రూ.49లక్షలు, సర్జికల్స్కు రూ.40లక్షలు కేటాయించినా ఉపయోగం లేదు. ఆప్రాన్లు, సక్షన్ కెథటర్లు, యూరినరీ కెథటర్లు, ఐవీ ప్లూయిడ్లు, పలు రకాల యాంటీబయోటిక్స్ లేవు. జీజీహెచ్లో 300-450 రకాల మందులు ఉండాలి. ప్రస్తుతం 100 రకాల మందులు లేవు. రాజమహేంద్రవరం జిల్లా ఆస్పత్రిలో పలు కీలక యాంటీబయోటిక్స్, కాల్షియం, గ్యాస్ట్రిక్, బీపీ, మధుమేహ మందుల కొరత ఉంది. ఇన్పేషెంట్లకు యూరిన్ బ్యాగ్, కాన్యులాలను రోగులే తెచ్చుకోవాల్సి వస్తోంది. సీడీఎస్ నుంచి 60% మందులు రావడం లేదు. మండపేట సీహెచ్సీలో 6 నెలలుగా యాంటీబయోటిక్స్ లేవు.
* ఇతర మందులు వినియోగించేటప్పుడు కడుపులో మంట రాకుండా ముందుజాగ్రత్తగా పాన్టాప్ వాడతారు. నెల్లూరు బోధనాసుపత్రిలో ఈ మాత్రలకు కొరత ఉండటంపై రోగులు ఆవేదన చెందుతున్నారు. మల్టీ విటమిన్, జింక్ సిరప్, పాన్టాప్, ర్యానిటిడిన్, గ్లైమ్ప్రైడ్ (మధుమేహం), బి-కాంప్లెక్స్, సిప్రోఫ్లాక్సాసిన్, యాంబ్రాక్సాల్ సిరప్లు లేవు.
* విజయనగరం కేంద్రాస్పత్రిలో ఎముకలు విరిగితే కట్లు కట్టడానికి వినియోగించే పీవోపీ (ప్లాస్టర్ ఆఫ్ పారిస్) లేదు. అత్యవసర మందుల కింద బయట కొంటున్నారు. ఘోషాస్పత్రిలోనూ ఇదే పరిస్థితి. అక్కడ రోజుకు రూ.10 వేలు ఆస్పత్రి అభివృద్ధి నిధులను మందుల కోసం వెచ్చిస్తున్నారు.
గుత్తేదారులకు నిలిచిన చెల్లింపులు
బోధనాస్పత్రుల్లో మందులు సరఫరా చేసిన గుత్తేదారులకు భారీగా బకాయిలున్నాయి. విశాఖ కేజీహెచ్లో దాదాపు రూ.కోటి వరకు బిల్లులు చెల్లించాలి. కర్నూలు జీజీహెచ్లో రూ.90లక్షల వరకు బిల్లులు పెండింగ్లోఉన్నాయి. గుంటూరు జీజీహెచ్కు గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఔషధాలకు రూ.9.85 కోట్లు రాగా అందులో 9.38 కోట్లను వినియోగించారు. సీడీఎస్లో లేని మందులు, సర్జికల్స్ను ప్రైవేటు దుకాణాల నుంచి సమకూర్చుకోగా వాటికి బిల్లు బకాయిలు రూ.3కోట్లకు పేరుకుపోయాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు సుమారు రూ.5 కోట్లు నిలిచిపోయాయి.
గ్లౌజు, కుట్టుదారం తెచ్చుకోమన్నారు
నా భార్యను కుటుంబనియంత్రణ శస్త్రచికిత్స కోసం గిద్దలూరు ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకొచ్చా. శస్త్రచికిత్సకు అవసరమైన గ్లౌజు, కుట్టువేసే దారం, ఇతరాలు కొని తేవాలని వైద్యులు రాసిచ్చారు. వీటిని కొని తెచ్చాను.
- బొల్లెబోయిన ప్రసాద్, రాజుపాలెం, గిద్దలూరు, ప్రకాశం జిల్లా
ఈ చిత్రంలోని కర్నూలుకు చెందిన మధుకుమార్ ఐదురోజుల కిందట రోడ్డు ప్రమాదంలో గాయపడగా కర్నూలు సర్వజన వైద్యశాలకు తీసుకొచ్చారు. పక్కటెముకలకు శస్త్రచికిత్స చేశారు. ఆస్పత్రిలో గ్లూకోజ్ తప్ప ఎలాంటి మందులూ ఇవ్వలేదు. మోనోసెఫ్, పాన్టాప్, లివిపిల్ వంటి పలు రకాల ఇంజెక్షన్లన్నీ బయటకు రాశారు. మధుకుమార్ ఆరోగ్యశ్రీ కింద చేరినా, ఆస్పత్రి నుంచి మందులు అందలేదు. బాధితుడి తల్లి సుమారు రూ.8వేలకు పైగా వెచ్చించి బయట కొనాల్సి వచ్చింది. ‘వైద్యులు చూసి వెళ్తున్నారు, మేమిచ్చిన ఇంజెక్షన్లు ఇస్తున్నారు. అంతకుమించి మందులేవీ ఆస్పత్రి వాళ్లు ఇవ్వలేదు’ అని బాధితుడి తల్లి విలపించింది.
ఆస్పత్రికి వచ్చేందుకు అయ్యే ఖర్చే ఎక్కువ
కొన్నేళ్లుగా మధుమేహం, రక్తపోటుతో బాధపడుతున్నా. గతంలో 15 రోజులకు సరిపడా మందులు ఇచ్చేవాళ్లు. ప్రస్తుతం ఐదు రోజులకు తగ్గించారు. బయట కొనలేక, భారమైనా సిటీబస్సులో జీజీహెచ్కు వస్తున్నా. ఎండల వల్ల రావడం మరింత ఇబ్బందిగా ఉంది.
- శివానందనరావు, మధురానగర్, విజయవాడ
ఛాతీనొప్పి రావడంతో ఏప్రిల్ 20న రాజమహేంద్రవరం జిల్లా ఆస్పత్రిలో 4రోజులు చికిత్స పొందాను. డిశ్ఛార్జి సమయంలో ఆరు రకాల మాత్రలు రాస్తే మూడే ఇచ్చారు. మిగిలిన వాటిని నేనే కొనుక్కోవాల్సి వచ్చింది.
- శేషారత్నం, బుచ్చింపేట, కోరుకొండ మండలం, తూర్పుగోదావరి జిల్లా
కొన్ని మందులు కావాలని చెప్పాం
‘ఆస్పత్రికి అవసరమైన అన్ని రకాల మందులనూ ఎప్పటికప్పుడు తెప్పిస్తూనే ఉన్నాం. ఇండెంట్ ప్రకారం మందులు వస్తున్నాయి. కిడ్నీ, థలసేమియా లాంటి వ్యాధులకు సంబంధించిన మందులు కావాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం’
- సౌభాగ్యలక్ష్మి, విజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమనాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM