AP CPS: సీఎంది విశ్వాసఘాతుకం
ముఖ్యమంత్రి విశ్వాస ఘాతుకానికి సీపీఎస్ ఉద్యోగులు బలయ్యారని ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీసీపీఎస్ఈఏ) నేతలు ధ్వజమెత్తారు.
సీపీఎస్ ఉద్యోగుల ఆగ్రహం
Cఏపీసీపీఎస్ఈఏ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి విశ్వాస ఘాతుకానికి సీపీఎస్ ఉద్యోగులు బలయ్యారని ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీసీపీఎస్ఈఏ) నేతలు ధ్వజమెత్తారు. ఉద్యోగుల సమాచారం, బడ్జెట్ లెక్కలపై ఏనాడూ శ్వేతపత్రం విడుదల చేయని రాష్ట్ర ప్రభుత్వం.. సీపీఎస్ ఉద్యోగుల లెక్కలపై మాత్రం కోట్లాది రూపాయల్ని ఖర్చు పెట్టి పత్రికా ప్రకటనలిస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తోందని విమర్శించారు. సీపీఎస్ రద్దుపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆదివారం ఏపీసీపీఎస్ఈఏ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. మానవ హారాలు, విశ్వాస ఘాతుక సభలు, భిక్షాటన వంటి వినూత్న కార్యక్రమాలతో ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఓటుకు విలువ లేకుండా చేస్తున్న వారికి బుద్ధినివ్వండని జాతి నేతల విగ్రహాల వద్ద వినతి పత్రాలు ఉంచారు. పాత పింఛను విధానాన్ని వెంటనే అమలు చేయకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
* ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బాపట్ల, కర్నూలులో మహాత్మాగాంధీ విగ్రహానికి, గుంటూరు, రాజమహేంద్రవరంలో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రాలు ఇచ్చారు. నెల్లూరు, నంద్యాలలో దీక్ష చేపట్టారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట మోకాళ్లపై నిలబడి నిరసన చేశారు.అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో నిరాహార దీక్ష చేపట్టారు. విశాఖపట్నంలో చేపట్టిన నిరసన దీక్షల్లో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అప్పలరాజు పాల్గొన్నారు.
జీపీఎస్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం: ఏపీటీఎఫ్
ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్ విధానం, పాత పింఛను పథకానికి ఎంతమాత్రం ప్రత్యామ్నాయం కాదని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, కె.కులశేఖర్రెడ్డి పేర్కొన్నారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర ఫెడరేషన్ పిలుపు మేరకు ఆదివారం రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టారు.
చెప్పులతో కొట్టుకుని..
విజయనగరం కలెక్టరేట్, న్యూస్టుడే: సీపీఎస్ విషయంలో సీఎం మాట తప్పారని విజయనగరం కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు, ఉపాధ్యాయులు చెప్పులతో కొట్టుకుని, మెడలో చెప్పుల దండలు వేసుకుని గుండ్లు గీయించుకున్నారు. ఏపీసీపీఎస్ఈఏ ఆధ్వర్యంలో ‘విశ్వాస ఘాతుకం’ పేరిట ఈ వినూత్న నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.శివకుమార్, కె.ధనుంజయ్ మాట్లాడుతూ.. రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత తెస్తానని, విశ్వాసఘాతుకానికి పాల్పడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
* నిరసనలో విజయనగరానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు సుబ్బారావు మాట్లాడుతూ.. 90ఏళ్ల తనకు రూ.40వేల పింఛను వస్తోందని.. ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం చేసిన తన కుమార్తె సీపీఎస్ ఉద్యోగి కావడంవల్ల ఆమెకు రూ.900 మాత్రమే వస్తోందని వివరించారు. ఇలాగైతే ఎలా బతుకుతారని ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబోస్కు గురజాడ విశిష్ట పురస్కారం
గురజాడ రచనల్లో వాడుక భాష ఎంతో గొప్పదని, అదే తనకు నచ్చిన అంశమని ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ అన్నారు. -
‘ఎంఎస్ఎంఈ ఏపీ వన్’ పేరుతో కొత్త సర్వే
ఆర్భాటం.. ప్రచారం అనేది జగన్ ప్రభుత్వానికే సాధ్యమైన విద్యలు. చిన్న పరిశ్రమల కష్టాలను తామే తీర్చేస్తున్నంతగా మాటలు చెబుతూ.. ఉత్త చేయి అందించడం ప్రభుత్వానికే చెల్లింది. -
దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు హుష్కాకి
విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలో దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు మాయమయ్యాయి. -
Cyclone Michaung: ముంచుకొస్తున్న తుపాను
నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిగ్జాం తుపాను మంగళవారం తీవ్ర తుపానుగా బలపడనుంది. -
తమిళనాడు వాసులకు తాడికొండలో ఓట్లు
తమిళనాడు వాసులకు తాడికొండలో ఓట్లు.. కాకినాడ, తిరుపతి చిరునామాలతో రాజంపేట జాబితాలో చోటు.. అసలు ఎవరో తెలియనివారి పేరిట వందలాది ఓట్లు.. ఒకే డోర్నంబరుతో పదులకొద్దీ బోగస్ ఓట్లు.. రాష్ట్ర ఓటర్ల జాబితా పరిశీలిస్తున్నా కొద్దీ ఇలా లెక్కలేనన్ని అక్రమాలు, అవకతవకలు బయటపడుతూనే ఉన్నాయి. -
సాగర్ వద్ద సాధారణ పరిస్థితులు
నాగార్జునసాగర్ జలాశయం వద్ద పరిస్థితులు యథాస్థితికి వచ్చాయి. నవంబరు 29కి ముందునాటి వాతావరణం నెలకొంది. -
ఆర్అండ్బీని భయపెడుతున్న తుపాను
రాష్ట్రాన్ని వణికిస్తున్న తుపాను.. రహదారులు భవనాలశాఖ ఇంజినీర్లను కూడా భయపెడుతోంది. తుపాను తీవ్రతతో రహదారులు దెబ్బతింటే చేతులెత్తేయాల్సిన దుస్థితిలో ఇంజినీర్లు ఉన్నారు. -
కళ్ల ముందు 1977 నాటి పీడకల!
మిగ్జాం తీవ్ర తుపాను కృష్ణా జిల్లా దివిసీమ దగ్గరలో తీరం దాటనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీని కేంద్ర స్థానం నుంచి 200 కి.మీ. మేర ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
కేసీఆర్ కన్నా జగన్ చిత్తుగా ఓడిపోతారు
మూడు రాజధానులంటూ అమరావతిని అరణ్యంలా మారుస్తున్న సీఎం జగన్.. భారాస అధినేత కేసీఆర్ కన్నా చిత్తుగా ఓడిపోతారని రాజధాని రైతులు ధ్వజమెత్తారు. -
మేము రాము బిడ్డో జగనన్న కాలనీకి..!
నంద్యాల జిల్లా డోన్ సమీపంలోని దొరపల్లె గుట్ట వద్ద ఉన్న జగనన్న కాలనీలోకి ఇంటి నిర్మాణ సామగ్రిని తీసుకెళ్లలేకపోతున్నామని ఆటో డ్రైవర్లు తెగేసి చెప్పేస్తున్నారు. -
కల్లాల్లో ధాన్యం.. కళ్లల్లో దైన్యం..
తుపాను హెచ్చరికలతో రైతులకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. ఏ క్షణంలో గాలులు వీచి చేతికొచ్చిన పంట నేలవాలుతుందోనని ఆందోళన చెందుతున్నారు. -
తిరుమలలో ఘనంగా కార్తిక స్నపన తిరుమంజనం
పవిత్ర కార్తిక మాసంలో నిర్వహించే కార్తిక వనభోజన మహోత్సవంలో భాగంగా ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం అత్యంత వైభవంగా జరిగింది. -
ఇలా ఇచ్చారు.. అలా చక్రం ఊడింది!
బ్యాటరీ ట్రై సైకిళ్లకు చక్రాలు సరిగ్గా బిగించకుండానే పంపిణీ చేయడంతో వైయస్ఆర్ జిల్లా మైదుకూరులో ప్రమాదవశాత్తు ఓ దివ్యాంగుడు కింద పడ్డారు. -
కుప్పం ఓటరు జాబితా సవరణలో విచిత్ర దరఖాస్తు
చిత్తూరు జిల్లా కుప్పంలోని ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో విచిత్ర పరిస్థితి నెలకొంది. పురపాలికలోని 173వ పోలింగ్ బూత్ పరిధిలో.. మరణించిన మహిళ ఓటును తొలగించాలని మృతి చెందిన ఇంకో మహిళ పేరుతో ఫారం-7 దాఖలు అయింది. -
రచయితలపై సామాజిక బాధ్యత
కవులు, రచయితలు, కథకులపై సామాజిక బాధ్యత ఉందని కవి కె.శివారెడ్డి పేర్కొన్నారు. -
ఎయిర్ ఇండియా విమానం రద్దు
తుపాను కారణంగా విమాన ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. న్యూదిల్లీ నుంచి హైదరాబాదు మీదుగా తిరుపతి జిల్లా రేణిగుంటకు ప్రతిరోజూ రాకపోకలు సాగించే ఎయిర్ ఇండియా విమానాన్ని ఆదివారం రద్దు చేశారు. -
అమర్యాదగా మాట్లాడటం సరికాదు
విశాఖ జిల్లా పద్మనాభం మండలం ఎంపీడీఓపై భీమిలి వైకాపా ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అమర్యాదగా మాట్లాడటం సరికాదని ఏపీ పంచాయతీరాజ్ అధికారుల సంఘం మండిపడింది. -
బకాయిల తుది గడువుపై ఏం చేద్దాం?
ప్రభుత్వ బకాయిలను రాబట్టుకునేందుకు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) సోమవారం మరోసారి భేటీ కానుంది. -
ఉద్యోగుల్ని వేధిస్తే తెలంగాణ ఫలితాలే
ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని వేధిస్తే తెలంగాణలో బీఆర్ఎస్కు ఎదురైన ఫలితాలే ఏపీలోనూ పునరావృతమవుతాయని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం హెచ్చరించింది. -
ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోగా అభిషిక్త్ కిశోర్ నియామకం
ఆర్థికశాఖ డిప్యూటీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఎమ్.అభిషిక్త్ కిశోర్ను ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ సీఈవోగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. -
ఇదీ సంగతి!


తాజా వార్తలు (Latest News)
-
Nalgonda: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం.. వ్యక్తి సజీవదహనం
-
Madhya Pradesh: మామా.. మజాకా!: కమలం గెలుపులో చౌహాన్ కీలక పాత్ర
-
Cyclone Michaung: తుపాను ప్రభావం తగ్గేవరకు అప్రమత్తంగా ఉండాలి: నెల్లూరు కలెక్టర్ ఆదేశాలు
-
Telangana Elections: చిన్న పార్టీలు.. జయాపజయాలపై పెద్ద ప్రభావం
-
Hyderabad: వారికి మస్త్ మెజారిటీ.. వీరికి బొటాబొటీ
-
Janasena: డిపాజిట్ కోల్పోయిన జనసేన అభ్యర్థులు