AP DGP: ఏకపక్ష ధోరణి లేకుండా చూస్తా
పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించే ధోరణి లేకుండా చూస్తానని నూతన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి చెప్పారు. వివాదాలకు తావివ్వకుండా పోలీసు వ్యవస్థను నిర్దిష్ట పద్ధతిలో తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.
వివాదాలకు తావివ్వకుండా పోలీసు వ్యవస్థను నిర్దిష్ట పద్ధతిలో తీసుకెళ్తా
కొత్త డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి
ఈనాడు, అమరావతి: పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించే ధోరణి లేకుండా చూస్తానని నూతన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి చెప్పారు. వివాదాలకు తావివ్వకుండా పోలీసు వ్యవస్థను నిర్దిష్ట పద్ధతిలో తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తనపై విశ్వాసంతో చాలా పెద్ద బాధ్యత అప్పగించారన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు ప్రతిష్ఠ, గౌరవం పెంచేలా వ్యవహరిస్తానని పేర్కొన్నారు. విధి నిర్వహణలో తప్పులు జరిగినప్పుడు, నిరాధార ఆరోపణలకు గురైనప్పుడు సిబ్బందికి బాసటగా ఉంటానని ప్రకటించారు.
ప్రవర్తన నియమావళి ఉల్లంఘించే వారిపై మాత్రం కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రజా సహకారం పొందేలా డీఐజీలు, ఎస్పీలు.. క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు, సిబ్బందికి మార్గనిర్దేశం చేయాలన్నారు. రాష్ట్ర డీజీపీగా శనివారం బాధ్యతలు స్వీకరించిన రాజేంద్రనాథరెడ్డి మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పోలీసు యూనిట్ల స్వరూపం, సిబ్బంది విభజన తదితర అంశాలపై పోలీసు ఉన్నతాధికారులతో కమిటీ వేశామని, ప్రస్తుతం అధ్యయనం జరుగుతోందని చెప్పారు. ఉగాదికి ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయాల్సి ఉన్నందున ఈ అంశాలకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. కొత్త పోలీసు కమిషనరేట్ల ఏర్పాటు అంశం చర్చల్లో ఉందని, దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.
ప్రభుత్వ సంస్థలపై దాడులు సహించం
‘ఇటీవల కొన్నిచోట్ల ప్రభుత్వ సంస్థలపై దాడులు చోటుచేసుకున్నాయి. అలాంటి ఘటనల్లో బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తా. మతపరమైన చిన్నచిన్న వివాదాలు తలెత్తితే స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో వాటిని పరిష్కరించాలి. పోలీసు శాఖను ప్రక్షాళించాల్సిన అవసరం ఉంటే చేస్తా. వీవీఐపీలు, వీఐపీల కార్యక్రమాల్లో భద్రతాపరమైన ఆంక్షల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రముఖుల భద్రతకూ సమస్య తలెత్తకుండా ఎలా వ్యవహరించాలో అధ్యయనానికి కమిటీ వేశాం. ముఖ్యమైన నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తా. మహిళలు, చిన్నారులు, అణగారిన వర్గాలపై జరిగే నేరాల విషయంలో పోలీసులు సత్వరం స్పందించాలి. ఎర్రచందనం అక్రమ రవాణా, గంజాయి సాగు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తాం. గిరిజనులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లిస్తాం. మావోయిస్టుల సమస్యను ఎలా ఎదుర్కోవాలో ఏపీ పోలీసుకు బాగా తెలుసు’ అని అన్నారు.
అప్పగించిన బాధ్యతలు నెరవేర్చా: గౌతమ్ సవాంగ్
పోలీసుశాఖ గతంలో ఎన్నడూ చూడని సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చిందని, అలాంటి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అప్పగించిన బాధ్యతల మేరకు పనిచేశానని పదవీ విరమణ చేసిన డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. కొత్త డీజీపీకి బాధ్యతలు అప్పగించిన అనంతరం సవాంగ్ దంపతుల్ని పోలీసు అధికారులు, సిబ్బంది పూలతో అలంకరించిన వాహనంలో ఎక్కించి, మంగళగిరి బెటాలియన్లో పరేడ్ నిర్వహించి గౌరవ వీడ్కోలు పలికారు. సవాంగ్ మాట్లాడుతూ ‘రెండేళ్ల ఎనిమిది నెలలపాటు నన్ను డీజీపీగా కొనసాగించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. ఈ సమయంలో పోలీసు శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాను. నా హయాంలో 7,552 ఎకరాల్లో గంజాయి పంట ధ్వంసం చేశాం. కొత్త డీజీపీ రాజేంద్రనాథరెడ్డి పోలీసు వ్యవస్థను ఉన్నత శిఖరాలపై నిలబెడతారని ఆశిస్తున్నా’ అని అన్నారు.
ఆ ప్రశ్నకు నవ్వే సమాధానం
‘ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఆత్మగౌరవాన్ని కాపాడేలా, రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా వ్యవహరిస్తారా?’ అని ఓ విలేకరి ప్రశ్నించగా డీజీపీ పెద్దగా నవ్వారు.
విలేకరి: ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ప్రతిష్ఠకు గత రెండున్నరేళ్లలో తీవ్ర విఘాతం కలిగింది. దాన్ని ఎలా అధిగమిస్తారు?
డీజీపీ: మీ మాటలతో నేను ఏకీభవించట్లేదు. ఎక్కడ సమస్య వచ్చినా సత్వరమే స్పందించాం. అవసరమైనచోట పరిస్థితులు చక్కదిద్దుతాం.
పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఆ పరిస్థితిని ఎలా మారుస్తారు?
అలాంటి ధోరణి లేకుండా చూస్తాం. వివాదాలకు తావివ్వం.
ప్రభుత్వ విధానాల్ని విమర్శించినా, లోపాలు ఎత్తిచూపినా వారి భావప్రకటన స్వేచ్ఛ హరించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దానికి మీరు అడ్డుకట్ట వేస్తారా?
అలాంటి పరిస్థితి తలెత్తకుండా చూస్తాం.
కొన్నిచోట్ల పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్నారు?
అలా దురుద్దేశపూర్వకంగా ఎవరైనా తప్పు చేస్తే చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనే కాదు.. మంత్రులు వచ్చినా అంతే!
ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకే కాదు.. మంత్రుల ర్యాలీలప్పుడు కూడా పచ్చని చెట్లని కొట్టేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్లోని తారకరామనగర్కు వెళ్లే దారిలో మంత్రి బుగ్గన నామినేషన్ దాఖలు ర్యాలీకి చెట్లు అడ్డొస్తున్నాయని వాటి కొమ్మలు నరికేశారు. -
వేలకొద్దీ మద్యం సీసాలు.. వైకాపా నాయకులకు ఎక్కడివి?
మారు సుధాకర్రెడ్డి.. వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. -
ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే
సీఎం జగన్ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. -
గులకరాయి కేసు నిందితుడి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. టెన్త్లో 509 మార్కులు
కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
హతవిధీ.. గిరిబాలుడి ప్రాణాలు ఆవిరి!
‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్ పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. -
ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు. -
నా.. నా.. నా.. అని బాకా.. చేసిందంతా ధోకా
మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్పై స్పష్టతనివ్వాలి
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వీఆర్వోల సంఘం సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. -
విద్య కమిషనరేట్లోకి ఆదర్శ పాఠశాలల టీచర్ల విలీనం
ఆదర్శ పాఠశాలల్లోని రెగ్యులర్ బోధన సిబ్బందిని.. పాఠశాల విద్య కమిషనరేట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గతనెల 15న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఇచ్చిన జీవోకు ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసింది. -
పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్ల నియంత్రణకు పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు. -
వాలంటీర్ల రాజీనామాలనుఅంగీకరించకుండా ఈసీని ఆదేశించండి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసేవరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్, గ్రామ సచివాలయాలశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ. -
యాక్సిస్తో పీపీఏల ప్రతిపాదన తిరస్కరణ
యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మోకాలడ్డింది. -
‘పది’లో బీసీ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ
పదో తరగతి పరీక్షల్లో మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల పాఠశాలల విద్యార్థులు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాలయాల కార్యదర్శి సోమవారం ప్రకటించారు. -
వెలంపల్లి సారూ.. ఈ భాగ్యవతి గుర్తుందా?
వృద్ధాప్యం, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వచ్చు. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గత అయిదేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
కరవు సీమలో ‘అవినీతి’ సిరి!
రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. -
50,000 → 10,117 → 3,350
‘‘మాట తప్పను.. మడమ తిప్పను. చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’ ‘మీట’ల మాస్టర్ జగన్ ‘బ్రాండ్’ మాటలు ఇవి. కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్..! -
వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల దాష్టీకాలు.. దేశం దృష్టికి తెచ్చేందుకు బొటన వేలు నరుక్కున్న మహిళ
మాజీ హోంమంత్రి, వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. -
‘ప్రోగ్రెస్ కాదు..’ అంతా బోగస్!
పరీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి.
తాజా వార్తలు (Latest News)
-
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..