AP Liquor: మద్యంలో విషం
రాష్ట్రంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్ముతున్న కొన్ని బ్రాండ్లలో అత్యంత ప్రమాదకరమైన పైరోగలాల్, ఐసోఫులెరిక్ యాసిడ్, డైఇథైల్ థాలేట్ వంటి విష రసాయనాలు ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారణైందని తెదేపా వెల్లడించింది.
3 రకాల బ్రాండ్లలో విషపూరిత, హానికరమైన రసాయనాలు
ఆంధ్రాగోల్డ్, 9 సీహార్స్, సిల్వర్ స్ట్రైప్స్స్ విస్కీ నమూనాల్ని పరీక్షిస్తే వెల్లడైంది
ఈ మద్యం వల్ల భావితరాల్లో జన్యుపరమైన సమస్యలు.. అనేక అనారోగ్యాలు
తెదేపా నాయకులు పంచుమర్తి అనూరాధ, ఆనం వెంకటరమణారెడ్డి, వరుణ్
ప్రైవేటు ల్యాబ్లలో పరీక్షించిన నమూనాల నివేదికలు విడుదల
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్ముతున్న కొన్ని బ్రాండ్లలో అత్యంత ప్రమాదకరమైన పైరోగలాల్, ఐసోఫులెరిక్ యాసిడ్, డైఇథైల్ థాలేట్ వంటి విష రసాయనాలు ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారణైందని తెదేపా వెల్లడించింది. ఈ మద్యం తాగినవారు మతిభ్రమించి భ్రాంతిలో ఉంటారని, నరాలన్నీ లాగేస్తున్నట్లు, మెదడులోనూ, ఒళ్లంతా ఎవరో సూదులతో గుచ్చుతున్నట్లు ఉంటుందని తెలిపింది. నాడీవ్యవస్థ పనితీరు పెరిగిపోవటం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు, శరీరం మెలికలు తిరగడం, మూర్ఛ వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని పేర్కొంది.
భావి తరాల్లో జన్యుపరమైన సమస్యలకు కారణమై వైకల్యం, అంధత్వం వంటివాటికి దారితీసే ప్రమాదం ఉందని ఆరోపించింది. ఫలితంగా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అంగవైకల్య ప్రదేశ్గా మారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్ముతున్న వివిధ రకాల బ్రాండ్ల మద్యాన్ని ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ తదితర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి ఆ నమూనాల్ని చెన్నైలోని ఎస్జీఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రయోగశాలలో పరీక్ష చేయించింది. ఆ ప్రయోగ ఫలితాలు, నివేదికల్ని శనివారం మీడియాకు విడుదల చేసింది. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనూరాధ, అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి, రసాయన నిపుణుడు, తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్ కలిసి విలేకరులతో మాట్లాడారు.
తాగితే చనిపోతారని తెలిసే వ్యాపారం
- పంచుమర్తి అనూరాధ
అత్యంత విషపూరితమైన రసాయనాలు కలిగిన ఈ మద్యాన్ని తాగితే ప్రజలు భయంకరమైన వ్యాధులతో చనిపోతారని తెలిసి కూడా ప్రభుత్వానికి ఏమీ పట్టట్లేదు. ప్రజల చావులతో సీఎం జగన్ వ్యాపారం చేస్తున్నారు. కల్తీ మద్యంతో వ్యాపారం చేస్తున్న ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో తప్ప ఎక్కడా చూడలేదు. ఈ విష రసాయనాలతో కూడిన మద్యం పురుషులు తాగటం వల్ల మహిళల తాళిబొట్లు తెగిపోతున్నాయి. కన్న కుమార్తెపై తండ్రి అత్యాచారానికి తెగబడటం, 60-70 ఏళ్ల వృద్ధుడు చిన్నారులపై బలాత్కారాలు చేయటం వంటి నేరాలకు ఈ విష రసాయనాలు కలిగిన బ్రాండ్లు తాగటమే కారణమవుతోంది. అయినా సరే ఐఏఎస్ అధికారులు ఈ ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తున్నారు.
రజత్ భార్గవా... ఇప్పుడే ఏమంటారు
- వరుణ్
ఏపీ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్ముతున్న బ్రాండ్లలో విష రసాయనాలు ఉన్నాయని గతంలోనే మేం బయటపెట్టాం. అప్పట్లో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్భార్గవ విలేకరులతో మాట్లాడుతూ.. అసలు ఆ నమూనాలు ఆంధ్రప్రదేశ్లో నుంచి సేకరించినవేనని ఎలా చెబుతారు? కొన్న తర్వాత వాటిలో ఏమైనా కలిపి ఉండొచ్చు కదా? అని ప్రశ్నించారు. అందుకే గుత్తి, చిలకలూరిపేట, అనపర్తి సహా రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని దుకాణాల నుంచి ర్యాండమ్గా కొనుగోలు చేసి నమూనాలు సేకరించాం. జియోట్యాగింగ్ కూడా చేశాం. (ఆయా ప్రాంతాల్లోని దుకాణాల నుంచి మద్యం కొనుగోలు చేసిన వీడియోలు ప్రదర్శించారు). వాటిని మేము ల్యాబ్లో పరీక్షిస్తే.. ప్రాణహాని కలిగించే విష రసాయనాలు ఉన్నట్లు తేలింది. గత రెండేళ్లలో అనేక మంది కొవిడ్ బారిన పడ్డారు. వైరస్ వల్ల వారి ఊపిరితిత్తులు ఇప్పటికే బలహీనపడ్డాయి. రోగనిరోధక శక్తి తగ్గింది. ఇలాంటి సందర్భాల్లో ఈ ప్రమాదకర రసాయనాలు కలిగిన మద్యం తాగితే అది మరింత ప్రాణాంతకం అవుతుంది. మా పరీక్షల్లో తేలిన అంశాలు నిజం కాదని ప్రభుత్వం భావిస్తే.. ఆ బ్రాండ్లు సురక్షితమేనని వచ్చి ప్రకటించాలి. ప్రజల్లో ఉన్న సందేహాలు నివృత్తి చేయాలి.
త్వరలో జగనన్న సారాయి యాప్
- ఆనం వెంకటరమణారెడ్డి
రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో లభిస్తున్న బ్రాండ్లన్నీ జగన్రెడ్డి, ఆయన బంధువులు, వారి పెట్టుబడిదారులు తయారు చేయిస్తున్నవే. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో ఉన్న రెగ్యులర్ బ్రాండ్లు ఇక్కడ ఎందుకు అమ్మట్లేదో జగన్ సమాధానం చెప్పాలి. త్వరలో జగనన్న సారాయి యాప్ను కూడా తీసుకొస్తారనుకుంటా. జనం సారా తాగకపోతే అందులో అప్లోడ్ చేయాలని వాలంటీర్లకు నిబంధన పెట్టినా పెడతారు. అక్రమ మద్యం అమ్ముకునేందుకే ప్రభుత్వ దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు పెట్టట్లేదు.
పరీక్షించిన బ్రాండు-1: ఆంధ్రా గోల్డ్ విస్కీ
కనుగొన్న విష రసాయనాలు: పైరోగలాల్, ఐసోఫులెరిక్ యాసిడ్
తాగితే వచ్చే పరిణామాలు: దగ్గు, గొంతునొప్పి, చర్మం కందిపోవటం, కళ్లు ఎర్రబడటం, వాంతులు, అతిసారం, శ్వాసక్రియ ఒక్కసారిగా పెరిగిపోవటం, రక్తపోటు తగ్గిపోవటం, నాడీ వ్యవస్థ పనితీరు ఒక్కసారిగా వేగవంతమవ్వటం, తలతిరగటం, తలనొప్పి, కడుపునొప్పి, వాంతులు, మానసిక గందరగోళం, శరీరం మెలికలు తిరగటం, మూర్ఛపోవటం లాంటి సమస్యలు వస్తాయి.
పరీక్షించిన బ్రాండు-2: సిల్వర్ స్ట్రైప్స్స్ విస్కీ
కనుగొన్న విష రసాయనాలు: పైరోగలాల్, ఐసోఫులెరిక్ యాసిడ్, డై ఇథైల్ థాలేట్
తాగితే వచ్చే పరిణామాలు: చేతులు, అరికాళ్ల కింద సూదులతో గుచ్చినట్లు ఉండటం, జన్యుపరమైన సమస్యలు, కళ్ల మంటలు, చర్మంపై దురద, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, కాలేయ సంబంధిత వ్యాధులు, దగ్గు, గొంతునొప్పి, చర్మం, కళ్లు ఎర్రబడటం, వాంతులు, అతిసారం వంటి సమస్యలు వస్తాయి.
పరీక్షించిన బ్రాండు-3: 9 సీహార్స్ విస్కీ
కనుగొన్న విష రసాయనాలు: పైరోగలాల్, ఐసోఫులెరిక్ యాసిడ్, డై ఇథైల్ థాలేట్
తాగితే వచ్చే పరిణామాలు: శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, కాలేయ సంబంధిత వ్యాధులు, కళ్ల మంటలు, చర్మంపై దురద, దగ్గు, గొంతునొప్పి, చర్మం, కళ్లు ఎర్రబడటం, వాంతులు, అతిసారం వంటివి
వెలుగుచూసిన విష రసాయనాలు..
పైరోగలాల్: ఇది విషపూరితం. దీన్ని తాగటం, పీల్చటం అత్యంత ప్రమాదకరం. జన్యుపరమైన సమస్యలకు కారణమవుతుంది.
డై ఇథైల్ థాలేట్: ఈ రసాయనం కలిగిన మద్యం తాగితే తిమ్మిరి ఎక్కుతుంది. ఒళ్లంతా సూదులతో గుచ్చినట్లు ఉంటుంది.
ఐసోఫులెరిక్ యాసిడ్: ఈ రసాయనాన్ని పరిశోధనల్లోనే ఉపయోగిస్తారు. మనుషులు, జంతువుల వైద్య అవసరాలకూ ఉపయోగించకూడదు. ఇది శ్వాసపరమైన ఇబ్బందులకు కారణమవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు -
అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలొద్దు
స్కిల్ కేసులో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది.