AP Liquor: మద్యంలో విషం
రాష్ట్రంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్ముతున్న కొన్ని బ్రాండ్లలో అత్యంత ప్రమాదకరమైన పైరోగలాల్, ఐసోఫులెరిక్ యాసిడ్, డైఇథైల్ థాలేట్ వంటి విష రసాయనాలు ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారణైందని తెదేపా వెల్లడించింది.
3 రకాల బ్రాండ్లలో విషపూరిత, హానికరమైన రసాయనాలు
ఆంధ్రాగోల్డ్, 9 సీహార్స్, సిల్వర్ స్ట్రైప్స్స్ విస్కీ నమూనాల్ని పరీక్షిస్తే వెల్లడైంది
ఈ మద్యం వల్ల భావితరాల్లో జన్యుపరమైన సమస్యలు.. అనేక అనారోగ్యాలు
తెదేపా నాయకులు పంచుమర్తి అనూరాధ, ఆనం వెంకటరమణారెడ్డి, వరుణ్
ప్రైవేటు ల్యాబ్లలో పరీక్షించిన నమూనాల నివేదికలు విడుదల
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్ముతున్న కొన్ని బ్రాండ్లలో అత్యంత ప్రమాదకరమైన పైరోగలాల్, ఐసోఫులెరిక్ యాసిడ్, డైఇథైల్ థాలేట్ వంటి విష రసాయనాలు ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారణైందని తెదేపా వెల్లడించింది. ఈ మద్యం తాగినవారు మతిభ్రమించి భ్రాంతిలో ఉంటారని, నరాలన్నీ లాగేస్తున్నట్లు, మెదడులోనూ, ఒళ్లంతా ఎవరో సూదులతో గుచ్చుతున్నట్లు ఉంటుందని తెలిపింది. నాడీవ్యవస్థ పనితీరు పెరిగిపోవటం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు, శరీరం మెలికలు తిరగడం, మూర్ఛ వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని పేర్కొంది.
భావి తరాల్లో జన్యుపరమైన సమస్యలకు కారణమై వైకల్యం, అంధత్వం వంటివాటికి దారితీసే ప్రమాదం ఉందని ఆరోపించింది. ఫలితంగా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అంగవైకల్య ప్రదేశ్గా మారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్ముతున్న వివిధ రకాల బ్రాండ్ల మద్యాన్ని ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ తదితర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి ఆ నమూనాల్ని చెన్నైలోని ఎస్జీఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రయోగశాలలో పరీక్ష చేయించింది. ఆ ప్రయోగ ఫలితాలు, నివేదికల్ని శనివారం మీడియాకు విడుదల చేసింది. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనూరాధ, అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి, రసాయన నిపుణుడు, తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్ కలిసి విలేకరులతో మాట్లాడారు.
తాగితే చనిపోతారని తెలిసే వ్యాపారం
- పంచుమర్తి అనూరాధ
అత్యంత విషపూరితమైన రసాయనాలు కలిగిన ఈ మద్యాన్ని తాగితే ప్రజలు భయంకరమైన వ్యాధులతో చనిపోతారని తెలిసి కూడా ప్రభుత్వానికి ఏమీ పట్టట్లేదు. ప్రజల చావులతో సీఎం జగన్ వ్యాపారం చేస్తున్నారు. కల్తీ మద్యంతో వ్యాపారం చేస్తున్న ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో తప్ప ఎక్కడా చూడలేదు. ఈ విష రసాయనాలతో కూడిన మద్యం పురుషులు తాగటం వల్ల మహిళల తాళిబొట్లు తెగిపోతున్నాయి. కన్న కుమార్తెపై తండ్రి అత్యాచారానికి తెగబడటం, 60-70 ఏళ్ల వృద్ధుడు చిన్నారులపై బలాత్కారాలు చేయటం వంటి నేరాలకు ఈ విష రసాయనాలు కలిగిన బ్రాండ్లు తాగటమే కారణమవుతోంది. అయినా సరే ఐఏఎస్ అధికారులు ఈ ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తున్నారు.
రజత్ భార్గవా... ఇప్పుడే ఏమంటారు
- వరుణ్
ఏపీ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్ముతున్న బ్రాండ్లలో విష రసాయనాలు ఉన్నాయని గతంలోనే మేం బయటపెట్టాం. అప్పట్లో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్భార్గవ విలేకరులతో మాట్లాడుతూ.. అసలు ఆ నమూనాలు ఆంధ్రప్రదేశ్లో నుంచి సేకరించినవేనని ఎలా చెబుతారు? కొన్న తర్వాత వాటిలో ఏమైనా కలిపి ఉండొచ్చు కదా? అని ప్రశ్నించారు. అందుకే గుత్తి, చిలకలూరిపేట, అనపర్తి సహా రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని దుకాణాల నుంచి ర్యాండమ్గా కొనుగోలు చేసి నమూనాలు సేకరించాం. జియోట్యాగింగ్ కూడా చేశాం. (ఆయా ప్రాంతాల్లోని దుకాణాల నుంచి మద్యం కొనుగోలు చేసిన వీడియోలు ప్రదర్శించారు). వాటిని మేము ల్యాబ్లో పరీక్షిస్తే.. ప్రాణహాని కలిగించే విష రసాయనాలు ఉన్నట్లు తేలింది. గత రెండేళ్లలో అనేక మంది కొవిడ్ బారిన పడ్డారు. వైరస్ వల్ల వారి ఊపిరితిత్తులు ఇప్పటికే బలహీనపడ్డాయి. రోగనిరోధక శక్తి తగ్గింది. ఇలాంటి సందర్భాల్లో ఈ ప్రమాదకర రసాయనాలు కలిగిన మద్యం తాగితే అది మరింత ప్రాణాంతకం అవుతుంది. మా పరీక్షల్లో తేలిన అంశాలు నిజం కాదని ప్రభుత్వం భావిస్తే.. ఆ బ్రాండ్లు సురక్షితమేనని వచ్చి ప్రకటించాలి. ప్రజల్లో ఉన్న సందేహాలు నివృత్తి చేయాలి.
త్వరలో జగనన్న సారాయి యాప్
- ఆనం వెంకటరమణారెడ్డి
రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో లభిస్తున్న బ్రాండ్లన్నీ జగన్రెడ్డి, ఆయన బంధువులు, వారి పెట్టుబడిదారులు తయారు చేయిస్తున్నవే. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో ఉన్న రెగ్యులర్ బ్రాండ్లు ఇక్కడ ఎందుకు అమ్మట్లేదో జగన్ సమాధానం చెప్పాలి. త్వరలో జగనన్న సారాయి యాప్ను కూడా తీసుకొస్తారనుకుంటా. జనం సారా తాగకపోతే అందులో అప్లోడ్ చేయాలని వాలంటీర్లకు నిబంధన పెట్టినా పెడతారు. అక్రమ మద్యం అమ్ముకునేందుకే ప్రభుత్వ దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు పెట్టట్లేదు.
పరీక్షించిన బ్రాండు-1: ఆంధ్రా గోల్డ్ విస్కీ
కనుగొన్న విష రసాయనాలు: పైరోగలాల్, ఐసోఫులెరిక్ యాసిడ్
తాగితే వచ్చే పరిణామాలు: దగ్గు, గొంతునొప్పి, చర్మం కందిపోవటం, కళ్లు ఎర్రబడటం, వాంతులు, అతిసారం, శ్వాసక్రియ ఒక్కసారిగా పెరిగిపోవటం, రక్తపోటు తగ్గిపోవటం, నాడీ వ్యవస్థ పనితీరు ఒక్కసారిగా వేగవంతమవ్వటం, తలతిరగటం, తలనొప్పి, కడుపునొప్పి, వాంతులు, మానసిక గందరగోళం, శరీరం మెలికలు తిరగటం, మూర్ఛపోవటం లాంటి సమస్యలు వస్తాయి.
పరీక్షించిన బ్రాండు-2: సిల్వర్ స్ట్రైప్స్స్ విస్కీ
కనుగొన్న విష రసాయనాలు: పైరోగలాల్, ఐసోఫులెరిక్ యాసిడ్, డై ఇథైల్ థాలేట్
తాగితే వచ్చే పరిణామాలు: చేతులు, అరికాళ్ల కింద సూదులతో గుచ్చినట్లు ఉండటం, జన్యుపరమైన సమస్యలు, కళ్ల మంటలు, చర్మంపై దురద, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, కాలేయ సంబంధిత వ్యాధులు, దగ్గు, గొంతునొప్పి, చర్మం, కళ్లు ఎర్రబడటం, వాంతులు, అతిసారం వంటి సమస్యలు వస్తాయి.
పరీక్షించిన బ్రాండు-3: 9 సీహార్స్ విస్కీ
కనుగొన్న విష రసాయనాలు: పైరోగలాల్, ఐసోఫులెరిక్ యాసిడ్, డై ఇథైల్ థాలేట్
తాగితే వచ్చే పరిణామాలు: శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, కాలేయ సంబంధిత వ్యాధులు, కళ్ల మంటలు, చర్మంపై దురద, దగ్గు, గొంతునొప్పి, చర్మం, కళ్లు ఎర్రబడటం, వాంతులు, అతిసారం వంటివి
వెలుగుచూసిన విష రసాయనాలు..
పైరోగలాల్: ఇది విషపూరితం. దీన్ని తాగటం, పీల్చటం అత్యంత ప్రమాదకరం. జన్యుపరమైన సమస్యలకు కారణమవుతుంది.
డై ఇథైల్ థాలేట్: ఈ రసాయనం కలిగిన మద్యం తాగితే తిమ్మిరి ఎక్కుతుంది. ఒళ్లంతా సూదులతో గుచ్చినట్లు ఉంటుంది.
ఐసోఫులెరిక్ యాసిడ్: ఈ రసాయనాన్ని పరిశోధనల్లోనే ఉపయోగిస్తారు. మనుషులు, జంతువుల వైద్య అవసరాలకూ ఉపయోగించకూడదు. ఇది శ్వాసపరమైన ఇబ్బందులకు కారణమవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ
పల్లెపల్లె తిరిగినాదో అమ్మా భువనమ్మ- ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ జనం గుండెల్లో కొలువైనాది.. కష్టాలు కన్నీళ్లు తుడిపేసింది. -
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం
అధికార పార్టీ నేతల ఫొటోలు, హోర్డింగులు తొలగించడంలో చర్యలు తీసుకోని అధికారులు.. నిరుపేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్కు మాత్రం నిబంధనలు వర్తిస్తాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
ఉత్తర కోస్తాలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?
తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో తోపులాటలు చోటుచేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి అంతరాయం ఏర్పడిన ఘటనపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. -
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. -
బోరు వేసుకుంటారా.. రూ. 10 వేలు కట్టండి
తిరుపతిలోని అధికార పార్టీ కార్పొరేటర్ల అసలు రంగును బయటపెడుతూ సోమవారం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఐదేళ్లూ షాక్.. ఎన్నికలని బ్రేక్!
పాదయాత్ర పేరిట ఊరూవాడా తిరిగిన జగన్... విద్యుత్ ఛార్జీలపై అలవోకగా అబద్ధాలు వల్లెవేశారు. మాటల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించారు. -
వైకాపా సైన్యం బరితెగింపు
ఎన్నికల సంఘం నిఘా పరిధిలో ఉన్నామన్న బెరుకు లేదు.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నామన్న అదురూ లేదు. -
వేతనాల చెల్లింపులపై నేడు ‘చివరి గ్రీవెన్స్ డే’
వేతనాల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా జిల్లా కేంద్రాలలో మంగళవారం నిర్వహించే చివరి ‘గ్రీవెన్స్ డే’(వినతుల స్వీకరణ)లో పరిష్కరించుకోవాలని ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ సూచించారు. -
జగన్పై పోస్టులో అభ్యంతరకర భాగాన్ని తొలగించండి
వైకాపా అధ్యక్షుడు జగన్పై తెదేపా ఎక్స్ ఖాతాలో ఉంచిన పోస్టులో అభ్యంతరకరమైన ఓ భాగాన్ని తొలగించాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సోమవారం లేఖ రాసింది. -
కక్షిదారులకు వెంటనే న్యాయం అందించాలి
న్యాయస్థానాల్లో కక్షిదారులకు వేగంగా న్యాయం జరిగేలా న్యాయవాదులు చొరవ తీసుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. -
ఓఎంఆర్ షీట్లో గల్లంతైన విద్యార్థిని పేరు
విద్యాశాఖ అధికారుల తీరుతో పదో తరగతి విద్యార్థిని అరగంటపాటు తల్లడిల్లాల్సి వచ్చింది. తిరుపతి నగరంలోని సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.వర్షిణి తనకు కేటాయించిన బైపాస్లోని రత్నం పరీక్షా కేంద్రం వద్దకు అరగంట ముందుగానే చేరుకుంది. -
కోడ్ కూసే ముందు.. అయినవారికే నిధులు
ఇప్పటికే పలు దఫాలు సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ పరిధిలో రహదారుల పనులు చేసిన గుత్తేదార్లకు మాత్రమే చెల్లింపులు చేశారంటూ ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. -
కాసులివ్వని కపట ప్రేమ!
పేరుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డబ్బులు జమ చేస్తున్నట్లు ప్రకటిస్తారు.. రైతులకు మాత్రం సున్నా వడ్డీ లేదు. పెట్టుబడి సాయమూ లేదు. -
గ్రహణం వీడితేనే గట్టెక్కేది!
చుట్టూ నీళ్లలో నిరుపయోగంగా ఉన్న ఈ నిర్మాణాలు టిడ్కో ఇళ్లు. ఒంగోలు నగరం సమీపంలోని చింతల వద్ద తెదేపా హయాంలో నిర్మించారు. -
ఈఏపీసెట్ పరీక్ష తేదీల్లో మార్పు
ఎన్నికల నేపథ్యంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ పరీక్ష షెడ్యూల్ మారనుంది. -
ఉత్తుత్తి సంక్షేమం
‘గడప గడపకు సంక్షేమం’ పేరుతో వైకాపా ప్రభుత్వం పేదలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోంది. -
కోడ్ ఉల్లంఘన విచారణలో జాప్యం: కలెక్టర్ ఆగ్రహం
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వాలంటీర్ల వివరాల సేకరణలో జాప్యం జరగడంతో గుంటూరు జిల్లా కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇదేం సామాజిక న్యాయం జగన్?
వైకాపా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సామాజిక న్యాయం నేతి బీర చందంగా ఉంది. రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాను కలిపి వైకాపా టికెట్ల కేటాయింపు పరిశీలిస్తే.. జగన్ మార్క్ న్యాయం ఏమిటన్నది స్పష్టమవుతోంది. -
సీపీఎస్ ఉద్యోగుల డబ్బులు రూ.2,800 కోట్లు హాంఫట్
జగన్ సర్కార్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులపై కక్షకట్టినట్లు వ్యవహరిస్తోంది. -
ఆగని సలహాదారు నియామకాల జోరు
ప్రభుత్వశాఖలకు సలహాదారుల నియామకంపై హైకోర్టు అభ్యంతరం చెప్పినా జగన్ ప్రభుత్వ తీరు మారడంలేదు.
తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Stock market: భారీ నష్టాల్లో మార్కెట్లు.. పతనానికి కారణాలు ఇవే!
-
CM Revanth: ఈనాడు-ఈటీవీ కథనంపై స్పందించిన సీఎం రేవంత్రెడ్డి.. ఆదుకుంటామని హామీ
-
Pashupati Paras: అబ్బాయితో భాజపా దోస్తీ.. కేంద్రమంత్రి పదవికి బాబాయ్ రాజీనామా
-
Hyd News: నకిలీ సాస్లు తయారు చేస్తున్న ముఠా అరెస్టు
-
TDP: తెదేపా ఎంపీ అభ్యర్థులపై కసరత్తు.. సాయంత్రం ప్రకటన?