AP News: దద్దరిల్లిన మన్యం
ఆశ్రయం పొందినట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. అక్కడికి సమీపాన కూంబింగ్ చేస్తున్న గ్రేహౌండ్స్ బలగాలు అప్రమత్తమై మంగళవారం రాత్రే అటువైపు వెళ్లాయి. ముందు ఒక బృందం వెళ్లాక.. అటవీ ప్రాంతం నలువైపులా పోలీసు బలగాలను మోహరించారు. ఉదయం 9.30 ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరువైపుల నుంచి కాల్పులు జరిపారు. సుమారు రెండు గంటలపాటు జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలం నుంచి ఏకే-47,
విశాఖ జిల్లాలో ఎదురుకాల్పులు
ఆరుగురు మావోయిస్టుల మృతి
మృతుల్లో ఇద్దరు డీసీఎంలు, ముగ్గురు మహిళలు
తప్పించుకున్న అగ్రనేతలు అరుణ, జగన్, ఉదయ్
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం, కొయ్యూరు, సీలేరు, న్యూస్టుడే: విశాఖ మన్యం మళ్లీ ఎరుపెక్కింది. తుపాకుల మోతలతో దద్దరిల్లింది. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల్లోని కొయ్యూరు మండలం తీగలమెట్ట అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం పోలీసులు, మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో ఇద్దరు డివిజనల్ కమిటీ సభ్యులు, ముగ్గురు మహిళలున్నారు. వీరు కాక మరో మహిళా మావోయిస్టు ఎవరన్నది ఇంకా గుర్తించాలి. ఈ ఘటనలో అగ్రనేతలు అరుణ, ఉదయ్, జగన్ తప్పించుకున్నట్లు సమాచారం.
మృతులు వీరే..
ఎదురు కాల్పుల్లో డివిజనల్ కమిటీ సభ్యుల (డీసీఎం) క్యాడర్లో ఉన్న సందె గంగయ్య అలియాస్ డాక్టర్ అశోక్, రణదేవ్ అలియాస్ అర్జున్తో పాటు, ఏరియా కమిటీ సభ్యురాలు సంతునాచిక, మహిళా మావోయిస్టులు పాయకే, లలిత మరణించారు. మరో మహిళ వివరాలు తెలియలేదు.
పక్కా సమాచారంతో దాడి
కొయ్యూరు మండలం మంప పోలీసు స్టేషన్ పరిధిలోని యు.చీడిపల్లి పంచాయతీ తీగలమెట్ట వద్ద దట్టమైన అటవీ ప్రాంతంలో 30 మంది మావోయిస్టులు ఆశ్రయం పొందినట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. అక్కడికి సమీపాన కూంబింగ్ చేస్తున్న గ్రేహౌండ్స్ బలగాలు అప్రమత్తమై మంగళవారం రాత్రే అటువైపు వెళ్లాయి. ముందు ఒక బృందం వెళ్లాక.. అటవీ ప్రాంతం నలువైపులా పోలీసు బలగాలను మోహరించారు. ఉదయం 9.30 ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరువైపుల నుంచి కాల్పులు జరిపారు. సుమారు రెండు గంటలపాటు జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలం నుంచి ఏకే-47, కార్బన్, .303 రైఫిల్, తపంచా, ఎస్బీబీఎల్ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.
అగ్రనేతలను కాపాడబోయి..
తీగలమెట్ట అడవిలో ఆశ్రయం పొందుతున్న మావోయిస్టుల్లో రాష్ట్ర, కేంద్ర కమిటీ సభ్యులు అరుణ, ఉదయ్, జగన్ మరికొందరు అగ్రనేతలున్నట్లు నిఘావర్గాల సమాచారం. ఎదురు కాల్పులు మొదలవగానే వీరిని సురక్షితంగా అడవిని దాటించే క్రమంలో రక్షణగా నిలిచిన మావోయిస్టులు కాల్పుల్లో చనిపోయినట్లు తెలుస్తోంది. చనిపోయిన మహిళా మావోయిస్టుల్లో ఇద్దరు అరుణ అంగరక్షకులై ఉండొచ్చని సమాచారం.
డాక్టర్ అశోక్ అందుకే వచ్చారా?
తాజా ఎదురుకాల్పుల్లో హతమైన సందె గంగయ్య చదివింది ఏడో తరగతే అయినా.. ఆ పార్టీ వైద్యబృందంలో ఆయనది కీలక పాత్ర. అందుకే ఆయన్ను డాక్టర్ అశోక్ అని పిలుస్తారు. సాధారణంగా మావోయిస్టు ముఖ్యనేతలు ఎవరైనా అనారోగ్యం బారిన పడితే చికిత్స కోసం డాక్టర్ అశోక్ను తీసుకొస్తారు. ఇప్పుడు కూడా ఆయన అందుకే వచ్చారా? అనే వివరాలు సేకరిస్తున్నారు. మావోయిస్టులు కొవిడ్ బారిన పడ్డారా? వారికి చికిత్స అందించడానికే ఆయన వచ్చారా? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. గంగయ్య అన్న రాజయ్య 1996లో ఓదెలగుట్ట వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందారు. మరో అన్న సందె రాజమౌళి అలియాస్ ప్రసాద్ 2007లో అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయారు. వీరిది తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామం. ఒకే గ్రామానికి, కుటుంబానికి చెందిన ముగ్గురు మావోయిస్టు నేతలు వివిధ సందర్భాల్లో చనిపోయారు.
అత్మరక్షణ కోసమే కాల్పులు
‘తీగలమెట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశాలు నిర్వహించి గిరిజనులను ఇబ్బంది పెడుతున్నారని సమాచారం వచ్చింది. వారిని నిరోధించడానికి పోలీసు బలగాలను పంపించాం. మా వాళ్లను చూసి మావోయిస్టులు కాల్పులు జరిపారు. లొంగిపోవాలని చెప్పినా పట్టించుకోలేదు. ఆత్మరక్షణార్థం తిరిగి కాల్పులు జరపడంతో ఆరుగురు చనిపోయినట్లు గుర్తించాం. మరికొందరు గాయాలతో తప్పించుకున్నట్లు తెలిసింది. ఇప్పటికైనా వారు లొంగిపోతే మెరుగైన వైద్యం అందించి ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తాం’ అని విశాఖ జిల్లా ఎస్పీ కృష్ణారావు ఓ ప్రకటనలో తెలిపారు.
మల్కాన్గిరిలోనూ ఎదురు కాల్పులు
మల్కాన్గిరి, న్యూస్టుడే: ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లా మథిలి ఠాణా కులబేడ గ్రామ సమీప అడవుల్లో భద్రతాదళాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయని ఎస్పీ రిషికేష్ డి.ఖిలారి బుధవారం విలేకరులకు తెలిపారు. మల్కాన్గిరి-కొరాపుట్ సరిహద్దు అటవీ ప్రాంతంలో సీసీఐ మావోయిస్టుల సమావేశం జరగనున్నట్లు ముందస్తు సమాచారం అందిందన్నారు. దీంతో ఎస్వోజీ, మల్కాన్గిరి డీవీఎఫ్ దళాలు అడవిలో జల్లెడ పట్టాయని తెలిపారు. భద్రతా దళాలను పసిగట్టిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారని, అప్రమత్తమైన జవాన్లు ఎదురు దాడి చేశారని వెల్లడించారు. కొంతమంది మావోయిస్టులకు గాయాలైనట్లు ప్రాథమిక సమాచారం ఉందన్నారు. ఈ ఘటనలో ఒక రైఫిల్, 19 తూటాలు, 15 ఏకే-47 తూటాలు, ఒక ఏకే-47 మ్యాగజీన్, 4 కిట్ బ్యాగులు, ఒక డిజిటల్ కెమెరా, డిటొనేటరు, పవర్బ్యాంక్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
తల్లడిల్లిన తల్లి గుండె
ఈనాడు డిజిటల్, పెద్దపల్లి, న్యూస్టుడే, ఓదెల: విశాఖ జిల్లా ఎన్కౌంటర్లో సందె గంగయ్య అలియాస్ అశోక్ మృతి వార్త తెలుసుకుని ఆయన తల్లి అమృతమ్మ తల్లడిల్లిపోయారు. బీపీతో బాధపడుతున్న అమృతమ్మ.. తమ ఇంటివద్ద గుమిగూడిన జనాన్ని చూసి కీడు శంకించారు. అంతలోనే చిన్న కొడుకు మహేందర్ విలపించారు. తమకు కనీసం అధికారులు, పోలీసులు సమాచారం ఇవ్వలేదని వాపోయారు. మీడియా వారు చెప్పేవరకూ తెలియదన్నారు. గంగయ్య తలపై రూ.5 లక్షల రివార్డు ఉంది. విద్యార్థి దశలోనే పీపుల్స్వార్ పార్టీకి ఆకర్షితుడై ఉద్యమం బాట పట్టాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’ ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్