AP News:ఇసుకేస్తే రాలనన్ని లొసుగులు!
కిరాణా కొట్టుకెళ్లి పది రూపాయల బిస్కెట్ ప్యాకెట్ కొన్నా... ఆన్లైన్లో చెల్లింపులు జరిపే రోజులివి. కానీ మీకు ఎన్ని వేల రూపాయల ఇసుక కావాలన్నా రీచ్ల్లోకో, డిపోల్లోకో వెళ్లి.. నోట్ల కట్టలు చేతిలో పెడితే తప్ప ఇసుక లారీకి ఎక్కదు. ఇదొక్కటే కాదు.. రాష్ట్రంలో ప్రైవేటు సంస్థ ద్వారా జరుగుతున్న ఇసుక తవ్వకాలు, విక్రయాల్లో క్షేత్రస్థాయిలో ఎన్నో లొసుగులు కనిపిస్తున్నాయి.
గుత్తేదారు జేపీ పవర్ వెంచర్స్ బదులు టర్న్కీ సంస్థ ఇసుక తవ్వకాలు
ఇసుక టెండర్లకు కొన్నాళ్ల ముందే పుట్టిన సంస్థ
ఏడు నెలలైనా ఆన్లైన్ బిల్లుల్లేవు
సొంత వేబిల్లులే జారీ
బాట ఛార్జీల పేరుతో స్థానిక నేతల దందా
ఒక్కో రీచ్లో ఏడాదికి రూ.2.40 కోట్లపైనే..
వడ్డాది మహేశ్, ఉభయ గోదావరి జిల్లాల నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి
తూర్పుగోదావరి జిల్లా వేమగిరి రీచ్లో భారీగా ఇసుక తవ్వకాలు
కిరాణా కొట్టుకెళ్లి పది రూపాయల బిస్కెట్ ప్యాకెట్ కొన్నా... ఆన్లైన్లో చెల్లింపులు జరిపే రోజులివి. కానీ మీకు ఎన్ని వేల రూపాయల ఇసుక కావాలన్నా రీచ్ల్లోకో, డిపోల్లోకో వెళ్లి.. నోట్ల కట్టలు చేతిలో పెడితే తప్ప ఇసుక లారీకి ఎక్కదు. ఇదొక్కటే కాదు.. రాష్ట్రంలో ప్రైవేటు సంస్థ ద్వారా జరుగుతున్న ఇసుక తవ్వకాలు, విక్రయాల్లో క్షేత్రస్థాయిలో ఎన్నో లొసుగులు కనిపిస్తున్నాయి. ఉభయగోదావరి జిల్లాల్లోని వేమగిరి, మందపల్లె, అంకంపాలెం, ఊబలంక రీచ్ల్లోనూ, గాయత్రి, కోటిలింగాలు, వాడపల్లి, ఔరంగాబాద్ పడవ ర్యాంపుల్లోనూ ‘ఈనాడు’ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు.. సరిహద్దుల్ని స్పష్టంగా నిర్ణయించకుండా ఎడాపెడా ఇసుక తవ్వేయడం, ఆన్లైన్ బిల్లింగ్ లేకపోవడం, సీసీ కెమెరాలు పని చేయకపోవడం వంటి అనేక ఉల్లంఘనలు కనిపించాయి.
రీచ్ల్లో ఎంత ఇసుక తవ్వుతున్నారు? ఎంత విక్రయిస్తున్నారు? అని గుత్తేదారు సంస్థ ప్రతినిధులు పుస్తకాల్లో రాసిన లెక్కల్నే గనుల శాఖ అధికారులు పరిగణనలోకి తీసుకుంటున్నారు. నిజమైన లెక్కలన్నీ ఆ సంస్థ పుస్తకాల్లో నమోదు చేస్తుందా అన్నది సందేహమే.
రాష్ట్రంలో ఇసుక తవ్వకం బాధ్యతల్ని ప్రైవేటు సంస్థ చేపట్టి ఏడు నెలలవుతోంది.
నేటికీ కంప్యూటరైజ్డ్ వే బిల్లులు ఇవ్వడం లేదు. గుత్తేదారు సంస్థ సొంతంగా ముద్రించుకున్న వేబిల్లులకు రీచ్ల్లోని సిబ్బంది చేతిరాతతో సంఖ్యలు కేటాయిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి అన్ని బిల్లుల లెక్కలూ చూపిస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్యమవుతున్నాయి. ఆన్లైన్ బిల్లులు జారీ చేసేలా సాఫ్ట్వేర్ రూపొందించామని గనులశాఖ అధికారులు చెప్పి మూణ్నెల్లయినా నేటికీ అమల్లోకి రాలేదు.
తూర్పుగోదావరి జిల్లా మందపల్లి రీచ్లో ఇసుక కోసం వరుసలో ఉన్న లారీలు
ఎడాపెడా తవ్వకాలు
అన్ని రీచ్ల్లో జియోకోఆర్డినేట్స్ ద్వారా సరిహద్దులు నిర్ణయించామని గనుల శాఖ చెబుతోంది. ఆ హద్దులు కనిపించేలా ఏ రీచ్లోనూ లీజుదారు జెండాలు ఏర్పాటు చేయలేదు. రీచ్కు దగ్గర్లో ఇసుక దొరికినచోటల్లా తవ్వుకుంటూ పోతున్నా అధికారులు పట్టించుకోవట్లేదు.
పనిచేయని సీసీ కెమెరాలు
గతంలో ఏపీఎండీసీ ద్వారా ఇసుక తవ్వకాలు జరిపినప్పుడు ప్రతి చోటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, ఆ సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి పర్యవేక్షించేవారు. ప్రైవేటు సంస్థ టెండరు దక్కించుకున్నాక అధికారులు సీసీ కెమెరాలను ఆ సంస్థకు అప్పగించి, చేతులు దులిపేసుకున్నారు. ఇప్పుడవి పని చేయడం లేదు. దీంతో ఎన్ని లోడ్లు బయటకు వెళ్తున్నాయనే నిఘా కరవైంది.
బాటఛార్జీ పేరిట బాదుడు
రాష్ట్రంలోని పలు రీచ్ల్లో ప్రతి లారీ నుంచి రూ.500 చొప్పున బాటఛార్జీ పేరిట కొందరు స్థానికులు వసూళ్లు చేస్తున్నారు. నిత్యం ఒక్కో రీచ్ నుంచి 200 లారీల ఇసుక వెళ్తుంటే బాటఛార్జీల పేరిట దోపిడీ లక్ష వరకూ ఉంటోంది. సగటున నెలకు రూ.30 లక్షలు వసూలు చేస్తున్నారు. వర్షాకాలం నాలుగు నెలలు తవ్వకాలు జరగలేదనుకున్నా.. మిగిలిన 8 నెలలకు సుమారు రూ.2.40 కోట్ల అనధికారిక వసూళ్లకు పాల్పడుతున్నారు. గతంలో ఇసుక లోడింగ్ చేసిన కూలీలకు ఇప్పుడు పనులు లేకపోవడంతో వారికి కొంత మొత్తం ఇస్తున్నామని, ఆ ఊరి అవసరాలకు, లారీల రాకపోకలతో గుంతలుపడిన రహదారులు పూడ్చటానికి అవసరమంటూ ఈ దందా కొనసాగిస్తున్నారు. మందపల్లి, ఊబలంక, అంకంపాలెం రీచ్ల్లో బాట ఛార్జీల పేరుతో వసూళ్ల దందా ‘ఈనాడు’ పరిశీలనలో బయటపడింది. బాట ఛార్జీ ఇవ్వకపోతే ఇసుక లోడ్ చేయరని, అందుకే ఆ భారాన్ని కొనుగోలుదారుపైనే మోపాల్సి వస్తోందని పలువురు లారీడ్రైవర్లు తెలిపారు. బాటఛార్జీలపై కొద్దిరోజుల కిందట రావులపాలెం లారీ యజమాని ఒకరు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలంటూ అతనిపై తీవ్రంగా ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలిసింది.
తూర్పుగోదావరి జిల్లా వేమగిరి రీచ్ వద్ద నుంచి ఇసుక లోడ్తో బయటకు వెళ్తున్న లారీ, ఆ దృశ్యాలు రికార్డు కాకుండా వెనక్కి తిప్పి ఉన్న సీసీ కెమెరా
ఏడాది వయసైనా లేని సంస్థకు సబ్లీజు
రాష్ట్రంలోని మూడు జోన్లలో టెండర్లను దిల్లీకి చెందిన జేపీ పవర్ వెంచర్స్ దక్కించుకుంది. మే 14న గనులశాఖతో ఒప్పందం చేసుకొని, ఇసుక తవ్వకాలు చేపట్టింది. తర్వాత టర్న్కీ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థకు ఉపగుత్తేదారుగా ఇసుక తవ్వకాలు, విక్రయాల బాధ్యతలు అప్పగించింది. టర్న్కీ సంస్థ.. రాష్ట్రంలో ఇసుక టెండర్లు నిర్వహించడానికి కొన్ని నెలల ముందే పుట్టింది. చెన్నై కేంద్రంగా 2020 డిసెంబరు 30న ఈ సంస్థ ఏర్పాటైనట్టు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వెబ్సైట్లో ఉంది. రీచ్ల్లో సిబ్బంది అత్యధికంగా తమిళనాడువారే ఉండటంతో తమ ఉపాధికి గండిపడుతోందని స్థానికులు వాపోతున్నారు.
చెల్లింపులు ఎలాగన్నది గుత్తేదారు ఇష్టం
- వీజీ వెంకటరెడ్డి, గనులశాఖ సంచాలకులు
ఇసుక తవ్వకాలు, విక్రయాల్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. నిబంధనలన్నీ పాటించేలా చూస్తున్నాం. జేపీ పవర్ వెంచర్స్ సంస్థతో టర్న్కీ ఎంటర్ప్రైజెస్ సంస్థ ఒప్పందం చేసుకుని ఉపగుత్తేదారుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. త్వరలోనే ఆన్లైన్లో వేబిల్లులు జారీ అయ్యేలా చూస్తాం. గుత్తేదారు సంస్థ నిత్యం ఇసుక తవ్వకాలు, విక్రయాల వివరాల్ని ఆయా జిల్లాల్లోని గనులశాఖ ఏడీలకు అందజేస్తోంది. డిజిటల్ చెల్లింపులను స్వీకరించడం అన్నది గుత్తేదారు సంస్థ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
నోట్లిస్తేనే లోడింగ్
ఇసుక రీచ్లు, డిపోల్లో నోట్ల రూపంలో డబ్బు చెల్లిస్తేనే ఇసుక లోడ్ చేస్తున్నారు. ఆన్లైన్ చెల్లింపులకు అంగీకరించవద్దని తమ యాజమాన్యం స్పష్టంగా ఆదేశించిందని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. డిజిటల్ విధానంలో చెల్లింపులు జరిగితే.. నిత్యం ఎన్ని టన్నుల ఇసుక అమ్మారో అధికారులకు తెలుస్తుంది. అలా తెలియకుండా ఉండేందుకే గుత్తేదారు సంస్థ నగదుగానే ఇవ్వాలని పట్టుబడుతోందన్న అనుమానాలున్నాయి. డిజిటల్ చెల్లింపులు జరిగేలా చూస్తామని గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది కొన్నాళ్ల క్రితం ప్రకటించినా ఆచరణకు నోచుకోలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
ఎంతమంది వాలంటీర్లు రాజీనామా చేశారు?
రాజీనామా చేశాక వాలంటీర్, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల మధ్య అనుబంధం పోతుందని.. అలాంటప్పుడు వారి మాట విని ఏ లబ్ధిదారు ఓటేస్తారని హైకోర్టు వ్యాఖ్యానించింది.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
-
అంటకాగితే.. అంతే రాణా..!