AP news:సాఫ్ట్వేర్ కొలువు.. సులువే!
ఐటీ నియామకాల్లో ట్రెండ్ పూర్తి స్థాయిలో మారుతోంది. ఇంజినీరింగ్లో కంప్యూటర్ సైన్సు (సీఎస్ఈ) చదవాలి.. సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించాలనే విధానానికి భిన్నంగా ఏ బ్రాంచి చదివినా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. కెమికల్ ఇంజినీరింగ్ విద్యార్థికీ అవకాశం దక్కడం గమనార్హం. వివిధ కంపెనీలు బ్రాంచులను పట్టించుకోకుండా అభ్యర్థుల నైపుణ్యాలనే పరీక్షిస్తున్నాయి. కోర్ ఇంజినీరింగ్ బ్రాంచుల్లోని సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్
సివిల్, మెకానికల్, ఈఈఈ అభ్యర్థులకూ అవకాశాలు
నైపుణ్యాలుంటే ఇంజినీరింగ్లో బ్రాంచితో సంబంధమే లేదు
ఈనాడు, అమరావతి: ఐటీ నియామకాల్లో ట్రెండ్ పూర్తి స్థాయిలో మారుతోంది. ఇంజినీరింగ్లో కంప్యూటర్ సైన్సు (సీఎస్ఈ) చదవాలి.. సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించాలనే విధానానికి భిన్నంగా ఏ బ్రాంచి చదివినా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. కెమికల్ ఇంజినీరింగ్ విద్యార్థికీ అవకాశం దక్కడం గమనార్హం. వివిధ కంపెనీలు బ్రాంచులను పట్టించుకోకుండా అభ్యర్థుల నైపుణ్యాలనే పరీక్షిస్తున్నాయి. కోర్ ఇంజినీరింగ్ బ్రాంచుల్లోని సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ (ఈఈఈ) కోర్సులు చదువుతున్న వారూ తమను తాము మార్చుకుని ప్రాంగణ ఉద్యోగాలను సాధిస్తున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీల మానవ వనరుల అవసరాలు పెరిగాయి. దాంతో కంపెనీలు విద్యార్థుల నైపుణ్యాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ముఖ్యంగా డిజిటల్ నైపుణ్యాలున్న వారికి సాఫ్ట్వేర్ కంపెనీలు మంచి ప్యాకేజీలను ఇస్తున్నాయి. దీంతో కోర్ ఇంజినీరింగ్ విద్యార్థులూ ఐటీ ఉద్యోగాలకు అవసరమైన కోర్సులను నేర్చుకుంటూ ముందడుగు వేస్తున్నారు.
* విజయవాడలోని వీఆర్ సిద్దార్థ ఇంజినీరింగ్ కళాశాలలో గతేడాది 273 మంది, ఈ ఏడాది 148 మంది కోర్ ఇంజినీరింగ్ విద్యార్థులకు అసెంచర్, టీసీఎస్ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లభించాయి. సంవత్సరానికి రూ.4.5 లక్షల నుంచి రూ.7.2 లక్షల మధ్య వేతన ప్యాకేజీలు పొందారు. వీరిలో కొందరు రెండు, మూడు ఉద్యోగాలకు ఎంపికైనవారు ఉండటం గమనార్హం.
* విజయవాడ ఎన్ఆర్ఐ కళాశాలలో ఈ ఏడాది 9 మంది కోర్ ఇంజినీరింగ్ వారు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సాధించారు. ఈఈఈ చదివే హరితేజ 4 కంపెనీలకు ఎంపికయ్యారు. రూ.4.5 లక్షల నుంచి రూ.5.5 లక్షల ప్యాకేజీ వరకు వచ్చాయి.
*విశాఖపట్నం గాయత్రి విద్యా పరిషత్తులో ఈ ఏడాది 168 మంది విద్యార్థులు రూ.3.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల ప్యాకేజీలు సాధించారు. కెమికల్ ఇంజినీరింగ్ చదివిన మరో 14 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పొందారు. వీరందరూ క్యాప్ జెమినీ, టీసీఎస్ ఇన్పోసిస్లాంటి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు.
కరిక్యులమ్లోనూ మార్పులు
స్వయం ప్రతిపత్తి కలిగిన కొన్ని ఇంజినీరింగ్ కళాశాలలు బేసిక్ ప్రోగ్రామింగ్ను కరిక్యులమ్లో భాగం చేస్తున్నాయి. సివిల్, మెకానికల్, ఈఈఈ విద్యార్థులకు కోడింగ్, ప్రోగ్రామింగ్, డాటా స్ట్రక్చర్స్, పైథాన్, ప్రాబ్లమ్ సాల్వింగ్పై శిక్షణ ఇస్తున్నాయి. మరికొన్ని కళాశాలలు స్వయం పోర్టల్లోని కోర్సులు పూర్తి చేసేలా విద్యార్థులకు సహాయం అందిస్తున్నాయి. దీంతో కోర్ ఇంజినీరింగ్ విద్యార్థులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలను అందిపుచ్చుకుంటున్నారు.
అదనపు కోర్సులతో టీసీఎస్లో ఉద్యోగం
నేను ఈఈఈ నాలుగో ఏడాది చదువుతున్నా. ఇందులో ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నందున సాఫ్ట్వేర్వైపు వెళ్దామని పైథాన్, ప్రోగ్రామింగ్, కంప్యూటర్ నెట్వర్కింగ్, జావా నేర్చుకున్నా. ఆన్లైన్లో సర్టిఫికేషన్ కోర్సులు చేశా. టీసీఎస్ డిజిటల్లో రూ.7.2 లక్షల ప్యాకేజీకి ఎంపికయ్యా.
- పింగళి ఐశ్వర్య
కోడింగ్, ప్రోగ్రామింగ్పై అవగాహన అవసరం
- కాంచనపల్లి వెంకట్, సీఈఓ, సన్టెక్ కార్ఫ్ ప్లేస్మెంట్ శిక్షణ సంస్థ
ఇంజినీరింగ్ చదివే వారికి డొమైన్తోపాటు ఐటీపైనా అవగాహన ఉండాలి. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చాక కొన్నిసార్లు డొమైన్ విజ్ఞానం ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఏ కోర్సు చదివేవారికైనా ప్రోగ్రామింగ్, ఆపరేటింగ్లాంటి వాటిపై కనీస పరిజ్ఞానం అవసరమవుతుంది. కరోనాతో వచ్చిన మార్పుల కారణంగా ఐటీ నియామకాలు పెరిగాయి. ప్రాజెక్టులు అధికంగా రావడంతో కంపెనీలు కోడింగ్, ప్రోగ్రామింగ్పై అవగాహన ఉన్న వారిని తీసుకుంటున్నాయి.
3 కంపెనీల ఆఫర్లు వచ్చాయి
- ఆదిత్య మోహన్, మెకానికల్ నాలుగో ఏడాది
మెకానికల్ చదువుతున్నా. సాఫ్ట్వేర్ వైపు వెళ్లాలని రెండో ఏడాది నుంచే ప్రొగ్రామింగ్తోపాటు అవసరమైన సర్టిఫికేషన్ కోర్సులు పూర్తి చేశా. ప్రాంగణ నియామకాల్లో టీసీఎస్, ఇన్ఫోసిస్, క్యాప్ జెమినీల నుంచి ఆఫర్లు వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ
పల్లెపల్లె తిరిగినాదో అమ్మా భువనమ్మ- ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ జనం గుండెల్లో కొలువైనాది.. కష్టాలు కన్నీళ్లు తుడిపేసింది. -
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం
అధికార పార్టీ నేతల ఫొటోలు, హోర్డింగులు తొలగించడంలో చర్యలు తీసుకోని అధికారులు.. నిరుపేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్కు మాత్రం నిబంధనలు వర్తిస్తాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
ఉత్తర కోస్తాలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?
తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో తోపులాటలు చోటుచేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి అంతరాయం ఏర్పడిన ఘటనపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. -
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. -
బోరు వేసుకుంటారా.. రూ. 10 వేలు కట్టండి
తిరుపతిలోని అధికార పార్టీ కార్పొరేటర్ల అసలు రంగును బయటపెడుతూ సోమవారం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఐదేళ్లూ షాక్.. ఎన్నికలని బ్రేక్!
పాదయాత్ర పేరిట ఊరూవాడా తిరిగిన జగన్... విద్యుత్ ఛార్జీలపై అలవోకగా అబద్ధాలు వల్లెవేశారు. మాటల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించారు. -
వైకాపా సైన్యం బరితెగింపు
ఎన్నికల సంఘం నిఘా పరిధిలో ఉన్నామన్న బెరుకు లేదు.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నామన్న అదురూ లేదు. -
వేతనాల చెల్లింపులపై నేడు ‘చివరి గ్రీవెన్స్ డే’
వేతనాల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా జిల్లా కేంద్రాలలో మంగళవారం నిర్వహించే చివరి ‘గ్రీవెన్స్ డే’(వినతుల స్వీకరణ)లో పరిష్కరించుకోవాలని ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ సూచించారు. -
జగన్పై పోస్టులో అభ్యంతరకర భాగాన్ని తొలగించండి
వైకాపా అధ్యక్షుడు జగన్పై తెదేపా ఎక్స్ ఖాతాలో ఉంచిన పోస్టులో అభ్యంతరకరమైన ఓ భాగాన్ని తొలగించాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సోమవారం లేఖ రాసింది. -
కక్షిదారులకు వెంటనే న్యాయం అందించాలి
న్యాయస్థానాల్లో కక్షిదారులకు వేగంగా న్యాయం జరిగేలా న్యాయవాదులు చొరవ తీసుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. -
ఓఎంఆర్ షీట్లో గల్లంతైన విద్యార్థిని పేరు
విద్యాశాఖ అధికారుల తీరుతో పదో తరగతి విద్యార్థిని అరగంటపాటు తల్లడిల్లాల్సి వచ్చింది. తిరుపతి నగరంలోని సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.వర్షిణి తనకు కేటాయించిన బైపాస్లోని రత్నం పరీక్షా కేంద్రం వద్దకు అరగంట ముందుగానే చేరుకుంది. -
కోడ్ కూసే ముందు.. అయినవారికే నిధులు
ఇప్పటికే పలు దఫాలు సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ పరిధిలో రహదారుల పనులు చేసిన గుత్తేదార్లకు మాత్రమే చెల్లింపులు చేశారంటూ ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. -
కాసులివ్వని కపట ప్రేమ!
పేరుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డబ్బులు జమ చేస్తున్నట్లు ప్రకటిస్తారు.. రైతులకు మాత్రం సున్నా వడ్డీ లేదు. పెట్టుబడి సాయమూ లేదు. -
గ్రహణం వీడితేనే గట్టెక్కేది!
చుట్టూ నీళ్లలో నిరుపయోగంగా ఉన్న ఈ నిర్మాణాలు టిడ్కో ఇళ్లు. ఒంగోలు నగరం సమీపంలోని చింతల వద్ద తెదేపా హయాంలో నిర్మించారు. -
ఈఏపీసెట్ పరీక్ష తేదీల్లో మార్పు
ఎన్నికల నేపథ్యంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ పరీక్ష షెడ్యూల్ మారనుంది. -
ఉత్తుత్తి సంక్షేమం
‘గడప గడపకు సంక్షేమం’ పేరుతో వైకాపా ప్రభుత్వం పేదలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోంది. -
కోడ్ ఉల్లంఘన విచారణలో జాప్యం: కలెక్టర్ ఆగ్రహం
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వాలంటీర్ల వివరాల సేకరణలో జాప్యం జరగడంతో గుంటూరు జిల్లా కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇదేం సామాజిక న్యాయం జగన్?
వైకాపా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సామాజిక న్యాయం నేతి బీర చందంగా ఉంది. రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాను కలిపి వైకాపా టికెట్ల కేటాయింపు పరిశీలిస్తే.. జగన్ మార్క్ న్యాయం ఏమిటన్నది స్పష్టమవుతోంది. -
సీపీఎస్ ఉద్యోగుల డబ్బులు రూ.2,800 కోట్లు హాంఫట్
జగన్ సర్కార్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులపై కక్షకట్టినట్లు వ్యవహరిస్తోంది. -
ఆగని సలహాదారు నియామకాల జోరు
ప్రభుత్వశాఖలకు సలహాదారుల నియామకంపై హైకోర్టు అభ్యంతరం చెప్పినా జగన్ ప్రభుత్వ తీరు మారడంలేదు.
తాజా వార్తలు (Latest News)
-
Ashwini Vaishnaw: 2026లో బుల్లెట్ రైలు పరుగులు.. త్వరలోనే ‘మేడిన్ ఇండియా’ చిప్
-
IPL-SRH: సన్రైజర్స్ హైదరాబాద్కు షాక్.. మూడు మ్యాచ్లకు కీలక ఆటగాడు దూరం
-
AP News: కాంగ్రెస్లో చేరిన వైకాపా ఎమ్మెల్యే
-
Hanu Man: ఓటీటీలో ‘హనుమాన్’ క్రేజ్ మామూలుగా లేదుగా.. 2024లో ఇదో సరికొత్త రికార్డు
-
Bengaluru: బెంగళూరులో పేలుడు పదార్థాలు స్వాధీనం
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు