AP news:సాఫ్ట్వేర్ కొలువు.. సులువే!
ఐటీ నియామకాల్లో ట్రెండ్ పూర్తి స్థాయిలో మారుతోంది. ఇంజినీరింగ్లో కంప్యూటర్ సైన్సు (సీఎస్ఈ) చదవాలి.. సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించాలనే విధానానికి భిన్నంగా ఏ బ్రాంచి చదివినా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. కెమికల్ ఇంజినీరింగ్ విద్యార్థికీ అవకాశం దక్కడం గమనార్హం. వివిధ కంపెనీలు బ్రాంచులను పట్టించుకోకుండా అభ్యర్థుల నైపుణ్యాలనే పరీక్షిస్తున్నాయి. కోర్ ఇంజినీరింగ్ బ్రాంచుల్లోని సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్
సివిల్, మెకానికల్, ఈఈఈ అభ్యర్థులకూ అవకాశాలు
నైపుణ్యాలుంటే ఇంజినీరింగ్లో బ్రాంచితో సంబంధమే లేదు
ఈనాడు, అమరావతి: ఐటీ నియామకాల్లో ట్రెండ్ పూర్తి స్థాయిలో మారుతోంది. ఇంజినీరింగ్లో కంప్యూటర్ సైన్సు (సీఎస్ఈ) చదవాలి.. సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించాలనే విధానానికి భిన్నంగా ఏ బ్రాంచి చదివినా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. కెమికల్ ఇంజినీరింగ్ విద్యార్థికీ అవకాశం దక్కడం గమనార్హం. వివిధ కంపెనీలు బ్రాంచులను పట్టించుకోకుండా అభ్యర్థుల నైపుణ్యాలనే పరీక్షిస్తున్నాయి. కోర్ ఇంజినీరింగ్ బ్రాంచుల్లోని సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ (ఈఈఈ) కోర్సులు చదువుతున్న వారూ తమను తాము మార్చుకుని ప్రాంగణ ఉద్యోగాలను సాధిస్తున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీల మానవ వనరుల అవసరాలు పెరిగాయి. దాంతో కంపెనీలు విద్యార్థుల నైపుణ్యాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ముఖ్యంగా డిజిటల్ నైపుణ్యాలున్న వారికి సాఫ్ట్వేర్ కంపెనీలు మంచి ప్యాకేజీలను ఇస్తున్నాయి. దీంతో కోర్ ఇంజినీరింగ్ విద్యార్థులూ ఐటీ ఉద్యోగాలకు అవసరమైన కోర్సులను నేర్చుకుంటూ ముందడుగు వేస్తున్నారు.
* విజయవాడలోని వీఆర్ సిద్దార్థ ఇంజినీరింగ్ కళాశాలలో గతేడాది 273 మంది, ఈ ఏడాది 148 మంది కోర్ ఇంజినీరింగ్ విద్యార్థులకు అసెంచర్, టీసీఎస్ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లభించాయి. సంవత్సరానికి రూ.4.5 లక్షల నుంచి రూ.7.2 లక్షల మధ్య వేతన ప్యాకేజీలు పొందారు. వీరిలో కొందరు రెండు, మూడు ఉద్యోగాలకు ఎంపికైనవారు ఉండటం గమనార్హం.
* విజయవాడ ఎన్ఆర్ఐ కళాశాలలో ఈ ఏడాది 9 మంది కోర్ ఇంజినీరింగ్ వారు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సాధించారు. ఈఈఈ చదివే హరితేజ 4 కంపెనీలకు ఎంపికయ్యారు. రూ.4.5 లక్షల నుంచి రూ.5.5 లక్షల ప్యాకేజీ వరకు వచ్చాయి.
*విశాఖపట్నం గాయత్రి విద్యా పరిషత్తులో ఈ ఏడాది 168 మంది విద్యార్థులు రూ.3.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల ప్యాకేజీలు సాధించారు. కెమికల్ ఇంజినీరింగ్ చదివిన మరో 14 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పొందారు. వీరందరూ క్యాప్ జెమినీ, టీసీఎస్ ఇన్పోసిస్లాంటి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు.
కరిక్యులమ్లోనూ మార్పులు
స్వయం ప్రతిపత్తి కలిగిన కొన్ని ఇంజినీరింగ్ కళాశాలలు బేసిక్ ప్రోగ్రామింగ్ను కరిక్యులమ్లో భాగం చేస్తున్నాయి. సివిల్, మెకానికల్, ఈఈఈ విద్యార్థులకు కోడింగ్, ప్రోగ్రామింగ్, డాటా స్ట్రక్చర్స్, పైథాన్, ప్రాబ్లమ్ సాల్వింగ్పై శిక్షణ ఇస్తున్నాయి. మరికొన్ని కళాశాలలు స్వయం పోర్టల్లోని కోర్సులు పూర్తి చేసేలా విద్యార్థులకు సహాయం అందిస్తున్నాయి. దీంతో కోర్ ఇంజినీరింగ్ విద్యార్థులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలను అందిపుచ్చుకుంటున్నారు.
అదనపు కోర్సులతో టీసీఎస్లో ఉద్యోగం
నేను ఈఈఈ నాలుగో ఏడాది చదువుతున్నా. ఇందులో ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నందున సాఫ్ట్వేర్వైపు వెళ్దామని పైథాన్, ప్రోగ్రామింగ్, కంప్యూటర్ నెట్వర్కింగ్, జావా నేర్చుకున్నా. ఆన్లైన్లో సర్టిఫికేషన్ కోర్సులు చేశా. టీసీఎస్ డిజిటల్లో రూ.7.2 లక్షల ప్యాకేజీకి ఎంపికయ్యా.
- పింగళి ఐశ్వర్య
కోడింగ్, ప్రోగ్రామింగ్పై అవగాహన అవసరం
- కాంచనపల్లి వెంకట్, సీఈఓ, సన్టెక్ కార్ఫ్ ప్లేస్మెంట్ శిక్షణ సంస్థ
ఇంజినీరింగ్ చదివే వారికి డొమైన్తోపాటు ఐటీపైనా అవగాహన ఉండాలి. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చాక కొన్నిసార్లు డొమైన్ విజ్ఞానం ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఏ కోర్సు చదివేవారికైనా ప్రోగ్రామింగ్, ఆపరేటింగ్లాంటి వాటిపై కనీస పరిజ్ఞానం అవసరమవుతుంది. కరోనాతో వచ్చిన మార్పుల కారణంగా ఐటీ నియామకాలు పెరిగాయి. ప్రాజెక్టులు అధికంగా రావడంతో కంపెనీలు కోడింగ్, ప్రోగ్రామింగ్పై అవగాహన ఉన్న వారిని తీసుకుంటున్నాయి.
3 కంపెనీల ఆఫర్లు వచ్చాయి
- ఆదిత్య మోహన్, మెకానికల్ నాలుగో ఏడాది
మెకానికల్ చదువుతున్నా. సాఫ్ట్వేర్ వైపు వెళ్లాలని రెండో ఏడాది నుంచే ప్రొగ్రామింగ్తోపాటు అవసరమైన సర్టిఫికేషన్ కోర్సులు పూర్తి చేశా. ప్రాంగణ నియామకాల్లో టీసీఎస్, ఇన్ఫోసిస్, క్యాప్ జెమినీల నుంచి ఆఫర్లు వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె