AP News:‘కొవిడ్ అల’..లా
రాష్ట్రంలో కొవిడ్ తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. వారం రోజుల్లోనే పాజిటివిటీ రేటు 11 శాతంపైగా వృద్ధి చెందింది. ఈనెల పదో తేదీన 4.05% ఉన్న పాజిటివిటీ రేటు ప్రస్తుతం 15.22 శాతానికి చేరింది. చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.
వారంలో 11%పైగా పెరిగిన పాజిటివిటీ
కొత్తగా 4,570 మందికి వైరస్
చిత్తూరు, విశాఖ జిల్లాల్లో అత్యధికం
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కొవిడ్ తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. వారం రోజుల్లోనే పాజిటివిటీ రేటు 11 శాతంపైగా వృద్ధి చెందింది. ఈనెల పదో తేదీన 4.05% ఉన్న పాజిటివిటీ రేటు ప్రస్తుతం 15.22 శాతానికి చేరింది. చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు 30,022 మందికి పరీక్షలు చేయగా.. 4,570 మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు. చిత్తూరు జిల్లాలో 1,124, విశాఖపట్నంలో 1,028, గుంటూరులో 368, అనంతపురం జిల్లాలో 347 కేసులు నమోదయ్యాయి. కొవిడ్తో చిత్తూరు జిల్లాలో ఒకరు మృతిచెందారు. రాష్ట్రంలో మొత్తం 26,770 మంది కొవిడ్ చికిత్స తీసుకుంటున్నారు. వీరిలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 6,080 మంది, విశాఖపట్నం జిల్లాలో 5,619 మంది ఉన్నారు. గత ఇరవై నాలుగు గంటల్లో 660 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.
అయిదు వేలకు చేరువ...
శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల మధ్య 35,673 మందికి పరీక్షలు చేయగా 4,955 మందికి కొవిడ్గా నిర్ధారించారు. అంటే పాజిటివిటీ రేటు 13.89 శాతంగా ఉంది. ఒమిక్రాన్ ప్రభావం మొదలయ్యాక... కేసుల సంఖ్య 5వేలకు చేరువకావడం గమనార్హం. అత్యధికంగా విశాఖపట్నంలో 1,103, చిత్తూరు జిల్లాలో 1,039 మందికి కొవిడ్ సోకింది. అధిక శాతం జిల్లాల్లో కేసుల సంఖ్య 300 పైనే ఉంది. వైరస్తో పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు మరణించారు. 24 గంటల్లో కొవిడ్ నుంచి 397 మంది కోలుకున్నారు. 22,870 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు కరోనా
గిద్దలూరు పట్టణం, న్యూస్టుడే: ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు కరోనా బారినపడ్డారు. శనివారం జ్వరం రావడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని, ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్లో ఉన్నట్లు తెలిపారు.
అంబటి రాంబాబుకు మూడోసారి కొవిడ్
సత్తెనపల్లి, న్యూస్టుడే: గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మూడోసారి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆదివారం ఆయన సెల్ఫీ వీడియో ద్వారా ధ్రువీకరించారు. జలుబు, ఒంటి నొప్పులు ఉండటంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్గా తేలిందన్నారు. స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. ఈనెల 12 నుంచి నియోజకవర్గంలో భారీ జనసందోహంతో చేపట్టిన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. పాజిటివ్ నిర్ధారణ అయిన తర్వాత సత్తెనపల్లి నుంచి గుంటూరు వెళ్లారని ఎమ్మెల్యే సన్నిహితులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?