AP News: కారుచౌక బేరం!
విశాఖపట్నం రాష్ట్రంలోనే అతి పెద్ద నగరం. అనేక అనుకూలతల దృష్ట్యా సహజ సిద్ధంగానే అభివృద్ధి చెందుతోంది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ అభివృద్ధిని కొనసాగించాల్సిందే. వాణిజ్య, పారిశ్రామిక, పర్యాటక ప్రాజెక్టులకు, ఇతర ప్రభుత్వ అవసరాలకు అక్కడ రాబోయే
విశాఖలో ఎకరం రూ.15 కోట్లు పలికేచోట.. ఎన్సీసీకి రూ.1.93 కోట్లకే..
మధురవాడలో 97.30 ఎకరాలను తక్కువకే కట్టబెడుతున్న ప్రభుత్వం
ఆ భూమిని ఎన్సీసీ.. జీఆర్పీఎల్కి రూ.200 కోట్లకు అమ్మేస్తుందని ప్రచారం
ఈనాడు - అమరావతి, విశాఖపట్నం
విశాఖపట్నం రాష్ట్రంలోనే అతి పెద్ద నగరం. అనేక అనుకూలతల దృష్ట్యా సహజ సిద్ధంగానే అభివృద్ధి చెందుతోంది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ అభివృద్ధిని కొనసాగించాల్సిందే. వాణిజ్య, పారిశ్రామిక, పర్యాటక ప్రాజెక్టులకు, ఇతర ప్రభుత్వ అవసరాలకు అక్కడ రాబోయే రోజుల్లో చాలా భూమి అవసరం. తగినంత భూమి లేక ఎంఐజీ లేఅవుట్లకు, పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం భూసమీకరణలో భూమి తీసుకుంటోంది. అలాంటి విశాఖలో అటు సాగర తీరానికి, ఇటు జాతీయ రహదారికి మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మధురవాడలో అత్యంత విలువైన 97.30 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఎన్సీసీ సంస్థకు కారుచౌకగా కట్టబెట్టింది. ఆ భూమి ఐటీ పార్కులున్న కొండవాలులోనే ఉంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో విలాసవంతమైన అపార్ట్మెంట్లు, విల్లాల ధరలు రూ.కోట్లలోనే ఉన్నాయి. కొన్నేళ్లలోనే.. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లానో, బంజారాహిల్స్లానో అభివృద్ధి చెందేందుకు అన్ని అవకాశాలూ
ఉన్న ప్రాంతం.
అలాంటిచోట సుమారు రూ.1,500 కోట్లు విలువ చేసే భూమిని.. రూ.187 కోట్లకే ఎన్సీసీ సంస్థకు ప్రభుత్వం కట్టబెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 2005లో ఎన్సీసీతో అప్పటి ప్రభుత్వం డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటే, ఆ సంస్థ అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలూ చేపట్టకపోయినా, 17 ఏళ్ల తర్వాత ఆ భూమిని ఇప్పుడు గంపగుత్తగా విక్రయించేయడంపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు. ఆ సంస్థకు భూములు పూర్తి హక్కులతో విక్రయించాలని గత ప్రభుత్వం చేసిన నిర్ణయాన్నే తాము అమలు చేశామన్నట్లు ఆయన మాట్లాడారు. వివాదంలో చిక్కుకోకుండా ఉండేందుకే, ఆ భూమిని ఎన్సీసీ సంస్థకు అప్పగించాలని నిర్ణయించామని చెబుతున్నారు. అమరావతి సహా గత ప్రభుత్వం తీసుకున్న ఎన్నో నిర్ణయాలను వైకాపా ప్రభుత్వం రాగానే తిరగదోడింది. 25శాతం లోపు పూర్తయిన పనులన్నింటినీ నిలిపేసింది. వాటిపై వివాదాల్లేవా? మరి ఎన్సీసీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని మాత్రం ఎందుకు తిరగతోడలేదు? వివాదమవుతుందని.. రూ.1,500 కోట్ల భూమిని రూ.187 కోట్లకే ఇచ్చేస్తారా? ఇలా ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో సందేహాలు.
వెనక్కి తీసుకోవచ్చు కదా?
వాణిజ్య, ఐటీ, ఫిన్టెక్ రంగాలపరంగా మధురవాడ వైపు విశాఖ అత్యంత వేగంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది.వై.ఎస్.రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా.. అక్కడి కొండలపై ఐటీ సంస్థలకు, చుట్టుపక్కల ప్రాంతాల్లో పలు నివాస ప్రాజెక్టులకు భూములిచ్చారు. భూములు దక్కించుకున్న సంస్థలు అప్పట్లో స్తబ్దుగా ఉండిపోయాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందడంతో భూములు తీసుకున్న సంస్థలూ చాలా ప్రాజెక్టులు పూర్తి చేశాయి. ఇంకొన్ని చేస్తున్నాయి. వైఎస్ హయాంలోనే మధురవాడలోని ఐటీ కొండల వాలులో 411, 412, 419-1, 419-3 సర్వే నెంబర్లలో ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు (ఏపీహెచ్బీ)కి చెందిన 97.30 ఎకరాల్ని టెండర్ల ద్వారా దక్కించుకున్న ఎన్సీసీ.. వివిధ కారణాలు చెబుతూ చాన్నాళ్లపాటు ప్రాజెక్టు చేపట్టలేదు. ఆ సంస్థ ఎకరానికి రూ.93.20 లక్షల చొప్పున రూ.90.68 కోట్లు డెవలప్మెంట్ ఛార్జీగా ప్రభుత్వానికి చెల్లించింది. దానికి అదనంగా ఆ ప్రాజెక్టులో నివాస భవనాల్ని విక్రయించగా వచ్చే ఆదాయంలో 3.5 శాతం, వాణిజ్య భవనాల ఆదాయంలో 4 శాతం (మొదట్లో ఒప్పందం చేసుకున్నప్పుడు అది 1.75%, 2% ఉంది. ప్రాజెక్టు ఆలస్యమవడంతో దాన్ని పెంచారు) ఏపీహెచ్బీకి ఎన్సీసీ చెల్లించాలి. దాంతోపాటు 5 శాతం భూమిలో అల్పాదాయవర్గాలకు ఇళ్లు కట్టి, చ.అడుగు రూ.450కి ఏపీహెచ్బీకి బదలాయించాలి. ఏళ్లు గడుస్తున్నా ఎన్సీసీ ఒక్క ఇటుకా వేయకపోవడంతో 2013లో కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం ఎన్సీసీకి భూకేటాయింపులు రద్దు చేసింది. ఆ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. యథాతథస్థితిని కొనసాగిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈ వివాదాన్ని సంప్రదింపులతో పరిష్కరించుకుని, ఎన్సీసీ చెల్లించిన డబ్బుకు వడ్డీ కట్టి భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే బహిరంగ మార్కెట్లో విక్రయించి అంతకు అనేక రెట్లు ఎక్కువ ఆదాయం సంపాదించగలిగే అవకాశం ఉండేది. అయినా ప్రభుత్వం ఆ సంస్థకు అతి తక్కువ ధరకు భూములు కట్టబెట్టింది.
ఇతర అవకాశాల్ని ఎందుకు పరిశీలించలేదు?
తెదేపా అధికారంలోకి వచ్చాక 2016లో ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకుందామని ఎన్సీసీ సంస్థ ప్రభుత్వాన్ని కోరింది. మూడు రకాల ప్రతిపాదనలు పెట్టింది. డెవలప్మెంట్ అగ్రిమెంట్లో పేర్కొన్న ప్రకారం ఏపీహెచ్బీకి చెల్లించాల్సిన రెవెన్యూ వాటాను మదింపు చేస్తే ఆ డబ్బు కట్టేస్తామని, తమకు పూర్తి హక్కులతో భూమిని ఇచ్చేయాలని కోరింది. లేదా ఇదివరకు తాము కట్టిన డబ్బును 12 శాతం వడ్డీతో చెల్లించాలంది. అవి రెండూ కాకపోతే... ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన నిబంధనలు, గడువులు నిర్దేశించుకుంటూ కొత్తగా ఒప్పందం చేసుకుందామని ప్రతిపాదించింది. ఎన్సీసీ సంస్థకు ఆ భూమిని పూర్తి హక్కులతో విక్రయించేందుకే నిర్ణయించి, డెవలప్మెంట్ అగ్రిమెంట్లో నిర్దేశించిన శాతాల్ని అనుసరించి ప్రభుత్వానికి రావలసిన ఆదాయాన్ని రెండు ప్రఖ్యాత మదింపు సంస్థలతో అంచనా వేయించాలని 2019 ఫిబ్రవరిలో ప్రభుత్వం జీవో (నెం.64) జారీ చేసింది. ప్రాజెక్టు విలువను, విక్రయ విలువను లెక్కించి, రెండు సంస్థల ప్రతిపాదనల్లో గరిష్ఠ విలువను పరిగణనలోకి తీసుకుని, దానిపై 20 శాతం అదనంగా ప్రభుత్వానికి ఎన్సీసీ చెల్లించాలని నిబంధన పెట్టింది. అల్పాదాయ వర్గాల ఇళ్లకు చ.అడుగు విలువను నిర్ణయించి... దానిలో రూ.450 చొప్పున ఎన్సీసీ మినహాయించుకుని, మిగతా మొత్తాన్ని ఏపీహెచ్బీకి చెల్లించాలని నిబంధన పెట్టారు. అధికారంలోకి వచ్చాక తెదేపా ప్రభుత్వ నిర్ణయాలు ఎన్నింటినో తిరగదోడిన వైకాపా ప్రభుత్వం.. ఎన్సీసీకి భూకేటాయింపుల విషయంలో మాత్రం ముందుకే వెళ్లింది. రెండు మదింపు సంస్థల నివేదికలు పరిశీలించి, సిఫారసులు చేసేందుకు అధికారుల కమిటీని నియమించింది. ఆ కమిటీ.. ఎన్సీసీ మరో రూ.97.29 కోట్లు కడితే చాలని సిఫారసు చేయగా మంత్రివర్గం ఆమోదించింది. 2021 అక్టోబర్ 26న ఏపీహెచ్బీకి రూ.97.29 కోట్లు చెల్లించింది. ఆ ప్రాజెక్టు కోసం ఎన్సీసీ గతంలోనే ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహక సంస్థ ఎన్సీసీవీయూఐఎల్కి ఏపీహెచ్బీ తర్వాత రోజే భూమిని రిజిస్ట్రేషన్ చేసింది.
ఇన్నేళ్లు ఎదురుచూసి నష్టానికి అమ్ముతుందా?
ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ఎన్సీసీ పెట్టుబడిపై ఎక్కువ లాభాలు ఆర్జించాలని చూస్తుంది. ఏ వ్యాపార సంస్థకయినా అది ప్రాథమిక సూత్రం. మధురవాడలోని 97.30 ఎకరాల ప్రాజెక్టు విషయంలో ఎన్సీసీ వ్యవహరిస్తున్న తీరు దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. ఎన్సీసీ విశాఖ ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసిన ఎన్సీసీవీయూఐఎల్ని రూ.200 కోట్లకు బెంగళూరుకు చెందిన జీఆర్పీఎల్కి అమ్మేస్తున్నట్టు ఇటీవల కొన్ని ఆంగ్ల వాణిజ్య వార్తా సంస్థల వెబ్సైట్లలో వార్తలు వచ్చాయి. ఆ ప్రాజెక్టు కోసం ఎన్సీసీ రూ.90.68 కోట్లను 2006 ఫిబ్రవరి నుంచి 2007 జులై మధ్య ఏడు దఫాలుగా ఏపీహెచ్బీకి చెల్లించింది. ఆ భూమిని తమకు పూర్తి హక్కులతో విక్రయించకపోతే తాము కట్టిన రూ.90.68 కోట్లకు ఏటా 12 శాతం వడ్డీ కలిపి చెల్లించాలని గత ప్రభుత్వాన్ని కోరింది. ఆ మొత్తానికి 12 శాతం బారువడ్డీ లెక్కిస్తే 15 ఏళ్లలో రూ.17.42 కోట్లవుతుంది. 2021 అక్టోబరు 26న చెల్లించిన రూ.97.29 కోట్లకు ఐదు నెలలకు 12 శాతం బారువడ్డీ లెక్కిస్తే సుమారు రూ.50 లక్షలవుతుంది. అంటే వడ్డీయే దాదాపు రూ.18 కోట్లవుతుంది. దీన్ని ఎన్సీసీ చెల్లించిన రూ.187.97 కోట్ల అసలుకు కలిపితే రూ.205.89 కోట్లవుతుంది. కానీ ఎన్సీసీ సంస్థ ఆ భూమిని జీఆర్పీఎల్కి రూ.200 కోట్లకే అమ్ముతున్నట్టు వార్తలొచ్చాయి. అంటే రూ.5.89 కోట్లు నష్టమన్నమాట. ఎన్సీసీ దీనిపై పెట్టిన వివిధ రకాల ఖర్చులు, కోర్టు ఖర్చులు కలిపితే నష్టం ఇంకా ఎక్కువే ఉంటుంది. అంత విలువైన ప్రాజెక్టును 15 ఏళ్లు ఎదురుచూసి, ఇప్పుడు నష్టానికి వదులుకుంటుందన్న వార్తల నేపథ్యంలో.. మధురవాడ భూ లావాదేవీపై అనేక సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
చదరపు గజం రూ.40 వేలకుపైనే..
మధురవాడలో భూముల్ని ఎకరాల్లో విక్రయించడం ఎప్పుడో పోయింది. ప్రభుత్వం కూడా అక్కడ రిజిస్ట్రేషన్ ధరల్ని గజాల లెక్కనే నిర్ణయించింది. ఎన్సీసీకి కేటాయించిన భూమి రిజిస్ట్రేషన్ విలువ గజం రూ.22 వేలు ఉంది. ఆ చుట్టుపక్కల బహిరంగ మార్కెట్లో చ.గజం రూ.40 వేలకుపైనే పలుకుతోంది. సమీపంలోని వుడా లేఅవుట్లలో చ.గజం రూ.90 వేలకుపైనే పలికిన సందర్భాలున్నాయి. ఎన్సీసీకి ఇచ్చిన భూమి ఐటీ పార్కుల్ని ఆనుకునే ఉండటంతో, అక్కడ భారీ టవర్లు నిర్మిస్తే చాలా గిరాకీ ఉంటుంది. ఏ రకంగా చూసినా ఎన్సీసీకి ఇచ్చిన భూమి విలువ ప్రస్తుతం ఎకరం రూ.15 కోట్లు ఉంటుందని అంచనా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం