AP News:అమూల్ కంపెనీ కాదు.. సహకార సంస్థ
అమూల్ కంపెనీ కాదని, సహకార రంగంలో పని చేసే సంస్థని, దానికి యజమానులు మహిళా పాడి సంఘాల సభ్యులేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఇది
ఇది వచ్చిన తర్వాత పాడి రైతులకు అదనంగా రూ.10కోట్ల లబ్ధి
ప్రైవేటు డెయిరీల గుత్తాధిపత్యం చెల్లదు
కృష్ణా జిల్లాలో పాలసేకరణ ప్రారంభించిన సీఎం జగన్
ఈనాడు, అమరావతి: అమూల్ కంపెనీ కాదని, సహకార రంగంలో పని చేసే సంస్థని, దానికి యజమానులు మహిళా పాడి సంఘాల సభ్యులేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఇది రావడంతో పోటీ పెరిగి మిగిలిన సంస్థలకు దిక్కుతోచడం లేదని వ్యాఖ్యానించారు. ఈ సంస్థ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత అదనంగా పాడి రైతులు రూ.10 కోట్ల లబ్ధి పొందారని వివరించారు. బుధవారం కృష్ణా జిల్లాలో అమూల్ పాలసేకరణ జగనన్న పాల వెల్లువ కార్యక్రమాన్ని ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. కృష్ణా జిల్లాలో 264 గ్రామాల్లో పాల సేకరణ జరపనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ... ‘ఈ సంస్థకు మిగిలిన వాటికి తేడా గమనించాలి. అమూల్ దేశంలో మొదటి స్థానంలో, ప్రపంచంలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. పాల నుంచి నేరుగా చాక్లెట్ తయారు చేసే సంస్థ. లాభాపేక్ష లేకుండా వచ్చిన లాభాలనూ సభ్యులకు ఏడాది చివరన పంచుతుంది...’ అని వివరించారు. రాష్ట్రంలోని సహకార రంగంలోని డెయిరీలను ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకున్నారని, ఆస్తులు స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. మరికొంతమందికి ప్రైవేటు డెయిరీలో వాటాలు ఉండటంతో పాలకు మంచి ధర ఇవ్వాలనే ఉద్దేశం లేకుండా పోయిందని విమర్శించారు. తాను పాదయాత్ర చేసిన సమయంలో అక్కచెళ్లమ్మలు వాటర్ బాటిల్కు... పాలు లీటరు ధరకు తేడా లేకుండా పోయిందని వాపోయారని గుర్తు చేశారు. ఒకే సంస్థ గుత్తాధిపత్యం ఉన్నా.. సంస్థలు కుమ్మక్కు (సిండికేట్) అయినా రైతులకు మంచి ధర ఇవ్వకుండా మోసం చేస్తారని ఆరోపించారు. ‘పాల సేకరణలో మోసాలు, కొలతల్లో మోసాలు ఉండేవి. వాటికి అడ్డుకట్ట వేసేందుకు ఎక్కువ ధర ఇచ్చే అమూల్తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కృష్ణా జిల్లా చాట్రాయిలో పి.వెంకటేశ్వరమ్మ కృష్ణా మిల్క్ యూనియన్కు పాలు పోస్తే.. గతంలో లీటరుకు రూ.44.80 ఇచ్చేవారు. ఇప్పుడు రూ.74.78 వస్తోంది. ఒక్క లీటరుకే ఇంత భారీ వ్యత్యాసం ఉంది. గత ఏడాదిలో రూ.71 కోట్ల విలువైన 168.50 లక్షల లీటర్ల పాలు సేకరిస్తే.. రైతులకు అదనంగా రూ.10 కోట్ల ప్రయోజనం కలిగింది...’ అని సీఎం జగన్ వివరించారు.
లీటరుకు రూ.50 పైసల చొప్పున అదనంగా బోనస్: రాష్ట్రంలో 4,796 గ్రామాల్లో పాడి ఎక్కువగా ఉందని గుర్తించి రూ.1600 కోట్లతో సౌకర్యాలను కల్పిస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. 2022 సెప్టెంబరు నాటికి 17,629 గ్రామాల్లో పాల సేకరణను లక్ష్యంగా ప్రణాళిక పెట్టుకున్నామన్నారు. 182 రోజులు నిరంతరాయంగా పాలు పోస్తే.. లీటరుకు రూ.50 పైసల చొప్పున అదనంగా బోనస్ ఇస్తామని వెల్లడించారు. కృష్ణా జిల్లాతో కలిపి ఆరు జిల్లాల్లో పాల సేకరణను అమూల్ ప్రారంభించిందని, మిగిలిన ఏడు జిల్లాలోనూ ఉద్ధృతం చేస్తామని తెలిపారు. ప్రకాశంలో 245, చిత్తూరులో 275, వైఎస్సార్ కడపలో 149, గుంటూరులో 203, పశ్చిమగోదావరిలో 174 గ్రామాల్లో పాల సేకరణ జరుగుతోందని వివరించారు. పశుగణాభివృద్ధిశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. 2019లో పాల వృద్ధి రేటు 1.40శాతం ఉండగా... 2021లో అది 11.70 శాతానికి పెరిగిందని చెప్పారు. హైదరాబాద్ నుంచి అమూల్ సంస్థ ఎండీ వీఎం పటేల్ పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, మేకా ప్రతాప్ వెంకట అప్పారావు, రక్షణ నిధి, జగన్మోహన్రావు పాల్గొన్నారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఎపీ డెయిరీ అభివృద్ధి సంస్థ ఎండీ బాబు పాల్గొన్నారు.
తెలంగాణలో రూ.500 కోట్లతో అమూల్ ప్లాంటు
ఈనాడు, హైదరాబాద్: ప్రసిద్ధ పాడి ఉత్పత్తుల సంస్థ అమూల్ తెలంగాణలో రూ. 500 కోట్లతో భారీ డెయిరీ ప్లాంటు ఏర్పాటు చేయనుంది. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా రోజుకు ఐదు లక్షల లీటర్ల పాల ఉత్పత్తుల సామర్థ్యంతో దీనిని స్థాపించి, భవిష్యత్తులో దీన్ని పది లక్షల లీటర్లకు పెంచనుంది. 18 నుంచి 24 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి కార్యకలాపాలను ప్రారంభిస్తుంది. సిద్దిపేట జిల్లా వర్గల్ వద్ద 50 ఎకరాల్లో ఏర్పాటుచేయనున్న ఈ ప్లాంట్ ద్వారా 500 మందికి పైగా ప్రత్యక్షంగా, మరో రెండువేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. బ్రెడ్, బిస్కెట్, స్నాక్స్, సంప్రదాయిక మిఠాయిలు తదితర బేకరీ ఉత్పత్తుల డివిజన్ను సైతం ఏర్పాటు చేయనుంది. తమ ఉత్పత్తులకు అవసరమైన పాలను తెలంగాణ రైతులు, సమాఖ్యలు, సహకార సంఘాల నుంచి నుంచే సేకరిస్తామని తెలిపింది. బుధవారం పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు సమక్షంలో అమూల్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ