AP sachivalayam: జులై 1 నుంచి ప్రొబేషన్
ఖరారుపై రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. రెండేళ్ల సర్వీసు పూర్తయి శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారందరికి ఈ నెలాఖరులోగా ప్రొబేషన్ ఖరారు చేయాలంటూ కలెక్టర్లకు అధికారాలు ఇచ్చింది.
సచివాలయాల ఉద్యోగుల మూలవేతనం రూ.22,460 నుంచి ప్రారంభం
రెండేళ్ల సర్వీసు, పరీక్షల్లో ఉత్తీర్ణతే అర్హతలు
నెలాఖరులోగా ప్రక్రియ పూర్తికి ఆదేశం
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఈనాడు, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారుపై రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. రెండేళ్ల సర్వీసు పూర్తయి శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారందరికి ఈ నెలాఖరులోగా ప్రొబేషన్ ఖరారు చేయాలంటూ కలెక్టర్లకు అధికారాలు ఇచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-5, వార్డు అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శుల మూలవేతనం రూ.23,120 నుంచి ప్రారంభమవుతుంది. మిగతా ఉద్యోగుల మూలవేతనం రూ.22,460 నుంచి మొదలవుతుంది. దీనికి కరవుభత్యం, అద్దె భత్యం అదనంగా కలవనున్నాయి. 2022 పీఆర్సీ ప్రకారం నిర్ణయించిన ఈ వేతనాలు జులై నెల నుంచి వర్తింపజేస్తుండగా, ఉద్యోగులు ఆగస్టులో అందుకోనున్నారు. రాష్ట్రంలో 2019 అక్టోబరులో ప్రారంభమైన 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రభుత్వం 1.21 లక్షల మంది ఉద్యోగులను నియమించింది. 2019-20, 2020-21లో రెండు విడతల్లో నియామక ప్రక్రియ పూర్తి చేశారు. గ్రామ సచివాలయాల్లో 11 మంది, వార్డు సచివాలయాల్లో 8 మంది చొప్పున సిబ్బందిని నియమించారు. వీరికి ఇప్పటివరకు నెలకు రూ.15 వేల చొప్పున చెల్లిస్తున్నారు. రెండేళ్ల సర్వీసు పూర్తయి శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులైన ఉద్యోగులకు 2021 అక్టోబరు నాటికే ప్రొబేషన్ ఖరారు చేసి కొత్త వేతనాలు ఇవ్వనున్నట్లు తొలుత ప్రకటించినప్పటికీ, ఎనిమిది నెలలు ఆలస్యంగా తాజా జీవో వెలువడింది.
అర్హుల సంఖ్యపై అస్పష్టత: ప్రొబేషన్ ఖరారయ్యే ఉద్యోగుల సంఖ్యపై ఇప్పటికీ స్పష్టత లేదు. దాదాపు లక్ష మందికి అర్హత ఉంటుందని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు చెబుతున్నారు. రెండేళ్ల సర్వీసు పూర్తయినా.. శాఖాపరమైన పరీక్షల్లో ఇంకా చాలామంది ఉత్తీర్ణులు కాలేదు. గత ప్రభుత్వాల హయాంలో పేదలకు నిర్మించిన ఇళ్ల క్రమబద్ధీకరణకు ఉద్దేశించిన వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) కింద పేదల నుంచి వసూలు చేసిన రూ.82.46 కోట్లకు సచివాలయాల ఉద్యోగులు లెక్కలు చెప్పాలని ఆ శాఖ ఇటీవల కలెక్టర్లను ఆదేశించింది. ఈ మొత్తానికి లెక్కలు చెప్పిన ఉద్యోగులకే ప్రొబేషన్ ఖరారు చేయాలని సూచించింది. ఈ కారణంగానూ ఎందరు అనర్హులుగా మిగిలిపోతారన్నది స్పష్టత కొరవడింది.
ఎవరు.. ఎవరి ప్రొబేషన్ ఖరారు చేస్తారు?
* కలెక్టర్: పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-5, డిజిటల్ అసిస్టెంట్ (పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-6), ఎనర్జీ అసిస్టెంట్, వెల్ఫేర్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్, వెటర్నరీ, ఫిషరీస్ అసిస్టెంట్, గ్రామ మహిళా పోలీస్, గ్రామ రెవెన్యూ అధికారి (గ్రేడ్-2), వార్డు రెవెన్యూ కార్యదర్శి, వార్డు మహిళా పోలీస్
* సర్వే సహాయ సంచాలకులు: గ్రామ సర్వేయర్ (గ్రేడ్-3)
* వ్యవసాయ సంచాలకులు: అగ్రికల్చరల్ అసిస్టెంట్
* జిల్లా పట్టుపరిశ్రమ అధికారి: సెరికల్చర్ అసిస్టెంట్
* విద్యుత్తు పంపిణీ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్: గ్రామ, వార్డు ఎనర్జీ అసిస్టెంట్
* వైద్య, ఆరోగ్యశాఖ ప్రాంతీయ సంచాలకులు: ఏఎన్ఎం, వార్డు హెల్త్ కార్యదర్శి
* పురపాలక ప్రాంతీయ సంచాలకులు: వార్డు పరిపాలన కార్యదర్శి, వార్డు శానిటేషన్, పర్యావరణ కార్యదర్శి, విద్యా, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి, సంక్షేమ, అభివృద్ధి కార్యదర్శి (గ్రేడ్-2)
* ప్రజారోగ్య పర్యవేక్షక ఇంజినీర్ (ఎస్ఈ): వార్డు ఎమినిటీస్ కార్యదర్శి (గ్రేడ్-2)
* పట్టణ ప్రణాళిక ప్రాంతీయ ఉప సంచాలకులు: వార్డు ప్లానింగ్, రెగ్యులేషన్ కార్యదర్శి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ
పల్లెపల్లె తిరిగినాదో అమ్మా భువనమ్మ- ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ జనం గుండెల్లో కొలువైనాది.. కష్టాలు కన్నీళ్లు తుడిపేసింది. -
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం
అధికార పార్టీ నేతల ఫొటోలు, హోర్డింగులు తొలగించడంలో చర్యలు తీసుకోని అధికారులు.. నిరుపేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్కు మాత్రం నిబంధనలు వర్తిస్తాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
ఉత్తర కోస్తాలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?
తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో తోపులాటలు చోటుచేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి అంతరాయం ఏర్పడిన ఘటనపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. -
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. -
బోరు వేసుకుంటారా.. రూ. 10 వేలు కట్టండి
తిరుపతిలోని అధికార పార్టీ కార్పొరేటర్ల అసలు రంగును బయటపెడుతూ సోమవారం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఐదేళ్లూ షాక్.. ఎన్నికలని బ్రేక్!
పాదయాత్ర పేరిట ఊరూవాడా తిరిగిన జగన్... విద్యుత్ ఛార్జీలపై అలవోకగా అబద్ధాలు వల్లెవేశారు. మాటల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించారు. -
వైకాపా సైన్యం బరితెగింపు
ఎన్నికల సంఘం నిఘా పరిధిలో ఉన్నామన్న బెరుకు లేదు.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నామన్న అదురూ లేదు. -
వేతనాల చెల్లింపులపై నేడు ‘చివరి గ్రీవెన్స్ డే’
వేతనాల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా జిల్లా కేంద్రాలలో మంగళవారం నిర్వహించే చివరి ‘గ్రీవెన్స్ డే’(వినతుల స్వీకరణ)లో పరిష్కరించుకోవాలని ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ సూచించారు. -
జగన్పై పోస్టులో అభ్యంతరకర భాగాన్ని తొలగించండి
వైకాపా అధ్యక్షుడు జగన్పై తెదేపా ఎక్స్ ఖాతాలో ఉంచిన పోస్టులో అభ్యంతరకరమైన ఓ భాగాన్ని తొలగించాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సోమవారం లేఖ రాసింది. -
కక్షిదారులకు వెంటనే న్యాయం అందించాలి
న్యాయస్థానాల్లో కక్షిదారులకు వేగంగా న్యాయం జరిగేలా న్యాయవాదులు చొరవ తీసుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. -
ఓఎంఆర్ షీట్లో గల్లంతైన విద్యార్థిని పేరు
విద్యాశాఖ అధికారుల తీరుతో పదో తరగతి విద్యార్థిని అరగంటపాటు తల్లడిల్లాల్సి వచ్చింది. తిరుపతి నగరంలోని సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.వర్షిణి తనకు కేటాయించిన బైపాస్లోని రత్నం పరీక్షా కేంద్రం వద్దకు అరగంట ముందుగానే చేరుకుంది. -
కోడ్ కూసే ముందు.. అయినవారికే నిధులు
ఇప్పటికే పలు దఫాలు సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ పరిధిలో రహదారుల పనులు చేసిన గుత్తేదార్లకు మాత్రమే చెల్లింపులు చేశారంటూ ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. -
కాసులివ్వని కపట ప్రేమ!
పేరుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డబ్బులు జమ చేస్తున్నట్లు ప్రకటిస్తారు.. రైతులకు మాత్రం సున్నా వడ్డీ లేదు. పెట్టుబడి సాయమూ లేదు. -
గ్రహణం వీడితేనే గట్టెక్కేది!
చుట్టూ నీళ్లలో నిరుపయోగంగా ఉన్న ఈ నిర్మాణాలు టిడ్కో ఇళ్లు. ఒంగోలు నగరం సమీపంలోని చింతల వద్ద తెదేపా హయాంలో నిర్మించారు. -
ఈఏపీసెట్ పరీక్ష తేదీల్లో మార్పు
ఎన్నికల నేపథ్యంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ పరీక్ష షెడ్యూల్ మారనుంది. -
ఉత్తుత్తి సంక్షేమం
‘గడప గడపకు సంక్షేమం’ పేరుతో వైకాపా ప్రభుత్వం పేదలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోంది. -
కోడ్ ఉల్లంఘన విచారణలో జాప్యం: కలెక్టర్ ఆగ్రహం
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వాలంటీర్ల వివరాల సేకరణలో జాప్యం జరగడంతో గుంటూరు జిల్లా కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇదేం సామాజిక న్యాయం జగన్?
వైకాపా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సామాజిక న్యాయం నేతి బీర చందంగా ఉంది. రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాను కలిపి వైకాపా టికెట్ల కేటాయింపు పరిశీలిస్తే.. జగన్ మార్క్ న్యాయం ఏమిటన్నది స్పష్టమవుతోంది. -
సీపీఎస్ ఉద్యోగుల డబ్బులు రూ.2,800 కోట్లు హాంఫట్
జగన్ సర్కార్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులపై కక్షకట్టినట్లు వ్యవహరిస్తోంది. -
ఆగని సలహాదారు నియామకాల జోరు
ప్రభుత్వశాఖలకు సలహాదారుల నియామకంపై హైకోర్టు అభ్యంతరం చెప్పినా జగన్ ప్రభుత్వ తీరు మారడంలేదు.
తాజా వార్తలు (Latest News)
-
Social Look: కృతి సనన్ ‘క్రూ’ సంగతులు.. వేడుకలో మృణాల్, కియారా మెరుపులు
-
Israel Hamas Conflict: యుద్ధ తంత్రంగా ఆకలి మంటలు: ఐరాస ఆందోళన
-
Meta: ఎన్నికల్లో ఏఐ నకిలీ సమాచార కట్టడి.. మెటా ప్రత్యేక చర్యలు
-
YSRCP: ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. వైకాపా ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసు
-
Manjummel Boys: ‘మంజుమ్మెల్ బాయ్స్’ సరికొత్త రికార్డు.. ఆ విషయంలో తొలి మలయాళ సినిమా
-
Suryakumar Yadav: ఐపీఎల్ మ్యాచ్లకు సూర్య దూరమేనా? ఇన్స్టా పోస్ట్ వైరల్