Andhra News: ఏటా ఉద్యోగాలు భర్తీ చేయకుంటే కష్టమే!
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ కార్యాలయాలు సక్రమంగా పని చేయాలంటే ఖాళీ అవుతున్న పోస్టులను గుర్తించి, ప్రతి ఏటా భర్తీ చేయాల్సిందేనని అశుతోష్ మిశ్ర కమిటీ నివేదిక ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కార్యాలయాలు ఒక పద్ధతి ప్రకారం,
కార్యాలయాల సమర్థ పనితీరుకు ఇది తప్పనిసరి
అశుతోష్ మిశ్ర కమిటీ నివేదిక సిఫార్సు
రాష్ట్రంలో పరిస్థితి ఇందుకు భిన్నం
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ కార్యాలయాలు సక్రమంగా పని చేయాలంటే ఖాళీ అవుతున్న పోస్టులను గుర్తించి, ప్రతి ఏటా భర్తీ చేయాల్సిందేనని అశుతోష్ మిశ్ర కమిటీ నివేదిక ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కార్యాలయాలు ఒక పద్ధతి ప్రకారం, సమర్థంగా పని చేయాలంటే ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేయడం ముఖ్యమని పేర్కొంది. ఏళ్ల తరబడి ఖాళీలను నింపకుండా.. ఒకేసారి వాటిని భర్తీ చేస్తే రెండు రకాలుగా ఇబ్బందులు ఎదురవుతాయని అభిప్రాయపడింది. దీనివల్ల ఒకేసారి ఉద్యోగాల భర్తీ, ఒకేసారి పదవీ విరమణ వంటి పరిస్థితులు ఏర్పడతాయని వివరించింది. ‘ప్రతి ప్రభుత్వశాఖా ఎప్పటికప్పుడు ఉద్యోగాలు భర్తీ చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఏటా దీన్ని నవీకరించి, ఎప్పుడు ఎన్ని ఖాళీలు వస్తున్నాయన్న సమాచారం సిద్ధంగా ఉంచుకోవాలి. పదవీ విరమణ, పదోన్నతుల వల్ల ఏర్పడే ఖాళీలపై కూడా స్పష్టత ఉండాలి. ఏపీపీఎస్సీ ద్వారా లేదా జిల్లా ఎంపిక కమిటీల సాయంతో లేదా కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలి’ అని అశుతోష్ కమిటీ కుండ బద్దలు కొట్టింది.
ఉద్యోగాల ఖాళీల వల్ల పనితీరుపై ప్రభావం పడుతోందని, ఇది ఇప్పటికే ఉన్న ఉద్యోగులపై ఒత్తిడి పెంచుతోందంటూ ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన అనేక అభ్యర్థనలను కమిటీ అందుకుందని తెలిపింది. ప్రధానంగా జిల్లా, డివిజన్ స్థాయిల్లో ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయని నివేదిక పేర్కొంది. మరోవైపు సరైన సేవలందక ప్రజలూ అసంతృప్తితో ఉంటున్నారని ఉద్యోగులు పేర్కొన్నట్లు నివేదికలో వెల్లడించారు.
తన దృష్టికి వచ్చాయంటూ కమిటీ ప్రస్తావించిన అంశాలివీ..
* ప్రధానంగా వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, పశుసంవర్థకం, వ్యవసాయ, భూ పరిపాలన శాఖల్లో 20శాతానికి మించి ఖాళీలు ఉన్నాయి.
* వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.
* ఎయిడెడ్ విద్యా సంస్థల్లోనూ భారీగా ఖాళీలున్నా భర్తీ చేయడం లేదు.
* ఏఈ, ఏఈఈ వంటి ఉద్యోగులున్నా వారికి సాయం అందించాల్సిన సిబ్బంది కొరత ఉంటోంది.
* వైద్య ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం వల్ల పని భారం పెరగడంతో పాటు సెలవులూ వినియోగించుకోలేని పరిస్థితి ఉంది.
* సర్వే ఉద్యోగులకూ అధిక పని ఒత్తిడి ఉంది.
* రెవెన్యూలో పని భారానికి, సిబ్బందికీ సంబంధం లేకుండా ఉంది.
ఏటా క్యాలండర్ లేదు.. భర్తీ లేదు!
ఒకవైపు అశుతోష్ మిశ్ర కమిటీ ఉద్యోగాల భర్తీ తప్పనిసరి అని విస్పష్టంగా ప్రకటించింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఎప్పుడో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేశారు. అశుతోష్ మిశ్ర కమిటీ పేర్కొన్న ఉద్యోగాలేవీ ఆ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినవి కావు. ప్రతి జనవరిలోనూ జాబ్ క్యాలండర్ ఇస్తామని ప్రకటించారు. జనవరిలో ఆ ఊసే లేదు. కిందటి ఏడాది జూన్లో 10,143 ఉద్యోగాలను 2022 మార్చి నెలాఖరులోపు భర్తీ చేస్తామన్నారు. అందులో వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాల కోసం మినహా అనేక నోటిఫికేషన్లు రానేలేదు. గ్రూపు 1, 2 ఉద్యోగాల నోటిఫికేషన్కు దిక్కే లేదు. పోలీసు ఉద్యోగాల భర్తీ చేయలేదు. డీఎస్సీ ప్రకటిస్తామని ఇచ్చిన హామీ నెరవేరలేదు. ఈ ఏడాది జనవరిలోనూ జాబ్ క్యాలండర్నూ విడుదల చేయలేదు. ఈ పరిస్థితుల్లో అటు ఉద్యోగులూ, ఇటు నిరుద్యోగులూ అసంతృప్తితో ఉన్నారు.
‘కొత్త శతాబ్దిలో పౌరుల నుంచి వస్తున్న సమకాలీన డిమాండ్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన విధంగా స్పందించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజల్లో అక్షరాస్యత, అవగాహన స్థాయి పెరగడం వల్ల ప్రభుత్వంపైనా ఉద్యోగులపైనా ఒత్తిడి కూడా పెరుగుతోంది. ప్రజలు అవినీతిరహిత, పారదర్శక పాలన కోరుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజా పాలన, ప్రభుత్వ వ్యవస్థలు, సంస్థల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన దిశగా అడుగులు వేయక తప్పదు. తక్కువ వ్యయంతోనే నాణ్యమైన సేవలు అందించాల్సి ఉంది. ఉద్యోగులు, అధికారుల తీరు మారడం, నైపుణ్యం పెరగడం వంటివి ప్రధానాంశాలవుతున్నాయి. కొత్త పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మానవ వనరులకు సంబంధించి సరైన ప్రణాళికతో ముందుకు సాగాల్సి ఉంది’
- అశుతోష్ మిశ్ర నివేదిక
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్