Azadi Ka Amrit Mahotsav: మహాత్మా ఏమిటీ చరఖా గోల?
ఆయన ‘మహాత్మా’ అని పిలిస్తే... ఈయనేమో ‘గురుదేవ్’ అంటూ బదులిచ్చేవారు! ఇలా ఒకరినొకరు ఎంతో గౌరవించుకునే, ఆత్మీయంగా అభిమానించుకునే ఆ ఇద్దరు... జాతీయోద్యమంలో అత్యంత కీలకమైన కొన్ని అంశాలపై తీవ్రంగా విభేదించుకున్నారు!
ఆయన ‘మహాత్మా’ అని పిలిస్తే... ఈయనేమో ‘గురుదేవ్’ అంటూ బదులిచ్చేవారు! ఇలా ఒకరినొకరు ఎంతో గౌరవించుకునే, ఆత్మీయంగా అభిమానించుకునే ఆ ఇద్దరు... జాతీయోద్యమంలో అత్యంత కీలకమైన కొన్ని అంశాలపై తీవ్రంగా విభేదించుకున్నారు! వారే రవీంద్రనాథ్ ఠాగూర్, మహాత్మాగాంధీ! ఒకరిపై ఒకరు బహిరంగంగానే వ్యాసాలు రాసుకున్నారు. వారిద్దరి మధ్య చిచ్చుకు కారణమైనవాటిలో ప్రధానమైంది చరఖా!
జాతీయోద్యమ సారథ్య బాధ్యతలు చేపట్టి విదేశీ వస్త్రాల బహిష్కరణకు పిలుపునిచ్చిన గాంధీజీ చరఖాను ఆంగ్లేయ సామ్రాజ్యవాదంపై బలమైన భారతీయ అస్త్రంగా ఎంచుకున్నారు. బ్రిటిష్ యంత్రాలకు పోటీగా స్వదేశీ స్వావలంబన చిహ్నంగా దీన్ని భావించారు. అంతేగాకుండా... చరఖాను స్వదేశీ మంత్రంగా, ఆర్థిక విప్లవ బీజంగా, గ్రామాల్లో పేదరిక నిర్మూలన సాధనంగా, వేడి నీళ్లకు చన్నీళ్ల తోడులాంటి ఆదాయంగా... అన్నింటికీ మించి ఆత్మగౌరవ పతాకంగా చూశారాయన! దోపిడి లేని, ఒకరినొకరు గౌరవించుకునే స్వాభిమాన, స్వావలంబిత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను తీసుకురావటంలో చరఖా ప్రధాన పాత్ర పోషిస్తుందని గాంధీజీ నమ్మారు. అంతేగాకుండా.. నానాటికీ యంత్రాలకు బానిసలమైపోతున్న మనుషులను ఇది తట్టిలేపుతుందని భావించారు. ‘‘చరఖాపై వడుకుతూనే ఊపిరి ఆగాలనేది నా కోరిక. నా దృష్టిలో ఇది స్వయం సహాయక సాధనం. శ్రమకు గౌరవం. మానవీయ విలువలకు దర్పణం. అమూర్తమైన అహింస భావనకు ఇది ప్రతిరూపం’’ అని నిర్వచించిన గాంధీజీ చరఖాపై తాను వడికిన ప్రతి పోగులోనూ దేవుడిని చూశారు. నిజానికి భారత్కు తిరిగి వచ్చేదాకా ఆయనకు చరఖాతో పరిచయం లేదు. 1917లో తొలిసారిగా సబర్మతి ఆశ్రమంలో గంగా బెన్ మజుందార్ అనే సామాజిక కార్యకర్త ఆయనకు చరఖాను పరిచయం చేశారు. మగన్లాల్ గాంధీ ద్వారా చరఖా తిప్పటం నేర్చుకున్న గాంధీజీ క్రమక్రమంగా అందులో నైపుణ్యం సాధించారు. ఎంతగా అంటే చరఖా చక్రంలో మార్పులు చేసి... ఆశ్రమంలోనే దాన్ని తయారు చేయించేంతగా! అలా సబర్మతి ఆశ్రమంలో చరఖాను రోజువారీ విధుల్లో తప్పనిసరి చేశారు. ఎక్కడ ప్రసంగించినా చరఖా ప్రస్తావన తప్పకుండా ఉండేది. అందరినీ చరఖాపై నూలు వడికేందుకు ప్రోత్సహించేవారు. దీంతో దేశంలో ఎక్కడ చూసినా చరఖా మాటే వినిపించేది. కనిపించేది. జాతీయ కాంగ్రెస్ జెండా, స్వరాజ్య జెండాల్లోనూ చరఖాకు చోటు కల్పించారు.
ఇది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్కు చికాకు తెప్పించింది. స్వరాజ్య సాధనకు అవసరమైన ఇతర కార్యక్రమాలు, చేపట్టాల్సిన ఉద్యమాల కంటే చరఖా ఆరాధన శ్రుతి మించుతోందని పించింది. దీనిపై ఆయన కలకత్తాకు చెందిన మాడర్న్ రివ్యూ పత్రికలో వ్యాసాలు రాశారు. ‘అన్నీ పక్కకు పోయి... చరఖాకు ఎక్కడలేని ప్రాధాన్యం ఇస్తున్నట్లు అనిపిస్తోంది. నిజంగా చరఖా అంత శక్తిమంతమైందా? కోట్ల మంది భారతీయులను భక్తులుగా మార్చగల దైవశక్తిగలదా? నూలు ఉండలోని దారమంతా పూర్తయినా విష్ణువు వరమివ్వడు... ఆయన భార్య లక్ష్మి మనల్ని కరుణించదు. ఒకప్పుడు అందరినీ సంపన్నులుగా చేసిన ఈ చరఖా చప్పుడు... ఇప్పుడు అభివృద్ధి దిశగా నడిపించబోదు. స్వరాజ్య ఉద్యమం నడవాలంటే బయటి చక్రాలు, చరఖాలు కాదు... అంతర్ చరఖాలు తిరగాలి. మనసులు కలిసి కదలాలి. నా మనసైతే ఎందుకో ఈ చరఖాతో కదలటం లేదు’ అంటూ గాంధీ పద్ధతిని ఠాగూర్ ప్రశ్నించారు. అసలు పనికంటే చిహ్నానికి ప్రాధాన్యం పెరుగుతోందన్నది ఆయన ఆవేదన.
చరఖా తిప్పడమంటే..
కొద్ది నెలల తర్వాత 1925 నవంబరులో గాంధీజీ తన పత్రిక యంగ్ ఇండియాలో ఠాగూర్కు బదులిచ్చారు. ‘‘కవులు తమదైన ఊహాలోకంలో విహరిస్తుంటారు. వారి మాటలను యథాతథంగా తీసుకుంటే వారికే కాదు, మనకు మనం కూడా హాని చేసుకున్నవారమవుతాం. కవి (ఠాగూర్) రాసిన వ్యాసంలో నేను మార్చుకోవాల్సినవి ఏమీ కనిపించలేదు. చరఖా గురించి ఎద్దేవా చేస్తూ ఆయన రాసిన మాటలేవీ నేనెన్నడూ అనలేదు. ప్రతి ఒక్కరూ చరఖా తిప్పండన్న నా పిలుపు బహుశా... ప్రజలంతా తాము చేసే వృత్తులు, పనులు విడిచి పెట్టుకొని 24 గంటలూ చరఖానే తిప్పుతూ కూర్చోండని అన్నట్లుగా ఆయనకు అర్థమై ఉంటుంది. కానీ నేనెప్పుడూ అలా చెప్పలేదు. రోజులో ఓ అరగంట సేపు దేశం కోసం చరఖా తిప్పుతూ త్యాగం చేయమన్నానంతే! చరఖా తిప్పడమంటే మన పనిని గౌరవించు కుంటున్నామని అర్థం’’ అని గాంధీజీ స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.