bill payments: బిల్లుల గోస!
బిల్లులు... బకాయిలు... పెండింగు... నిధుల కొరత... రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో వివిధ పనులు చేస్తున్న వారిని కొన్ని నెలలుగా వెంటాడుతున్న మాటలివి. సకాలంలో డబ్బులు చేతికందక బాధితులు అప్పుల పాలవుతున్నారు. వాటిలో మచ్చుకు మూడింటిని పరిశీలిస్తే.... కరోనా సమయంలోనూ అధికారుల ఒత్తిడితో ‘నవరత్నాలు... పేదలందరికీ ఇళ్ల’ను నిర్మించుకుంటున్న
ఇల్లు కట్టుకుంటున్నా బిల్లు ఇవ్వరేం!
* గృహ నిర్మాణ బకాయిలు రూ.500 కోట్లు
* 5.90 లక్షల నరేగా పనిదినాల బిల్లూ పెండింగే
అప్పులతో వడ్డింపు
* మధ్యాహ్న భోజన వంట నిర్వాహకులకు వెతలు
* రాష్ట్రవ్యాప్తంగా రూ.55 కోట్ల బకాయిలు
పాత బకాయిల ఊసేలేదు
* ఎల్ఈడీ వీధి దీపాల ప్రాజెక్టు చుట్టూ చీకట్లు
* పంచాయతీలకు పూర్తిగా బాధ్యత అప్పగించే యత్నం
బిల్లులు... బకాయిలు... పెండింగు... నిధుల కొరత... రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో వివిధ పనులు చేస్తున్న వారిని కొన్ని నెలలుగా వెంటాడుతున్న మాటలివి. సకాలంలో డబ్బులు చేతికందక బాధితులు అప్పుల పాలవుతున్నారు. వాటిలో మచ్చుకు మూడింటిని పరిశీలిస్తే.... కరోనా సమయంలోనూ అధికారుల ఒత్తిడితో ‘నవరత్నాలు... పేదలందరికీ ఇళ్ల’ను నిర్మించుకుంటున్న వారికి రూ.500 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. చేతిలో డబ్బు లేకపోవడంతో ఆపై పనులు చేపట్టేందుకు లబ్ధిదారులు ససేమిరా అంటున్నారు. ఈ పథకంలో భాగంగా ఉపాధి హామీ పథకం(నరేగా) కింద చెల్లించాల్సిన రూ.14 కోట్లూ విడుదలవడంలేదు. తక్కువ విద్యుత్తు వినియోగంతో గ్రామాల్లో వెలుగులు నింపేందుకు తీసుకొచ్చిన ఎల్ఈడీ వీధి దీపాల పథకానిదీ అదే దారి. పథకాన్ని నిర్వహిస్తున్న ఇంధన సంస్థలకు ప్రభుత్వం రూ.28 కోట్లకుపైగా బకాయి పడింది. చెల్లింపుల్లో తీవ్ర జాప్యంపై మొరపెట్టుకుంటున్నా సరైన స్పందన లేదని బాధితులు వాపోతున్నారు. ఇక పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వంట చేస్తున్న
మహిళలకూ బకాయిల బెడద తప్పడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా 41.60 లక్షల మంది విద్యార్థులకు వండిపెడుతున్న ఏజెన్సీల బాధ్యులకు రూ.55 కోట్ల వరకు రావాల్సి ఉంది. పిల్లలకు భోజనం ఆపకూడదనే ఉద్దేశంతో మహిళలు ప్రైవేటుగా వడ్డీలకు అప్పులు తెస్తూ పథకాన్ని కొనసాగిస్తుండటం గమనార్హం.
ఇల్లు కట్టుకుంటున్నా బిల్లు ఇవ్వరేం!
ఈనాడు డిజిటల్, అమరావతి: లబ్ధిదారులు తక్షణమే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా ఒత్తిడి చేస్తున్న ప్రభుత్వం బిల్లుల చెల్లింపులో మాత్రం జాప్యం చేస్తోంది. కరోనా కష్టకాలంలోనూ అధికారుల సూచన మేరకు అప్పోసప్పో చేసి పనులు ప్రారంభిస్తున్న పేదలు... సకాలంలో డబ్బుల రాక ఇబ్బందులు పడుతున్నారు. మొదటి విడతగా చేపట్టిన ఇళ్లన్నీ సెప్టెంబరు నెలాఖరుకు బేస్మెంట్ స్థాయికి చేరే గడువు నిర్దేశించిన ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని చేరిన వాటికి బకాయిలు చెల్లించడంలో ఆలస్యం చేస్తోంది.
బేస్మెంట్ స్థాయి దాటినవి 1.70 లక్షలు
పురపాలక సంఘాలు, పట్టణాభివృద్ధి సంస్థల్లో మొదటి విడతగా చేపట్టిన 15.60 లక్షల ఇళ్ల నిర్మాణంలో 1.70 లక్షల గృహాల నిర్మాణాలు బేస్మెంట్, ఆపై స్థాయికి చేరాయి. వీటికిగాను ఇప్పటివరకు రూ.400 కోట్ల వరకు బిల్లులను చెల్లించగా.... ఇంకా దాదాపుగా రూ.500 కోట్ల మేర పెండింగ్ ఉన్నాయి. ప్రస్తుతం ఆగస్టు 15 వరకు ఉన్న బిల్లులను ప్రభుత్వం విడుదల చేసింది. ఆ తర్వాత అప్లోడ్ చేసిన వాటికి చెల్లింపులు లేవు. రాష్ట్రంలో రోజుకు రూ.15-20 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి.
పునాది దశలోనే 8 లక్షల గృహాలు
జులైలో చేపట్టిన సామూహిక శంకుస్థాపనలో దాదాపు 10 లక్షల గృహాలకు భూమిపూజ చేయగా... వాటిలో ఇప్పటికీ 8 లక్షల గృహాలు పునాది స్థాయిలోనే ఉన్నాయి. చేతిలో డబ్బు లేక ఆపై పనులు చేపట్టేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తుందేమోనని ఎదురుచూస్తున్న వారూ ఉన్నారు. ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించి, బిల్లులందని వారు మాత్రం... తాము ఖర్చు చేసిన మొత్తం చేతికందితే తప్ప ఇక ముందుకెళ్లే పరిస్థితి లేదని క్షేత్రస్థాయిలో అధికారులకు తెగేసి చెబుతున్నారు.
ఉపాధి హామీ పనిదినాల డబ్బులకూ ఎదురుచూపులే
పట్టణాభివృద్ధి సంస్థల్లో చేపట్టే ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీ రూ.1.50 లక్షలతోపాటు ఉపాధి హామీ పథకం(నరేగా) కింద రూ.30 వేలు వినియోగించుకోవచ్చు. ఈ మొత్తాన్ని నిర్మాణం పూర్తయ్యేలోపు నాలుగు విడతల్లో లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయాలి. బేస్మెంట్ స్థాయికి 28 పనిదినాలు, ప్లింత్స్థాయికి 24, లింటెల్స్థాయికి 10, రూఫ్స్థాయికి 28 పనిదినాలకు కూలి ఇవ్వాలి. వీటి చెల్లింపు గడువు 15 రోజులకు మించకూడదు. ఇళ్ల నిర్మాణాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 9.21 లక్షల పనిదినాలు జరిగాయి. వీటిలో 3.30 లక్షల దినాలకు చెల్లింపులు జరిగాయి. ఇంకా 5.90 లక్షల పనిదినాల కూలి పెండింగ్లో ఉంది. ఒక పనిదినానికి రూ.245 చొప్పున మొత్తం రూ.14 కోట్లు చెల్లించాల్సి ఉంది.
బిల్లుల చెల్లింపు కేంద్ర పరిశీలనలోనే..
కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టే పథకాలకు సంబంధించి చెల్లింపులను తప్పనిసరిగా పబ్లిక్ ఫైనాన్స్ మానిటరింగ్ సిస్టమ్(పీఎఫ్ఎమ్ఎస్)లో నమోదు చేయాలని కేంద్రం ఆదేశించింది. గృహనిర్మాణానికి ఇచ్చే రాయితీ దాదాపు కేంద్రమే భరిస్తున్న నేపథ్యంలో ప్రతి వ్యవహారాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. సిమెంటు, ఇనుము సరఫరాకు గుత్తేదారులకు, లబ్ధిదారులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్(డీబీటీ) విధానంలో జరిగే చెల్లింపులను సవివరంగా పొందుపరుస్తున్నారు. ఈ వివరాలు నమోదు చేయని పక్షంలో కేంద్రం నుంచి రాయితీ విడుదల కాదు. అందుకే లబ్ధిదారుల బ్యాంకు ఖాతా నంబర్లు, ఐఎఫ్ఎస్సీ కోడ్, ఆధార్ కార్డు వివరాలను పీఎఫ్ఎమ్ఎస్లో అప్లోడ్ చేశారు.
అప్పులతో వడ్డింపు
*అనంతపురం జిల్లా కల్లూరు జిల్లాపరిషత్తు పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఏజెన్సీకి మార్చి, ఏప్రిల్లో వంట చేసిన బిల్లులు రూ.66,138 ఇంతవరకు విడుదల కాలేదు. ఇక్కడ పనిచేస్తున్న నలుగురు వర్కర్లకు రూ.48 వేల వరకు జీతం బకాయి ఉంది.
* నెల్లూరు గ్రామీణ మండలం కోడూరుపాడు ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ఏజెన్సీకి రూ.3లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది. - విశాఖపట్నం జిలవరం ప్రాథమిక పాఠశాల మెయిన్, జిల్లా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాలల వంట ఏజెన్సీకి రూ.3లక్షల వరకు బిల్లు రావాల్సి ఉంది.
రాష్ట్రంలో పాఠశాలల మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు బిల్లుల బకాయిలు పేరుకుపోయాయి. విద్యార్థుల ఆకలి తీర్చేందుకు చాలామంది వంట నిర్వాహకులు కిరాణ దుకాణాలలో అప్పులు పెట్టి సరకులు తెస్తుండగా... మరికొందరు వడ్డీలకు అప్పులు తీసుకుంటున్నారు. కరోనా కారణంగా గతేడాది నవంబరు 2నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 30 వరకు పాఠశాలలు కొనసాగాయి. ఈ సమయంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీలు వంట చేసి, పిల్లలకు వడ్డించాయి. ఆ తర్వాత కొవిడ్ రెండోవేవ్ రావడంతో పాఠశాలలు మూతపడ్డాయి. తాజాగా ఆగస్టు 16 నుంచి పునఃప్రారంభమయ్యాయి. పాఠశాలలు కొనసాగిన సమయంలో వడ్డించిన భోజనాలకు చాలామందికి బిల్లులు విడుదల కాలేదు. రాష్ట్రంలో వంట ఏజెన్సీలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.80 కోట్ల వరకు ఉండగా... ఇటీవల రూ.25 కోట్లే విడుదల చేశారు. ఇంకా రూ.55 కోట్లు రావాల్సి ఉంది.
పెరిగిన ధరలతోనూ సమస్యలు
పప్పులు, వంటనూనెలు, గ్యాస్ ధరలు పెరిగాయి. విద్యార్థులు అధికంగా ఉన్నచోట ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ప్రాథమిక పాఠశాల విద్యార్థికి రోజుకు రూ.4.97, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థికి రోజుకు రూ.7.45 చొప్పున చెల్లిస్తున్నారు. 1-8 తరగతుల వ్యయాన్ని కేంద్రం, 9, 10 తరగతుల వ్యయాన్ని రాష్ట్రం భరిస్తున్నాయి. వంట కార్మికులకు నెలకు రూ.3వేల చొప్పున చెల్లిస్తున్నారు. ఈ వేతనాలూ చాలా జిల్లాల్లో పెండింగ్లో ఉన్నాయి. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వరూపరాణి మాట్లాడుతూ... ‘బిల్లులు, వేతనాలను సకాలంలో చెల్లించకపోవడంతో అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వమే గ్యాస్ను ఉచితంగా అందించడంతోపాటు గౌరవవేతనాన్ని పెంచాలి. తమిళనాడులో మాదిరి సరకులన్నీ సరఫరా చేసి, వంట ఏజెన్సీలకు రూ.6-8వేలు వేతనాలు ఇవ్వాలి’ అని కోరారు.
ఎల్ఈడీ వీధి దీపాల ప్రాజెక్టు చుట్టూ చీకట్లు
గ్రామాల్లో ఎల్ఈడీ వీధి దీపాల కథ మొదటికొచ్చేలా కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఈ ప్రాజెక్టుని పంచాయతీలకే మళ్లీ పూర్తిగా అప్పగించేందుకు అడుగులు పడుతున్నాయి. ఎల్ఈడీల నిర్వహణ సరిగా లేదంటూ ఇంధన సామర్ధ్య సేవల సంస్థ, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థలకు పంచాయతీరాజ్శాఖ తాజాగా తాఖీదులు జారీ చేసింది.
పాక్షికంగా మొదట బాధ్యతల తగ్గింపు
కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎల్ఈడీ ప్రాజెక్టుపై దృష్టి పెంచింది. ఒప్పందంపైనా ఒకటికి రెండు సార్లు సమీక్షించారు. ఎల్ఈడీల నిర్వహణ సరిగా లేదంటూ ఈ ఏడాది మార్చి 3న జీవో విడుదల చేసి, నిర్వహణ బాధ్యతను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. విడి భాగాలను సరఫరా చేసేందుకే ఈఈఎస్ఎల్, ఎన్ఆర్ఈడీసీని పరిమితం చేశారు. ప్రాజెక్టు నిర్వహణతో వచ్చే ఆదాయంలో నుంచి పంచాయతీలకు ఒక్కో ఎల్ఈడీ నిర్వహణకు నెలకు రూ.9.65 చొప్పున ఇంధన సంస్థలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది.
పాత బకాయిల ఊసేలేదు
ఎల్ఈడీ దీపాల ప్రాజెక్టు నిర్వహిస్తున్న ఇంధన సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.28 కోట్లకుపైగా బకాయిలు చెల్లించాలి. ఒప్పందం ప్రకారం ఈ మొత్తాలను గ్రామ పంచాయతీల నుంచి వసూలు చేసి ఇంధన సంస్థలకు ప్రతి మూడు నెలలకోసారి జమ చేసే బాధ్యత ప్రభుత్వానిది. ఈ చెల్లింపుల్లో జాప్యంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఇంధన సంస్థలు పలుసార్లు పంచాయతీరాజ్శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వీటి ఊసెత్తకుండా ఎల్ఈడీలకు కంప్యూటరైజ్డ్ కంట్రోల్ మానిటరింగ్ సిస్టం (సీసీఎంఎస్) బాక్సులు ఏర్పాటు చేయని కారణంగా వీధి దీపాలు పగులు, రాత్రి వెలుగుతున్నాయని, చాలాచోట్ల రాత్రుల్లో వెలగడం లేదంటూ ఇంధన సంస్థలకు పంచాయతీరాజ్శాఖ తాఖీదులు జారీ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
ఎంతమంది వాలంటీర్లు రాజీనామా చేశారు?
రాజీనామా చేశాక వాలంటీర్, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల మధ్య అనుబంధం పోతుందని.. అలాంటప్పుడు వారి మాట విని ఏ లబ్ధిదారు ఓటేస్తారని హైకోర్టు వ్యాఖ్యానించింది.
తాజా వార్తలు (Latest News)
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
-
అంటకాగితే.. అంతే రాణా..!
-
సైబర్ మోసమా.. వారియర్లు పట్టేస్తారు!