Andhra News: మహిళను ఈడ్చి పడేశారు.. జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో దారుణం

మహా విశాఖ నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశంలో అభివృద్ధి పనులపై ప్రశ్నించిన 48వ వార్డు కార్పొరేటర్‌, భాజపా ఫ్లోర్‌ లీడర్‌ గంకల కవితను మేయరు సస్పెండ్‌ చేశారు.

Updated : 05 Nov 2022 09:43 IST

విశాఖపట్నం(కార్పొరేషన్‌), న్యూస్‌టుడే: మహా విశాఖ నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశంలో అభివృద్ధి పనులపై ప్రశ్నించిన 48వ వార్డు కార్పొరేటర్‌, భాజపా ఫ్లోర్‌ లీడర్‌ గంకల కవితను మేయరు సస్పెండ్‌ చేశారు. ఆమెను మార్షల్స్‌ ఈడ్చుకెళ్లి బయట పడేశారు. శుక్రవారం నిర్వహించిన కౌన్సిల్‌ సమావేశం జీరో అవర్‌లో చర్చ సందర్భంగా మేయరు హరి వెంకటకుమారి... కవితకు మాట్లాడే అవకాశమిచ్చారు. ‘కౌన్సిల్‌ ఏర్పాటై ఏడాదిన్నరైంది. ఏడాది క్రితం 48వ వార్డుకు రూ.1.50 కోట్లతో అభివృద్ధి పనులు కేటాయిస్తూ తీర్మానం చేశారు. ఒక్కపనీ ప్రారంభించలేదు. ప్రజలసొమ్ము తింటూ ఇంజినీరింగ్‌ అధికారులు అన్యాయం చేస్తున్నారు. వారు పురుగులు పడి పోతారు’ అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులను అలా అంటారా... వెంటనే కవిత క్షమాపణలు చెప్పాలంటూ అధికార వైకాపా కార్పొరేటర్లు డిమాండ్‌ చేశారు. తన వార్డులో పనులు చేస్తే క్షమాపణ చెబుతానని కవిత స్పష్టంచేశారు. వైకాపా ఫ్లోర్‌లీడర్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ... క్షమాపణ చెప్పేదాకా ఆమె వార్డులో ఒక్కపనీ చేయకుండా ఆదేశాలివ్వాలని మేయరును కోరారు. దీంతో కవిత పోడియం వద్ద బైఠాయించారు. కవితను మేయరు సస్పెండ్‌ చేయడంతోపాటు సమావేశమందిరం నుంచి బయటకు తీసుకెళ్లాలని మార్షల్స్‌ను ఆదేశించారు. ఆమెను మార్షల్స్‌ బయటకు ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనలో కవిత స్పృహ తప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు