CAG: అప్పులపై ఉక్కపోత
లెక్కకు మిక్కిలి అప్పులు చేసిన రాష్ట్రం..ఆ లెక్కలు చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మొత్తం అప్పుల వివరాలను తెలియజేయాలనికాగ్ఎప్పట్నుంచో కోరుతున్నా వెనకడుగు వేస్తోంది. తాము కోరిన అప్పుల వివరాలు ఇంకా రాలేదని కాగ్ అధికారులు పదే పదే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు.
లెక్కలు చెప్పలేక రాష్ట్రం సతమతం
కార్పొరేషన్లకు గ్యారంటీలపై వివరాలడిగిన కాగ్
ఇప్పటికీ పంపని ప్రభుత్వం
తాజాగా పీఏజీ తాఖీదు
31లోగా పంపాలని గడువు
అత్యవసరమని స్పష్టీకరణ
ఈనాడు - అమరావతి
లెక్కకు మిక్కిలి అప్పులు చేసిన రాష్ట్రం..ఆ లెక్కలు చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మొత్తం అప్పుల వివరాలను తెలియజేయాలనికాగ్ఎప్పట్నుంచో కోరుతున్నా వెనకడుగు వేస్తోంది. తాము కోరిన అప్పుల వివరాలు ఇంకా రాలేదని కాగ్ అధికారులు పదే పదే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (పీఏజీ) కార్యాలయం తాజాగా రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులకు తాఖీదు పంపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వివిధ ప్రభుత్వరంగ సంస్థలకు, కార్పొరేషన్లకు, ఆర్థిక సంస్థలకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి తీసుకున్న రుణాల వివరాలన్నీ సమర్పించాలని కోరింది. ఇందుకు మే 31 వరకు గడువిచ్చింది. దీన్ని అత్యవసరంగా భావించాలని పీఏజీ కార్యాలయ అధికారులు రాష్ట్ర అధికారులకు స్పష్టం చేశారు. మార్చి నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగిసింది. ఏప్రిల్ నాటికి, కనీసం మే ప్రారంభం నాటికి రాష్ట్రం లెక్కలను కాగ్ ఖరారు చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం అసలు సమాచారమే ఇవ్వలేదు. కాగ్కు మొత్తం వివరాలు చేరి, వారు ఇతరత్రా ప్రశ్నలు లేవనెత్తితే ఎదురయ్యే ఇబ్బందులపై ఆర్థికశాఖలో తర్జనభర్జన పడుతున్నారని సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వ లెక్కలను ఖరారు చేసే క్రమంలో ఇంతవరకూ కాగ్ కేవలం బహిరంగ మార్కెట్ రుణాల వరకే వివరాలను తీసుకుని వాటితోనే లెక్కలు తేలుస్తోంది. రాష్ట్రం చేస్తున్న అప్పుల తీరుతెన్నులపై కేంద్ర ఆర్థికశాఖకు, ప్రధానికి, ఆర్థిక మంత్రికీ ఫిర్యాదులు చేరుతుండటంతో కాగ్ తన శైలిని మార్చుకుంది. రాష్ట్రం ఏ రూపంలో అప్పు చేసినా ఆ వివరాలన్నీ తెలియజేయాలని గతేడాది డిసెంబరు నుంచి కోరుతూ వస్తోంది. ప్రతి నెలా రాష్ట్రం లెక్కలను కాగ్ పరిశీలించి తుది అంకెలు తేలుస్తుంది. ఈ క్రమంలో జనవరి, ఫిబ్రవరి నెలల్లోనూ గ్యారంటీ ఇచ్చి తెచ్చిన రుణాల వివరాలు కోరినా ప్రభుత్వం స్పందించలేదని కాగ్ పేర్కొంది.
గ్యారంటీల విలువ రూ.1,69,905 కోట్లు
ప్రభుత్వం బడ్జెట్ పుస్తకాల్లో వెల్లడించిన లెక్కల ప్రకారం ఇంతవరకూ రూ.1,69,905 కోట్లకు వివిధ సంస్థలకు గ్యారంటీలు ఇచ్చింది. ఇందులో ఇప్పటివరకు తిరిగి చెల్లించినవి పోను రూ.1,38,603 కోట్లకు గ్యారంటీలు అమల్లో ఉన్నట్లు లెక్క. స్టేట్ ఫైనాన్షియల్ సర్వీస్ కార్పొరేషన్ నుంచి మరో రూ.10వేల కోట్లు సమీకరించారు. నాన్ గ్యారంటీ రుణాలు రూ.65వేల కోట్ల వరకు ఉన్నాయి. ఇందులో దాదాపు రూ.50వేల కోట్ల విలువైన అప్పులను ఆయా సంస్థలే తిరిగి చెల్లించే పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు రూ.1.63 లక్షల కోట్ల అప్పునకు ప్రభుత్వమే జవాబుదారీగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. కాగ్కు ఈ లెక్కలన్నీ సమర్పిస్తే మొత్తం అప్పుల విలువ అధికారికంగా పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం కాగ్కు ఈ వివరాలన్నీ పంపిన తర్వాతే తుది లెక్కలు ఖరారు కానున్నాయి.
కాగ్ కోరుతున్నది ఇదే..
* ఏయే కార్పొరేషన్ నుంచి ప్రభుత్వం ఎంత రుణం తీసుకుంది?
* ఏ కార్పొరేషన్కు ప్రభుత్వం ఎంత గ్యారంటీ ఇచ్చింది?
* ప్రతి కార్పొరేషన్, ప్రభుత్వరంగ సంస్థ, ఆర్థిక సంస్థల వారీగా వివరాలు.
* ఆయా కార్పొరేషన్లకు ప్రభుత్వం ఏ రోజు ఎంత మొత్తానికి గ్యారంటీ ఇచ్చింది? జీవోలు ఇచ్చిన తేదీ ఎప్పుడు?
* 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం వివరాలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్