Chandrababu: నడవలేడు.. నడిపించలేడు!
‘ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నడవలేడు, తిరగలేడు. వృద్ధుడు కదా! మొండికేసిన ఎద్దును ముల్లుగర్రతో పొడిచేందుకే నేను వచ్చా. ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లకే పరిమితమై యంత్రాంగాన్ని
సీఎం ప్రజలకు క్షమాపణ చెప్పాలి
బాధితులకు పరిహారమిచ్చే వరకూ పోరాడతా
వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
చంద్రబాబు విమర్శ
చిత్తూరు జిల్లాలోని రాయలచెరువును పరిశీలిస్తున్న చంద్రబాబునాయుడు.
చిత్రంలో మాజీ మంత్రి అమరనాథరెడ్డి, తెదేపా నాయకులు
ఈనాడు, ఈనాడు డిజిటల్, తిరుపతి: ‘ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నడవలేడు, తిరగలేడు. వృద్ధుడు కదా! మొండికేసిన ఎద్దును ముల్లుగర్రతో పొడిచేందుకే నేను వచ్చా. ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లకే పరిమితమై యంత్రాంగాన్ని నడిపించలేకపోతున్నారు’ అని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు రాలేకపోయిన ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను చంద్రబాబు బుధవారం పరిశీలించారు. ఏర్పేడు మండలం పాపానాయుడుపేట వద్ద కూలిన వంతెనతో పాటు తిరుచానూరు వంతెన, రాయలచెరువు, తిరుపతిలోని ముంపు కాలనీల్లో పర్యటించారు. మహిళలు వరదల కారణంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రాంతాల్లో మాట్లాడుతూ.... ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో తిరుపతితో పాటు పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. రాయలచెరువు తెగుతుందని రాష్ట్రం హోరెత్తుతుంటే ముఖ్యమంత్రి గాల్లోనే తిరుగుతున్నాడు. ఈ సీఎం.. గాలి సీఎం. నేను ముఖ్యమంత్రిగా ఉంటే తిరుపతిలోనే బసచేసి ఉండేవాడిని. చుట్టపుచూపుగా వచ్చే సీఎం మనకు అవసరమా? ప్రజలు ప్రాణాలు కోల్పోయిన తర్వాత వస్తారా? బాధ్యత కలిగిన సీఎం అసెంబ్లీని వాయిదా వేసి క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజల కష్టాలను తెలుసుకుని వాటిని పరిష్కరించాల్సిందిపోయి.. నాపై వ్యక్తిగత దాడికి దిగుతున్నారు. ఇప్పటికీ బాధితులకు పరిహారం అందించలేదు. అందరికీ సాయం అందేలా పోరాడతా. ప్రభుత్వం వద్ద నిర్ధిష్ట డిమాండ్లు పెడతా. రాష్ట్రంలోని రైతులు వరి వేయవద్దని వ్యవసాయ మంత్రి ప్రకటన చేశారు. రైతులు వరి కాకుంటే గంజాయి పండిస్తారా? వరి వేయవద్దనే అధికారం మీకు ఎవరిచ్చారు? ఇవాళ వరి వద్దన్నారు.. రేపు వ్యవసాయమే వద్దంటారు.
మడమతిప్పిన సీఎం...
అమరావతి రాజధాని విషయమై రెండున్నరేళ్ల తర్వాత తప్పు చేశాం, ఉపసంహరించుకుంటున్నామన్నాడు. మళ్లీ కొత్త బిల్లు తెస్తానని అంటున్నాడు. మడమ తిప్పి మాటమార్చిన సీఎం పూర్తిగా అవకాశవాది. అసెంబ్లీలో నాపై వ్యక్తిగత దాడికి దిగుతున్నారు. చిన్న కుప్పం పట్టణంలో అక్రమాలు చేసి మొనగాళ్లమని విర్రవీగుతున్నారు. కొండపల్లి వంటి చిన్న మున్సిపాలిటీని చేజిక్కించుకునేందుకు రెండు రోజులుగా దౌర్జన్యం చేస్తున్నారు. న్యాయస్థానానికి వెళ్తే సిగ్గు ఉందా అని హెచ్చరించే పరిస్థితి వచ్చింది. ప్రజాసేవ చేయరు, చేసే వారిని చేయనివ్వరు. మీకిచ్చిన సమయం అయిపోయింది. మార్పు ప్రారంభమైంది. ధైర్యం ఉంటే ప్రజాసేవలో పోటీపడండి, కేసులు పెట్టి చరిత్రహీనులు కావద్దు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రభుత్వం చేయదు, మరొకరిని చేయనివ్వదు. మా ప్రభుత్వం రాగానే నెల రోజుల్లో వరద మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందిస్తాం. మీ సమస్యలపై సీఎంకు, సీఎస్కు గురువారం లేఖలు రాస్తా. వారి స్పందన చూస్తా. లేకుంటే మళ్లీ తిరుపతికి వస్తా.
మిత్రుడు ఇంటికి చంద్రబాబు
శ్రీవేంకటేశ్వర వర్సిటీ ఆర్థికశాస్త్ర విభాగం విశ్రాంత ఆచార్యులు కొమ్మినేని శ్రీనివాసులునాయుడు ఇంటికి చంద్రబాబు వెళ్లారు. శ్రీకృష్ణనగర్లో పర్యటిస్తూ ఇక్కడే ఉంటున్న మిత్రుడి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పలకరించారు. ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు.
రాయలచెరువు పర్యటనపై ఆంక్షలు
రాయలచెరువు ప్రాజెక్టును పరిశీలించాలనుకున్న చంద్రబాబుకు పోలీసులు ఆంక్షలు విధించారు. చెరువు ప్రమాదకరంగా ఉందని, అక్కడికి వెళ్లడం శ్రేయస్కరం కాదంటూ మంగళవారమే తెదేపా శ్రేణులకు నోటీసులు ఇచ్చారు. బుధవారం మధ్యాహ్నం చంద్రబాబు శానంభట్లలోని జేబీఎస్ కన్వెన్షన్ సెంటర్కు వచ్చినప్పుడు పోలీసులు మరోమారు ఈ విషయాన్ని ప్రస్తావించారు. తాను అక్కడికి వెళ్లి తీరుతానని చంద్రబాబు స్పష్టంచేశారు. భారీ కాన్వాయ్ కాకుండా మూడు వాహనాల్లో వెళ్లాల్సిందిగా పోలీసులు సూచించారు. ఆ మేరకు ఆయన మూడు వాహనాలతో వెళ్లి రాయలచెరువు కట్టను పరిశీలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!