Chandrababu: నష్టం రూ.6,054 కోట్లు.. ఇచ్చేది 35 కోట్లా?
విపత్తు సమయంలో ముందస్తు హెచ్చరికలతో పాటు.. వరద అనంతర సహాయ చర్యలనూ ప్రభుత్వం విస్మరించిందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ‘నవంబరు మొదటి వారానికే చెరువులన్నీ నిండి ఉన్నాయి.
ముందస్తు హెచ్చరికలను, సహాయచర్యలనూ విస్మరించిన ప్రభుత్వం
మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు ఇవ్వాలి
హెక్టారు వరికి రూ.20వేలు.. అరటి, మామిడికి రూ.50వేల పరిహారమివ్వాలి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ
ఈనాడు-అమరావతి: విపత్తు సమయంలో ముందస్తు హెచ్చరికలతో పాటు.. వరద అనంతర సహాయ చర్యలనూ ప్రభుత్వం విస్మరించిందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ‘నవంబరు మొదటి వారానికే చెరువులన్నీ నిండి ఉన్నాయి. అయినా వర్షపాతం, అల్పపీడనంపై జాతీయ విపత్తు నిర్వహణ మార్గదర్శకాలకు అనుగుణంగా భద్రత, ముందస్తు చర్యలను చేపట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. వరదల స్వభావాన్ని పరిశీలిస్తే.. ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కన్పిస్తోంది. న్యాయ విచారణ జరిపించాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మకు లేఖ రాశారు. వరద ప్రభావిత ప్రాంతాలను స్వయంగా సందర్శించి.. ప్రజల బాధలు చూశానన్నారు. ‘ప్రాథమిక పరిశీలన ఆధారంగా మౌలిక సదుపాయాల నష్టం రూ.6,054.29 కోట్లు ఉంటే.. ప్రభుత్వం కేవలం రూ.35కోట్లు మాత్రమే విడుదల చేయడం విషాదకరమ’ని విమర్శించారు. విపత్తు సహాయ నిధి రూ.1,100 కోట్లను వ్యక్తిగత డిపాజిట్ ఖాతాకు మళ్లించిన ప్రభుత్వం.. ఎన్డీఆర్ఎఫ్ ప్రాథమిక సూత్రాలను విస్మరించిందని ధ్వజమెత్తారు. కుటుంబసభ్యుల్ని కోల్పోయిన వారికి రూ.25 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షలు, వరదనీరు ఇళ్లలోకి చేరిన వారికి రూ.10వేలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.25వేల సాయం, ఇళ్లు కోల్పోయిన వారికి ఉచితంగా గృహాలను నిర్మించి ఇవ్వాలని డిమాండు చేశారు. నేత, మత్స్యకార కుటుంబాలకు ప్రత్యేక సాయంగా 50 కిలోల చొప్పున బియ్యం అందించాలన్నారు.
వరికి హెక్టారుకు రూ.30వేలివ్వాలి
‘వరదల కారణంగా 8లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంట నష్టం జరిగిందని వ్యవసాయశాఖ మంత్రి శాసనసభలో వెల్లడించారు. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి. భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న వరికి హెక్టారుకు రూ.30వేలు, అరటి, జీడిమామిడికి రూ.50వేలు, మామిడికి రూ.40వేలు, చెరకుకు రూ.25వేలు, పత్తికి రూ.30వేలు, వేరుసెనగకు రూ.25వేలు, జొన్నకు రూ.15వేలు, మొక్కజొన్నకు రూ.20వేలు, కొబ్బరి(చెట్టుకు) రూ.3వేలు చొప్పున పరిహారం ఇవ్వాలి. ఆక్వాకు హెక్టారుకు రూ.50వేలు, పడవలు ధ్వంసమైన మత్స్యకారులకు రూ.2లక్షలు, పూర్తిగా ధ్వంసమైన వారికి రూ.8లక్షలు, వలలు కోల్పోయిన వారికి రూ.20వేలు, కొత్త వలల కొనుగోలుకు 75% రాయితీ, కొత్త పడవల కొనుగోలుకు రూ.5లక్షల రాయితీ అందించాలి. వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనాలి. ఉపాధి కోల్పోయిన చేనేతలు, వీధి వ్యాపారులు, ఆటో రిక్షాల వారికి రూ.20వేల చొప్పున సాయం ఇవ్వాలి’ అని సూచించారు. ‘వరదల్లో చనిపోయిన ప్రతి ఆవు/గేదెకు రూ.40వేలు, జెర్సీ ఆవుకు రూ.50వేలు, గొర్రె/మేకకు రూ.6వేలు, ధ్వంసమైన గోశాలలకు రూ.25వేలు, పూర్తిగా ధ్వంసమైన గోశాలలకు రూ.3లక్షల నుంచి రూ.5లక్షలు, దెబ్బతిన్న కోళ్ల ఫారాలకు రూ.50వేల చొప్పున పరిహారం ఇవ్వాలి’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.
కపిల తీర్థం చుట్టూ కందకం నిర్మించాలి
కపిల తీర్థం పక్కన కొండచుట్టూ కందకం తవ్వడం ద్వారా.. వర్షపు నీటిని స్వర్ణముఖి నదిలోకి మళ్లించాలని చంద్రబాబు సూచించారు. వర్షపు నీరు తిరుపతి నగరంలోకి మళ్లకుండా ఇది ఉపయోగపడుతుందన్నారు. ‘తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ స్థితి నెలకొల్పేందుకు రహదారులు, వంతెనలు, విద్యుత్తు, సమాచార వ్యవస్థను పునర్నిర్మించాలి. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో మళ్లీ ఎడతెరపి లేకుండా వానలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలున్న నేపథ్యంలో.. ముందస్తు ఉపశమన ప్రయత్నాలు చేపట్టాలి’ అని చంద్రబాబు కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా