Chandrababu:నాడు 43% ఫిట్మెంట్ ఇచ్చా
‘ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత రూ.22,700 కోట్ల రెవెన్యూ లోటున్నప్పుడు ఉద్యోగులు నా వద్దకు వచ్చారు. డబ్బులు లేవని... తమకు అన్యాయం చేయవద్దని, రాష్ట్రం కోసం కష్టపడతామని తెలిపారు. దీంతో ఒక్కమాటా
ప్రస్తుత ప్రభుత్వం ఐఆర్ కన్నా 4% తగ్గించింది
వైకాపా నేతలు ఖనిజ సంపదను లూటీ చేస్తున్నారు
కుప్పం పర్యటనలో చంద్రబాబు ధ్వజం
ఈనాడు డిజిటల్, చిత్తూరు - న్యూస్టుడే, శాంతిపురం: ‘ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత రూ.22,700 కోట్ల రెవెన్యూ లోటున్నప్పుడు ఉద్యోగులు నా వద్దకు వచ్చారు. డబ్బులు లేవని... తమకు అన్యాయం చేయవద్దని, రాష్ట్రం కోసం కష్టపడతామని తెలిపారు. దీంతో ఒక్కమాటా మాట్లాకుండానే 43% ఫిట్మెంట్ ఇచ్చా’ అని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు గుర్తుచేశారు. ‘ప్రస్తుత ప్రభుత్వం 27% మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించింది. శుక్రవారం ఉద్యోగ సంఘం నాయకులను బెదిరించి.. 23% ఫిట్మెంట్ ఇచ్చారు. అంటే ఇచ్చిన దాంట్లోనే 4% తగ్గించారు. ఒకవైపు ఉద్యోగులు బాధపడుతుంటే... ఉద్యోగ సంఘాల నాయకులు అభినందిస్తున్నారు. ఆర్థిక ప్రయోజనాలను కల్పించకుండా ఉండేందుకే ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచారు. ఉద్యోగులూ ఆలోచించండి. ఇది పీఆర్సీ కాదు... రివర్స్ పేఆర్సీ’ అంటూ ప్రభుత్వంపై చంద్రబాబు ధ్వజమెత్తారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా కుప్పం వచ్చిన ఆయన చివరి రోజు శనివారం గుడుపల్లె, శాంతిపురం మండలాల్లో పర్యటించారు. రాష్ట్రంలో 4 రోజుల్లో ఇద్దరు దళితులు ఆత్మహత్య చేసుకున్నారని... నిరసన చేస్తున్న వారిపై రౌడీషీట్ తెరుస్తామని బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఈ క్రమంలో ‘జైభీమ్’ అంటూ నినాదాలు చేశారు.
ఒక్క గ్రామంలోనే 250 అక్రమ క్వారీలు
అనంతరం విలేకరులతో చంద్రబాబు మాట్లాడుతూ... ‘ఖనిజ సంపదను వైకాపా నాయకులు లూటీ చేస్తున్నారు. నేను వస్తున్నానని తెలుసుకుని క్వారీల్లోని యంత్రాలను తరలించేశారు. భారీగా మందుగుండు సామగ్రిని వినియోగిస్తూ స్థానికులకు నిద్ర లేకుండా చేస్తున్నారు. పర్యావరణానికీ తీవ్ర నష్టం కలిగిస్తున్నారు. వీటి కారణంగా హంద్రీ-నీవా టన్నెల్ జాడ కనిపించడం లేదు. ఒక్క ముద్దనపల్లెలోనే 250 క్వారీలు అక్రమంగా నిర్వహిస్తున్నారు. ద్రవిడ విశ్వవిద్యాలయంలోని 150 ఎకరాల్లోనూ ఇదే తంతు జరుగుతోంది. ఇటువంటి దందాలు బాగా చేస్తున్నందుకే ఒక వ్యక్తిని ఎమ్మెల్సీగా చేశారు. పలమనేరు ఎమ్మెల్యే, కుప్పం రెస్కో ఛైర్మన్తోపాటు వైకాపా నాయకులు ప్రకృతి సంపదను దోచేస్తున్నారు. ఇందులో ఒకాయన నాపై బాంబులు వేస్తానన్నారు. వీరందరికీ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మద్దతుగా ఉన్నారు. వెంటనే ఆయన్ని మంత్రివర్గం నుంచి తొలగించాలి. ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే ఇలా ఉంటే... రాష్ట్రం మొత్తంలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చివరకు పోలవరం కాలువ గట్టుపై ఉన్న మట్టిని కూడా వైకాపా నాయకులు వదలడంలేదు. కుప్పంలో ఇన్ని అక్రమాలు జరుగుతున్నా.. మైనింగ్, రెవెన్యూ, పోలీసులు నిద్ర పోతున్నారా’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై జాతీయ హరిత ట్రైబ్యునల్ విచారణ చేయాలని, అక్రమ మైనింగ్పై న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.
3 కిలోమీటర్లు నడిచి.. క్వారీలను పరిశీలించి...
కుప్పం నియోజకవర్గంలో వైకాపా నాయకులు అక్రమంగా క్వారీలు నిర్వహిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు తదితరులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. శాంతిపురం మండలం సి.బండపల్లి పంచాయతీ ముద్దనపల్లె, ద్రవిడ విశ్వవిద్యాలయం తదితర చోట్ల ఈ పరిస్థితి ఎక్కువగా ఉందని వివరించారు. అక్కడకే వెళ్లి అక్రమాల అంతుచూద్దాం పదండంటూ చంద్రబాబు కార్యకర్తలతో కలిసి ముద్దనపల్లె క్వారీల వద్దకు వెళ్లారు. సుమారు 3 కిలోమీటర్ల మేర కొండలు, గుట్టలు ఎక్కి మైనింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. గంటకుపైగా ఆయన అక్కడే ఉన్నారు. వెంట ఉన్న కార్యకర్తలు ఆయన వేగాన్ని అందుకోలేకపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM